-
మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం!
మాల్దీవుల అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(PNC)పై తీవ్రమైన అసమ్మతి పెరుగుతోంది. దీంతో దేశ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చెందిన అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్పై ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ మీడియా సోమవారం పలు కథనాలు ప్రచురించింది. ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ), మరో భాగస్వామ్య పార్టీకి చెందిన ఎంపీలందరితో అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ప్రతిపక్ష ఎండీపీ అభిశంసన తీర్మానాన్ని ఇంకా పార్లమెంట్లో సమర్పించలేదు. అయితే ఆదివారం మల్దీవుల పార్లమెంట్లో అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఘర్షణకు దారితీసింది. తీర్మానం ఓటింగ్ను ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా స్పీకర్కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్లోనే తన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతిపక్ష పార్టీలు అన్ని మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. చదవండి: Maldives: మాల్దీవుల పార్లమెంట్లో ఎంపీల కొట్లాట -
బైడెన్పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్పై అభిశంసనకు పూనుకున్నారు. ‘వైట్ హౌస్లో ఉంటున్న అవినీతి కుటుంబం’ సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్డీ-1023 ఫారమ్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. ప్రతినిధి జిమ్ బ్యాంక్స్ ట్విట్టర్లో ఈ పత్రాలను తిరిగి పోస్ట్ చేస్తూ, వైట్ హౌస్లో ఉంటున్న అత్యంత అవినీతి కుటుంబం అని ఆరోపించారు. వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే దీనిని చదివి తెలుసుకోండి. బైడెన్ను వెంటనే పదవి నుండి తొలగించాలని అతను కోరారు. ‘బైడెన్ నేరాలకు రుజువులున్నాయి’ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఈ అభిశంసనకు వంతపాడారు. 80 ఏళ్ల అధ్యక్షుడిని గద్దె దించాలని డిమాండ్ చేశారు. బైడెన్ ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తరపున పాల్గొన్నారు. బైడెన్ ఒక నేరస్తుడు. అతను మనల్ని డబ్బ్యుడబ్ల్యు3లోకి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బైడెన్లు చేసిన నేరాలకు రుజువు ఉందంటూ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ ఆరోపించారు. ఈ విషయంలో రిపబ్లికన్లు ఇక జాప్యం చేయలేరు. ఇందుకోసం మాకు 218 రిపబ్లికన్ ఓట్లు అవసరం. నేను మొదటి రోజు నుండి ఇదే మాటపై ఉన్నాను. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. మరో ప్రతినిధి ఆండీ బార్ ఇలా రాశారు.. బైడెన్ రాజీ పడ్డాడనడానికి ఇది అసలైన సాక్ష్యం. బైడెన్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. ‘అవి నిరాధార ఆరోపణలు’ వైట్ హౌస్ అధికారులు రిపబ్లికన్ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఆ పత్రాలు నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ రిపబ్లికన్లు నిజానిజాలతో సంబంధం లేకుండా అధ్యక్షుడు బైడన్పై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..! 🚨BREAKING🚨 The FD-1023 form alleging then-Vice President JOE BIDEN was involved in a $5,000,000 bribery scheme with a Burisma executive has been released by @ChuckGrassley. Read 👇 pic.twitter.com/Mc6dVIwdsG — Oversight Committee (@GOPoversight) July 20, 2023 -
రిపబ్లికన్ల హ్రస్వ దృష్టి
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా విజయవంతంగా అభిశంసన నుంచి తప్పించుకోగలిగారు. అధ్యక్ష స్థానంలోవున్నవారు అభిశంసన తీర్మానం ఎదుర్కొనాల్సిరావడం అమెరికా చరిత్రలో ఇంతక్రితం కూడా జరిగింది. కానీ పదవినుంచి తప్పుకున్నాక కూడా అది వెన్నాడటం కొత్త రికార్డు. తన నాలుగేళ్ల పాలన, క్లైమాక్స్లో ప్రవర్తించిన తీరుతో ట్రంప్ చేజేతులా ఈ అపకీర్తి మూటగట్టుకున్నారు. ఫలితాలు వెలువడిన్పటినుంచి పదవి నుంచి తప్పుకునే వరకూ వున్న దాదాపు 80 రోజుల వ్యవధి ట్రంప్ అరాచక మనస్తత్వాన్ని మరింత బాహాటంగా బయటపెట్టింది. పదవినుంచి తప్పుకునే అధ్యక్షుడిని అమెరికాలో ‘నిరర్ధక అధ్యక్షుడి’గా అభి వర్ణించటం సంప్రదాయం. కానీ ఆ ‘నిరర్థక దశ’ను ట్రంప్ తనను తాను కాపాడుకునేందుకు ఉపయోగించుకున్నారు. దిగ్భ్రమ కలిగించే నేరాలకు పాల్పడినవారికి సైతం ఉదారంగా క్షమాభిక్ష పెట్టారు. గత నెల 6న కొత్త అధ్యక్షుడి ఎన్నికను లాంఛనంగా ప్రకటించేందుకు కాంగ్రెస్ సమావేశమైనప్పుడు తన మద్దతుదార్లను కేపిటల్ హిల్పై దాడికి పురిగొల్పారని సామాజిక మాధ్యమాల సాక్షిగా రుజువైంది. కర్రలు, తుపాకులు వగైరాలు ధరించి వచ్చిన ట్రంప్ మద్దతుదార్ల తీరు చూసి బెంబేలుపడిన అనేకమంది సెనేటర్లు ప్రాణ భయంతో బల్లలకింద దాక్కొనవలసి వచ్చింది. అక్కడ ఎంతో విధ్వంసం చోటుచేసుకుంది. ఇలా చేసినా రిపబ్లికన్ పార్టీకి ఏమాత్రం తప్పనిపించలేదంటే... పదవినుంచి దిగిపోయారు గనుక పట్టించుకోనవసరం లేదంటూ అది వాదించిందంటే ఆ పార్టీ ఎంత మితవాద శక్తిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పార్టీలో ట్రంప్ వంటి నేత అధ్యక్ష స్థానం వరకూ ఎగబాకారంటే వింత ఏముంది? మెజారిటీ సభ్యులు... అంటే వందమందిలో 57 మంది ట్రంప్పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని అంగీకరించారు. డెమొక్రాటిక్ పార్టీకి వున్న 50 మంది సభ్యులతో పాటు రిపబ్లికన్ పార్టీకి చెందిన ఏడుగురు కూడా తీర్మానానికి మద్దతు పలకటం వల్ల ఇది సాధ్యమైంది. కానీ అభిశంసన నెగ్గాలంటే మూడింట రెండు వంతులమంది మెజారిటీ (67 మంది) అవసరం గనుక ట్రంప్ విజయవంతంగా బయట పడ గలిగారు. తీర్మానం నెగ్గితే డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ చేయటానికి అనర్హు లయ్యేవారు. ఈ అభిశంసన వీగిపోవటం న్యాయం గెలవటంగా ట్రంప్ అభివర్ణిస్తున్నారు. తనను రాజ కీయంగా సమాధి చేద్దామనుకున్నవారి ప్రయత్నాలు విఫలమయ్యాయని సంబరపడుతున్నారు. తన చేష్టలకు ఏనాడూ పశ్చాత్తాపం ప్రకటించని ట్రంప్ అలా మాట్లాడటంలో వింతేమీ లేదు. కానీ స్వయంగా దేశాధ్యక్షుడే హింసకు పురిగొల్పటాన్ని రిపబ్లికన్ పార్టీ విస్మరించిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ చర్య ద్వారా అది తనకు తాను నష్టం చేసుకోవటంతోపాటు దేశానికి కూడా నష్టచేసింది. చట్టబద్ధ పాలనను అధ్యక్షుడే అపహాస్యంపాలు చేయటం, ఆవేశంతో ఊగిపోతున్న మూకను కేపిటల్ హిల్పై దాడికి పంపటం, వారి విధ్వంసాన్ని తేలిగ్గా తీసుకోవటం, ప్రజా తీర్పును వమ్ముచేసేందుకు ప్రయత్నించటం, రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేయటం, అణగదొక్కే ప్రయత్నం చేయటం లాంటి చర్యలను క్షమించటం రిపబ్లికన్ పార్టీ పరువును పాతాళానికి నెట్టేసింది. దేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్యం లోపరహితమైనది కాదని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే అది నియంతృత్వ పోకడలున్నవారి చేతుల్లోకి జారుకుంటుందని గత నెల 6నాటి పరిణామాలు నిరూపించాయి. దీన్ని కేవలం తమకూ, డెమొక్రటిక్ పార్టీకి మధ్య జరిగే పోరుగా మాత్రమే చూడటం రిపబ్లికన్ పార్టీ హ్రస్వ దృష్టికి నిదర్శనం. పార్టీలో ఇదొక దుస్సంప్రదాయానికి కూడా అంకురార్పణ చేసింది. భవిష్యత్తులో ఒక నిర్మాణాత్మక పద్ధతిలో, మెరుగైన ఆలోచనలతో ముందుకొచ్చి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడేవారికి ఆ పార్టీలో స్థానం దొరకదన్న అభిప్రాయం అందరికీ కలుగుతుంది. ట్రంప్కూ లేదా ఆయన మాదిరిగా ఇష్టానుసారం వ్యవహరించే మరో నాయకుడికి మాత్రమే ఆదరణ లభిస్తుందని శ్రేణులంతా భావిస్తాయి. ‘అందరం ఏకమవుదాం... అమెరికా ఘనతను మరోసారి చాటుదాం’ అంటూ ట్రంప్ ఇచ్చిన తాజా పిలుపు కాస్త హేతుబద్ధంగా ఆలోచించగలిగే రిపబ్లికన్ శ్రేణులను బెంబేలెత్తించివుండాలి. తీర్మానంపై మాట్లాడిన సెనేట్ రిపబ్లికన్ పక్ష నేత మెక్ కానిల్ సైతం ట్రంప్ తీరును తప్పుబట్టారు. అధ్యక్షుడిగా తన కర్తవ్యాన్ని విస్మరించి, హింసకు నైతికంగా బాధ్యుడయ్యారని అంగీకరించారు. ఇంత చెప్పినవారు అభిశంసన తీర్మానంతో గొంతు కలిపేందుకు నిరాకరించటం విడ్డూరం. ఉన్నత స్థాయికి ఎలా ఎగబాకాలో, జనాకర్షణకు మార్గాలేమిటో, సమర్ధులుగా రాణించటం ఎలాగో చెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిత్వరంగ నిపుణులు బోలెడు పుస్తకాలు రచించారు. కానీ ప్రజా తీర్పును గౌరవించటం ఎలాగో... హుందాగా పదవినుంచి వైదొలగటం ఎంత ముఖ్యమో చెప్పే పుస్తకాలు ఎవరూ రాసినట్టు లేరు. ఆ మాదిరి పుస్తకాలు అందుబాటులో వుంటే డోనాల్డ్ ట్రంప్కు అవి ఏదో మేరకు ఉపయోగపడేవి. ఏదేమైనా తాము నిష్పాక్షికమైన తీర్పరి స్థానంలో వున్నామని... దేశ చరిత్రలో మాయని మచ్చ అనదగ్గ ఒక మహాపరాధానికి కారకుణ్ణి గుర్తించి, శిక్షిం చాల్సిన కర్తవ్యం తమపై వున్నదని రిపబ్లికన్లు గుర్తించలేకపోవటం... ఫక్తు రాజకీయ నేతలుగానే వ్యవహరించటం విషాదం. -
గట్టెక్కిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా అభిశంసన నుంచి గట్టెక్కారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించారని అభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్ సెనేట్లో శనివారం జరిగిన ఓటింగ్లో 57–43 ఓట్ల తేడాతో బయటపడ్డారు. అమెరికా చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయి, అయిదుగురు ప్రాణాలను బలితీసుకున్న క్యాపిటల్ భవనం ముట్టడి హింసాత్మకంగా మారిన ఘటనలో ట్రంప్ని దోషిగా నిలబెట్టడంలో డెమొక్రాట్లు విఫలమయ్యారు. గద్దె దిగిపోయిన తర్వాత కూడా అభిశంసన ఎదుర్కొన్న మొదటి వ్యక్తి ట్రంప్, అంతే కాకుండా రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడు కూడా ట్రంప్ ఒక్కరే. అధ్యక్షుడిగా ఆయన తన అధికారాలన్నీ దుర్వినియోగం చేస్తున్నారన్న అభియోగాలపై గత ఏడాది ప్రవేశపెట్టిన అభిశంసన నుంచి కూడా ట్రంప్ బయటపడ్డారు. ఒకవేళ ట్రంప్ అభిశంసనకు గురైతే ఆ తర్వాత ఆయనను భవిష్యత్ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయడానికి వీల్లేకుండా తీర్మానం ఆమోదించాలని సెనేట్లో డెమొక్రాట్లు భావించారు. కానీ రిపబ్లికన్ పార్టీ వారికి సహకరించలేదు. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోయాక ఆయనపై అభిశంసన మోపడమే సరికాదని వాదించింది. మొత్తం 100 మంది సభ్యులున్న సెనేట్లో రెండింట మూడో వంతు మెజారిటీ అంటే 67 ఓట్లు వస్తే ట్రంప్ అభిశంసనకు గురవుతారు. ఈ సారి సెనేట్లో రెండు పార్టీలకు చెరి సమానంగా 50 సీట్లు ఉన్నాయి. మరో ఏడుగురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు అభిశంసనకి మద్దతునిచ్చారు. దీంతో అభిశంసనకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. 10 ఓట్లు తక్కువ రావడంతో ట్రంప్పై అభియోగాలన్నీ వీగిపోయాయి. సెనేట్లో విచారణ కేవలం అయిదు రోజుల్లోనే ముగిసిపోయింది. అభిశంసన విచారణకే రిపబ్లికన్ పార్టీ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. క్యాపిటల్ భవనంపై దాడిని ఖండించినప్పటికీ, అధికారాన్ని వీడిన తర్వాత ట్రంప్పై విచారణ అక్కర్లేదని మొదట్నుంచి చెప్పిన ఆ పార్టీ వాదనలకి పెద్దగా ఆస్కారం లేకుండానే విచారణని ముగించింది. ఇప్పుడే రాజకీయ ఉద్యమం మొదలైంది సెనేట్లో అభిశంసన నుంచి బయటపడిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో తనపై నిందలు మోపినట్టుగా మరే ఇతర అధ్యక్షుడిపైన జరగలేదని పేర్కొన్నారు. ఒక మంత్రగాడిని వేటాడినట్టుగా తన వెంట బడ్డారని దుయ్యబట్టారు. నిజం వైపు నిలబడి, న్యాయాన్ని కాపాడిన తన లాయర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనను రాజకీయంగా కూడా సమాధి చెయ్యాలని డెమొక్రాట్లు భావించినప్పటికీ కుదరలేదని, అసలు ఇప్పుడే తన రాజకీయ ఉద్యమం ప్రారంభమైందని ట్రంప్ అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్గా నిలబెట్టడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ధిక్కరించారు ట్రంప్పై అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన రిపబ్లికన్ సభ్యులపై డెమొక్రాట్లు మండిపడ్డారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసిన వ్యక్తిని కాపాడడం వల్ల ఇప్పుడు సెనేట్ కూడా అపఖ్యాతి పాలైందని అన్నారు. ట్రంప్ని ద్రోహిగా నిలబెట్టలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి పారిపోవడమేనని స్పీకర్ నాన్సీ పెలోసి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికే బీటలు అమెరికాలో ప్రజాస్వామ్యం బీటలు వారిందని మరోసారి రుజువైందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రతీ అమెరికా పౌరుడికి నిజం వైపు నిలబడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అభిశంసన నుంచి ట్రంప్కి విముక్తి లభించిన వెంటనే బైడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అమెరికా చరిత్రలో ఇలాంటి విషాదకరమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మన దేశంలో హింసకి, తీవ్రవాదానికి స్థానం లేదు. అమెరికా పౌరులు, ముఖ్యంగా నాయకులందరూ నిజంవైపు నిలబడి అబద్ధాన్ని ఓడించాలి. అలా జరగకపోవడం వల్ల ప్రజాస్వామ్యం చెదిరిపోయిందని అర్థం అవుతోంది’’ అని బైడెన్ పేర్కొన్నారు. -
కనుబొమ్మలు తీసివేసి.. కోట్లలో మోసాలు
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని పలువురు వ్యాపారులను రూ. కోట్లలో ముంచుతున్న సత్తుపల్లికి చెందిన ఘరానా కేటుగాడు బాబురావు ఆగడాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళనకు దిగారు. వందలాది మందిని మోసం చేస్తూ దర్జాగా తిరుగుతున్న వైనంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జైలు నుంచి బెయిల్ మీద వచ్చి కొత్త మోసాలకు పాల్పడుతున్నాడని, ఇంటీరియర్ కంపెనీ కోసం సరుకులు కావాలని వ్యాపారులకు డబ్బులు ఎగనామం పెట్టాడని తెలిపారు. మినరల్ వాటర్ కంపెనీలలో వాటాల పేరుతో లక్షలు లూఠీ చేశాడని, డబ్బులు అడిగిన బాధితులపై భార్యతో లైంగిక వేదింపుల కేసులుపెడుతున్నాడని పేర్కొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సీసీఎస్, సీఐడీ, విజయవాడ, గుంటూరు పోలీస్ స్టేషన్లలో ఇలా వందల కేసులు పెట్టాడని తెలిపారు. తప్పించుకు తిరుగుతున్న నిందితుడు కనుబొమ్మలు తీసేయడం, గడ్డం స్టైల్ మార్చడం, టోపీలు పెట్టడం రకరకాల వేషాలు మర్చాడంలో దిట్ట అని చెప్పారు. బాబురావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement