breaking news
Thammudu Movie
-
'తమ్ముడు' ఫస్ట్ డే కలెక్షన్స్.. నితిన్ కెరీర్లో ఇదే తక్కువ
నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమా జూలై 4న విడుదలైంది. దర్శకుడు వేణు శ్రీరాం ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ప్రేక్షకులను ఏమాత్రం ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో మొదటిరోజు చాలా తక్కువ కలెక్షన్స్ సాధించినట్లు సాక్నిక్ వెబ్సైట్ ప్రకటించింది. నితిన్ కెరీర్లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న మూవీగా తమ్ముడు అని పేర్కొంది. ఆయన నటించిన గత సినిమా 'రాబిన్ హుడ్' ఫస్ట్ డే నాడు రూ. 4.8 కోట్ల గ్రాస్ సాధించిగా తమ్ముడు కలెక్షన్స్ ఆ మార్క్ను కూడా చేరుకోలేకపోయింది.భీష్మ, రంగ్ దే సినిమాల తర్వాత సరైన విజయం లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆపై దర్శకుడు వేణు శ్రీరాం కూడా ఎం.సి.ఏ, వకీల్ సాబ్ సినిమాల తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజుతో మూడో సినిమాగా 'తమ్ముడు' ప్రాజెక్ట్ను ప్లాన్ చేయడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. కానీ, తమ్ముడు చిత్రం వారిని తీవ్రంగానే నిరాశపరిచింది. దీంతో మొదటిరోజు కేవలం రూ. 4 కోట్ల గ్రాస్ మాత్రమే బాక్సాఫీస్ వద్ద సాధించినట్లు పలు వెబ్సైట్లు ప్రకటించాయి. అయితే, కలెక్షన్ల వివరాలు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. నితిన్ కెరీర్లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా తమ్ముడు నిలిచిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.దిల్ రాజు నిర్మించిన 'తమ్ముడు' సినిమా నితిన్ కెరీర్ను తిరిగి ప్రారంభిస్తుందని అందరూ భావించారు. కానీ, అది వారిద్దరికీ మరో పరాజయంగా మారింది. వరుస పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద నితిన్ పోరాటం కొనసాగుతోంది. ఇది అభిమానులను మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమ మార్కెట్ను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో గేమ్ ఛేంజర్ వల్ల భారీగా నష్టపోయిన దిల్ రాజు ఇప్పుడు మరోసారి భారీగా నష్టపోవడం తప్పదని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఆయన రూ. 50 కోట్లకు పైగానే ఖర్చు చేశారని టాక్. అయితే, తమ్ముడు సినిమా కేవలం రూ. 20 కోట్ల వరకు మాత్రమే మార్కెట్ చేసినట్లు సమాచారం. -
నితిన్ తమ్ముడు మూవీ.. ఏ ఓటీటీకి రానుందంటే?
రాబిన్హుడ్ తర్వాత నితిన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందకొచ్చారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళే థియేటర్లలో విడుదలంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. అయితే తొలి రోజే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న తమ్ముడు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే డిజిటల్ ఫ్లాట్ఫామ్లో సందడి చేసే అవకాశముంది. ఈ సినిమాను హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వచ్చే రెస్పాన్స్ చూస్తే కాస్తా త్వరగానే ఓటీటీలోకి సందడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది. -
తమ్ముడు మూవీ పబ్లిక్ టాక్
-
తమ్ముడు మూవీ రివ్యూ
టైటిల్: తమ్ముడునటీనటులు: నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్నిర్మాత : దిల్ రాజు, శిరీష్దర్శకత్వం: శ్రీరామ్ వేణుసంగీతం: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్ఎడిటింగ్: ప్రవీణ్ పూడివిడుదల తేది: జులై 4, 2025నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్లు అయింది. భారీ అంచనాలు పెట్టుకున్న రాబిన్ హుడ్ కూడా నితిన్ని నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పవన్ కల్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ ‘తమ్ముడు’ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం నితిన్ని హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూ (Thammudu Movie Review)లో చూద్దాం.కథజై (నితిన్) ఆర్చరీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనుకుంటాడు. కానీ ప్రాక్టీస్పై దృష్టి పెట్టలేకపోతాడు. దానికి కారణం.. చిన్నప్పుడు తన అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ( లయ) విషయంలో చేసిన ఒక చిన్న తప్పు! ఆ తప్పు కారణంగా అక్క అతన్ని చిన్నప్పుడే దూరం పెడుతుంది. అక్కని కలిస్తే తప్ప తను ప్రాక్టీస్పై దృష్టి పెట్టలేనని స్నేహితురాలు చిత్ర ( వర్ష బొల్లమ) తో కలిసి వైజాగ్ వస్తారు. అక్క కోసం వెతకగా ఆమె ఫ్యామిలీతో కలిసి అంబరగొడుగు జాతర వెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో జై అక్కడికి వెళ్తాడు. అక్కడ బిజినెస్మెన్ అజార్వాల్ మనుషులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. అజార్వాల్ మనుషులు ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశారు? వారి బారి నుంచి అక్కని జై ఎలా రక్షించాడు? అతనికి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలాంటి సహాయం చేసింది? ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఝాన్సీ ఇచ్చిన మాట ఏంటి? చివరకు అది నెరవేరిందా లేదా? అక్క విషయంలో జై చేసిన తప్పు ఏంటి? చివరకు అక్కతో ప్రేమగా తమ్ముడు అనిపించుకున్నాడా లేదా అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే...అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసిన పోరాటమే ఈ సినిమా కథ. చాలా రొటీన్ స్టోరీ. కానీ దర్శకుడు తనదైన స్క్రీన్ప్లేతో తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాకి కీలకమైన అక్క- తమ్ముడు సెంటిమెంట్ను ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతిదీ మన ఊహకి అందేలా సాగడం, ఎమోషనల్ సన్నివేశాలు సరిగా పండకపోవడం సినిమాకి మైనస్ అనే చెప్పాలి.ఫ్యాక్టరీ ప్రమాదం సన్నివేశంతో చాలా ఎమోషనల్గా కథను ప్రారంభించాడు దర్శకుడు. విలన్ పరిచయం సీన్ డిఫరెంట్గా ప్లాన్ చేశాడు. భారీ ఎలివేషన్తో విలన్ను పరిచయం చేసి.. ఆ తరువాత కథని హీరో వైపు మళ్లించాడు. ఆర్చరీలో బంగారు పథకమే లక్ష్యం గా ఉన్న జై... అక్క విషయంలో చేసిన తప్పుని పదేపదే గుర్తు తెచ్చుకోవడం... కోచ్ చెప్పిన మాటతో అక్క కోసం వెళ్ళడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అంబరగొడుగు నేపథ్యం సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ఊహించింది తెరపై జరుగుతుంటే కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తాం. ఇంటర్వెల్ వరకు కథనం సోసోగానే సాగుతుంది. అజార్వాల్ గ్యాంగ్ నుంచి ఝాన్సీ ఫ్యామిలీని జై ఎలా రక్షించాడు? అనేదే సెకండాఫ్ స్టోరీ. అయితే మధ్య లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ రొటీన్గా సాగుతుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎమ్ సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.ఎవరెలా చేశారంటే..జై పాత్రలో నితిన్ (Nithiin) చక్కగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. అయితే ఆయన ఈ సినిమాలో హీరో అనడం కంటే... కీలక పాత్రధారి అని చెప్పడం బెటర్. రత్నం పాత్రకి సప్తమి గౌడ న్యాయం చేసింది. ఝాన్సీగా లయ నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. చిత్రగా వర్ష బొల్లమ్మ బాగా నటించింది. మిగతావాళ్లందరూ తమ పాత్రలతో మెప్పించారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘తమ్ముడు’ మూవీ ట్విటర్ రివ్యూ
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (జులై 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నరు.తమ్ముడు కథేంటి? ఎలా ఉంది? నితిన్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్లో తమ్ముడు చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది.. బాగోలేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.#Thammudu Review : A Good emotional Ride with Solid Production values - 3/5 💥💥💥Mainly Youth Star ⭐️ @actor_nithiin has given one of the career best performance 🔥🔥🔥💥💥 with a good comeback film 🎥👍❤️🔥 #Nithiin Director #SriramVenu Handled the subject very well with… pic.twitter.com/Xy0CFOvlKH— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) July 4, 2025 తమ్ముడు సినిమాలో విలువలతో పాటు మంచి ఎమోషన్ పండించే సన్నివేశాలు ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. నితిన్ కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు. దర్శకుడు శ్రీరామ్ వేణు కథను చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా హ్యాండిల్ చేశాడు. బీజీఎమ్ బాగుంది. క లయ, సప్తమీ గౌడ, వర్ష బొలమ్మ యాక్టింగ్ బాగుందంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. Second half has excellent fight sequences…fans ki full meals aa fight sequences…Overall good movie. One time watch.Must in Theaters.#Thammudu @actor_nithiin https://t.co/ZHf0uZ0tr2— Mythoughts 🚩 (@MovieMyPassion) July 4, 2025 ఫస్టాఫ్ పర్వాలేదు. సెకండాఫ్లో ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతాయి. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్లా ఫైట్ సీక్వెన్స్ తీర్చిదిద్దారు. ఓవరాల్గా తమ్ముడు గుడ్ మూవీ. ఒక్కసారి చూడొచ్చు. కచ్చితంగా థియేటర్స్లో చూడాలి’ అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. Below average film. Apart from two fight sequences, the film is boring in the second half.The issue with #Thammudu is the lack of emotion and the brother/sister emotion doesn’t work. The choreography for action sequences which is important for this film could’ve been much…— Sharat chandra 🦅 (@Sharatsays2) July 4, 2025బిలో యావరేజ్ సినిమా ఇది. రెండు ఫైట్ సీక్వెన్స్ మినహా సెకండాఫ్ అంతా బోరింగ్గా సాగుతుంది. అక్కా తమ్ముడు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. సినిమాకు అదే ప్లస్ అయింది. వేణు శ్రీరామ్ డిసప్పాయింట్ చేశాడు. టెక్నికల్గా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో సక్సెస్ అయ్యాడు కానీ.. సరైన కథనే రాసుకోలేకపోయాడు. టీం పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ అది ప్రేక్షకుడిపై ప్రభావం చూపలేకపోయింది’అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#Thammudu A Lackluster Action-Adventure Drama That Tests Your Patience from start to finish! Director Venu Sriram attempts to deliver a unique action-adventure film with an interesting backdrop. However, he completely fails. The on-screen proceedings are outright silly at…— Venky Reviews (@venkyreviews) July 4, 2025 విలన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నా.ఆ పాత్ర తాలుకు సంఘర్షణ ఆకట్టుకోలేకపోయింది. బీజీఎం బాగుంది. సెకండాఫ్లో ఒక సీన్ బాగుంది. అంతకు మించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేదంటూ మరో నెటిజన్ 1.75 రేటింగ్ ఇచ్చాడు.#Thammudu is a super knit commercial movie.First half starts a bit slow and the director takes his own time to establish the plot. There’s no looking back from the pre-interval to the superb INTERVAL BANG 💥.Post interval scenes are the major highlights of the movie.3.5/5— Peter Reviews 🔥🪓 (@urstruelypeter) July 4, 2025#thammudu First Half Review: Starts off with a familiar setup and unfolds at a slow pace, especially during the forest portions. The drama and stakes feel underwhelming so far. Hoping the second half picks up and delivers better.#ThammuduTrailer #nithin #DilRaju— Dingu420 (@dingu420) July 4, 2025 -
సైకో కిల్లర్గా చేయాలని ఉంది: వర్ష బొల్లమ్మ
‘‘హీరోయిన్గా కొన్ని సినిమాలు చేశాను. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చినా చేస్తాను. స్క్రీన్పై వర్ష బాగా నటిం చిందనే పేరు తెచ్చుకుంటే చాలు. ఉదాహరణకు నిత్యా మీనన్గారికి మంచి పెర్ఫార్మర్గా పేరుంది. ఆమెలా పేరు తెచ్చుకోవాలని ఉంది. ‘తమ్ముడు’ కథ విన్నప్పుడు, ఈ సినిమాలో నేను చేసిన చిత్ర క్యారెక్టర్ కొత్తగా అనిపించింది.సవాల్గా తీసుకుని, ఈ సినిమా చేశాను’’ అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ అన్నారు. నితిన్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రంలో లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, బాల నటి శ్రీరామ్ దిత్య ఇతర కీలక పాత్రల్లో నటించారు.శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ– ‘‘అక్కాతమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే సినిమా ‘తమ్ముడు’. కానీ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్ జైకి ఓ డ్రైవింగ్ ఫోర్స్లా ఉంటుంది చిత్ర పాత్ర.ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేయాలనుకునే మనస్తత్వం చిత్రది. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇక ఓ సైకో కిల్లర్ రోల్ చేయాలన్నది నా ఆకాంక్ష. ప్రస్తుతం ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్, మరో వెబ్ సిరీస్లో నటిస్తున్నాను. మరో రెండు సినిమాలు ఉన్నాయి’’ అని అన్నారు. -
ఒకే ఒక పెద్ద సినిమా.. టాలీవుడ్కి ఏమైంది?
టాలీవుడ్లో మొన్నటి వరకు పోటీ లేకుండా సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఒకేవారం పెద్ద సినిమాతో పాటు మూడు, నాలుగు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అయ్యేవి. కానీ సమ్మర్ నుంచి టాలీవుడ్లో పెద్దగా పోటీ లేకుండా సినిమాలు వస్తున్నాయి. ఇక గత నెలలో థగ్లైఫ్, కుబేర, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలు వచ్చినా.. వాటి మధ్యలో కూడా వారం, వారం గ్యాప్ ఉంది. వీటితో పాటు రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కానీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక జులైలో టాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెల మొత్తంలో ఒకే ఒక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. మిగిలిన సినిమాలన్ని పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగబోతున్నాయి.జులై మొదటి వారంలో తమ్ముడు చిత్రంలో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ హీరోయిన్లుగా నటించగా, లయ కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మేరకు అయినా సినిమా ఆడుతుందో లేదో జులై 4న తెలుస్తుంది. ఇక అదే రోజు సిద్ధార్థ్ నటించిన 3 బి.హెచ్.కె కూడా విడుదల కానుంది. తమ్ముడుతో పోలిస్తే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్కి వెళ్లి చూసే పరిస్థితి అయితే ఈ సినిమాకు లేదు.ఇక రెండో వారంలో అనుష్క షూటీ రిలీజ్ కావాల్సింది. కానీ అది వాయిదా పడింది. దీంతో ఈ వారంలో ఎలాంటి పోటీ లేకుండా సింగిల్గా బరిలోకి దిగుతున్నాడు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ జులై 11న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. మరి సింగిల్గా వస్తున్న సుహాస్.. సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.ఇక మూడో వారంలో మేఘాలు చెప్పిన ప్రేమ కథ(జులై 17) అనే చిన్న సినిమాతో పాటు జూనియర్(జులై 18 అనే కన్నడ-తెలుగు సినిమా కూడా ఇక్కడ విడుదల కాబోతుంది. గాలి జనార్థన్రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా నటిస్తున్న జూనియర్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం, హీరోయిన్గా శ్రీలీల నటించడం, మరో కీలక పాత్రలో జెనీలియా కనిపించడంతో జూనియర్పై టాలీవుడ్లో మంచి హైప్ క్రియేట్ అయింది.ఇక చివరి వారంలో (జూలై 24) హరిహరి వీరమల్లు రాబోతుంది. ఈ నెలలో వస్తున్న ఏకైక పెద్ద సినిమా ఇదే. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎంఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాలో నిధి అగర్వాల హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిది. -
నేచురల్ బ్యూటీ 'వర్ష బొల్లమ్మ' స్పెషల్ ఫోటోలు చూశారా..? (ఫొటోలు)
-
అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు
‘‘ఓ నిర్మాతకు ఓ హీరోతో సినిమా కమిట్మెంట్ కావాలంటే అబ్నార్మల్ అడ్వాన్స్లు ఇచ్చి, వాళ్లను హోల్డ్ చేసుకుని సినిమా ప్లాన్ చేయాలి. అది నా ఫార్ములా కాదు. హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్ల రూపంలో డబ్బులిచ్చి, వారిని కట్టడి చేయడం అనే దానికి నేను వ్యతిరేకం. ఓ దర్శకుడితో నాకు వేవ్ లెంగ్త్ సింక్ అయితే సినిమా చేస్తాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు పంచుకున్న విశేషాలు.→ కథగా చూస్తే ‘తమ్ముడు’ సింపుల్ స్టోరీ. అక్కా తమ్ముడి మధ్య ఓ సమస్య రావడం, వారు ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు? అనేది మూవీలో చూస్తారు. స్క్రీన్ప్లే పరంగా కొత్తగా చూపిస్తూ, యాక్షన్ సీక్వెన్స్లతో ఆసక్తికరంగా తీశాడు వేణు శ్రీరామ్. ఇది యాక్షన్ ప్యాక్డ్ సినిమా. మొదటి ఇరవై నిమిషాల తర్వాత ఈ సినిమాలోని మిగిలిన కథంతా ఒక్క రోజులో జరుగుతుంది. → మా బ్యానర్లోని గత సినిమాలు అమెజాన్లో స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ ఒకరితోనే ముందుకు వెళ్లలేం కదా. సో... ‘తమ్ముడు’ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్లో సినిమా ప్రదర్శనకు ముందు ఆ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో తెలిసేలా ఉండటం కరెక్ట్ కాదు. ఈ విషయం గురించి ఓటీటీ సంస్థలతో మాట్లాడినప్పుడు సపోర్ట్ చేస్తామన్నారు. → ఎఫ్డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ వేడుక చేశాం. అలాగే మన హైదరాబాద్లో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఈ ఏడాది ఎఫ్డీసీ ద్వారా నిర్వహించాలని అనుకుంటున్నాం. ఆన్లైన్ టికెటింగ్, రన్ట్రాక్ (సినిమా వసూళ్లను ట్రాక్ చేసే విధానం) లను తెలంగాణాలో తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. → మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్రాజు ప్రొడక్షన్స్ సంస్థల్లో ఈ ఏడాది నాలుగు సినిమాలు (రౌడీ జనార్థన, ఎల్లమ్మ, దేత్తడి, మరో సినిమా స్క్రిప్ట్ స్టేజ్లో ఉంది) రెడీ అవుతున్నాయి. ఇంకా అనిల్ రావిపూడితో ఓ సినిమా, ‘మార్కో’ హనీఫ్తో ఓ సినిమా, ఓ ఇద్దరు కొత్త డైరెక్టర్స్ సినిమాలు ఉన్నాయి. ఇంకా ఓ అడ్వెంచరస్ సినిమా కూడా ఉంది. ప్రశాంత్ నీల్తో సినిమా ఉంటుంది. హోల్డ్లో ఉన్న ‘సెల్ఫిష్’ సినిమాపై ఈ వారంలో ఓ కార్లిటీ వస్తుంది. కొత్తవారిని ప్రోత్సహించే విధంగా ‘దిల్’ రాజు డ్రీమ్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ‘దిల్’ రాజు డ్రీమ్స్లో నిర్మాతలు కూడా దరఖాస్తు చేసు కుంటున్నారు. కథ బాగుంటే మేమే బడ్జెట్ కేటాయించి వాళ్లతో సినిమా చేస్తాం. వాళ్లు సినిమా చేసుకుని మా దగ్గరకు వస్తే మా గైడెన్స్తో ఆ సినిమాను రిలీజ్ చేస్తాం. ఇక పైరసీని అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ‘కుబేర, కన్నప్ప’ చిత్రాల పైరసీ ప్రభావం కాస్త తగ్గింది → ‘గేమ్ చేంజర్’ చిత్రా నికి నిర్మాత మీరేనా? జీ స్టూడియోస్ సంస్థనా? జీ స్టూడియోస్ తమ సినిమా అంటున్నారట? అనే ప్రశ్నకు– ‘‘ఒకవేళ వాళ్లే అయితే లాస్ కట్టమనాలి’’ అని ‘దిల్’ రాజు బదులిచ్చారు.అవమానపరచాలనుకోలేదు: నిర్మాత శిరీష్ ‘‘మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో చిరంజీవి, రామ్చరణ్గారికి ఎంతో అనుబంధం ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్చరణ్గారు ఒకరు. ఆయన్ని అవమానపరచడం, కించపరచడం చేయను. అది జరిగిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్లకు, చరణ్గారికి క్షమాపణలు చెబుతున్నాను. మా బ్యానర్లో చరణ్గారితోనే మరో సినిమా చేయబోతున్నాం’’ అంటూ శిరీష్ ఓ వీడియో బైట్ రిలీజ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తర్వాత ఆ చిత్రదర్శకుడు శంకర్, హీరో రామ్చరణ్ కనీసం ఫోన్ కూడా చేయలేదన్నట్లుగా శిరీష్ పేర్కొన్నారు. ఆ తర్వాత నెలకొన్న వివాదంపై తన స్పందనను ఇలా వీడియో బైట్ ద్వారా తెలియజేశారు. -
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
నెగెటివ్ ట్రోలింగ్ని, ఫేక్ రివ్యూస్ని అరికట్డడంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కన్నప్ప సినిమా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడేదని అభినందించాడు. ఇకపై మేము కూడా అదే ఫాలో అవుతామని చెప్పారు.మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం ఏంటి?మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్కి రెండు రోజుల ముందే మంచు విష్ణు ఓ హెచ్చరికను జారీ చేశారు. కన్నప్ప సినిమాని టార్గెట్గా చేసుకొని కావాలని ఎవరైన నెగెటివ్గా పోస్టులు పెట్టిన, వ్యక్తిగత హననానికి పాల్పడినా.. ఉద్దశ్యపూర్వకంగా విమర్శలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పబ్లిక్ కాషన్ నోటీస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది మంచి ఫలితాన్నే ఇచ్చింది. రిలీజ్ తర్వాత ఫేక్ రివ్యూస్, నెగెటివ్ ట్రోలింగ్ పెద్దగా జరగలేదు. ట్వీటర్లో సినిమాపై, మంచు ఫ్యామిలీపై నెగెటివ్ పోస్ట్లు పెట్టలేదు. సినిమాకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయి.అదే ఫాలో అవుతాం : దిల్ రాజుసినిమాను కాపాడాడానికి ఎవరు ఏ మంచి చేసినా.. మేమంతా అది ఫాలో అవుతామని అన్నారు దిల్ రాజు. ఆయన నిర్మించిన తాజా చిత్రం తమ్ముడు జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. నెగెటిట్ ట్రోలింగ్పై స్పందించారు. ‘కన్నప్ప చిత్రబృందం మంచి నిర్ణయం తీసుకుంది. రిలీజ్కు ముందే అలా ఒక హెచ్చరిక జారీచేస్తే.. ఫేక్ రివ్యూస్, నెగెటివ్ ట్రోలింగ్, పైరసీ తగ్గిపోతుంది. అలా అని రివ్యూస్ని ఆపడం మా ఉద్దేశం కాదు. రివ్యూస్ రాయండి. కానీ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి. సినిమాపై కావాలని నెగెటివ్గా రాస్తే.. ఎక్కువగా నష్టపోయేది నిర్మాత మాత్రమే. హీరోలు, దర్శకులు ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో హిట్ కొడతారు. కానీ నిర్మాత అయితే ఆ సినిమాకు డబ్బులు పోగొట్టుకోవాల్సిందే కదా? అది దృష్టిలో పెట్టుకొని జన్యూన్గా రివ్యూస్ ఇవ్వండి. దయచేసి హెల్ప్ చేయకపోయినా పర్లేదు ..డ్యామేజ్ మాత్రం చేయెద్దు’ అని దిల్ రాజు విజ్ఞప్తి చేశాడు. -
తమ్ముడుతో టాలీవుడ్లో ఎంట్రీ.. అప్పుడే లైన్లో పెట్టేసిందిగా! (ఫోటోలు)
-
నా రియల్ లైఫ్లో వాళ్లు లేరు.. అయినా ఫీల్ కాలేదు: లయ
తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్గా మెప్పించిన బ్యూటీ లయ. భద్రం కొడుకో మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన లయ.. ఆ తర్వాత స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత యూఎస్ వెళ్లిపోయిన లయ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా జాబ్ కూడా చేసింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది.నితిన్ హీరోగా వస్తోన్న తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో రిలీజ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్కు హాజరైన లయ.. తమ్ముడు సినిమా గురించి తన అనుభవాలు పంచుకుంది. నా రియల్ లైఫ్లో అక్కా, తమ్ముడు అంటూ తనకెవ్వరు లేరని తెలిపింది. అందుకే ఈ చిత్రం తన కెరీర్లో చాలా స్పెషల్ అని ఆనందం వ్యక్తం చేసింది. ఈ మూవీ కోసం దాదాపు 90 రోజుల పాటు చెప్పుల్లేకుండానే పని చేశానని లయ వెల్లడించింది.లయ మాట్లాడుతూ..' ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్కు నేను ఎప్పుడు ఫీలవ్వలేదు. ఎందుకంటే నాకు అక్కా, తమ్ముడు, చెల్లి లాంటి వాళ్లు ఎవరూ లేరు. నా సినిమా జర్నీలో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సినిమా మొత్తం చెప్పుల్లేకుండా పరిగెత్తడం చాలా ఈజీ అనుకున్నా. కానీ తర్వాత రోజు అలానే చేస్తుంటే ఆ నొప్పి అప్పుడు అర్థమైంది. దెబ్బ మీద దెబ్బ తగిలి అలానే అలవాటు చేసుకున్నా. ఇన్నాళ్లు నా పాత సినిమాలు చూసి ఎలా అభిమానించారో.. నా తమ్ముడు సినిమాకు కూడా అలాగే మద్దతిస్తారని ఆశిస్తున్నా' అని తన అనుభవాన్ని పంచుకుంది.కాగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించింది. -
'తనే నా జీవితంలో మొదటి స్నేహితురాలు'.. తమ్ముడు డైరెక్టర్ భావోద్వేగం
తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు టాలీవుడ్ హీరో నితిన్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న లయ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో జూలై 04న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తమ్ముడు మూవీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈవెంట్కు హాజరైన దర్శకుడు వేణు శ్రీరామ్ తన జర్నీ గురించి మాట్లాడారు.తన జీవితంలో మొదటి స్నేహితురాలు అక్క అని వేణు శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన తన సోదరిని అందరికీ పరిచయం చేశారు. నా జీవితంలో మొట్టమొదటి కెమెరా మా అక్కనే కొనిచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. తనకు తొందరగానే పెళ్లి అయిపోందన్నారు. నా మొదటి షార్ట్ ఫిలిం ఆ కెమెరాతోనే తీశానని వేణు శ్రీరామ్ వెల్లడించారు. మా అక్క కష్టపడేతత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. -
పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా చూలేదు : కాంతర హీరోయిన్
‘పుష్ప’ చిత్రంలో రష్మిక చేసిన పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఆఫర్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. కానీ కాంతర సక్సెస్ తర్వాత నాకు అన్ని అలాంటి క్యారెక్టర్సే ఆఫర్ చేశారు. అందుకే చాలా మూవీస్ వదులుకున్నాను. ఎక్కువ చిత్రాలు చేయకపోవడానికి కారణం ఇదే. డిఫరెంట్ రోల్స్ వస్తే కచ్చితంగా చేస్తా. కమర్షియల్ సినిమా చేయడం కూడా ఇష్టమే. ‘తమ్ముడు’ కూడా కమర్షియల్ చిత్రమే’ అని అన్నారు కన్నడ బ్యూటీ సప్తమి గౌడ. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘తమ్ముడు’. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సప్తమి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ కాంతార సినిమా తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు గారి దగ్గర నుంచి "తమ్ముడు" మూవీ కోసం కాల్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో ఓకే అయ్యాక, డైలాగ్ వెర్షన్ చెప్పారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఉంది. హార్స్ రైడింగ్ నేర్చుకోమని చెప్పారు. అరకులో షూటింగ్ చేశాం. నితిన్ గారి భుజానికి గాయం వల్ల షూటింగ్ కొంత ఆలస్యమైంది. "తమ్ముడు" మూవీకి వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది.→ అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. తను పవన్ కల్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్ కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాంతారతో చూస్తే లుక్ వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు కానీ క్యారెక్టర్ గా చూస్తే పూర్తిగా భిన్నమైనది.→ "తమ్ముడు" కాస్త సీరియస్ సబ్జెక్ట్..ఇందులో నా క్యారెక్టర్ ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. లయ, నితిన్ గారు కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్, లయ గారు ఉన్న సిచ్యువేషన్ తెలియకుండా వారితో నా తరహాలో జోవియల్ గా ఉంటాను. అది ఆడియెన్స్ కు హ్యూమర్ ఇస్తుంది.→ కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్ చేయడంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది.→ పవన్ కల్యాణ్ తమ్ముడు సినిమా గురించి నాకు ఐడియా ఉంది. వేణు గారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు నేను ఆ సినిమాను చూడలేదు. మా మూవీ రిలీజ్ లోపు పవన్ గారి తమ్ముడు మూవీ చూస్తాను.→ "తమ్ముడు" సినిమా నటిగా నాకు తప్పకుండా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఈ చిత్రంలో నాది లెంగ్తీ రోల్ కాదు, కానీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. రత్న క్యారెక్టర్ రాసేప్పుడు మిగతా వాటి కంటే ఎంజాయ్ చేశానని డైరెక్టర్ వేణు గారు చెప్పేవారు. ఈ సినిమాకు ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే.→ ఈ మూవీలో నితిన్ తో నాకు లవ్ ట్రాక్ ఉంటుంది. మా టీనేజ్ ప్రేమ తర్వాత మరింత పరిణితి చెందుతుంది. మూవీలో రత్న, నితిన్ క్యారెక్టర్ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. దిల్ రాజు గారి ఎస్వీసీ సంస్థలో నా ఫస్ట్ తెలుగు మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక సినిమా బాగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలంటే మంచి సంస్థలకే సాధ్యమవుతుంది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు "తమ్ముడు" మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి క్యారెక్టర్ ను పక్కాగా డిజైన్ చేసుకున్నారు. ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ నుంచి కూడా తనకు కావాల్సిన ఔట్ పుట్ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు.→ ప్రస్తుతం తెలుగులో మరో రెండు చిత్రాలతో పాటు తమిళంలో, కన్నడలో మూవీస్ చేస్తున్నా. వాటి డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తా. భాషాలకు అతీతంగా అన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా. -
ఎప్పటికీ 'తమ్ముడు' అనిపించుకోలేవు (ట్రైలర్)
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ మరో ట్రైలర్ను విడుదల చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. అయితే, తాజాగా రిలీజ్ ట్రైలర్ పేరుతో మరోటి వదిలి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశారు. మొదటి ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మరో పవర్ఫుల్ వీడియోను షేర్ చేసి మూవీపై మరింత అంచనాలు పెంచేశారు.రత్న అనేపాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, గుత్తిపాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్గా సౌరభ్ సచ్దేవ్ కనిపించబోతున్నారు. నితిన్-దిల్ రాజు కాంబినేషన్లో ఇప్పటికే ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’పై సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని మేకర్స్ తెలిపారు. -
నితిన్ 'తమ్ముడు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. అల్లు అర్జున్ స్థాయికి రాలేకపోయావ్: దిల్ రాజు
నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. జూలై 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంది చిత్రయూనిట్. ఈ క్రమంలో దిల్ X తమ్ముడు పేరుతో ఓ స్పెషల్ చిట్చాట్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడారు.సత్సంబంధాలు లేకపోయినా..నితిన్ మాట్లాడుతూ.. దిల్రాజు (Dil Raju)ను నేను అంకుల్ అని పిలిచేవాడిని. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న, రాజు కలిసి తొలిప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సినిమా హిట్టయినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్లాం. అలా రాజుతో పరిచయం ఏర్పడింది. 2005లో రామ్ సినిమా చేశాను. అప్పుడు రిలీజ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మన మధ్య సత్సంబంధాలు లేకపోయినా మీరు వచ్చి కొంత అమౌంట్ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. చాలామంది హీరోలకు, నిర్మాతలకు సాయం చేశారు. అలాంటిది మీరు సినిమాలను తొక్కేస్తారన్న విమర్శలు విన్నప్పుడు బాధేసింది అని చెప్పుకొచ్చాడు.జయం సినిమాకు ముందే..దిల్ రాజు తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. జయం సినిమా పోస్టర్స్ చూసి ఈ కుర్రాడు భలే ఉన్నాడనుకున్నాను. అప్పుడు నువ్వు ఎవరో కాదు, సుధాకర్ రెడ్డి కుమారుడు అనగానే.. మరింకే, నితిన్తో సినిమా చేద్దామని వినాయక్తో అన్నాను. అలా జయం రిలీజ్కు ముందే దిల్ మూవీ ఫిక్స్ చేశాం. కాకపోతే దిల్ టైటిల్ బూరుగుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఉంది. ఆయన దగ్గరకు వెళ్లి ఈ టైటిల్ మా సినిమాకు బాగుంటుందని అడగ్గానే ఇచ్చారు. ఆయన టైటిల్ ఇవ్వడం వల్లే 'దిల్' రాజు అనేది ఒక బ్రాండ్ అయిపోయింది.గేమ్ ఛేంజర్ నష్టాలునేను 2003లో నిర్మాతనయ్యాను. నువ్వు 2002లో హీరో అయ్యావు. నాకంటే ఒక ఏడాది సీనియర్వి. నేను జూనియర్ను. అయినా నేను ఒక్కొక్కటిగా సాధించుకుంటూ టాప్ పొజిషన్లోకి వచ్చాను. ఆర్య సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ను, దిల్ సినిమా చేస్తున్నప్పుడు నితిన్ (Nithiin)ను ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించాను. కానీ, నువ్వు ఆ స్థాయికి రాలేకపోయావు. అదే నువ్వు కోల్పోయావు. తమ్ముడుతో సక్సెస్ వస్తుంది కానీ పూర్వ వైభవం రావడానికి అది సరిపోదు అన్నాడు.రెండు ప్రాపర్టీలు అమ్ముకుంటా..గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గురించి ఓపెన్ అవుతూ.. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజవగానే నాకు నష్టం రాబోతుందని అర్థమైంది. కాకపోతే 14న రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం కచ్చితంగా హిట్ కొడుతుందని నమ్మకంగా ఉన్నాను. ఒకవేళ ఆ సినిమా లేకపోయినా.. రెండు ప్రాపర్టీలు అమ్ముకుని ఆ నష్టాల నుంచి బయటపడేవాడిని. అది పెద్ద విషయం కాదు అని చెప్పుకొచ్చాడు. ఇక వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నితిన్కు.. తమ్ముడు సినిమా విజయాన్ని సాధించి పెట్టాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
‘‘మా కథకి ‘తమ్ముడు’ సరైన టైటిల్. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారు. ఈ సినిమాలో నితిన్కి అక్క పాత్ర చేశాను. నటన పరంగా చూస్తే నితిన్ మెచ్యూర్డ్గా కనిపిస్తారు. చాలా కష్టమైన సన్నివేశాలను కూడా సులభంగా చేశారు’’ అని నటి లయ (Actress Laya) తెలిపారు. నితిన్ హీరోగా రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించిన లయ పంచుకున్న విశేషాలు.2023లో ఇండియాకు..వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడిన నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాను. అప్పుడు కొన్ని యూట్యూబ్ చానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలు చూసిన ‘తమ్ముడు’ మూవీ టీమ్ నుంచి జూన్లో నాకు ఫోన్ వచ్చింది. నటిస్తారా? అని అడిగితే ఓకే అన్నాను. ‘తమ్ముడు’ కథ ఓ లైన్గా చెప్పారు. ఝాన్సీ కిరణ్మయి పాత్ర కోసం బరువు పెరగాలని చెప్పడంతో స్వీట్స్ బాగా తిని, 7 కిలోలు బరువు పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక పూర్తి కథ విన్నాను. నా రీ ఎంట్రీకి ‘తమ్ముడు’ సరైన సినిమా అని బలంగా అనిపించి, నటించాను.ఉద్యోగం మానేశా‘తమ్ముడు’ సినిమా కోసం హైదరాబాద్ రావాలనుకున్నప్పుడే అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ మానేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు... అందుకే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశం వదులుకోకూడదని వచ్చేశా. ఈ సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ భిన్నంగా ఉంటుంది. ఝాన్సీ కిరణ్మయి స్ట్రిక్ట్ ఆఫీసర్. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటుంది. నా క్యారెక్టర్లో స్ట్రిక్ట్నెస్తో పాటు ఎమోషన్, అఫెక్షన్ కూడా ఉంటాయి. అమెరికాలోనే కాదు హైదరాబాద్లోనూ..కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటించాలని అనుకుంటున్నాను. నేను అమెరికా నటిని కాదు... పక్కా హైదరాబాద్ నటినే. నాకు అమెరికాలో ఇల్లు ఉంది. హైదరాబాద్లోనూ ఉంది. నాకోసం ఫ్లైట్స్లో బిజినెస్ క్లాస్ టికెట్స్, స్టార్ హోటల్స్లో వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్లోని నా ఇంట్లో ఉంటాను. ప్రస్తుతం శివాజీగారితో చేస్తున్న ఓ సినిమా తుది దశకు వచ్చింది. కొన్ని కథలు వింటున్నాను.చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ -
జై శివనాయకీ...
‘జై బగళాముఖీ, జై శివనాయకీ, జై వనరూపిణీ, జై జయకారిణీ, విద్రుమ రూపిణి, విభ్రమకారిణి, గగనఛత్ర వింధ్యాచలవాసిని....’ అంటూ సాగుతుంది ‘తమ్ముడు’ సినిమాలోని ‘జై బగళాముఖీ’ పాట. నితిన్ హీరోగా నటించిన చిత్రం ఇది. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ, స్వసికా విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.ఈ సినిమాలోని ‘జై బగళాముఖీ...’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘‘కొండ కోనలందుండి కోటి బ్రహ్మాండములేలే శివనారీ... గుండె గుండెలో అఖండ జ్యోతిగ వెలుగుచుండు ఓంకారి’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీతదర్శకుడు అజనీష్ లోకనాథ్ నేతృత్వంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం అందించిన ఈ పాటను వి. అబ్బి ఆలపించారు. ‘‘శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారి మహిమను కీర్తిస్తూ సిని మాలో జరుపుకునే గ్రామ జాతర సందర్భంగా ఈ పాట వస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
Thammudu Movie: ఆకట్టుకుంటున్న 'భూ అంటూ భూతం..' సాంగ్
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'భూ అంటూ భూతం..' రిలీజ్ చేశారు. మేనకోడలు బేబి దిత్యకు మేనమామ నితిన్ ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. 'భూ అంటూ భూతం..' పాటను అజనీష్ లోకనాథ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల ఆకట్టుకునేలా పాడారు. సింహాచలం మన్నేలా లిరిక్స్ రాశారు. 'భూ అంటూ భూతం..' పాట ఎలా ఉందో చూస్తే - 'భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి..పుట్టగానే నేరుగా నువు పరుగెత్తలే, పట్టుకుంటూ పడుతూ నడకేనేర్చావే, భయపడి అడుగు ఆపకే..అంటూ సాగుతుందీ పాట. -
నితిన్ 'తమ్ముడు' ట్రైలర్ ఈవెంట్.. హీరోయిన్ల సందడి (ఫోటోలు)
-
నితిన్ ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో మార్పు రావాలని ఆయన అన్నారు. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. అలాగే ఇప్పుడు తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగనని స్పష్టం చేశారు. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో తమ్ముడు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు టిక్కెట్ల పెంపు అంశంపై కామెంట్స్ చేశారు.ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత అని.. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదని.. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించామని దిల్ రాజు పేర్కొన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు అన్నారు. ఆయన సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలని కోరారు.కాగా.. టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన తమ్ముడు సినిమా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. -
యూట్యూబ్లో డబ్బులు పెట్టి వ్యూస్ కొనొద్దని చెప్పా: దిల్ రాజు
టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) కెరీర్లోనే అధిక బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం తమ్ముడు (Thammudu Movie). ఈ చిత్రం ద్వారా హీరోయిన్ లయ టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో నితిన్కు అక్కగా నటించింది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాష్, శిరీష్ నిర్మించారు. తమ్ముడు ట్రైలర్ను బుధవారం (జూన్ 11న) రిలీజ్ చేశారు.ఈరోజు చెప్పేస్తా..ఈ సందర్భంగా దిల్ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలారోజుల నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఆ విషయం చెప్పి తీరతాను. యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేశాం. ఆ వీడియో కింద కనిపించే నెంబర్లన్నీ ఒరిజినల్. ప్రేక్షకులు చూసిన నెంబర్లే అక్కడ కనిపించాలని మా ఆఫీసులో నా పీఆర్ టీమ్తో సహా అందరికీ చెప్పాను. డబ్బులు ఖర్చు చేసి మరీ మిలియన్ల వ్యూస్ కొనొద్దని సూచించాను. ఎలా తెలుస్తుంది?ఎందుకంటే ఒరిజినల్గా మన పాట, ట్రైలర్.. ఏదైనా సరే, జనాల్లోకి ఎంతగా రీచ్ అవుతుందనేది మనకు అర్థం కావాలి. అప్పుడే మన మూవీ ప్రజలకు ఏమేరకు రీచ్ అవుతుందని ఓ అంచనాకు రాగలం. మనం కొనుక్కుంటే వ్యూస్ నెంబర్లు ఎక్కువ కనిపిస్తాయి. కానీ, అది ప్రేక్షకుడికి చేరిందా? లేదా? అనేది తెలియడం లేదు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జూలై 4న రిలీజ్ చేస్తున్నారు.చదవండి: సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు -
'మాట పోయి మనిషి బతికినా.. పోయినట్టే లెక్క'.. ఆసక్తిగా తమ్ముడు ట్రైలర్
టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'మాట పోయి మనిషి బతికినా.. మనిషి పోయినట్టే లెక్క.. మాట బతికి మనిషి పోతే.. మనిషి బతికున్నట్లే లెక్క' అనే డైలాగ్ ఆడియన్స్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. A powerful promise sparks a fierce battle for survival...! 👪Presenting the absolutely intense #BangerFromThammudu 🎯🌄▶️ https://t.co/QX2opY8tyDIn theatres from July 4th, 2025 🔒#ThammuduOnJuly4th @actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya #SaurabhSachdeva… pic.twitter.com/NoSyNMSTlF— Sri Venkateswara Creations (@SVC_official) June 11, 2025 -
ఏంటి మీ గోల?.. డౌట్స్ ఉంటే ట్రైలర్ చూడండి..!
ఇటీవల టాలీవుడ్ మూవీ ప్రమోషన్లలో డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. అందరికంటే కాస్తా భిన్నంగా చేస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తమ్ముడు' మేకర్స్ అదే అలానే ట్రై చేశారు. గతంలో మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసేందుకు కొత్తగా ట్రై చేశారు. తాజాగా ట్రైలర్ అపేడేట్ ఇచ్చేందుకు మరోసారి అదే స్టైల్నే ఫాలో అయ్యారు. హీరోయిన్లు హడావుడి చేస్తూ ట్రైలర్ డేట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఆ వీడియోలో 'నేను అడగడం వల్లే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ విషయంలోనూ అంతే' అంటూ వర్ష బొల్లమ్మ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. అయితే మేము చెప్తాం అంటూ అక్కడే ఉన్న హీరోయిన్ సప్తమీ గౌడ, స్వాసిక చెబుతారు. ఈ మాట విన్న లయ అసలు మీరిద్దరు ఎవరు? అని ప్రశ్నిస్తుంది. వేరే సినిమాలో నటించి.. తమ్ముడు అనుకున్నారా? అంటూ వర్ష బొల్లమ్మ నవ్వులు పూయిస్తుంది. చివర్లో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చి.. ఏంటి మీ గోల? మీ డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే ట్రైలర్ చూడండి అని అనడంతో వీడియో ముగుస్తుంది.టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు ట్రైలర్ను జూన్ 11న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. -
బాలకృష్ణ కాలు తొక్కా.. ప్యాకప్ చెప్పి.. నన్ను వద్దన్నారు: హీరోయిన్
లయ(laya)...ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కోసం సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్బై చెప్పింది. 1999లో వేణు 'స్వయంవరం' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన లయ.. 2006 వరకు దాదాపు 40 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత 25 ఏళ్ల వయసులోనే గణేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లి పోయింది. అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ జాబ్ చేసింది. ఆ తర్వాత డ్యాన్స్ స్కూల్ కూడా రన్ చేసింది. కరోనా కారణంగా అది మూతపడింది. ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చిన లయ.. ఇన్స్టాలో వరుసగా రీల్స్ చేయడంతో ఆమె గురించి మరోసారి బయటి ప్రపంచానికి తెలిసింది. ఆమె చేసిన రీల్స్ వల్లే..మళ్లీ సినిమా చాన్స్లు వచ్చాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమాలో లయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నటి లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీనియర్ నటుడు బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో పొరపాటున బాలయ్య కాలు తొక్కితే.. సీరియస్ అవ్వడమే కాకుండా సినిమాలో నుంచి తీసేయండి అని చెప్పాడని, నన్ను ఆటపట్టించడానికే ఇలా అన్నారనే విషయం తెలియక బోరున ఏడ్చానని చెప్పింది.‘విజయంద్రవర్మ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాను. ఆ సినిమా ఫస్డ్డే షూటింగ్ రోజే పాట పెట్టారు. దాని కోసం బాలకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ క్రమంలో నేను పొరపాటున బాలయ్య కాలు తొక్కేశాను. దాంతో బాలకృష్ణ వెంటనే సీరియస్ అయ్యాడు. ‘నా కాలే తొక్కుతావా..? ప్యాకప్.. ఈ అమ్మాయిని సినిమాలో నుంచి తీసేయండి’అని చెప్పి పక్కకి వెళ్లిపోయాడు. బాలకృష్ణ అలా అనడం నేను తట్టుకోలేకపోయాను. గట్టిగా ఏడ్చేశాను. వెంటనే బాలయ్య వచ్చి..‘అయ్యో..నేనేదో సరదాగా అన్నాను.. నిజమనుకున్నావా? ఇలాంటివి నేను బోలెడు అంటున్నాను’ అని నవ్వేశాడు. ఆయన జోక్ చేశాడనే విషయం గ్రహించక నేను ఏడ్చేశాను. సెట్లో ఎప్పుడు ఆయన అలానే సరదాగా ఉండేవాడు’ అని లయ చెప్పుకొచ్చింది. -
గురి తప్పదు తమ్ముడు
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అంటూ సోమవారం ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్.రత్న అనేపాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, గుత్తిపాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్గా సౌరభ్ సచ్దేవ్ కనిపించబోతున్నారు. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ వీడియో చివర్లో నితిన్ ఎంట్రీ, బాణం వదిలిన తీరు ఆసక్తిగా ఉంది. ‘‘నితిన్, ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: కేవీ గుహన్, సంగీతం: అజనీష్ లోకనాథ్. -
రిలీజ్ డేట్ ఎప్పుడు?
‘‘ఇవాళ నా పుట్టినరోజు... ఎవరొచ్చినా లోపలికి పంపించు’’ అంటూ వచ్చేవాళ్లు చెప్పే శుభాకాంక్షల కోసం ఎగ్జయిటింగ్గా ఎదురు చూశారు దర్శకుడు శ్రీరామ్ వేణు. అయితే వచ్చిన లయ, స్వసిక విజయన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ‘సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారు? చెబుతారా చెప్పరా?’ అంటూ కాస్తంత కోపంగా అడగడంతో, శ్రీరామ్ వేణు ఖంగు తిన్నారు. పైగా బేబీ శ్రీరామ్ దీత్య అయితే ‘నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మూవీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా, మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు?’ అని అడగడంతో, బర్త్డే విషెస్ చెబుతారని ఆశిస్తే, ఇలా షాక్ ఇచ్చేరేంటి అనుకుంటూ సర్ది చెప్పి, పంపించేస్తారు.చివరికి నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ నవ్వుకుంటూ... శ్రీరామ్ వేణుతో, రిలీజ్ది ఏముందీ? కేక్ కట్ చేద్దువుగాని అంటూ, జూలై 4న థియేటర్లలో ‘తమ్ముడు’ అని రాసి ఉన్న కేక్ని కట్ చేయించారు. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు చేశారు. ఆదివారం (మే 4) శ్రీరామ్ వేణు బర్త్ డే సందర్భంగా పైన పేర్కొన్న విషయాలతో తయారు చేసిన ఓ ఫన్నీ వీడియో ద్వారా సినిమాని జూలై 4న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
అసలు నేను సినిమాలో ఉన్నానా?.. డైరెక్టర్ను డైరెక్ట్గా అడిగేసిన లయ!
రాబిన్హుడ్ తర్వాత నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డైరెక్టర్ వేణు శ్రీరామ్ బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇంతకీ అదేంటో మీరు కూడా చూసేయండి.డైరెక్టర్ వేణు శ్రీరామ్ పుట్టినరోజు కానుకగా తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. అయితే ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో వెల్లడించారు. దర్శకుడు వేణు శ్రీరామ్ దగ్గరికి వచ్చిన హీరోయిన్లు బర్త్ డే విషెస్కు బదులుగా మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు సార్?అని అడుగుతారు. దీంతో ఆయన కాస్తా షాకింగ్కు గురవుతారు. హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మతో పాటు మరో సీనియర్ టాలీవుడ్ హీరోయిన్ లయ కూడా దర్శకుడితో మూవీ విడుదల తేదీ గురించే ఆరా తీస్తుంది.అసలే నేను తెలుగమ్మాయిని.. 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నా.. నేను ఈ సినిమాలో ఉన్నానా సార్? అంటూ డైరెక్టర్ వేణు శ్రీరామ్ను ప్రశ్నిస్తుంది. 'ఒక్క పోస్టర్ లేదు.. అప్డేట్ లేదు.. కనీసం సినిమా రిలీజ్ డేట్ అయినా చెప్పండి.. వెళ్లి థియేటర్లోనే చూసుకుంటా' అని లయ మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ మూవీ ప్రమోషన్లలో ఇదొక డిఫరెంట్ వే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. వేణు శ్రీరామ్- నితిన్ కాంబోలో వస్తోన్న తమ్ముడు మూవీ జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో దిల్రాజు, అల్లు శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాబిన్ హుడ్ మూవీ హిట్ కాకపోవడంతో నితిన్ ఫ్యాన్స్ తమ్ముడిపై ఆశలు భారీగానే పెట్టుకున్నారు. మరీ వారి అంచనాలకు తగినట్లుగా రాణిస్తుందో లేదో తెలియాలంటే జూలై 4వరకు వేచి చూడాల్సిందే.Just as I asked, they’ve announced it!😏#Thammudu releasing on July 4th, 2025🎯#HBDSriramVenu sir #ThammuduOnJuly4th❤️🎂@actor_nithiin #Laya @VarshaBollamma #Swasika #DilRaju #Shirish @SVC_official @AJANEESHB pic.twitter.com/zw4zLuR6QD— Sapthami Gowda (@gowda_sapthami) May 4, 2025An Ambitious & Powerful Saga Will Ignite Big Screens🔥Feel the pulse of Action, emotion & adrenaline!💥#Thammudu Hitting the Bullseye on July 4th, 2025🎯#ThammuduOnJuly4th@actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya @VarshaBollamma #Swasika #DilRaju #Shirish… pic.twitter.com/bIlA0oWOHH— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2025 -
తెలుగులో తొలి సినిమా.. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడిలా తిరుపతిలో
దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం చేసిందీ బ్యూటీ. మళ్లీ ఇన్నేళ్లకు తిరుమల కొండపై కనిపించింది. ఈమెని చూసి తొలుత గుర్తుపట్టలేదు కానీ తర్వాత ఈమె ఎవరో తెలిసి అవాక్కవుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత మారిపోయిందో అని అనుకుంటున్నారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?'హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చేపల్లే తుళ్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి' ఈ పాట వినగానే మీకు పవన్ కల్యాణ్ గుర్తొస్తారు కదా! ఇదే సాంగ్లో ఓ హీరోయిన్ కూడా ఉంటుంది. పైన ఫొటోలో కనిపిస్తున్నది ఆమెనే. ఈ బ్యూటీ పేరు అదితి గోవిత్రికర్. ముంబైకి చెందిన అదితి స్వతహాగా డాక్టర్. కానీ ఈ కోర్స్ చేస్తున్న టైంలోనే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. పలు యాడ్స్లో కనిపించి తెలుగులో 'తమ్ముడు' మూవీలో ఛాన్స్ కొట్టేసింది.(ఇదీ చదవండి: సిగ్గు లేకుండా నన్ను కమిట్మెంట్ అడిగాడు: హీరోయిన్ కావ్య థాపర్)1999లో 'తమ్ముడు' సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న అదితి.. 'మౌనమేలనోయి' అని మరో తెలుగు మూవీ చేసింది. దీని తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. 2021 వరకు హిందీ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. లాక్ డౌన్ తర్వాత నాలుగైదు వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు చేసింది. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్టులేం ఈమె చేతిలో లేవు.తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని అదితీ గోవిత్రికర్ దర్శించుకుంది. బయటకొచ్చిన తర్వాత ఈమెని వీడియో తీసిన కొందరు, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 'తమ్ముడు' హీరోయిన్ ఎంతలా మారిపోయిందోనని మాట్లాడుకుంటున్నారు. అదితి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.1998లో ముఫ్పాజాల్ లక్డావాలా అనే డాక్టర్ని దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ మనస్పర్థలతో 2009లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈమె పిల్లలతో కలిసి ఉంటోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు) -
బెల్లంకొండ 'భైరవం'.. శివరాత్రికి 'తమ్ముడు'
*'ఛత్రపతి' రీమేక్ ఫలితం దెబ్బకు సైలెంట్ అయిపోయిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కొత్త సినిమాని రెడీ చేశాడు. 'భైరవం' టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన 'గరుడన్' చిత్రానికి ఇది రీమేక్ అని తెలుస్తోంది. మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకుడు. వచ్చే నెలలో అంటే డిసెంబరు 3వ వారంలో రిలీజ్ ఉండొచ్చని టాక్.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)*ప్రస్తుతం 'రాబిన్ హుడ్' చేస్తున్న నితిన్.. డిసెంబరు 20న ఈ సినిమాతో థియేటర్లలోకి రానున్నాడు. మరోవైపు 'వకీల్ సాబ్' తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' చేస్తున్నాడు. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ కథతో తీస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది శివరాత్రికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.*అనుష్క శెట్టి ప్రస్తుతం 'ఘాటి' అనే సినిమా చేస్తోంది. క్రిష్ దర్శకుడు. చాలా వరకు షూటింగ్ పూర్తి కాగా.. ఈనెల 7న అంటే గురువారం చిత్ర గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉండబోతుందని ఓ అంచనాకు రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) -
అతిథి పాత్రకు సై?
అందం, అభినయం పరంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ తెలుగు సినిమా అంగీకరించి దాదాపు రెండేళ్లయింది. ప్రస్తుతం తమిళంలో ‘కాదలిక్క నేరమిల్లయ్, డియర్ ఎక్సెస్’ సినిమాలు చేస్తున్నారు. ఇవి తెలుగులోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి... నిత్యా మీనన్ స్ట్రయిట్ తెలుగు సినిమా సంగతి ఏంటి? అంటే... ఆమె ఓ తెలుగు సినిమా అంగీకరించారనే ప్రచారం జరుగుతోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తమ్ముడు’ సినిమాలో అతిథి పాత్రకు సై అన్నారట నిత్య. గతంలో నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. తాజాగా నితిన్ హీరోగా రూ΄÷ందుతున్న ‘తమ్ముడు’లో సప్తమీ గౌడ కథానాయికగా నటిస్తున్నారు. నటి లయ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో ఉన్న కీలకమైన అతిథి పాత్రకు నిత్యా మీనన్ని తీసుకున్నారని సమాచారం. -
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
-
సెంటిమెంట్... అడ్వెంచర్
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తమ్ముడు’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శనివారం (మార్చి 30) నితిన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘భీష్మ’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘రాబిన్ హుడ్’. ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ హీరో నితిన్ నేడు (మార్చి 30) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో నితిన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'తమ్ముడు' అనే టైటిల్ను ఫిక్స్ చేసిన మేకర్స్.. నేడు నితిన్ పుట్టినరోజు కావడంతో ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాని దిల్రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న 56వ సినిమాగా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లో నితిన్ కాస్త డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. ఆడవాళ్లు లారీ తోలుతుంటే లారీపై కుమారస్వామి ఆయుధం పట్టుకొని నితిన్ కూర్చున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్కు సంబంధించిన సీన్ నుంచి ఈ పోస్టర్ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నితిన్- దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో మరో సినిమాను రానుంది. వీరిద్దరి కాంబోలో ఇష్క్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నితిన్ భారీ హిట్ అందుకున్నాడు. A story of ambition, courage, and determination🎯 Presenting the passion-filled first look of #THAMMUDU ❤️🔥 Wishing everyone's Favourite Brother @actor_nithiin a very Happy Birthday ❤️🎉#HBDNithiin A Film by #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/30PgqvLvIZ — Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2024 -
నితిన్ ‘తమ్ముడు’ సినిమా కాన్సెప్ట్ ఇదేనా..?
నితిన్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘తమ్ముడు’ టైటిల్ ఖరారైంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు వంశీ పైడిపల్లి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కొన్ని సినిమా టైటిల్స్ చాలా బాధ్యతతో వస్తుంటాయి. మీ అంచనాలకు మించి ఉండేలా ఈ సినిమా చేస్తాం’’ అని పేర్కొన్నారు నితిన్. ‘‘సెప్టెంబర్ 1నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ‘దంగల్, కహానీ, తారే జమీన్ పర్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు వర్క్ చేసిన సత్యజిత్ పాండే (సేతు) ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే అక్క– తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని టాలీవుడ్ టాక్. -
‘తమ్ముడు’ సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉంది? ఎం చేస్తుంది?
‘హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చేపల్లే తుళ్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి’ ఈ పాట వినగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఎర్ర చొక్కాలో లుంగీ కట్టిన పవన్ కల్యాణ్ మన కళ్ల ముందుకు వస్తాడు. ఆ తర్వాత ఓ బ్యూటీ బ్లాక్ టీషర్ట్ వేసీ రైల్వే స్టేషన్లో అలా నడుస్తున్నట్లు కనిపిస్తుంది కదా? ఆ బ్యూటీ పేరే అదితి గోవిత్రికర్. . 1999లో తమ్ముడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ అందాల భామ, ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసిన తనదైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత ‘సోచ్’ అనే చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ’16 డిసెంబర్’, ‘బాజ్’, ‘డే దనా దన్’, ‘భేజా ఫ్రై 2’, ‘స్మైల్ ప్లీజ్’, ‘కోయి జానే నా’ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే అవేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. సినిమా అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది అదితి. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ల్లోనూ నటించింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటూ లండన్లోని హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో రెండో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. ఇక అదితి వ్యక్తిగత విషయాలకొస్తే.. 1998లోనే దావూడి బొహ్ర అనే వ్యక్తిని పెళ్ళాడింది. ఇద్దురు పిల్లలు పుట్టాక వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు దూరమయ్యారు. 2007లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అదితి తన పిల్లలతో కలిసి ముంబైలోని సోదరి ఆర్జూ గోవిత్రికర్తో నివసిస్తోంది. View this post on Instagram A post shared by Dr Aditi Govitrikar (@aditigovitrikar)