
టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) కెరీర్లోనే అధిక బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం తమ్ముడు (Thammudu Movie). ఈ చిత్రం ద్వారా హీరోయిన్ లయ టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో నితిన్కు అక్కగా నటించింది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాష్, శిరీష్ నిర్మించారు. తమ్ముడు ట్రైలర్ను బుధవారం (జూన్ 11న) రిలీజ్ చేశారు.
ఈరోజు చెప్పేస్తా..
ఈ సందర్భంగా దిల్ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలారోజుల నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఆ విషయం చెప్పి తీరతాను. యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేశాం. ఆ వీడియో కింద కనిపించే నెంబర్లన్నీ ఒరిజినల్. ప్రేక్షకులు చూసిన నెంబర్లే అక్కడ కనిపించాలని మా ఆఫీసులో నా పీఆర్ టీమ్తో సహా అందరికీ చెప్పాను. డబ్బులు ఖర్చు చేసి మరీ మిలియన్ల వ్యూస్ కొనొద్దని సూచించాను.
ఎలా తెలుస్తుంది?
ఎందుకంటే ఒరిజినల్గా మన పాట, ట్రైలర్.. ఏదైనా సరే, జనాల్లోకి ఎంతగా రీచ్ అవుతుందనేది మనకు అర్థం కావాలి. అప్పుడే మన మూవీ ప్రజలకు ఏమేరకు రీచ్ అవుతుందని ఓ అంచనాకు రాగలం. మనం కొనుక్కుంటే వ్యూస్ నెంబర్లు ఎక్కువ కనిపిస్తాయి. కానీ, అది ప్రేక్షకుడికి చేరిందా? లేదా? అనేది తెలియడం లేదు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జూలై 4న రిలీజ్ చేస్తున్నారు.
చదవండి: సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు