
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ మరో ట్రైలర్ను విడుదల చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. అయితే, తాజాగా రిలీజ్ ట్రైలర్ పేరుతో మరోటి వదిలి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశారు. మొదటి ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మరో పవర్ఫుల్ వీడియోను షేర్ చేసి మూవీపై మరింత అంచనాలు పెంచేశారు.
రత్న అనేపాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, గుత్తిపాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్గా సౌరభ్ సచ్దేవ్ కనిపించబోతున్నారు. నితిన్-దిల్ రాజు కాంబినేషన్లో ఇప్పటికే ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’పై సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని మేకర్స్ తెలిపారు.