-
సిలిండర్ పేలి నలుగురికి గాయాలు
-
ఓల్వో బస్సు బోల్తా: నలుగురికి గాయాలు
ఇటిక్యాల : ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడటంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం మండలంలోని కొండేరు సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ జగదీశ్వర్ కథనం ప్రకారం.. ప్రైవేట్ ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు బుధవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి హైదరబాద్ వెళ్తుంది. ఈ క్రమంలో మండలంలోని కోండేరు గ్రామ స్టేజీ వద్ద డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన సురేష్, ఆయన భార్య పద్మ, వారి కుమార్తె సౌమ్య, తిరుపతికి చెందిన మురళీకృష్ణలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను హైవే అంబులెన్స్లో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 38 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటన స్థలానికి ఎస్ఐ వెళ్లి ప్రయాణికులను ఇతర వాహనాల్లో హైదరాబాద్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చెట్టును ఢీకొన్న పోలీస్ వాహనం
రాయగడ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాయగడ జిల్లాకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సివిల్ సప్లయిస్, సహకార విభాగా మంత్రి సూర్యనారాయణ పాత్రో సెక్యూరిటీ వాహనం ప్రమాదానికి గురైంది. కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా పార్వతీపు రం మీదుగా బరంపురం వెళ్లే సమయంలో మం త్రి సెక్యూరిటీ వాహనం శేశికళ పోలీస్స్టేషన్ పరి ధి జీమిడిపేట ప్రాంతంలో అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొని ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో సెక్యూరిటీ సిబ్బంది ఏఎస్ఐ మోతీలాల్, కె.పొరిడా, బిశొయిరామకృష్ణ, ఆదిత్యచౌదరి, కేకే నాయక్కు గాయాలు కాగా వారికి తక్షణం జీమి డిపేట పీహెచ్సీలో వైద్యం అందించిన పిదప రాయగడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో విశాఖపట్టణం తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
హాజీపూర్(మంచిర్యాలరూరల్) : హాజీపూర్ మండలం దొనబండ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రికి చెందిన ఓ యువకుడు మృతిచెందగా మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. హాజీపూర్ ఎస్సై ముత్తన్న తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి రాజీవ్నగర్కు చెందిన శెట్పల్లి నిఖిల్సాయి, రాజ్కుమార్, సాయిపవన్, వెంకటరమణ, సిద్దులు కారులో మందమర్రి నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శెట్పల్లి నిఖిల్సాయి(19) తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్కుమార్, సాయిపవన్, వెంకటరమనణ, సిద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హాజీపూర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో నిఖిల్సాయి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మిగతా నలుగురు యువకులు పట్టణలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. కాగా మృతుడు నిఖిల్సాయికి తండ్రి రాజేశం, తల్లి విజయ ఉన్నారు. తండ్రి క్యాబ్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. నిఖిల్సాయి బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రెండు లారీల మధ్య నలిగిన కారు
ఇచ్ఛాపురం : పట్టణానికి సమీపంలో పురుషోత్తపురం చెక్పోస్టు సమీపంలో గెడ్డ వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చెప్పిన వివరాలు ప్రకారం... ఒడిశా నుంచి ఇచ్ఛాపురం వైపు వస్తున్న కారు ఎదురుగా ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ సమయంలో వెనుక వైపుగా వస్తున్న మరో లారీ కారును ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య కారు నలిగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో బరంపురం మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పట్టణ ఎస్ఐ బి.మంగరాజు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement