breaking news
Blessing Muzarabani
-
సిరాజ్ను వెనక్కు నెట్టిన జింబాబ్వే బౌలర్
టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 26.91 సగటున 37 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్గా ఉండేవాడు. తాజాగా జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ (Blessing Muzarabani) సిరాజ్ను వెనక్కు నెట్టి, అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు. ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 20) మొదలైన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన ముజరబానీ తన వికెట్ల సంఖ్యను 39కి (10 మ్యాచ్ల్లో) పెంచుకున్నాడు. ముజరబానీ, సిరాజ్ తర్వాత ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్ స్టార్క్ (7 మ్యాచ్ల్లో 29 వికెట్లు), నౌమన్ అలీ (26), నాథన్ లియోన్ (24) ఉన్నారు.ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో ముజరబానీతో పాటు (11-1-47-3), బ్రాడ్ ఈవాన్స్ (9.3-2-22-5), తనక చివంగ (6-0-29-1) చెలరేగడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ను తొలి ఇన్నింగ్స్లో 127 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్గా నిలిచాడు.ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ (6) ఔట్ కాగా.. బెన్ కర్రన్ (34), నిక్ వెల్చ్ (40) క్రీజ్లో ఉన్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి.చదవండి: PAK VS SA 2nd Test: బాబర్ విఫలమైనా, ఆదుకున్న కెప్టెన్ -
ఆఫ్ఘనిస్తాన్ భరతం పట్టిన జింబాబ్వే బౌలర్
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే యువ పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) చెలరేగిపోయాడు. 9.3 ఓవర్లలో 22 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈవాన్స్కు బ్లెస్సింగ్ ముజరబానీ (11-1-4-3), తనక చివంగ (6-0-29-1) కూడా తోడవ్వడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ను 127 పరుగులకే ఆలౌట్ చేసింది.ఇవాళే మొదలైన (అక్టోబర్ 20) ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలో ఆఫ్ఘనిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే బ్రాడ్ ఈవాన్స్ ఒక్కసారిగా చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. ఈవాన్స్ తన కెరీర్లో రెండో టెస్ట్లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే కూడా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 6 పరుగులకే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ను జియా ఉర్ రెహ్మాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. బెన్ కర్రన్ (2), నిక్ వెల్చ్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి. చదవండి: రిటైరయ్యే వయసులో అరంగేట్రం.. పాక్ ప్లేయర్ అరుదైన ఘనత -
శ్రీలంకకు జింబాబ్వే షాక్.. 80 పరుగులకే ఆలౌట్
హరారే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో జింబాబ్వే బౌలర్లు నిప్పులు చేరిగారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. జింబాబ్వే బౌలర్ల దాటికి 17.4 ఓవర్లలో కేవలం 80 పరుగులకే కుప్పకూలింది. ఆరంభం నుంచే శ్రీలంక బ్యాటర్లకు కష్టాలు ఎదురయ్యాయి. శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్లో తన వేసిన తొలి బంతికే ముజారబానీ.. స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్(1) ఔట్ చేసి పర్యాటక జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాత శ్రీలంక వికెట్లు పతనం కొనసాగింది. టాపర్డర్, మిడిలార్డర్, లోయార్డర్ అన్న తేడా లేకుండా లంక బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. శ్రీలంక బ్యాటర్లలో కమిల్ మిశ్రా 20 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మొత్తం ఏడు మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవెన్స్, కెప్టెన్ సికిందర్ రజా తలా మూడు వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు ముజారబానీ రెండు, విలియమ్స్ ఒక్క వికెట్ సాధించారు. కాగా టీ20ల్లో శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇంతకుముందు టీ20 వరల్డ్కప్-2024లో సౌతాఫ్రికాపై శ్రీలంక కేవలం 77 పరుగులకే ఆలౌటైంది.అదేవిధంగా జింబాబ్వే గడ్డపై టీ20ల్లో అత్యల్ప టోటల్ను నమోదు చేసిన మూడో జట్టుగా లంక చెత్త రికార్డును మూట కట్టకుంది. ఈ జాబితాలో జింబాబ్వే అగ్రస్ధానంలో ఉంది. 2024లో బులవాయో వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 57 పరుగులకే ఆలౌటైంది.చదవండి: Anshul Kamboj: మరో జహీర్ అన్నారు.. కట్ చేస్తే! ఒక మ్యాచ్కే ఖేల్ ఖతం -
IPL 2025: ఆర్సీబీ జట్టులోకి జింబాబ్వే ప్లేయర్.. అతడికి ప్రత్యామ్నాయంగా ఎంపిక
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 8 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడం ఇది పదోసారి. ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024, 2025 సీజన్లలో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్కు ముందు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ రెండూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో లీగ్ దశను ముగించాలని భావిస్తుంది. తదుపరి మ్యాచ్ల్లో ఆర్సీబీ.. సన్రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.గుజరాత్, పంజాబ్ కూడా..!నిన్న (మే 18) రాత్రి ఢిల్లీపై విజయం సాధించడంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్రైజర్స్తో జరిగే మ్యాచ్లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ఎంగిడికి ప్రత్యామ్నాయంగా ముజరబానీవచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతని స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీతో భర్తీ చేసింది. ముజరబానీ.. ఆర్సీబీ లక్నోతో ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్కు అందుబాటులో ఉంటాడు. ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ (సీఎస్కే) ఆడిన ఎంగిడి అందులో మూడు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.🚨 BLESSING MUZARABANI WILL PLAY FOR RCB IN PLAYOFFS 🚨- He replaces Lungi Ngidi. pic.twitter.com/kzZ1rLrGgl— Johns. (@CricCrazyJohns) May 19, 2025ముజరబానీ విషయానికొస్తే.. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన 28 ఏళ్ల ముజరబానీ.. జింబాబ్వే తరఫున 12 టెస్ట్లు, 55 వన్డేలు, 70 టీ20లు ఆడి 198 వికెట్లు పడగొట్టాడు. గత కొంతకాలంగా ముజరబానీ టీ20ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. అందుకే ఆర్సీబీ ఈ ఆఫ్రికా ఆణిముత్యాన్ని వెతికి పట్టుకుంది. ముజరబానీ.. సికందర్ రజా తర్వాత ఐపీఎల్ ఆడనున్న రెండో జింబాబ్వే క్రికెటర్. -
ఐర్లాండ్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఘనత
ఐర్లాండ్ క్రికెట్ జట్టు(Ireland Cricket Team) సరికొత్త చరిత్ర లిఖించింది. టెస్టు(Test Format)ల్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాలతో 119 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. జింబాబ్వే(Zimbabwe)తో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేసింది.రాణించిన ఆండీ మెక్బ్రిన్ కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం ఐర్లాండ్ జట్టు.. జింబాబ్వే పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో బులవాయో వేదికగా ఇరుజట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఐరిష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, జింబాబ్వే బౌలర్ల ధాటికి ఐర్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో బౌలింగ్ ఆల్రౌండర్ ఆండీ మెక్బ్రిన్ 90 పరుగులు(నాటౌట్), టెయిలెండర్ మార్క్ అడెర్ 78 పరుగులతో రాణించారు. ఫలితంగా తమ తొలి ఇన్నింగ్స్లో ఐర్లాండ్ 260 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగగా.. ఎంగరవ రెండు, ట్రెవర్ గ్వాండు ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక జింబాబ్వే తమ మొదటి ఇన్నింగ్స్లో 267 పరుగులకు ఆలౌట్ అయి.. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. నిక్ వెల్చ్ 90, ముజర్బాని 47 పరుగులతో రాణించారు.292 పరుగుల లక్ష్యం.. జింబాబ్వే బ్యాటర్ల వైఫ ల్యంఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐర్లాండ్ 298 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా జింబాబ్వే ముందు 292 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఐరిష్ స్పిన్నర్ మాథ్యూ హంప్రెస్ ఆరు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరోవైపు బ్యారీ మెకార్తీ రెండు, మార్క్ అడెర్, ఆండీ మెక్బ్రిన్ ఒక్కో వికెట్ తీశారు.జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మధెవెరె (195 బంతుల్లో 84; 8 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. బ్రియాన్ బెనెట్ (72 బంతుల్లో 45; 3 ఫోర్లు), జొనాథన్ క్యాంప్బెల్ (62 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణించినా ఫలితం లేకపోయింది. 228 పరుగులకే జింబాబ్వే కుప్పకూలగా.. ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. వరుసగా మూడో టెస్టు విజయంతద్వారా టెస్టుల్లో వరుసగా మూడో విజయాన్ని(‘హ్యాట్రిక్’) నమోదు చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఐర్లాండ్ ప్లేయర్ ఆండీ మెక్బ్రిన్ (90 పరుగులు; 4 వికెట్లు)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.కాగా ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి టెస్టు హోదా పొందిన ఐర్లాండ్ జట్టు ఆడిన తొలి ఏడు టెస్టుల్లోనూ ఓడిపోయింది. అయితే, గత ఏడాది మార్చిలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఎనిమిదో టెస్టులో గెలిచి ఈ ఫార్మాట్లో తొలి విజయం నమోదు చేసుకుంది. అనంతరం జింబాబ్వేతో గత ఏడాది జూలైలో జరిగిన తొమ్మిదో టెస్టులో నెగ్గి వరుసగా రెండో గెలుపు రుచి చూసింది.తాజాగా జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఫార్మాట్లో ఈ మేర ‘హ్యాట్రిక్’ సాధించింది. ఇప్పటి వరకు కేవలం పది టెస్టులే ఆడిన ఐర్లాండ్.. వరుసగా మూడు మ్యాచ్లలో గెలుపొందడం ద్వారా.. అత్యంత తక్కువ టెస్టుల్లో ‘హ్యాట్రిక్’ విజయాలు అందుకున్న తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. అంతకు ముందు సౌతాఫ్రికా 1906లో పద్నాలుగు మ్యాచ్ల తర్వాత హ్యాట్రిక్ కొట్టింది.తక్కువ మ్యాచ్ల వ్యవధిలోనే టెస్టుల్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జట్లు👉ఐర్లాండ్- 10 మ్యాచ్లలో హ్యాట్రిక్- 2025👉సౌతాఫ్రికా- 14 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1906👉ఇంగ్లండ్- 23 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1886👉పాకిస్తాన్- 25 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1959👉వెస్టిండీస్- 35 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1950👉ఆస్ట్రేలియా- 50 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1898👉శ్రీలంక- 87 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1998👉బంగ్లాదేశ్- 88 మ్యాచ్లలో హ్యాట్రిక్- 2014👉ఇండియా- 109 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1969👉న్యూజిలాండ్- 260 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1998.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
ముచ్చటగా 3 మ్యాచ్లు ఆడి ఇంటికొచ్చేసిన అంబటి రాయుడు
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రయాణం మూన్నాళ్ల ముచ్చటగా సాగింది. వ్యక్తిగత కారణాల చేత రాయుడు సీపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ లీగ్ ఆడిన రెండో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కిన రాయుడు.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్కు ప్రాతినిథ్యం వహిస్తూ మూడు మ్యాచ్లు ఆడాడు. ఇందులో ఓ మ్యాచ్లో (తొలి మ్యాచ్) డకౌట్ కాగా.. మిగతా రెండిటిలో 32, 15 పరుగులు చేశాడు. 3 మ్యాచ్ల్లో రాయుడు 15.66 సగటున 117.50 స్ట్రయిక్రేట్తో 47 పరుగులు చేసి నిరాశపర్చాడు. ఐపీఎల్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు, భారత దేశవాలీ క్రికెట్కు గుడ్బై చెప్పిన రాయుడు బీసీసీఐతో బంధాన్ని తెంచుకుని కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు. 37 ఏళ్ల రాయుడు ఐపీఎల్ 2023 ఎడిషన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్లో సభ్యుడిగా ఉండిన విషయం తెలిసిందే. మరోవైపు అంబటి రాయుడుతో పాటు జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ కూడా కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్కే ప్రాతినిథ్యం వహిస్తున్న ముజరబానీ కూడా వ్యక్తిగత కారణాలచే సీపీఎల్ను మధ్యలోనే వీడాడు. ఇతను కూడా రాయుడు లాగే మూడంటే మూడే మ్యాచ్లు ఆడాడు. ఈ 3 మ్యాచ్ల్లో అతను కేవలం ఒకే వికెట్ పడగొట్టి దారుణంగా విఫలమయ్యాడు. రాయుడు, ముజరబానీ జట్టును వీడటంతో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ వీరికి రీప్లేస్మెంట్గా ఇంగ్లండ్ ఆటగాళ్లు విల్ స్మీడ్, బెన్నీ హోవెల్లను తమ పంచన చేర్చుకుంది. వీరిలో స్మీడ్ విధ్వంసకర బ్యాటర్ కాగా.. హోవెల్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఉన్నాడు. ఇదిలా ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ప్రదర్శన దారుణంగా ఉంది. ఆ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తొలి 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత ఆడిన 4 మ్యాచ్ల్లో ఎవిన్ లెవిస్ సేన ఓటమిపాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో కొనసాగుతుంది. -
8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే!
ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్కు జింబాబ్వే తమ జట్టును మంగళవారం ప్రకటించింది. స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్తో జరిగిన సిరీస్లకు దూరమైన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు జింబాబ్వే వెళ్లనుంది. చివరగా 2003-2004లో ఆస్ట్రేలియా టూర్కు వెళ్లింది. అదే విధంగా ఇరు జట్లు ముఖాముఖి తలపడి కూడా దాదాపు 8 ఏళ్ల కావస్తోంది. చివగా 2014లో ఆసీస్-దక్షిణాఫ్రికా జట్లతో ట్రై సిరీస్లో జింబాబ్వే తలపడింది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జింబాబ్వే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కాగా ఈ సిరీస్ 2020 ఆగస్టులో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా రేండేళ్ల పాటు వాయిదా పడింది. టౌన్విల్లే వేదికగా ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ వన్డే సూపర్ లీగ్లో భాగంగానే జరగనుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ జట్టును ప్రకటించింది. జింబాబ్వే జట్టు: రెగిస్ చకబ్వా (కెప్టెన్,), ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, కైటానో, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమాని, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యౌచి సికందర్ రజా, సీన్ విలియమ్స్ ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా చదవండి: IND vs PAK: 'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్కు చుక్కలు చూపించేది అతడే' -
జింబాబ్వే స్టార్ బౌలర్కు బంపర్ ఆఫర్.. తొలిసారి ఐపీఎల్లో!
ఐపీఎల్-2022 సీజన్కు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మార్క్ వుడ్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్ వుడ్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు లక్నో ఫ్రాంచైజీ కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో వుడ్ స్ధానాన్ని జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీతో భర్తీ చేయాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు అతడు ఐపీఎల్లో పాల్గోవడం ఖాయంగా కనిపిస్తోంది. క్యాష్ రిచ్ లీగ్ కోసం ముజారబానీ భారత్కు బయలుదేరినట్లు జింబాబ్వేలోని భారత రాయబారి కార్యాలయం ద్రువీకరించింది. అయితే ముజారబానీని వుడ్ స్ధానంలో భర్తీ చేస్తారా లేదా నెట్ బౌలర్గా ఎంపిక చేస్తారా అన్నది వేచి చూడాలి. కాగా అంతకుముందు వుడ్ స్ధానాన్ని బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ ఆహ్మద్తో భర్తీ చేయాలని భావించింది. అయితే అతడు దక్షిణాప్రికా పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ జట్టులో భాగమై ఉన్నాడు. దీంతో అతడికి ఐపీఎల్లో ఆడేందుకు అనుమతిని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. దీంతో అతడి స్థానంలో ముజారబానీని జట్టులో తీసుకోనున్నారు. ఇక మార్చి 26 నుంచి క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తన తొలి మ్యాచ్లో మార్చి 28 మరో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ను ఢీకొట్టనుంది. చదవండి: IPL 2022: ఆఫ్ఘనిస్తాన్ యువ బౌలర్కు లక్కీ ఛాన్స్.. ఏకంగా ఆర్సీబీ తరపున!