breaking news
-
రేపు వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో రేపు (మంగళవారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. రేపు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమవనున్నారు. ఈ భేటీలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొంటారు. వీరితో పాటు పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. -
సంక్షేమానికి నిజమైన అర్థం.. వైఎస్ జగన్ పాలన: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ మైనారిటీ విభాగం ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అ«ధ్యక్షులతో పాటు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పట్టిష్టం చేయడం మన ప్రధాన కర్తవ్యంమన్నారు. మన పార్టీకి నిజమైన బలం కార్యకర్తలేనని.. మన నాయకుడు వైఎస్ జగన్ శక్తి కూడా కార్యకర్తలేనని.. పార్టీ తన ప్రస్థానంలో అనేక రికార్డులు సృష్టించిందన్నారు.‘‘వైఎస్ జగన్ తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పాలనలో డెలివరీ మెకానిజం డెవలప్ చేయడంతో పాటు, విద్య, వైద్యం వంటి కోర్ సెక్టార్స్ను ప్రతి గడపకు తీసుకెళ్ళారు. రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు, ఏమేం చేయాలో ఆలోచించి, వాటిని అమలు చేశారు. సంక్షేమానికి నిజమైన అర్థం చెప్పిన పాలన మనది. అదే కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనతోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది’’ అని సజ్జల పేర్కొన్నారు.అడ్డుకుంటూ.. అరాచకం:మరో వైపు జగన్ ప్రజాదరణ నానాటికి మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా, స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారు. అందుకే ఆయన పర్యటనలు అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇటీవల పలు ఆంక్షలతో జగన్ పల్నాడు జిల్లా పర్యటన అడ్డుకోవాలని చూస్తే, సాధ్యం కాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారు. పొలీసులను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.అప్రకటిత ఎమర్జెన్సీ:కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ప్రశ్నించే గొంతులు నొక్కుతోంది. ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణితో పని చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపే తప్పుడు సంప్రదాయానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతోంది. అయితే ఆ కేసులు ఎదుర్కొనే సత్తా మన నాయకుడికి ఉంది. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఒక్క పథకం కూడా అమలు చేయకున్నా, లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ.. మైనారిటీ సంక్షేమం:ఎన్నికలు ఎప్పుడొచ్చినా, మనం ధీటుగా ఎదుర్కోగలం. మనం సంస్థాగతంగా ఇంకా బలపడాలి. పార్టీ నెట్వర్క్ అనేది కేంద్ర కార్యాలయం నుంచి గ్రామస్థాయి వరకు వెళ్ళాలి. పార్టీలో అన్ని కమిటీల నియామకం పూర్తయితే 18 లక్షల మంది క్రియాశీలక సభ్యులవుతారు. అప్పుడు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, రాష్ట్రానికి చేస్తున్న నష్టాలను ఇంకా గట్టిగా ప్రచారం చేయగలం. అలాగే మన పార్టీపై అదే పనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ధీటుగా ఎదుర్కోగలగుతాం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం గతంలో ఏనాడూ లేని విధంగా గత ప్రభుత్వంలో కొనసాగింది. మన పార్టీ ఎప్పుడూ మైనారిటీల పక్షాన నిలబడింది. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మైనారిటీలంతా మన వెంటే ఉండేలా, మీరంతా కృషి చేయాలి. చొరవ చూపాలి. ఇంకా వైఎస్సార్సీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని ముస్లింలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సజ్జల.. పార్టీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమం కోరుకుంటుందని స్పష్టం చేశారు. -
చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారని నిన్నటి పొలిట్ బ్యూరో సమావేశానికి 56 మంది గైర్హాజరు అయ్యారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ చేస్తూ, మద్యం కమిషన్లు దండుకుంటూ వారంతా బిజీగా ఉన్నారు. అబద్దాలను నిజం చేయటానికి ఎల్లోమీడియా ద్వారా విషం చిమ్ముతున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.2014-2019 మధ్య జనాన్ని మోసం చేసినందునే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. రైతు రుణమాఫీ సహా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే జనం ఓడించారు. 2024లో గెలిచాక కూడా మళ్ళీ జనాన్ని మోసం చేస్తున్నారు. జగన్ ఖజానాని ఖాళీ చేశారనీ అందుకే సంక్షేమాలను అమలు చేయలేదని అబద్దాలు మొదలు పెట్టారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ లోకేష్ కమీషన్లు తీసుకుని టెండర్లు పిలుస్తున్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ ఒక్క ఏడాదే దుర్మార్గపు పాలన చేశారు. రానున్న రోజుల్లో ఇంకా పరమ దుర్మార్గపు పాలన చేస్తారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కుప్పంలోనే ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే ఏం చేశారు?. డైలాగులు చెప్పినంత సీరియస్గా పరిపాలన చేయటం లేదు. లోకేష్ కు సిగ్గు ఉంటే టెన్త్ మూల్యాంకనం తప్పిదాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లోకేష్కు అలాంటి సిగ్గు లేదు. చంద్రబాబు చేతిలో పాలన లేదు.. అంతా లోకేషే. ఇన్నేసి దుర్మార్గాలు చేస్తూ సుపరిపాలన అని ఎలా చెప్తారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘జగన్ అంటే చంద్రబాబుకు విపరీతమైన ఈర్ష్య, భయం. కూటమి ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని ఎల్లో మీడియానే చెప్తోంది. ఎమ్మెల్యేలేమో చంద్రబాబు గ్రాఫే పడిపోయిందని చెప్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవటం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికే పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఎండీయూ వాహనాలు, వాలంటీర్లను తొలగించి సామాన్యులను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు మాటలను ఆయన పార్టీ వారే వినిపించుకోవటం లేదు. చంద్రబాబుకు తెలియకుండా 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకి వెళ్లిపోయారంటే ఆయనకు పార్టీ మీద ఏమాత్రం పట్టు లేదని తేలిపోయింది..జగన్ నెల్లూరు వెళితే టీడీపీ వారికి ఏంటి ఇబ్బంది?. హెలికాఫ్టర్ కాకపోతే కారులోనో లేదంటే నడుచుకుంటూ అయినా వెళ్తారు. జగన్కు 40 నుండి 60 శాతం ఆదరణ పెరిగింది. ఇది టీడీపీ సర్వేలోనే తేలిందని చంద్రబాబు, లోకేష్, పవన్ మాటలు వింటుంటేనే అర్థం అయింది. అందుకే జగన్ పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకే ఊడిగం చేస్తానని పవన్ అంటున్నారు. వ్యతిరేకత పెరిగితే కూటమికైనా ఓటమి తప్పదు. జగన్ని కట్టడి చేయటానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం నీచ సంస్కృతి’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
బదిలీల పేరుతో ఉద్యోగులకు కూటమి సర్కార్ వేధింపులు: చంద్రశేఖర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: బదిలీల పేరుతో కూటమి సర్కార్ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీలను సైతం కూటమి ఎమ్మెల్యేలు తమ అక్రమార్జనకు ఆదాయ వనరుగా మార్చుకుంటున్న దారుణమైన పరిస్థితి ఏపీలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా గ్రామస్థాయికి పాలనను అందించేందుకు వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సర్వ నాశనం చేస్తూ, అందులోని సిబ్బంది సంఖ్యను కుట్రపూరితంగా తగ్గించివేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ఎవరు డబ్బులిస్తే వారికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వేగంగా బదిలీలు జరిగిపోతున్నాయి. అనధికారికంగా బదిలీలకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను తప్పనిసరి చేస్తూ రాజకీయ జోక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దాదాపు 95 శాతం బదిలీలు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ద్వారానే జరుగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 1.40 లక్షల మంది ఉద్యోగుల బదిలీల కోసం జీవోఎంస్ నెంబర్ 5 ని విడుదల చేశారు. వైయస్సార్సీపీ హయాంలో చివరి ఏడాది నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీలు జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చాక నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బదిలీల పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారు.సచివాలయ వ్యవస్థపై కక్షసాధింపువైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయాల వ్యవస్థకు మంచి పేరు రావడంతో దాన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసింది. ఇప్పుడు సచివాలయాల్లో బదిలీల పేరుతో ఉద్యోగులను వేరే మండలాలకు బలవంతంగా పంపించి వేధిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఒక రూల్, పట్టణాల్లో వార్డు సచివాలయాల్లో పనిచేసేవారికి వేరే రూల్ వర్తింపజేస్తున్నారు. బదిలీల పేరుతో చిన్నస్థాయి ఉద్యోగులను డబ్బుల కోసం ఒత్తిడికి గురిచేస్తున్నారు. ప్రభుత్వమే ఉద్యోగుల చేత తప్పులు చేయించే కార్యక్రమానిక ఉసిగొల్పుతున్నట్టుంది.పనివేళల్లోనే బదిలీలు పూర్తిచేయాలిభర్త చనిపోయి వితంతువులుగా ఉన్న ఉద్యోగులకు, కేన్సర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడేవారికి, స్పౌస్ కేస్ల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నా, వారి అభ్యర్థనలను పట్టించుకోవడం లేదు. గ్రామ సచివాలయాల బదిలీలకు జూన్ 30తో గడువు ముగిసిపోయింది. నిబంధనల ప్రకారమే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని వైయస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో 12 రోజుల కిందట డెలివరీ అయిన ఒక బాలింతరాలు, ఒక మహిళా ఉద్యోగిని కౌన్సిలింగ్ పేరుతో ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకూ కుర్చోబెట్టి వేధించడంతో ఆమె అస్వస్థతకు గురై ఇంటికెళుతూ మార్గమధ్యలో చనిపోయింది. ఆమె కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? నిబంధనల ప్రకారమే ఆఫీసు వేళల్లోనే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలి. రాత్రింబవళ్లు తిప్పించుకుని వేధించడం ఆపాలి. -
అవకాశవాదులకు బైబై.. సొంత కార్యకర్తలకు జైజై
భారతీయ జనతా పార్టీ తెలుగువ రాష్ట్రాల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించే విషయంలో పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని స్వచ్ఛమైన సొంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే పట్టంగట్టింది. ఈ విషయంలో పైరవీలు రికమండేషన్లకు తావు లేకుండా నికార్సైన బిజెపి కార్యకర్తలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణకు ఎన్ రామచంద్రరావుని అధ్యక్షునిగా నియమించగా ఆంధ్ర ప్రదేశ్కు పివిఎన్ మాధవ్ ను సారధిగా నియమించారు. ఈ నియామకం విషయంలో పార్టీ ఢిల్లీ పెద్దలు పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి అవకాశవాదాన్ని కేంద్రంలోని బిజెపి పెద్దలు క్షమించే ఉద్దేశంలో లేకపోబట్టి ఆవిన్ను పక్కకు తప్పించారు. వాస్తవానికి ఆవిడ టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమార్తె అయినప్పటికీ కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎంపీగా కేంద్రంలో మంత్రిగా పనిచేశారు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో బిజెపిలో చేరారు. ఇక్కడ ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఆమె మనసు ఆలోచనలు అన్నీ కూడా ఆమె సామాజిక వర్గం వ్యాపార వర్గంతోబాటు ముఖ్యంగా తెలుగుదేశం అనుకూలంగానే ఉంటూ వచ్చారు తప్ప బీజేపీకి ఆమె ఏనాడు ఉపయోగపడలేదు. బిజెపి పేరు చెప్పుకొని ఆమె తన సొంత పరపతిని పెంచుకొని రాజకీయంగా ఎదిగారు తప్ప పార్టీని ఆమె ఎదగనివ్వలేదు. ఏదైతేనేం మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటినుంచి అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పురందేశ్వరిని తప్పించాలని హార్డ్ కోర్ బిజెపి కార్యకర్తలు కోరుతూ వస్తున్నారు. పురందేశ్వరి ఎంత సేపు తన కుటుంబ పార్టీ ఆయన చంద్రబాబుకు తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించే నిర్ణయాలే తీసుకున్నారు తప్ప బిజెపి బలోపేతానికి వీసమెత్తు కృషి కూడా చేయలేదు. ఆమె వైఖరిని మొదటి నుంచి గమనిస్తూ వస్తున్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఏకంగా ఆమెను పక్కకు తప్పించి జన్మతః బిజెపి కార్యకర్త ఆయన మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.విశాఖనగరానికి చెందిన పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆ టర్మ్ పదవి ముగిసాక 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. వాస్తవానికి మాధవ తండ్రి పీవీ చలపతిరావు సీనియర్ బిజెపి నాయకుడు. అద్వానీ వాజ్పేయి వంటి దిగ్గజాలతో కలిసి నడిచిన వాడు. చలపతిరావు అంటే మోడీ ఇతర బిజెపి పెద్ద నాయకులకు కూడా అపారమైన గౌరవం. నికార్సైన చలపతిరావు కుటుంబానికి న్యాయం చేయాలి అనే భావనతో ఉన్న ఢిల్లీ పెద్దలు ఆయన కుమారుడు మాధవ్ కు ఇప్పుడు బిజెపి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. ఈ నియామకం తెలుగుదేశంతోపాటు అవకాశవాద రాజకీయాలు నేరిపే పురందేశ్వరికి షాకింగ్ అని చెప్పాలి.పార్టీ ఆలోచనలు పార్టీ గీత దాటి అడుగు వేయని నిబద్ధత కలిగిన మాధవ్ ఏ విషయంలోనూ తెలుగుదేశానికి తలవంచకుండా పార్టీ బలోపేతానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తారు అని బిజెపి కార్యకర్తలు నమ్ముతున్నారు. అన్నిటికి మించి చంద్రబాబు బంధువు అయిన పురందేశ్వరి కబ్జా నుంచి బిజెపిని విడిపించడం అతి పెద్ద అడుగు అని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. బిజెపిని చంద్రబాబు కాళ్ళ వద్ద తాకట్టు పెట్టి తన వ్యక్తిగత ప్రయోజనాలు పరపతి పెంచుకున్న పురందేశ్వరికి ఈ నిర్ణయం చేదుగానే ఉంటుంది కానీ నిజమైన బిజెపి కార్యకర్తలకు మాధవ నియామకం తీపి కబురు అని చెప్పాలి.-సిమ్మాదిరప్పన్న -
జేసీ వర్గీయుల దాష్టీకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి
సాక్షి, అనంతపురం జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు రామకృష్ణ, రేవతి ఇళ్లపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త రామకృష్ణ కిరాణా షాపును జేసీ వర్గీయులు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతు ఇవ్వొద్దని జేసీ నిన్న వార్నింగ్ ఇచ్చారు. మద్దతు ఇచ్చిన వారిపై జేసీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు.కాగా, ఆదివారం తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యానించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు.’ అంటూ జేసీ వ్యాఖ్యానించారు. -
ఆ నలుగురిపైనే.. బాబు ఫోకస్..!
ప్రజాప్రతినిధుల పనితీరుపై టీడీపీ అధిష్టానం చేయించిన ఐవీఆర్ఎస్ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాం.. గతం కన్నా మిన్నగా పాలన సాగిస్తున్నాం అని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సర్వే ఫలితాలు షాక్కు గురి చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధ్వానపు పనితీరుతో ప్రజాప్రతినిధులు ఆదరణ కోల్పోయిన విషయం స్పష్టమైంది. సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రజాప్రతినిధులు ఏడాదికే ప్రజలకు బేజారయ్యారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఏడాది పాలనలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పనితీరుపై టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) సర్వే చేపట్టింది. ఏ ప్రభుత్వానికైనా కనీసం మూడేళ్ల తర్వాత వ్యతిరేకత వస్తుంది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఏడాదికే ప్రజలు విసుగు చెందడం గమనార్హం. ఆ నలుగురిపైనే ఎక్కువగా.. జిల్లాలో సగం మంది ప్రజాప్రతినిధుల పనితీరుపై మాత్రమే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సర్వే చేపట్టింది. పుట్టపర్తిలో పల్లె సింధూరరెడ్డి బదులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పెత్తనం చెలాయిస్తుంటారు. మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బదులు మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామిదే హవా సాగుతోంది. పెనుకొండలో మంత్రి సవిత బదులు ఆమె భర్త వెంకటేశ్వర్లు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎంపీగా పార్లమెంటు వ్యాప్తంగా పర్యటించాల్సిన బీకే పార్థసారథి పెనుకొండ నియోజకవర్గంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. దీంతో ఆ నలుగురిపై ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా పరిగణనలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అడ్రెస్ లేకున్నా.. అడగరా? సీఎం చంద్రబాబు బావమరిది, సినీనటుడు నందమూరి బాలకృష్ణ చుట్టపుచూపుగా హిందూపురం నియోజకవర్గానికి వస్తుంటారు. ఏ మండలంలో ఏ నాయకుడు ఉన్నాడో కూడా గుర్తించలేరని చెబుతుంటారు. అంతేకాకుండా తన పీఏలు హిందూపురం వ్యాప్తంగా దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సీఎంకు బావమరిది కావడంతో ఆయన పనితీరుపై ఎలాంటి సర్వేలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. అరాచకాలను అడ్డుకోరా? ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తోన్న రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో అరాచకాలు వెలుగు చూశాయి. ఆమె పనితీరుపై ఎలాంటి సర్వే చేయకపోవడంపై సొంత పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి రేగింది. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు వెలుగు చూసినా పరిటాల కుటుంబానికి అధిష్టానం నుంచి ఎలాంటి హెచ్చరికలూ రాలేదని కూటమి నేతలు వాపోతున్నారు. కదిరిలో వన్మ్యాన్ షో కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వన్మ్యాన్ షో చేస్తున్నారు. కిందిస్థాయి నాయకులను ఎదగనీయకుండా.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన నాయకులను దగ్గరకు కూడా రానీయడం లేదని వాపోతున్నారు. అయినా అధిష్టానం వద్ద మంచి మార్కులు ఎలా వచ్చాయని నాయకులు ఆలోచనలో పడ్డారు. జిల్లా కేంద్రానికి రాని మంత్రి శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తికి ఓ మంత్రి రావడమే లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒకట్రెండు సార్లు మినహా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే వ్యవహారం నచ్చలేదా? లేక అధికారులు తనకు నచ్చిన వారు లేరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీ బీజేపీ కొత్త బాస్గా PVN మాధవ్
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వైపు మొగ్గు చూపించింది అధిష్టానం. దీంతో ఈ మధ్యాహ్నాం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఇవాళ నామినేషన్స్ జరుగుతున్నాయి. అంతకు ముందు అధిష్టానం ఏకగ్రీవంగా పీవీఎన్ మాధవ్ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సంప్రదాయబద్దంగా జరగనున్న ప్రక్రియలో భాగంగా.. సోము వీర్రాజు, జీవీఎల్తో కలిసి మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. రేపు ఉదయం మాధవ్ పేరును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పీవీఎన్ మాధవ్.. పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మండలిలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గానూ ఆయన వ్యవహరించారు. ఆయన పదవీకాలం 2019 మార్చి 30 నుండి 2025 మార్చి 29 వరకు కొనసాగింది. అయితే..ఈ మధ్యలో.. 2023లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయ జీవితానికి తోడు సామాజిక కార్యక్రమాల్లోనూ మాధవ్ చురుకుగా పాల్గొంటారు. 2024లో విశాఖపట్నంలో జరిగిన "ఆర్గానిక్ మేళా"ను నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. -
‘చంద్రబాబు అబద్ధాల చక్రవర్తి... మోసపు మహారాజు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్సీ సల్ రాష్ట్ర అధ్యక్షడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. మోసపూరిత, దగాకోరు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబన్నారు.తనకున్న మీడియా బలంతో లేనిది ఉన్నటల చూపించడంలో సమర్ధడు చంద్రబాబు అంటూ విమర్శించారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని కబ్జా చేసి.. నందమూరి వారసులను తొక్కేశారని, చంద్రబాబు ఓ కబ్జా నాయకుడని ఆరోపించారు. ‘ చంద్రబాబు అబద్ధాల చక్రవర్తి...మోసపు మహారాజు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని అబద్ధాలతోనే గడిపేశాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను పవిత్రగ్రంధంగా భావించిన వ్యక్తి జగన్. ఇచ్చిన ప్రతీ హామీని జగన్ నెరవేర్చారు. ప్రజలను వంచించి ..అబద్ధాలతో ఓట్లను కొల్లగొట్టడంలో చంద్రబాబు పీహెచ్.డీ చేశాడు. ఏం చెప్పుకుని తొలి అడుగు...ఇంటింటికీ తెలుగుదేశం చేపడతారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబు మురికి మాటలు మానుకోవాలి. 24 గంటలూ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి సిగ్గులేదా మీకు. వివేకానందరెడ్డి హత్య ఎవరి హయాంలో జరిగింది...ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు?, వివేకా కేసులో ఎఫ్ఐఆర్ లో ఏముందో..ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీకు తెలియదా?, మీ ప్రభుత్వం వచ్చి ఏడాదైంది కదా...ఎందుకు సునీతకు న్యాయం చేయలేకపోయారు. కోడికత్తి కేసు అని అవహేళన చేస్తున్నారు. కోడికత్తి ఘటన జరిగింది నీ హయాంలోనే కదా?, ఆ కేసును ఏడాదైనా ఎందుకు నువ్వు పట్టించుకోలేదు. 40 ఏళ్ల అనుభవం, హైటెక్ సీఎం అని చెప్పుకునే నువ్వెందుకు పరిశీలించలేకపోయావ్?, జగన్ సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో రాయితో దాడి జరిగింది నిజంకాదా?, ఆ ఘటన పై ఎఫ్ఐఆర్ నమోదైంది నిజం కాదా ... ఆ దోషుల సంగతి నువ్వే చూడు. డ్రామా ఆడించారో..నీ ఉపన్యాసాలతో ఆవేశానికి గురై రాయివేశాడో తేల్చు. సత్తెనపల్లి జగన్ పర్యటనలో గుర్తుతెలియని కారు ఢీకొట్టిందని మీ ఎస్పీనే చెప్పాడు. జగన్ పర్యటలను అడ్డుకోవడానికి ఏఐ టెక్నాలజీతో దొంగవీడియోను సృష్టించారు. జగన్ సత్తెనపల్లి పర్యటన పై బురదజల్లాలని చూస్తున్నారు. పొదిలి , సత్తెనపల్లి పర్యటలను చూసి చంద్రబాబు అండ్ కోకు చెమటలు పడుతున్నాయి. ఏడాదికాలంలోనే ఉప్పెనలా వ్యతిరేకత రావడంతో నేరారోపణలు చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడా...చంపేశారా తేల్చండి. మీ హయాంలోనే కదా పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు...ఎందుకు ఈరోజు వరకూ తేల్చలేకపోయారు. క్రిస్టియన్ సమాజాన్ని దారుణంగా అవమానించింది మీరు కాదా?, ఈరోజుకీ ప్రవీణ్ కుటుంబాన్ని బయటకు రాకుండా చేస్తుంది మీరుకాదా?, తిరుపతి లడ్డూ వివాదం సృష్టించింది ఎవరు?, దేవదేవుడిని అవమాన పరిచింది మీరు కాదా?, సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దిగజార్చింది నువ్వుకాదా చంద్రబాబు’ అని ప్రశ్నించారు. టీజే సుధాకర్ ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు వెంకటేశ్వరస్వామితో ఆడుకున్నావ్ఈ పాపం నిన్ను ...నీ పిల్లలను ..వారి తరాన్ని కచ్చితంగా వెంటాడుతుందివేంకటేశ్వరస్వామి అన్నా...హైందవ సమాజం మనోభావాలన్నా ఏమాత్రం గౌరవం లేదుచంద్రబాబు, పవన్ కలిసి తిరుమలను రాజకీయంగా వాడుకున్నారుస్థానికసంస్థల ఎన్నికల్లో హీనాతిహీనంగా దిగజారిపోయారుకౌన్సిలర్లను కిడ్నాప్ చేసి...కొట్టి ...తప్పుడు కేసులు పెట్టించావ్ వైఎస్సార్సీపీ కార్యకర్తలను అతి దారుణంగా నరికి చంపించారుఏడాది కాలంలో ఘోరాతి ఘోరంగా విఫలమయ్యావ్వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పై పదే పదే దాడులు చేయించావ్మీరు చేసే కుళ్లు రాజకీయాలను మేం కచ్చితంగా గుర్తుంచుకుంటాంజగన్ పర్యటన ఉంది...వేలాది మంది వస్తున్నారు...అంటే రక్షణ కల్పించావాజగన్ మోహన్ రెడ్డి వాహనం పై దాడి జరిగే అవకాశముందని మేం చెప్పినా నువ్వు పట్టించుకోలేదుసత్తెనపల్లి జగన్ పర్యటనలో దళితుడి మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేప్రజలు నీకు 94 శాతం స్ట్రైక్ రేట్ ఇస్తే... నువ్వు 99 శాతం జనాన్ని ముంచేశావ్ఈ ఏడాదికాలంలో నువ్వు చెప్పుకోవడానికి ఏముంది గుండు సున్నా తప్ప2014-19 మధ్య జరిగింది కూడా మోసపూరిత పాలనేడ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టారునిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అన్నారు ఎగ్గొట్టేశారుబాహుబలి గ్రాఫిక్స్ చూపించి రాజధానిలో శాశ్వతంగా చిన్న రోడ్డు నిర్మించలేదురియల్ ఎస్టేట్ కోసం రాజధాని నాటకం ఆడుతున్నారుపోలవరం పూర్తిచేస్తానన్నావ్ ... ఎందుకు చేయలేకపోయావ్విభజన హామీలన్నీ సాధించుకొచ్చేది నువ్వే అన్నావ్ కదా..ఏం చేశావ్ఓటుకు నోటు కేసులో దొరికిపోయి తెలంగాణ నుంచి పారిపోయి వచ్చావ్గోదావరి పుష్కరాల్లో 32 మందిని సినిమా షూటింగ్ పిచ్చితో చంపింది నువ్వు కాదా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 చంద్రబాబు జేబు సంస్థలుసమాజంలో అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడంలో సాక్షి మీడియాకు భాగస్వామ్యం ఉందినీతికి, నిజాయితీకి కట్టుబడి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచిని సాక్షి మీడియా ప్రజలకు తెలియజేస్తోంది జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించారుజగన్ ఆర్బీకే సెంటర్లు తెచ్చాడు ...రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాడుజగన్ పాలనలో ఏ పథకంలోనూ పక్షపాతం చూపలేదు ఈ ఏడాది కాలంలో నువ్వేం సాధించావో సమాధానం చెప్పు చంద్రబాబు జగన్ తెనాలి వెళ్లి యువకులను పరామర్శిస్తే గంజాయి బ్యాచ్ అని విమర్శిస్తున్నారుమరో మారు తెనాలి యువకులను గంజాయి బ్యాచ్ అంటే చంద్రబాబు పై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాప్రకాశం జిల్లాలో ఏడు కేసులున్న ఓ రౌడీ షీటర్ చనిపోతే నువ్వు,నీ కుమారుడు వెళ్లారుఆయనే ఏ బ్యాచ్ .. అతని పైన సమాజంలో ఏమైనా క్లీన్ చిట్ ఉందానీ కార్యకర్త కాబట్టి ...నువ్వు పరామర్శించడానికి వెళ్లావ్...అతని పై ఎన్నికేసులు ఉన్నా పర్లేదాఅగ్రకులంలో పుట్టాడు కాబట్టి ఆయన గొప్పోడు..తెనాలి యువకులు మాత్రం రౌడీలా నీ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఈరోజు నేను పెట్టలేకపోవచ్చుకానీ నాకంటూ ఒకరోజు వస్తుంది...అప్పుడు కచ్చితంగా బదులిస్తా -
అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు: వైఎస్ జగన్
తాడేపల్లి: ఏపీ ఈసెట్ రిజల్ట్స్ వచ్చి 45 రోజులవుతున్నా ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు సర్కారును నిలదీశారు ఇది ఏపీ విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్.‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’ అంటూ విమర్శించారు.రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025 -
పెద్దారెడ్డితో ఉంటారా.. వాళ్ల సంగతి చూస్తా: జేసీ వార్నింగ్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో రెడ్బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరూ తిరగొద్దు. పెద్దారెడ్డికి మద్దతుగా ఉండే వారిని గుర్తిస్తాం.. ఫోటోలు తీస్తున్నాం. పెద్దారెడ్డిని మద్దతు ఇచ్చే వారిని రప్పా..రప్పా.. అని నరికేస్తాం’ అని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు మండిపతున్నారు.ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం నుంచి తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పెద్దారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అనంతరం పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు.ఈ సందర్బంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు.. టీడీపీ జేసీ, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాజీ మంత్రి శైలజానాథ్ కామెంట్స్..పోలీసుల తీరును ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు?. పెద్దారెడ్డిపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?. ఓ మాజీ ఎమ్మెల్యేని లాక్కొని వస్తారా?. ఇప్పటికైనా పోలీసులు చట్టాన్ని కాపాడాలి. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలి. ఎస్పీ జగదీష్ బాధ్యతగా ప్రవర్తించాలి.. ఏకపక్షంగా వ్యవహరించవద్దు.మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కామెంట్స్..ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన రాక్షస ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చేంతవరకు పోరాడతాం. బాండ్లు ఇచ్చి మరీ హామీ ఇచ్చారు.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తాం. పోలీసులు కేసు నమోదు చేస్తారా?. రాజ్యాంగ విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకులను పీడిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో మైనింగ్ వ్యాపారులను బెదిరించి , కేసులు , జరిమానాలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
‘తాడిపత్రిలో ఆటవిక రాజ్యం.. పోలీసులు అడ్డుకోవడమేంటి?’
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు వచ్చి రెండు మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించటం లేదు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొద్దని ఏవైనా ఆదేశాలు ఉన్నాయా?. మాజీ ఎమ్మెల్యేని తాడిపత్రిలోకి అనుమతించకపోవడం ఏం న్యాయం?. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి,గుంతకల్లు: ‘ఎవరేమనుకున్నా..నాకేంటి! ఈ గుమ్మనూరు జయరాంకు ఏమన్నా లెక్కా’ అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గుంతకల్లులోని పరిటాల శ్రీరాములు కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి క్లస్టర్ యూనిట్, బూత్ కార్యకర్తల సమావేశంతోపాటు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ రోజు గుత్తిలో నిర్వహించిన సమావేశంలో అన్న మాటలు (వైఎస్సార్సీపీ నాయకులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోగా టీడీపీలో చేరితే సరి.. లేదంటే తోకలు కత్తిరించి సున్నం అంటిస్తాం) రాష్ట్రమంతా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా గుంతకల్లు వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవం. నేనేమన్నా దౌర్జన్యాలు చేస్తానని చెప్పలేదే! ఉన్న మాట అంటే ఉలుకు అన్న చందంగా వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్నారు. సరే.. వారు, ఎవరేమనుకున్నా నాకేంటి?! ఈ గుమ్మనూరు జయరాంకు ఏమన్నా లెక్కా’ అని వ్యాఖ్యానించారు. -
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తున్న తరుణంలో.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కుట్రకు దిగింది. బలవంతంగా అరెస్ట్ చేయించింది.ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, రహస్య ప్రాంతానికి తరలించగా.. ఇప్పటికే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొచ్చన్న హైకోర్టు అనుమతిచ్చిన విషయాన్ని పోలీసులకు పెద్దారెడ్డి గుర్తు చేశారు. దీంతో చేసేది లేక పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?అనంతపురం రాంనగర్లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రికత్తత నెలకొంది. అంతకుముందు, పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేతకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేలా మునిసిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు తన ఇంటి కొలతలు తీసుకున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. అదే సమయంలో పెద్దారెడ్డిపై దాడులు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగు పెట్ట నివ్వడం లేదు. అడుగడుగునా కూటమి నేతలు అడ్డు తగులుతున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి హైకోర్టులో అనుమతి తీసుకున్నారు. అయినప్పటికీ కూటమి నేతలు పదేపదే బెదిరింపులు, దాడులతో కక్ష సాధింపు చర్యలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో పెద్దారెడ్డి మరోమారు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. -
వైఎస్ జగన్ హెలికాప్టర్ను దిగనివ్వం.. కోటంరెడ్డి అనుచరుల అరాచకం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డితో ములాఖత్కు వైఎస్ జగన్ జూలై 3న నెల్లూరుకు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం వైఎస్సార్సీపీ నాయకులు స్థలాన్ని పరిశీలిస్తుండగా నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అనుచరులు అడ్డుపడుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్సార్సీపీ నాయకులు మూడు వేర్వేరు ప్రైవేటు స్థలాలను చూడగా.. కోటంరెడ్డి అనుచరులు ఆయా భూముల యజమానులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఉన్న నిర్మాణాలతో పాటు భూములపై వివాదాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్సీపీ నేతలు శనివారం కొత్తూరు అంబాపురంలోని క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్ కోసం ఎంపిక చేశారు. స్కూల్ యాజమాన్యం అనుమతితో జిల్లా అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్ వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు. ట్రస్ట్ భూముల్లో ప్రభుత్వ భూమి ఉందంటూ హడావుడి చేశారు. భవనాలను కూల్చేస్తామంటూ రాద్ధాంతానికి దిగారు. దీంతో స్కూల్ సంబం«దీకులు భయాందోళనకు గురై హెలిప్యాడ్కు స్థలం ఇవ్వబోమని చెప్పాల్సి వచ్చింది. వైఎస్ జగన్ జనాదరణ చూసి భయపడి..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 143 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ కూటమి ఆ హామీలు నెరవేర్చలేక తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. దీనిని నిలదీస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తుండడంతో రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ఆయన నెల్లూరు జిల్లాకు వస్తున్నారని తెలియగానే సంఘీభావం తెలిపేందుకు వేలాదిమంది తరలివస్తారని టీడీపీ నేతల్లో భయం పుట్టింది. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారు. హెలిప్యాడ్కు స్థలాలు ఇవ్వకుండా యజమానులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. -
సింగిల్గా అయితే సీన్ సితారే
ఎవరెన్ని అనుకున్నారు.. భారీ మెజారిటీతో గెలిచాం అని లోలోన చంకలు గుద్దుకుంటున్నప్పటికి.. కూటమి నాయకులకు మాత్రం ఇంకా వైఎస్ జగన్ అంటే భయం పోలేదు. జగన్కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు నిద్రలేకుండా చేస్తుంది. జగన్ ఇల్లు దాటడం లేదని ఓవైపు అంటూనే ఆయన వీధిలోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలోన టీడీపీ, జనసేన నాయకులు కుళ్ళు కుంటున్నారు.మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేసారు కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం అని సాక్షాత్తు కూటమి నాయకులే ఒప్పుకుంటున్నారు. ఓకే కాంబినేషన్తో మళ్లీ మళ్లీ వస్తే సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అన్నిటికి మించి మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ అలవోకగా అధికారాన్ని చేపడతారని తెలుగుదేశానికి వంతపాడే మీడియా సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి.నిత్యం వైఎస్ జగన్ను ఆడిపోసుకునే ఓ చానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి చావు దెబ్బ తప్పదని అంగీకరించారు. మరోవైపు సూపర్ సిక్స్ హామీలు ఏవి అమలు చేయకుండా కేవలం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకొని తెచ్చుకొని అంతా బాగుందని చెప్పుకుంటాను కూటమి నాయకులకు.. దాని పెయిడ్ మీడియాకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారాలు లేని అభాండాలు వేసి రకరకాల మాయలు చేసి గెలిచిన కూటమి నాయకులు ఇప్పటికే ప్రజల్లో చులకన అయ్యారు.హామీలు ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దండాలు దోపిడీలు రౌడీయిజం ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అరాచకం మినహా ఇంకేమీ పనులు చేయకపోవడంతో ప్రజలకు సైతం ప్రభుత్వం మీద అసహ్యం మొదలైంది. మొదటి ఏడాదిలోనే ఇంత వెగటు పుడితే రానున్న నాలుగేళ్లలో ఇది మరింత ముదిరి కూటమి నాయకులను తన్ని తరిమేసే పరిస్థితికి వస్తుందని వారికి అర్థమైంది. ఒకసారంటే వీరి మాటలు ప్రజలు నమ్మారు కానీ మళ్ళీ మళ్ళీ అవే హామీలు అవే మోసకారి మాటలు చెబితే ప్రజలు నమ్మి నెత్తిన పెట్టుకోరు అనే విషయం కూటమి నాయకులతో పాటు ఆ మీడియాకు సైతం ఎప్పటికే అర్థమైంది.అంతేకాకుండా ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేల్లో కూడా దాదాపుగా 50 శాతం మంది ఎమ్మెల్యేలకు రెండోసారి గెలిచే అవకాశం లేదని తేలడంతో వారు ఇప్పుడు బిత్తిరి చూపులు చూస్తున్నారు. ఏదైతేనేం ఉన్న ఈ నాలుగేళ్లు ఉన్న కాడికి దండుకుందాం అనే టార్గెట్తో చాలామంది ఎమ్మెల్యేలు సహజం వనరులతో పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దందా చేస్తూ సొమ్ములు వెనకేస్తున్నారు.ఈ పరిస్థితి కూడా కూటమి మీడియాకు తెలుసు.. అందుకే తాజాగా జరిగిన డిబేట్లో ఓ యాంకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పలేక చెప్పలేక కుమిలిపోతూ చెప్పారు. కూటమి పొత్తులో లేకపోతే వైఎస్ జగన్ నిలువరించడం అసాధ్యం అని యాంకర్తో పాటు రఘురాం కృష్ణంరాజు సైతం అంగీకరించారు. ఏడాదిలోనే వారి పాలనపై వారికే నమ్మకం కోల్పోవడంతో.. ప్రజల ఇప్పుడు వైఎస్ జగన్పై దృష్టిసారించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు మరింత వివరించి వారి మద్దతు కూడగట్టుకునేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్నాయి..* సిమ్మాదిరప్పన్న -
‘నీ అంతు చూస్తా’.. మహిళా ప్రిన్సిపల్కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
అనకాపల్లి,సాక్షి: కస్తుర్బా కాలేజీ ప్రిన్సిపల్ని చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు బెదిరింపులు గురి చేశాడు. ఎమ్మెల్యే రాజు బెదిరింపులతో ప్రిన్సిపల్ అన్నపూర్ణ గుండెపోటుకు గురయ్యారు. ‘ఎమ్మెల్యే రాజు నా అంతుచూస్తానని బెదిరించారు. 50 మంది మగాళ్ళ మధ్య నన్ను దూషించారు. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగిన వదిలేది లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా స్కూల్లో సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పా. అయినా, ఎమ్మెల్యే వినకుండా దూషించారు. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించారని’ వాపోయారు. ఇటా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మహిళపట్ల దరుసు ప్రవర్తన ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. ‘చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. -
‘పెట్టుబడులు తెచ్చిందేమో జగన్.. ప్రచారమేమో చంద్రబాబుది’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే పెట్టుబడులన్నీ కట్టుకథలేనని విమర్శించార వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. ఆయన సీఎం అయిన ప్రతీసారి ఇలాంటి కట్టుకథలే చెప్పుకుంటూ ఉంటారని మండిపడ్డారు. ఈరోజు(శనివారం, జూన్ 28) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన మహేష్.. కోటి ఉద్యోగాలు అంటూ 1999లో చెప్పి కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదనే విషయాన్ని పోతిన మహేష్ గుర్తు చేశారు. ‘ 2014లో కూడా 25 లక్షల ఉద్యోగాలు, పది లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానని కథలు వినిపించారు. 2024లో కూడా 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ మళ్ళీ మోసం చేశారు. ఇలా ప్రతిసారీ దారుణమైన అబద్దాలు చెప్పి జనాన్ని వంచిస్తూనే ఉన్నారు. కోటి యాభై లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నట్టు చంద్రబాబుకు చెందిన ఎల్లోమీడియానే చెప్పింది. మరి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు?, ప్రపంచంలో ట్రెండింగులో ఉన్న నాలుగు పదాలను పట్టుకుని అది తానే చేశానంటూ భజన చేయించుకోవటం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబు చెప్పే మాటలు హంబక్కేనని ప్రజలు గుర్తించాలి. జగన్ తెచ్చిన పరిశ్రమలను కూడా తానే తెచ్చినట్టు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఎన్టీపీసీ లక్షా పదివేల కోట్ల విలువైన ఎంఓయూని జగన్ ప్రభుత్వంలో చేసుకుంది. అన్ని అనుమతులు, భూకేటాయింపులన్నీ జగనే చేశారు. కానీ చంద్రబాబు చేసినట్టు భజన చేసుకుంటున్నారుఇలా అనేక ప్రాజెక్టులను జగన్ తెస్తే చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. పెట్టుబడులు తెచ్చేది జగన్, ప్రచారం చేసుకునేది చంద్రబాబు. కూటమి నేతల బెదిరింపులు, దాడులకు పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరైనా పెట్టుబడులు పెట్టటానికి వస్తారా?, బాలాజీగోవిందప్ప లాంటి పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలను అరెస్టులు చేసి జైల్లో పెడితే ఇక ఎవరు పెట్టుబడులు పెడతారు?, జిందాల్ కూడా చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక మహారాష్ట్రకు పారిపోయారు. తాడిపత్రిలో ఆదినారాయణరెడ్డి ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేయించారు. పల్నాడులో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సిమెంట్ ఫ్యాక్టరీలపై దాడి చేయించారు. శ్రీకాకుళం, శ్రీకాళహస్తిలలో అక్కడి ఎమ్మెల్యేలు కమిషన్ల కోసం వేధించలేదా?, మైహోం వారి సిమెంట్ ఫ్యాక్టరీపై వేధింపులకు పాల్పడలేదా?, కృష్ణపట్నం పోర్టు నుండి కమీషన్లు ఇవ్వలేదని సోమిరెడ్డి దాడి చేశారు. కమీషన్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు సీజ్ ద ఫ్యాక్టరీ అంటున్నారు. ఇలాంటి వారి వలన రాష్ట్రానికి ఎలా పెట్టుబడులు వస్తాయి?, అశోక్ లేలాండ్ 2021లో జగన్ హయాంలోనే ఉత్పత్తి ప్రారంభించింది. స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ కూడా అయింది. కానీ లోకేష్ వెళ్ళి మళ్ళీ ప్రారంభిస్తున్నట్టు బిల్డప్పులు ఇచ్చారుడైకిన్ సంస్థ 2022లో జగన్ హయాంలో ప్రారంభిస్తే దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎవరి హయాంలో ఎన్నెన్ని పరిశ్రమలు వచ్చాయో చర్చకు సిద్దమా?, చంద్రబాబు బినామీ కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నారు. ఎకరం 99 పైసలకే ఎవరికోసం ఇస్తున్నారో చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు ఏమీ లేవు. ఉద్యోగాల కల్పన అనేదే జరగటం లేదు. కానీ వేల కోట్ల విలువైన భూములను తమ బినామీ కంపెనీలకు దోచి పెడుతున్నారు. దీనిపై ప్రజలు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి’ అని పోతిన మహేష్ పేర్కొన్నారు. -
ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన: మహేష్ రెడ్డి
సాక్షి, నరసరావుపేట: కూటమి సర్కార్పై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన ఉంది అని ఆరోపించారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడేది లేదన్నారు.మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీ మొత్తం చంద్రబాబు ఫ్యాక్షనిజం నడుపుతున్నారు. నిన్నటి ఓటమి రేపటి గెలుపునకు నాంది కావాలి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే భయమెందుకు?. ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన ఉంది. వైఎస్ జగన్ తొమ్మిది కార్లు, వంద మందితో వెళ్లాలట!. అనైతిక రాజకీయ ఒరవడికి కూటమి ప్రభుత్వం నాంది. భూస్థాపితం చేస్తారా?. ఎలా చేస్తారు?. ప్రజల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై, కార్యకర్తలపై అనేకమైన తప్పుడు కేసులు పెడుతున్నారుచిన్న పాపను 14 మంది అత్యాచారం చేస్తే వారిని ఎన్కౌంటర్ చేయాలి కదా?. తెనాలిలో యువకుల్ని పోలీసులు విచక్షణారహితంగా కొడుతుంటే వైఎస్ జగన్ వెళ్లి పరామర్శించడం తప్పా?. కుప్పం నియోజకవర్గం ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే మీరు ఏం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన సెక్యురిటీ ఇవ్వకపోవడం వల్లనే సత్తెనపల్లి పర్యటనలో ఇద్దరు చనిపోవడం జరిగింది. వైఎస్ జగన్ 2010లో పార్టీ పెట్టిన అప్పటి నుండి చంద్రబాబు.. వైఎస్ జగన్ని తొక్కాలని చూస్తున్నాడు. అందుకే అనైతిక పొత్తులు పెట్టుకున్నారు.. కానీ, విఫలం అయ్యారు. ఎన్నికల్లో మహిళలకు నెలకు 1500 ఇస్తా అన్నారు అది నమ్మి మహిళలందరూ చంద్రబాబుకు ఓటు వేశారు. అన్నదాత సుఖీభవ పథకం ఇంతవరకు మొదలు అవ్వలేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. ఆసుపత్రులకు ఒక్క బిల్లు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. పల్నాడులో మెడికల్ కాలేజీ పనులు పూర్తి చేయడం లేదు. అందుకే మేము సెల్ఫీ వీడియోతో నిరసన తెలియజేసాం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. మీరు పెట్టే కేసులకు భయపడేది లేదు. ప్రజల తరపున వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది’ అని తెలిపారు. -
గిన్నిస్ బుక్లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల
ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్పై సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్ బుక్లోకి ఎక్కించొచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్కు పదవీ గండం ఉండేది. .. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. .. సింగయ్య మృతి కేసులో జగన్పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. .. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఇంకా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్ట్ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. ‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’:::మాజీ మంత్రి శైలజానాథ్ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్కు పట్టదా?. :::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. :::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. :::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి -
క్యూఆర్ స్కాన్ ద్వారా బాబు మోసాలు బయటపెడతాం: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని.. హమీల గురించి అడిగితే తాట తీస్తామంటున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం.. ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తరాంధ్ర రిజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, పార్లమెంటు పరిశీలకులు సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగా గీతా, దవులూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.బొత్స మాట్లాడుతూ.. ‘‘నాలుక మందంతో కార్యక్రమాలు చేస్తే ప్రజల తరపున ఉద్యమిస్తాం. ఇదిగో చంద్రబాబు.. ఇదిగో పవన్ అంటూ మీ మ్యానిఫెస్టో.. బాండ్లను ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేశారని అడుగుదాం. టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు. తాట తీస్తాం, తోకలు కట్ చేస్తాం అంటున్నారు...అక్రమ కేసులు పెట్టి.. చట్టాన్ని చేతిలో తీసుకుంటే వైఎస్సార్సీపీ పని అయిపోతుందని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ప్రభుత్వం ఎంత డ్రామా ఆడింది. సింగయ్య ప్రమాదంపై ఒక ఎస్సీ రెండు సార్లు మాట్లాడటం రాజకీయాల్లో ఎప్పుడైనా చూశామా?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కురసాల కన్నబాబుమాట్లాడుతూ.. వైఎస్ జగన్ను ఓడించండం తన వల్ల కాదని చంద్రబాబు కూటమి కట్టాడు. అందమైన అబద్దాలను హమీలుగా ఇచ్చాడు. ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధమే గెలిచింది. ప్రజలు.. ప్రతిపక్షం నోరెత్తకుండా బెదిరింపు ధోరణితో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది. అందుకే "బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ" పేరుతో వైఎస్సార్సీపీ ప్రజల్లోకి వెళ్తుంది...క్యూఆర్ కోడ్ను ఫోన్లో స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో మ్యానిఫెస్టో వస్తుంది. సూపర్ సిక్స్ ఉమ్మడి మ్యానిఫెస్టో వస్తుంది. మొట్టమెదటి సారిగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన నాయకుడు వైఎస్ జగన్. దీనిని చంద్రబాబు కాపీ కొట్టారు. షణ్ముక వ్యూహం పేరుతో కూటమి పార్టీలు మరికొన్ని హమీలు ఇచ్చాయి. 50 ఏళ్లు నిండినా ఎస్సీ, బీసీలకు పెన్షన్ ఇస్తానని.. నోటికొచ్చిన హమీలను చంద్రబాబు ఇచ్చారు. ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలే అమలు చేయడం లేదు. ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు అనేక ఎత్తుగడలు వేశాడు’’అని కన్నబాబు మండిపడ్డారు.దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన షణ్ముక వ్యూహం హమీ అమలు చేయాలి. కుమారస్వామీ పేరు మీద విడుదల చేసిన మేనిఫెస్టోలో హమీలను అమలు చేయాలి. కాపులకు ఐదేళ్లలో రూ.15 వేలు కోట్లు ఇస్తానని పవన్ చెప్పారు. వైఎస్ జగన్ ఫైనాన్స్ ఇంజనీరింగ్ వల్ల ఖాజనా ఎప్పుడు నిండుగా ఉండేది. కాలర్ పట్టుకుని హమీలు అమలు చేయమని అడుగుతాం. చంద్రబాబు ఎన్నికల్లో 143 హామీలు ఇచ్చాడు. చంద్రబాబు చేసిన వంచనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ -
వైఎస్సార్సీపీ నేత అనుమానాస్పద మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: వైఎస్సార్సీపీ నేత మునగాల రామసుబ్బారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. మహానంది మండలం మసీదుపురం గ్రామ శివారులోని బావిలో రామసుబ్బారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఆయన తల, శరీరంపై దెబ్బలను పోలీసులు గుర్తించారు. ఇది ముమ్మాటికీ హత్యేనని మృతుని కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ నేత వంటెద్దు ప్రవీణ్కుమార్ రెడ్డి హత్య చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.రామసుబ్బారెడ్డి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగం వల్లే శ్రీశైలం నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయని శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుండడమే ఈహత్యలకు కారణమన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి హత్యకు కారకులను శిక్షించాలని శిల్పా డిమాండ్ చేశారు. మహానంది పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
అరాచక పాలనను అడ్డుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడాదికిపైగా టీడీపీ కూటమి సర్కారు సాగిస్తున్న రెడ్బుక్ అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసుల బనాయింపు, ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనంపై వైఎస్సార్సీపీ నేతల బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేసింది. గురువారం విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ను కలసిన వైఎస్సార్ సీపీ బృందం ఈ అరాచకాలపై జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విన్నవించింది. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, ప్రభుత్వమే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్కు వివరించింది. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో దారుణంగా విఫలం కావడం, ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండటంతో ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీసిందని.. ప్రతి ఘటననూ వక్రీకరిస్తూ తమపై ఎదురుదాడికి దిగుతోందని గవర్నర్ దృష్టికి తెచి్చంది. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడైన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు భద్రత కల్పించకుండా బాధ్యతారాహిత్యంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని నివేదించింది. ఈమేరకు శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినె విరూపాక్షి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు గవర్నర్ను కలిశారు. అనంతరం శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ రాజ్భవన్ బయట మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని గవర్నర్ కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి,మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ,చిత్రంలో వైఎస్సార్సీపీ నాయకులు ఇది నిరంకుశ ప్రభుత్వం: బొత్స సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేస్తున్న అఘాయిత్యాలు, మాజీ సీఎం వైఎస్ జగన్కు కల్పించాల్సిన భద్రతను విస్మరించడం, ఆయన పర్యటనల సందర్భంగా అక్రమ కేసులు బనాయిస్తున్న వైనాన్ని గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు బొత్స వెల్లడించారు. ‘ఇవి అప్రజాస్వామికం.. గతంలో ఎవరూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్కు వివరించాం. ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఒక వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదానికి వైఎస్ జగన్కు చెందిన కాన్వాయ్ వాహనాలు కారణం కాదు.. వేరే ప్రైవేటు వాహనం ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సాక్షాత్తూ పల్నాడు జిల్లా ఎస్పీ చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రమాదంలో సింగయ్య గాయపడటంతో పోలీసులే అతడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత హఠాత్తుగా పోలీసుల తీరు మారింది. ఈ సంఘటన వైఎస్ జగన్ ప్రయాణించిన కారు ఢీకొనడం వల్లే జరిగిందంటూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కారులో ప్రయాణిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఆ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వం ఎంత అరాచకాలకు పాల్పడుతోందో దీని ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతోంది. ఏదో ఒక విధంగా వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఉంది. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవాలని చూడటం అవివేకం. వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఆయన పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆయన ఎక్కడకు వెళ్లినా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారనే సమాచారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ప్రభుత్వం వద్ద లేవా? దానికి తగిన విధంగా ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదు? పైగా జరిగిన ప్రతి దానిని వక్రీకరిస్తూ మాపైనే ఎదురు దాడి చేస్తున్నారు. సత్తెనపల్లి సంఘటనపై మీకు మానవత్వం లేదా? అని టీడీపీ నేతలు ప్రశ్నించడం చూస్తుంటే ఇంతకంటే ఎదురు దాడి ఉంటుందా అనిపిస్తోంది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ చుట్టూ వందల మంది ప్రజలు ఉన్నారు. ఆయనకు పోలీస్ భద్రత కల్పిస్తే అంత మంది ఆయన ప్రయాణిస్తున్న కారుకు అత్యంత సమీపంలోకి ఎలా వస్తున్నారు? సింగయ్య నిజంగానే వైఎస్ జగన్ వాహనం కింద పడితే ఆ కారుకు ముందు ఉండాల్సిన పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు, అందులోని పోలీసులు, రోప్ పారీ్టలు ఎందుకు చూడలేదు? ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఏ సమాచారం ప్రకారం మొదట వివరాలను వెల్లడించారు? ఈ కుట్రనే గవర్నర్ దృష్టికి తీసుకొచ్చాం’ అని బొత్స పేర్కొన్నారు. ప్రజలే మీ నార తీస్తారు..! ఈ సందర్భంగా ఓ విలేకరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాలని బొత్సను కోరగా ఘాటుగా బదులిచ్చారు. ‘పవన్ కళ్యాణ్ ఎవడి నార తీస్తారు..? ఎవరి మక్కెలు ఇరగదీస్తారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? పనికిమాలిన మాటలు మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అందరి నార తీస్తారని గుర్తుంచుకోండి. ఒక ఎమ్మెల్యేగా జగన్కు భద్రత ఇచ్చామని హోంమంత్రి అనిత చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. తెలివి తక్కువ మాటలు వెనక్కి తీసుకోవాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం ఎమ్మెల్యే కాదు.. ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? గతంలో చంద్రబాబు తన పర్యటనల సమయంలో భద్రత కావాలని ఎందుకు అడిగారు?’ అని బొత్స ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్.. ‘ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోంది. ప్రజలకు ఇచి్చన వాగ్దానాలను అమలు చేయలేక దృష్టి మళ్లించేందుకు ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతోంది. ప్రజల తరఫున బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని మేం ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం. స్వాతంత్య్రం వచి్చన తరువాత ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని బొత్స ధ్వజమెత్తారు. -
‘కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళతాం’
విశాఖ: కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళతామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాత్ స్పష్టం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఆయన విమర్శించారు. ‘ బాబు మోసాలను 6 వారాలు పాటు ప్రజల్లోకి తీసుకువెళ్తాము.. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు స్తాయి వరకు తెలియజేస్తాము.చంద్రబాబు హామీలను QR కోడ్ ద్వారా ప్రజలకు వివరిస్తాము. వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు చంద్రబాబు ఇవ్వద్దంటున్నారు. టిడిపి వాళ్లకు వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలు అందించారు. గతంలో మేనిఫెస్టో ను వెబ్ సైట్ నుంచి తీసివేసిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబుకు రాజ్యాంగం, ప్రజలన్న భయం లేదు. ప్రభుత్వ పథకాలు అందిస్తామని గ్యారెంటీ వారంటీ కార్డులు ఇచ్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి గ్యారెంటీ, వారంటీ కార్డులు ఇచ్చారు. చంద్రబాబు మోసం చేస్తారని మొదటి నుంచి చెపుతున్నాము. నిరుద్యోగ భృతి అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నెలకు రూ. 1500, 20 లక్షల ఉద్యోగాలు ఏమి అమలు చేయలేదు. తల్లికి వందనంకు సవా లక్ష ఆంక్షలు పెట్టారు.. ఉచిత గ్యాస్ ఎవరికి అందుతుంధో ఎవరికి తెలియదు. ప్రజల్లోకి వెళ్లడానికి టీడీపీ నేతలు యపడుతున్నారు..టిడిపి నాయకులు మాస్కులు వేసుకొని ప్రజలు దగ్గరకు వెళ్ళాలని చూస్తున్నారు. టిడిపి నేతలను ప్రజలు నిలదీయాలి. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఏమీ కనిపించలేదు. చంద్రబాబు లోకేష్ పెత్తనం ప్రభుత్వంలో కనిపిస్తుంది..‘సన్’ స్ట్రోక్ వలన పవన్న చంద్రబాబు పక్కనపెడుతున్నారు’ అని గుడివాడ అమర్నాత్ విమర్శించారు. -
సంబంధం లేకుండానే కలిసి మెలిసి తిరిగారా?: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: బ్యాంక్ రుణాల కోసం ఈ–స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు భారీ స్కామ్ చేశారని, దీనిపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు.తన అనుచరుడిని దళారిగా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన ఎమ్మెల్యే, ఫోర్జరీతో వందల కోట్ల బ్యాంక్ రుణాలు కాజేశారని ఆయన ఆరోపించారు. దాన్నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే, తన దళారి ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై మొత్తం నింద వేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. ప్రెస్మీట్లో మాజీ ఎంపీ ఇంకా ఏం మాట్లాడారంటే..:‘మీసేవ’ నిర్వాహకుడికి అది సాధ్యమా?:కళ్యాణదుర్గం కేంద్రంగా నకిలీ ఈ–స్టాంప్ డ్యూటీ కుంభకోణం జరిగింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు తన కన్సట్రక్షన్ కంపెనీకి బ్యాంక్ రుణాలు పొందేందుకు, తన అనుచరుడిని దళారిగా మార్చి ఈ స్కామ్ చేశారు. గతంలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ స్టాంప్ల స్కామ్లో, రాష్ట్రంలో టీడీపీకి చెందిన ఒక నాయకుడి ప్రమేయం బయటపడింది. మళ్లీ ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ స్కామ్ వెలుగు చూసింది.ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దాన్ని ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. నిజానికి ఈ స్కామ్లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’. ఎమ్మెల్యే అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్ర నిర్వాహకుడు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు?ఎమ్మెల్యే పదవికి సురేంద్రబాబు రాజీనామా చేయాలి:42 ఏళ్ల అనుభవం ఉందని ఆడిటర్, మాకు 27 సంవత్సరాల అనుభవం ఉందని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ చెబుతోంది. రెండు మూడు సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు సంబంధించి మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయో తెలుసుకోలేనప్పుడు ఆ అనుభవం ఉండి ఏం ప్రయోజనం?ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ మీద ఆధారపడి 20 వేల కుటుంబాలున్నాయని, అందువల్ల బురద జల్లొద్దని నీతులు చెబుతున్నారు. మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు లేదు. స్కామ్ జరిగిందని మీరే చెబుతున్నప్పుడు మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు ఎందుకుంటుంది?. ఒకవేళ ఎమ్మెల్యే సురేంద్రబాబు హంసలాగా స్వచ్ఛమైన వారైతే, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి.‘మీ–సేవ’ బాబుతో తనకేం సంబంధం లేదని ఎస్సార్సీ కంపెనీ యజమాని, టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు చెబుతున్నారు. ఏం సంబంధం లేకుండానే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన మీతో తిరుగుతారా? ఆయన కొడుకు పుట్టినరోజున మీరు వెళ్లి కేకు తినిపించి వస్తారా? అలాగే మీ పుట్టినరోజుకి మీసేవ బాబు వచ్చి కేకు ఎందుకు తినిపించారు? అంతే కాకుండా మీరిద్దరూ కలిసి నారా లోకేష్ను ఎందుకు కలిశారు? మీ బంధాన్ని ధృవపర్చేలా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ఫొటోలన్నింటికీ ఏం సమాధానం చెబుతారు?.ఆ అరెస్టులు ఎందుకు చూపడం లేదు?:స్టాంప్ డ్యూటీ స్కామ్కు సంబంధించి ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబుతో పాటు, గొల్ల భువనేశ్వర్, మంజు, మోహన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అయిదు రోజులవుతున్నా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో హాజరుపర్చలేదు. దీంతో వారంతా ఎక్కడున్నారో అంతు చిక్కడం లేదు. దీనిపై పోలీసులు వెంటనే ఒక ప్రకటన చేయాలి.‘సిట్’ కాదు. సీబీఐ దర్యాప్తు చేయాలి:కళ్యాణదుర్గంలో స్టాంప్ డ్యూటీ స్కామ్పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేయడం సరికాదు. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్యే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే ‘సిట్’ వల్ల ఒరిగేదేమీ ఉండదు. అందుకే ఈ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అందుకోసం సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. అలా ప్రభుత్వం తన నిజాయితీ నిరూపించుకోవాలి.హైకోర్టు తలుపు తడుతా:పోలీసులు అదుపులోకి తీసుకున్న ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబు ఎక్కడున్నాడో చెప్పకుండా ఆయన ఇంట్లో 2 కేజీల బంగారం, రూ.2 కోట్ల నగదు దొరికిందని.. ఆయన, ఆయన భార్య బ్యాంక్ ఖాతాల్లో భారీ లావాదేవీలున్నాయని లీక్లు ఇస్తున్నారు. కానీ, ఆయన ఎక్కడున్నాడో మాత్రం చెప్పడం లేదు. అందుకే బాబుతో సహా, మిగిలిన వారందరినీ వెంటనే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలి. లేకపోతే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాల్సి వస్తుందని మాజీ ఎంపీ తలారి రంగయ్య హెచ్చరించారు.