ఓల్వో బస్సు బోల్తా: నలుగురికి గాయాలు

Four Members Injured In Road Accident  - Sakshi

ఇటిక్యాల : ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు అదుపు తప్పి బోల్తాపడటంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం మండలంలోని కొండేరు సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్‌ఐ జగదీశ్వర్‌ కథనం ప్రకారం.. ప్రైవేట్‌ ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు బుధవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి హైదరబాద్‌ వెళ్తుంది. ఈ క్రమంలో మండలంలోని కోండేరు గ్రామ స్టేజీ వద్ద డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపు బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన సురేష్, ఆయన భార్య పద్మ, వారి కుమార్తె సౌమ్య, తిరుపతికి చెందిన మురళీకృష్ణలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 38 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ వెళ్లి ప్రయాణికులను ఇతర వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top