ముందస్తు ప్రచారం నిబంధనలకు విరుద్ధం | Vice-President Venkaiah Naidu likely to take time to act on motion | Sakshi
Sakshi News home page

ముందస్తు ప్రచారం నిబంధనలకు విరుద్ధం

Apr 22 2018 1:44 AM | Updated on Sep 2 2018 5:48 PM

Vice-President Venkaiah Naidu likely to take time to act on motion - Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభాధ్యక్షుడికి అందజేసిన నోటీసులోని విషయాలకు ముందస్తు ప్రచారం ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందని పార్లమెంట్‌ అధికారులు తెలిపారు. ప్రతిపక్షాలు సీజేఐ జస్టిస్‌ మిశ్రాపై పలు ఆరోపణలు చేస్తూ అభిశంసన తీర్మానం నోటీసులను రాజ్యసభాధ్యక్షుడు వెంకయ్యకి అందజేయడం తెల్సిందే.

ఈ నోటీసులోని వివరాలన్నీ శనివారం మీడియాలో రావటంపై అధికారులు స్పందించారు. సభలో ప్రస్తావించదలచిన నోటీసు చైర్మన్‌ అంగీకారం పొంది, దాని ప్రతులను సభ్యులకు పంపిణీ చేసేవరకు ఎవరూ దానిని వెల్లడి చేయరాదని పార్లమెంటరీ విధివిధానాలు చెబుతున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement