breaking news
gen z
-
జీవితం పూలపాన్పు కాదు
న్యూఢిల్లీ: జీవితం అనేది ఎత్తుపల్లాల్లేకుండా సరళరేఖలా ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని యువ ఎన్ఐఆర్ విద్యార్థులతో వీడియో ద్వారా రాహుల్ సంభాషించారు. ఆ సంభాషణ తాలూకు వివరాలను రాహుల్ తన యూట్యూబ్ ఖాతాలో ఆదివారం పోస్ట్చేశారు. ‘‘ వాస్తవిక ప్రశ్నలు, నిజాయతీ అయిన సమాధానాలు. ఇందులో ఎలాంటి వడబోతలు లేవు. నేటి యువత గుర్తింపు సమస్యతోపాటు ఒత్తిడిని బాగా ఎదుర్కొంటోంది. జెన్ జెడ్ యువత తమ ఇష్టాయిష్టాలను, వృత్తిజీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలో తెలీక సతమతమవుతోంది. స్వేచ్ఛగా ఆలోచించడానికి తమ భావాలను వ్యక్తపర్చడానికి యువత ఇబ్బందిపడుతోంది. కొత్త విషయాలను తెల్సుకోవడం మొదలలు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, ఒక నిర్ణయం నుంచి ఎలా బయటపడాలి అనే సమస్యలూ జెన్జెడ్ను చుట్టుముట్టాయి. తమకు తమకు నమ్మకం లేక ఎలా ఇబ్బందులపాలవుతున్నారో, అభద్రతా భావంతో కుంగిపోతున్నారో వాళ్లు నాతో చెప్పారు. ఇబ్బందులు పడే జెన్జెడ్కు నేనిచ్చే సందేశం ఒక్కటే. సమయానుకూలంగా వ్యవహరిస్తూ దృఢచిత్తంతో పోరాడాలి. అన్నింటినీ ఎదుర్కోవాలి’’ అని సూచించారు. -
తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారా..!?
చాలామంది తరుచుగా ఉద్యోగాలు మారుతుంటారు. ముఖ్యంగా 20 నుంచి 25 ఏళ్ల వయసున్న యువత తరుచుగా జాబ్లు మారుతుంటారు. దాంతో చాలామంది ఈ ఉద్యోగంలోనైన ఎన్నాళ్లు ఉంటాడో అని విమర్శిస్తుంటారు. అయితే ఇలా విమర్శించడాన్ని తప్పుపడుతున్నారు పీపుల్ గ్రూప్ అండ్ షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు , సీఈవో అనుపమ్ మిట్లల్. ఇలా మారడాన్ని ఆయన సరైన స్ట్రాటజీగా అభివర్ణించారు కూడా. పైగా యువత సరిగ్గానే చేస్తుందని కితాబిచ్చేస్తున్నారు కూడా. చాలామంది నిపుణులు కూడా ఎక్కడ స్థిరంగా పనిచేయకపోతే అనుభవం ఎలా వస్తుందంటూ..ఉద్యోగాలు మారుతుండే వాళ్లని తిడుతుంటారు. కానీ మిట్టల్ మాత్రం ఇది సరైనదే అంటున్నారు. మరి అది ఏవిధంగానో ఆయన మాటల్లో సవివరంగా తెలుసుకుందామా..!జెన్జెడ్ తరుచుగా ఉద్యోగాలను మార్చడంపై సీఈవో అనుమపమ్ మిట్టల్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ..ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. జెన్జెడ్ తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారని కెరీర్ నిపుణులు తప్పుపడుతుంటారు. కానీ దీన్ని డేటింగ్లా తీసుకోండి అంటున్నారు అనుపమ్. స్థిరంగా ఒక చోట ఉద్యోగం చేయడాన్ని వివాహంగా భావిస్తే..ఈ తరం యువత తమకు నచ్చిన రంగంలో అభిరుచి వెతుక్కుంటూ చేస్తున్న అన్వేషణే ఇది అని అంటున్నారాయన. ఇలా ఉద్యోగాలు మారుతు తమకు నచ్చిన రంగాన్ని వెతుక్కుంటున్నారని అన్నారు. ఈ యువ నిపుణుల తమకు ఏ రంగాలు, ఎందులో తాము సరిపోతామో అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఇది అని అంటున్నారు. దీన్ని నమ్మకద్రోహం కిందకు చూడొద్దని, ఆత్మపరిశీలనకు సంబంధించిన అన్వేషణగా అభివర్ణించారాయన. చాలామంది కెరీర్ నిపుణులు దీన్ని తప్పుగా చూస్తున్నారు గానీ.. యువత సరిగ్గా చేయాల్సింది ఇదే కదా అన్నారు. నిజానికి జెన్జెడ్లో చాలామంది కెరీర్ ప్రారంభదశలో ఉన్న నిపుణులే. ఈ తరం ఒత్తిడి కంటే మానసిక శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇస్తోంది. పైగా వాళ్లు కార్పోరేట్ నిచ్చెన ఎక్కడం కంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై దృష్టి పెడతారని పలు సర్వేలు కూడా పేర్కొన్నాయని గుర్తుచేశారు. అందువల్ల ఈ తరం చేస్తుంది ముమ్మాటికి కరెక్టేనని అన్నారు. అంతేగాదు 21-24 ఏళ్ల మధ్య ఉద్యోగాలు మారడం సరైనదేనని, 25 ఏళ్ల తర్వాత మాత్రం స్థిరంగా ఒకచోట పనిచేయాలని అనుపమ్ సూచించారు. అంతేగాదు ఉద్యోగం మారాక, దాని గురించి ఆలోచించకండి, చింతికండి అని చెబుతున్నారు అనుపమ్. తాను టీమ్ లీడర్గా ఉన్నప్పుడూ..ఉద్యోగాల నియామక ప్రక్రియలో చాలా క్లియర్గా ఉండేవాడినని, అభ్యర్థికి కనీసం 4 నుంచి 5 ఏళ్లు అనుభవం లేకపోతే నిర్థాక్షిణ్యంగా రిజెక్ట్ చేసేవాడినని అన్నారు. అలాగే ఇలా ఉద్యోగాలు మారడం వల్ల కొత్తదనం తెలియడమే కాకుండా, దాని పర్యవసానాలపై అవగాహన, అనుభవం ఏర్పడుతుందని కూడా నొక్కి చెప్పారు. ఈ పోస్ట్ చాలామంది యువతను ఆకర్షించడమే గాక మాకు ఇది సరైన మార్గనిర్దేశం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..! ఆ ఎనిమిది మార్పులు..) -
యువతను రెచ్చగొట్టారు
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని కేంద్రం ఆరోపించింది. పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్లలో మాదిరిగా జెన్ జెడ్ నిరసనలకు పిలుపునిచ్చారని పేర్కొంది. తన నిజ స్వరూపం బయటపడకుండా ఉండేందుకు గాను ఆయన మహాత్మాగాంధీ ప్రసంగాలను ఉపయోగించుకున్నారని తెలిపింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద వాంగ్చుక్ను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ అరవింద్ కమార్, జస్టిస్ పీవీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ చేసిన వ్యక్తులను ఎలాంటి విచారణ లేకుండా గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధించే హక్కు అధికారులకు ఉంటుంది. కేంద్రం, లద్దాక్ యంత్రాంగం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేంద్రాన్ని వాళ్లు అని, లద్దాఖ్ ప్రజలను మనం అని వేరుగా చూపిస్తూ మాట్లాడారని వాంగ్చుక్ ప్రసంగించే వారని ఆయన పేర్కొన్నారు. గతంలో జమ్మూ కశీ్మర్లో వచ్చినట్లుగా ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండం చేపట్టాలంటూ డిమాండ్ చేశారన్నారు. చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులు కలిగిన లద్దాఖ్ ప్రాంతం అత్యంత సున్నితమైందన్న మెహతా..అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ వాంగ్చుక్ చేసిన ప్రసంగాలను తప్పనిసరిగా గణనలోకి తీసుకోవాలని కోరారు. ‘ప్రసంగాల వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే జిల్లా మేజిస్ట్రేట్ వాంగ్చుక్ నిర్బంధానికి ఆదేశాలు జారీ చేశారు. మేజి్రస్టేట్ ఆదేశాల మేరకు డీఐజీ స్థాయి అధికారి ముందుగా వాంగ్చుక్ వద్దకు వెళ్లి ఆయన ప్రసంగాల వీడియోలను, ఇతర ఆధారాలను చూపారు. నిర్బంధంలోకి తీసుకునేందుకు గల కారణాలను వివరించారు’అని ధర్మాసనానికి మెహతా తెలిపారు. మేజి్రస్టేట్ కృత్రిమ ఆధారాలతోనే వాంగ్చుక్ను నిర్బంధించాలంటూ ఆదేశాలు జారీ చేశారన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. వాంగ్చుక్ చేసిన ప్రసంగాలను విన్న అధికారులు, ఆ వీడియోలను తయారు చేసి మేజి్రస్టేట్ ముందుంచారని వివరించారు. మంగళవారం కూడా ఈ కేసులో వాదనలు కొనసాగనున్నాయి. జోథ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న వాంగ్చుక్ అరబ్ దేశాల్లో మాదిరిగా తిరుగుబాటును లేవదీసేందుకు ప్రయత్నించినట్లు తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ జనవరి 29వ తేదీన ఒక ప్రకటన వెలువరించారు. ప్రభుత్వాన్ని విమర్శించే, నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కు తనకుందని అందులో పేర్కొన్నారు. కొన్ని ఎంపిక చేసిన వీడియోలను చూపు తూ అధికారులు వాంగ్చుక్ నిర్బంధాన్ని సమరి్థంచుకుంటున్నారంటూ ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. వాంగ్చుక్ నిర్బంధం చట్ట విరుద్ధం, ఏకపక్ష చర్య..ఆయన ప్రాథమిక హక్కులకు భంగకరమని గీతాంజలి అంగ్మో ఆరోపిస్తున్నారు. లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ప్రకటించాలంటూ గతేడాది సెప్టెంబర్లో జరిగిన నిరసనల్లో నలుగురు చనిపోగా, 90 మంది వరకు గాయపడ్డారు. అల్లర్లకు వాంగ్చుక్ రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని ఆరోపిస్తూ రెండు రోజుల తర్వాత అధికారులు జాతీయ భద్రతా చట్టం కింద ఆయన్ను నిర్బంధంలోకి తీసుకోవడం తెల్సిందే. -
జెన్జీలు ఇంత మంచోళ్ళు ఏంట్రా!?
జెన్జీ అనగానే చాలామందికి రకరకాల అపోహలు. సక్రమంగా పనిచేయరని, ఏ విషయానికీ శ్రద్ధ చూపరని, బాధ్యతగా ఉండరని… ఇలా ఇంటా బయటా వారిమీద ఓ అవవాదు ఉంది. కానీ తాజాగా వెలువడిన ఒక నివేదిక మాత్రం ఈ అపోహలను చెరిపేసింది. ‘జెన్జీలు ఇంత మంచోళ్ళు ఏంట్రా!’ అని అనిపించేలా ఆ నివేదికలో వివరాలు బయటపడ్డాయి. ఏంటా నివేదిక? ఆ నివేదికలో ఏముంది?బార్, రెస్టారెంట్, హౌస్ పార్టీ – ఏ సందర్భమైనా మద్యం తప్పనిసరి అన్న భావన ఉండేది. కానీ తాజాగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం జెన్జీలు మద్యం వినియోగానికి దూరంగా ఉంటున్నారని తేలింది. బీర్, వైన్, స్పిరిట్స్ వంటి పానీయాలను వీరు పెద్దగా పట్టించుకోవడం లేదు. యువతలో మద్యం వినియోగం తగ్గుతుండగా, ఆరోగ్యంపై శ్రద్ధ, మితంగా జీవించడం, జీరో-అల్కహాల్ పానీయాలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగ ధోరణులు మారుతున్నాయి.అమెరికాలో గ్యాలప్ సర్వే ప్రకారం 18-34 ఏళ్ల వయసు గల యువతలో మద్యం తాగే వారి శాతం గత రెండు దశాబ్దాల్లో తగ్గింది. 2000ల ప్రారంభంలో 72 శాతం మంది తాగుతుండగా, ఇటీవల అది 62 శాతానికి పడిపోయింది. మిల్లెనియల్స్తో పోలిస్తే జెన్జీ తరం సుమారు 20 శాతం తక్కువగా మద్యం సేవిస్తోంది. మరో సర్వే ప్రకారం 21.5 శాతం మంది జెన్జీలు అసలు మద్యం తాగరని, 39 శాతం మంది అప్పుడప్పుడు మాత్రమే తాగుతారని తేలింది. ఎందుకు తగ్గిస్తున్నారు?మద్యం వల్ల నిద్రలేమి, ఆందోళన, హ్యాంగోవర్ వంటి సమస్యలు వస్తాయని యువత స్పష్టంగా గుర్తిస్తోంది. ఫిట్నెస్, మైండ్ఫుల్నెస్, మానసిక స్థైర్యం కోసం మద్యం దూరం చేస్తున్నారు.సామాజిక ప్రభావం: సోషల్ మీడియా యుగంలో ప్రతి నిర్ణయం బహిరంగంగా కనిపిస్తోంది. అందుకే మద్యం తాగకపోవడం కూడా ఒక సామాజిక సందేశంగా మారింది. ‘సోబర్ క్యూయిరియస్’ ఉద్యమాలు, మద్యం లేని సమావేశాలు, వెల్నెస్ ఈవెంట్లు యువత సంస్కృతిలో భాగమయ్యాయి.ఆర్థిక కారణాలు: పెరుగుతున్న జీవన ఖర్చులు, విద్యా రుణాలు, గృహ వ్యయాలు. ఇవన్నీ మద్యం వినియోగాన్ని తగ్గించేలా ప్రభావం చూపుతున్నాయి. ఖరీదైన నైట్లైఫ్ కన్నా ఇంట్లో సమావేశాలు, నాన్-అల్కహాలిక్ పానీయాలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు.తాగుతున్నవారు కూడా..జెన్జీ తరం పూర్తిగా మద్యం మానేసిందని కాదు. తాగుతున్నవారు కూడా పూర్వతరాలతో పోలిస్తే భిన్నంగా తాగుతున్నారు. తక్కువ సార్లు, తక్కువ పరిమాణంలో, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తాగుతున్నారు. అలాగే లో-అల్కహాల్, నాన్-అల్కహాలిక్, ఫ్లేవర్డ్ పానీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఆహార, అతిథ్య రంగంపై ప్రభావంఈ మార్పు రెస్టారెంట్లు, బార్లు, బ్రాండ్లను కొత్త దారిలో నడిపిస్తోంది. మాక్టెయిల్స్, లో-అల్కహాల్ డ్రింక్స్, ప్రీమియం నాన్-అల్కహాలిక్ పానీయాలు ఇప్పుడు మెనూలో ప్రధాన స్థానాన్ని పొందుతున్నాయి. పానీయాల కంపెనీలు కొత్తగా లో-అల్కహాల్, నాన్-అల్కహాలిక్ విభాగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.జెన్జీ తరం మద్యం వినియోగాన్ని పూర్తిగా తిరస్కరించడం కాదు, దాని పాత్రను తిరిగి నిర్వచిస్తోంది. ఆరోగ్య ప్రాధాన్యత, ఆర్థిక వాస్తవాలు, సామాజిక మార్పులు – ఇవన్నీ కలిపి ఈ తరాన్ని కొత్త దారిలో నడిపిస్తున్నాయి. సంప్రదాయాలను ప్రశ్నించే, అలవాట్లకన్నా ఉద్దేశ్యాన్ని విలువ చేసే తరం ఇది. -
టాలీవుడ్ను కాపాడుతున్న 'Gen Z' కిడ్స్
భారతదేశంలోని మల్టీప్లెక్స్ థియేటర్ల ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడిన సంస్థ MAI.. ఈ సంస్థ ఎప్పటికప్పుడు థియేటర్స్కు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను క్రోడీకరిస్తుంది. గత 5ఏళ్లలో వచ్చిన మార్పులను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉంది. వారు ఇప్పటికే అందించిన నివేదిక ప్రకారం కోవిడ్ తర్వాత 2020–2022 మధ్య థియేటర్కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. కానీ, 2023–2025లో పెద్ద సినిమాల కారణంగా మళ్లీ పెరుగుదల కనిపించిందని పేర్కొంది.ముఖ్యంగా 2025లో Gen Z (13–29 ఏళ్ల వయసు) ప్రేక్షకులు థియేటర్కి వెళ్లే వారి సంఖ్య 25% పెరిగింది. వారు సగటున సంవత్సరానికి 6 సార్లు థియేటర్కి వెళ్లారని లెక్కలు చెబుతున్నాయి. అయితే, 30 ఏళ్లకు పైబడిన వారి సంఖ్యతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఏకంగా 41 శాతం వరకు థియేటర్వైపు వెల్లడంలేదని తేల్చిచెప్పింది. 2019 వరకు ప్రతి ఏడాది థియేటర్లలో సినిమాలు చూసిన ప్రేక్షకుల సంఖ్య సుమారు 150 కోట్ల వరకు ఉంది. అయితే, 2024కు వచ్చేసరికి కేవలం రూ. 86 కోట్లకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సినిమా టికెట్ ధరలతో పాటు క్యాంటీన్ రేట్ల కారణంగా థియేటర్వైపు వెళ్లాలని ఉన్నప్పటికీ సామాన్యులు దడుసుకుంటున్నారు. దీంతో కొన్ని థియేటర్స్ మూతపడుతున్నాయి. ఓటీటీల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ అవసరం తగ్గింది.థియేటర్స్కు ప్రేక్షకులు వెళ్లడం తగ్గించడంతో కలెక్షన్స్పై ఆ ప్రభావం పడుతుంది. గత ఐదేళ్లగా భారతీయ సినిమాలన్నీ సాధించిన వసూళ్లులో పెద్దగా మార్పు లేదు. దేశవ్యాప్తంగా 2019లో రూ. 19వేల కోట్లు వస్తే.. 2024లో రూ. 18వేల కోట్లు, 2025లో రూ. 14వేల కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. 41శాతం ప్రేక్షకులు తగ్గినప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం టికెట్ రేట్ల పెంపు అని చెప్పవచ్చు. 2025లో సినిమా టికెట్ ధరల పెంపు గణనీయంగా పెరిగింది. అదే సమయంలో థియేటర్కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా Gen Z (13–29 ఏళ్ల వయసు) వారే థియేటర్కు వెళ్తున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. గతేడాదిలో హిందీ పరిశ్రమ కాస్త మెరుగ్గానే ఉంది. హిందీ పరిశ్రమ నుంచి గతేడాది 231 సినిమాలు విడుదలైతే రూ. 4,639 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ, టాలీవుడ్ పాతాళానికి పడిపోయింది. తెలుగులో 274 సినిమాలు తీస్తే రూ. 2500 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాతి స్థానంలో తమిళ ఇండస్ట్రీ 290 సినిమాలకు గాను రూ. 1,533 కోట్ల గ్రాస్తో ఉంది. కన్నడ రూ. 1,100 కోట్లు, మలయాళం రూ. 919 కోట్లతో వరుసగా ఉన్నాయి. కలెక్షన్స్తో పాటు ఓటీటీ వంటి వాటితో నిర్మాతలు కాస్త బయటపడుతున్నారు. లేదంటే కోట్ల రూపాయలు నష్టం భరించాల్సి వచ్చేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనా టాలీవుడ్లో ఈ ఏడాది నుంచి మరింత కఠనంగా పరిస్థితిలు ఉండే ఛాన్స్ ఉంది. -
మన జెన్ జెడ్లో పుష్కలంగా సృజన
న్యూఢిల్లీ: భారతీయ జెన్ జెడ్ యువతరంలో సృజనాత్మకత పుష్కలంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2047 ఏడాదికల్లా భారత్ను అభివృద్ధిచెందిన దేశంగా వికసిత్ భారత్గా అవతరింపజేసుకునేందుకు యువత తమ వంతుగా అందించే వినూత్న, సృజనాత్మక ఆలోచనల వేదికగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్(బీవీవైఎల్డీ)ను మోదీ ప్రభుత్వం తీర్చిదిద్దింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 12వ తేదీన బీవీవైఎల్డీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో వీబీఐఎల్డీ ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ ఏటా స్వామి వివేకానంద గౌరవార్థం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన స్ఫూర్తితో వీబీవైఎల్డీని స్థాపించాం. యువతను దృష్టిలో ఉంచుకుని పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చాం. అంకురసంస్థల విప్లవాన్ని ఆశిస్తున్నాం. ఇప్పుడు సృజనాత్మక ఆలోచనలు, శక్తి, సదుద్దేశాలతో మన యువశక్తి ఇప్పుడు దేశ నిర్మాణంలో ముందు వరసలో నిలబడింది. సృజనాత్మక ఆలోచనలు, సమా చారం, సంస్కృతిలతో ఆరెంజ్ ఎకానమీ గణనీయమైన వృద్ధిపథంలో పయనిస్తోంది. గత దశాబ్దకాలంగా చేపట్టిన పలు సంస్కరణలతో ఇప్పుడు ఏకంగా సంస్కరణ ఎక్స్ప్రెస్ దూసుకుపోతోంది. ఈ సంస్కరణల కేంద్ర బిందువు మన యువతలోనే దాగి ఉంది’’ అని మోదీ అన్నారు. జనవరి 9వ నుంచి 12వ తేదీదాకా బీవీవైఎల్డీ కొనసాగింది. దేశవ్యాప్తంగా పలు స్థాయిల్లో 50 లక్షల మందికిపైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంది. -
పద పదా.. భారత Gen Zలో పెరుగుతున్న ట్రెండ్
భారతదేశంలోని జెన్ జీ (Gen Z) నవ యువతలో సంగీతం ప్రాధాన్యత పెరుగుతోంది. ట్రావెల్ టెక్ సంస్థ ఎయిర్బీఎన్బీ (Airbnb) విడుదల చేసిన తాజా అధ్యయనం పలు ఆసక్తి వివరాలు తెలియజేస్తోంది. సంగీత కచేరీలు, మ్యూజిక్ ఫెస్టివల్స్ యువయాత్రలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రేరేపిస్తున్నాయి.ఎయిర్బీఎన్బీ ‘ఎక్స్పీరియన్స్-లెడ్ ట్రావెల్ ఇన్సైట్స్’ రిపోర్ట్ ప్రకారం, 2026లో 62% యువ భారతీయులు కచేరీలు, సంగీత ఫెస్టివల్స్ కోసం ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నారు. ఇది సంప్రదాయ విహారం కోసం చేసే యాత్రల నుండి సాంస్కృతిక అనుభవాల ఆధారిత యాత్రల వైపు మార్పును సూచిస్తుంది. ఇప్పటికే 76% మంది జెన్ జీ ప్రతినిధులు.. సంగీత కార్యక్రమం కోసమే తాము ఓ కొత్త నగరాన్ని సందర్శించినట్లు పేర్కొన్నారు.ఈవెంట్ ముగిసినా..ఇలా మ్యూజిక్ ఈవెంట్ల కోసం వెళ్లినవారు ఆ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఈవెంట్ అయిపోయాక కూడా అక్కడే ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలను మరింతగా అన్వేషిస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 53% మంది ఇలాగే స్థానిక ప్రాంతాలు, కాఫీ షాపులు, నైట్లైఫ్, సాంస్కృతిక హాట్స్పాట్లను చూడటం కోసం తమ వసతిని మరికొన్ని రోజులు కొనసాగించారు.విదేశాలకూ వెళ్తాం..ఈ సంగీత ఆధారిత యాత్రలు భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. 40% కి పైగా జెన్ జీ ప్రతినిధులు అంతర్జాతీయంగా జరిగే మ్యూజిక్ ఈవెంట్ల కోసం ముఖ్యంగా అమెరికా, యూరోప్, ఆసియా దేశాలకు కూడా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 70% మంది ఫ్రెండ్స్ తో సమూహంలో ఈ ఈవెంట్లలో పాల్గొనడాన్ని ఇష్టపడుతున్నారు. గ్రూప్ స్టేలకు డిమాండ్ను పెంచుతోంది.ఖర్చు లెక్కేం లేదు..ఇలా మ్యూజిక్ ట్రిప్లకు వెళ్లడం కోసం ఖర్చుకు కూడా వెనకాడటం లేదు భారత జెన్జీ యువత. ప్రతి పది మందిలో ఆరుగురు యువ యాత్రికులు తమ నెలవారీ ఆదాయంలో 21–40% మ్యూజిక్ కన్సర్ట్ -ఆధారిత ట్రిప్లపైనే ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒక్కో సంగీత కార్యక్రమ ప్రయాణానికి చేసే సగటు ఖర్చు రూ.51 వేల దాకా ఉంటోంది.ఇదీ చదవండి: ఇవేం ధరలు బాబోయ్.. హ్యాట్రిక్ కొట్టేసిన పసిడి, వెండి -
బలగాల ప్రయోగంపై కేపీ ఓలీకి సమన్లు!
కాఠ్మండు: గత ఏడాది సెప్టెంబర్లో నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో యువత పైకి సాయుధబలగాలను ప్రయోగించి నాటి ప్రధాని కేపీ శర్మ ఓలీ అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ కమిషన్ త్వరలో ఆయనను విచారించనుంది. జనవరి 21వ తేదీలోగా నివేదిక సమర్పింంచాల్సి ఉండటంతో ఆలోపు నిర్ణయాత్మకమైన నేతలు, అధికారుల నుంచి కమిషన్ సభ్యులు వివరణ తీసుకోనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన కాఠ్మండులో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ చేపట్టిన యువతపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్లో అవినీతి, వారసత్వ రాజకీయాలు, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన జనం జెన్–జెడ్ యువతరం సారథ్యంలో ఉద్యమించడంతో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో దేశవ్యాప్తంగా ఆనాడు 77 మంది చనిపోయిన విషయం తెల్సిందే. దీంతో నేపాల్ తాత్కాలిక ప్రభుత్వం నియమించిన గౌరీ బహదూర్ కర్కీ సారథ్యంలోని విచారణ కమిషన్ దర్యాప్తు మొదలెట్టింది. కర్కీ గురువారం మీడియాతో మాట్లాడారు. ఘటనలో స్పష్టత కోసం ఓలీకి సమన్లు జారీచేసి ప్రశ్నించే అవకాశముందని చెప్పారు. అయితే కమిషన్ ఎదుట తాను హాజరయ్యే ప్రసక్తే లేదని కేపీ శర్మ ఓలీ కరాఖండీగా చెప్పేశారు. కమిషన్ చట్టబద్ధతను, విచారణలో పారదర్శకతను ఆయన ప్రశ్నించారు. -
జెన్ జడ్ గురించి మీకు తెలుసా?
జెన్ జడ్ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన... ఈ సాంకేతికను అలవర్చుకున్న... చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్నే జెన్జడ్ అని... అంటే జనరేషన్ జడ్ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా... కొత్త ఆలోచనలు... దానికి మించి... ఆన్లైన్ సాంకేతికత... అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్ జడ్. ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్ జడ్ తీరు గురించి మనో వైజ్ఞానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్ చేద్దాం.జన్ జడ్ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్..., "ఐ జనరేషన్"...., "డిజిటల్ స్థానికులు".... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్జడ్లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు చిన్నప్పుడే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు. దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.... పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్ జడ్ లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్ వెదకటం, చాట్ జీపీటీని అడగం.... లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే... దీంతో వారి మనస్సులు... వారి సామాజిక స్పృహ... ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు. జన్జడ్ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం... కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా... ఎక్కువగా ఆలోచిస్తారు... చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం... దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Z లో చాలా వరకు వ్యక్తులు సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం... సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం... ఇ-కామర్స్ బ్రాండ్స్, డిజిటల్ కంటెంట్లు, స్టార్టప్లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు. జెన్ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.... భయం లేకుండా ప్రవర్తించడం... కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని... లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తారు. జెన్ జడ్ తరం మానసికంగా బలంగా ఉంటారు... భావోద్వేగాలకు తావు లేకుండా... బాధను వ్యక్తీకరించడం... ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.... సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా... వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.ఆన్ లైన్లో చర్చల ద్వరా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు... ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన... చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు... వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్ ఎక్స్పోజర్... అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం... ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు... కలిగి ఉంటారు. కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ... బలహీనత కాదు... అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.... గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి... కానీ జెన్జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.... తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు. -
ఫొటో 2025
వేయి వాక్యాల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటో పట్టిచూపుతుందని ఒక విశ్లేషణ. అలా 2025 ఏడాదిలో విశ్వవ్యాప్తంగా పలు ఘటనలు చరిత్రలో నిలిచిపోయాయి.సమాజంపై ప్రభావితంచూపిన, చర్చనీయాంశమైన చిత్రాలివి..పెళ్లయి కాళ్లకు పారాణి కూడా ఆరకముందే ఉగ్రవాదుల పైశాచికకాండలో భర్తను కోల్పోయి అతని మృతదేహం వద్ద నిశ్చేష్టురాలై కూలబడిన నవ వధువు ఫొటో ఇది. పెళ్లయిన ఆరు రోజులకే నూరేళ్లు నిండిపోయిన భారత నావికాదళాధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోగా కాపాడండి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరచి అలసిపోయిన భార్య హిమాన్షీ ఫొటో ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాలో ప్రచురితమైంది. ఏప్రిల్ 22వ తేదీ జమ్మూకశ్మీర్లోని పహల్గాం పరిధిలోని బైసారన్ పచ్చికబయళ్లలో అమాయక పర్యాటకులపై ఉగ్రమూకలు దాడిచేయడం, అందుకు ప్రతిగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రమూకల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేయడం తెల్సిందే.అగ్రరాజ్యాధినేత అధికారి నివాసం వైట్హౌస్ ఒక్కసారిగా రచ్చబండగా మారిన అరుదైన క్షణం తాలూకు ఫొటో ఇది. మాట్లాడుకుందాం అంటూ ఆహా్వనించి మీడియా ప్రతినిధుల ఎదుట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్కువచేసి మాట్లాడటం, దానికి జెలెన్స్కీ దీటుగా బదులివ్వడం, చివరకు ద్వైపాక్షిక భేటీ వాగ్వాదాలమయంగా మారడం తెల్సిందే. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన ఈ వాగ్వాదాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో ప్రపంచదేశాలన్నీ చూశాయి. అతిథిని అవమానించిన ట్రంప్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయల్దేరిన విమానం గాల్లోకి లేచిన 32 సెకన్లకే ఎదురుగా ఉన్న వైద్యకళాశాల భవనంపై కుప్పకూలిన అత్యంత విషాధ ఘటన తాలూకు ఫొటో ఇది. 12 మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలి అగ్నిగుండంగా మారి బూడిదైంది. ఈ ఘటనలో ఒక్కరే బతికి బయటపడ్డారు. విమానంలో సాంకేతిక లోపమా? పైలట్ తప్పిదమా అనేది మిస్టరీగా మారింది. దేశీయ విమానయాన రంగ భద్రతపైనా ఈ దుర్ఘటన నీలినీడలు కమ్మేలా చేసింది.వేగంగా మండే స్వభావమున్న వెదురు కర్రలు, స్టీరోఫోమ్ కిటికీలను నెలలతరబడి మరమ్మతుల కోసం వినియోగించడంతో అనుకోకుండా అంటుకున్న నిప్పురవ్వలు చివరకు హాంకాంగ్లోని ప్రముఖ వాంగ్ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్ బహుళ అంతస్తుల భవనాలను నిలువునా బూడిదచేసిన దారుణోదంతం ఫొటో ఇది. ఈ ఘటనలో ఏకంగా 161 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 26వ తేదీన జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదం తర్వాత హాంకాంగ్లో వెదురు కర్రలు, స్టీరోఫోమ్ వినియోగంపై పెద్ద చర్చే మొదలైంది. అవినీతి, వారసత్వ రాజకీయాలు, నేతల విలాసవంత జీవితం, అసమర్థ, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన నేపాల్ యువత ఉవ్వెత్తున నిరసనోద్యమంగా ఎగసిపడిన క్షణం నాటి ఫొటో ఇది. జెన్ జెడ్ ఉద్యమంగా నేపాల్ ప్రధాన నగరాల్లో వేలాదిగా బారులుతీసిన విద్యార్థులు ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోశారు. ఈ దెబ్బకు సెపె్టంబర్ 9న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, కేబినెట్ మంత్రులు పదవులకు రాజీనామాచేసి సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం తెల్సిందే. వారం తిరిగేలోపే మాజీ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి సుశీల కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.గాజాపై నెలల తరబడి వేల కొద్దీ బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండటంతో ఇళ్లు, ఆస్పత్రులు సహా ప్రతి కట్టడం కుప్పకూలడంతో నిలువనీడలేక, తినడానికి తిండిలేక, దుర్భర దారి్రద్యంలో బతుకీడుస్తూ అన్నదాన శిబిరాల వద్ద గిన్నె పట్టుకుని ఆహారం కోసం పోటీపడుతున్న చిన్నారులు వీరంతా. ఈ ఏడాది మొదట్లో గాజాలో ఓ శరణార్థి శిబిరంలో తీసిన ఈ ఫొటో అక్కడి దయనీయ స్థితికి అద్దంపడుతోంది. ఇకనైనా ఇజ్రాయెల్ దారుణదాడులను నిలిపివేయాలని ప్రపంచదేశాలు వేడుకుంటున్నా అమెరికా అండతో ఇజ్రాయెల్ ఈ అభ్యర్థనలను పెడచెవిన పెడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జెన్ జడ్.. పదం కాదు.. ఓ తరం.. ఆసక్తికర విషయాలివే..!
జెన్ జడ్ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన.. ఈ సాంకేతికను అలవర్చుకున్న.. చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్నే జెన్జడ్ అని.. అంటే జనరేషన్ జడ్ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా.. కొత్త ఆలోచనలు.. దానికి మించి.. ఆన్లైన్ సాంకేతికత.. అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్ జడ్.ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్ జడ్ తీరు గురించి మనో వైజ్క్షానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్ చేద్దాం.జన్ జడ్ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్.., "ఐ జనరేషన్".., "డిజిటల్ స్థానికులు"... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్జడ్లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు చిన్నప్పుడే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు.దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్ జడ్లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్ వెదకటం, చాట్ జీపీటీని అడగం.. లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే.. దీంతో వారి మనస్సులు.. వారి సామాజిక స్పృహ.. ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు.జన్జడ్ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం.. కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా.. ఎక్కువగా ఆలోచిస్తారు.. చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం.. దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Zలో చాలా వరకు వ్యక్తులు సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం.. సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం.. ఇ-కామర్స్ బ్రాండ్స్, డిజిటల్ కంటెంట్లు, స్టార్టప్లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు.జెన్ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.. భయం లేకుండా ప్రవర్తించడం.. కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని.. లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికితీయడానికి ప్రయత్నిస్తారు. జెన్జడ్ తరం మానసికంగా బలంగా ఉంటారు.. భావోద్వేగాలకు తావు లేకుండా.. బాధను వ్యక్తీకరించడం.. ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.. సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా.. వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.ఆన్లైన్లో చర్చల ద్వారా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు.. ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన.. చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు.. వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్ ఎక్స్పోజర్.. అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం.. ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు.. కలిగి ఉంటారు.కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ.. బలహీనత కాదు.. అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.. గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి.. కానీ జెన్జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.. తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.


