కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లాక్ అయిందంటూ అప్పట్లో చాలా స్టోరీలు వచ్చాయి. నిజానికి అవి రూమర్స్ కావు. వీరిద్దరూ కలిసి సినిమా చేయడానికి గతంలో ప్రయత్నించారు. అయితే కథ విషయంలో ఇద్దరికీ సెట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. తాజాగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' సక్సెస్ మీట్ ఈవెంట్లో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నేను సూర్యతో ఇప్పటికే ఓ సినిమా చేయాలి. కానీ సూర్యకు నచ్చే కథను నేను చెప్పలేకపోయాను. అయితే త్వరలోనే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తానని నిండుసభలో ప్రకటించారు. నా భార్య సూర్యకు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో తను నన్ను కోరుతున్నారు. “అది రిక్వెస్ట్ కాదు.. డిమాండ్” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, సూర్యను కలిసేందుకు తన భార్య ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ షూటింగ్కి వెళ్లి, ఆయనతో ఫొటో కూడా దిగినట్లు త్రివిక్రమ్ వెల్లడించారు.
కరుప్పు హిట్ తర్వాత సూర్య నటించిన మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం ఆగష్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్తోనే సూపర్ హిట్ అవుతుందని టాక్ వినిపించింది. రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.


