దసరా సీజన్లో థియేటర్స్లోకి రానున్నాడు కామ్రేడ్ కళ్యాణ్. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’. మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తున్నారు.
కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ సినిమాను అక్టోబరు 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘యాక్షన్, ఎమోషన్, వినోదంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది.


