breaking news
World Championship Of Legends
-
పాక్తో మ్యాచ్ బహిష్కరణ: స్పందించిన ధావన్.. మాలో కొందరు..
పాకిస్తాన్ చాంపియన్స్తో మ్యాచ్ను బహిష్కరించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) స్పందించాడు. తనపై ఎవరి ఒత్తిడీ లేదని.. తన మనసు చెప్పినట్లు మాత్రమే నడుచుకున్నానని తెలిపాడు. కాగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) -2025 టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్తో మ్యాచ్లను బహిష్కరించిన విషయం తెలిసిందే.సెమీ ఫైనల్లోనూ..లీగ్ దశలో దాయాదితో పోటీ పడాల్సి రాగా ఇండియా చాంపియన్స్ మ్యాచ్ను బాయ్కాట్ చేసింది. అనంతరం ఇరుజట్లు తొలి సెమీ ఫైనల్లో తలపడాల్సి వచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్ను కూడా బహిష్కరిస్తే టోర్నీ నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి. అయినప్పటికీ భారత ఆటగాళ్లు.. తమకు దేశమే ముఖ్యమంటూ చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ ఆడేది లేదని తేల్చిచెప్పారు.పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఇండియా చాంపియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. పాకిస్తాన్ చాంపియన్స్ ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో సౌతాఫ్రికా చేతిలో ఓడి పాక్ మరోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది.పూర్తి స్పృహలో ఉండే ఈ నిర్ణయంఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా చాంపియన్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటం వ్యక్తిగతంగా నాకు అస్సలు ఇష్టం లేదు. పూర్తి స్పృహలో ఉండి నేను ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాను.మా జట్టులోని కొంత మంది నాతో పాటు ఏకీభవించారు. భజ్జీ పా (హర్భజన్ సింగ్) కూడా ఇదే అభిప్రాయం వ్యక్తపరిచారు. అందుకే పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడకూడదని నిశ్చయించుకున్నాం.ఎవరూ ఒత్తిడి చేయలేదుమ్యాచ్ నుంచి తప్పుకోవాలని మాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. పాకిస్తాన్తో ఆడటం మాలో కొందరికి ఏమాత్రం ఇష్టం లేదు. పాక్తో మ్యాచ్ ఆడటానికి మాకు ఎటువంటి సరైన కారణం కనిపించనే లేదు. అంతకుమించి ఏమీ లేదు’’ అని తెలిపాడు. క్రిక్బ్లాగర్తో ముచ్చటిస్తూ ధావన్ ఈ మేరకు తన మనసులోని అభిప్రాయాలు పంచుకున్నాడు.తొలి చాంపియన్ ఇండియాకాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో నిర్వహిస్తున్న టీ20 టోర్నీయే డబ్ల్యూసీఎల్. గతేడాది ఇంగ్లండ్ వేదికగా మొదలైన ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ చాంపియన్స్ రూపంలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇక అరంగేట్ర సీజన్ ఫైనల్లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్ను ఓడించి టైటిల్ గెలిచింది.ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్లోని ప్రశాంత పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి.. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ.. పాక్ ఆక్రమిత, పాక్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. దీంతో పాక్ ఆర్మీ ప్రతిదాడికి యత్నించగా.. భారత సైన్యం గట్టిగా కౌంటర్ ఇచ్చింది. డబ్ల్యూసీఎల్-2025లో ఇండియా చాంపియన్స్ జట్టు ఇదేయువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్.చదవండి: బహిష్కరించిన భారత్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం! -
డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీ విజేతగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ నిలిచింది. శనివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. తొలి డబ్ల్యూసీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఈ విజయంలో ప్రోటీస్ దిగ్గజం, సౌతాఫ్రికా ఛాంపియన్స్ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ది కీలక పాత్ర.47 బంతుల్లో సెంచరీ..196 పరుగుల లక్ష్య చేధనలో డివిలియర్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ది బౌలర్లను ఊతికారేశాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడిని ఔట్ చేయడం పాక్ బౌలర్ల తరం కాలేదు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు.మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్.. 12 ఫోర్లు, 7 సిక్స్లతో 120 పరుగులు చేశాడు. అతడితో పాటు జేపీ డుమినీ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 50 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాక్ బౌలర్లలో ఆజ్మల్ ఒక్కడే వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.షర్జీల్ ఖాన్ మెరుపులు..అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షర్జీల్ ఖాన్ మెరుపులు మెరిపించాడు. కేవలం 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్లతో 76 పరుగులు చేశాడు. అతడితో పాటు ఉమర్ అమీన్(36) రాణించాడు. సఫారీ బౌలర్లలో విల్జోయెన్, పార్నల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఒక మెగా ఈవెంట్ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన డివిలియర్స్కు ప్లేయర్ ఆఫ్ది టోర్నీ అవార్డు దక్కింది.చదవండి: యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్గా..AB de Villiers is probably the only retired cricketer who’s still better than all the active playerspic.twitter.com/3OB1AdCQaK— yash (@onlydardnod1sco) August 2, 2025 -
బహిష్కరించిన భారత్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)-2025 టోర్నమెంట్లో సెమీస్ ఆడకుండానే ఇండియా చాంపియన్స్ వెనుదిరిగింది. సెమీ ఫైనల్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (IND vs PAK)ను ఎదుర్కోవాల్సి రావడమే ఇందుకు కారణం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో క్రీడల్లోనూ ఎలాంటి ‘బంధం’ వద్దంటూ భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్ను బహిష్కరించారు.దేశమే ముఖ్యమంటూ..ఫలితంగా ఇండియా చాంపియన్స్ టోర్నమెంట్ నుంచే వెనుదిరిగాల్సి వచ్చినా.. దేశమే తమకు ముఖ్యమంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. ఇండియా చాంపియన్స్ తప్పుకోవడంతో పాకిస్తాన్ చాంపియన్స్ నేరుగా ఫైనల్కు చేరుకుంది.సర్వహక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డువేఇక ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రైవేట్ క్రికెట్ లీగ్లలో దేశం పేరును వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు సమాచారం. వార్తా సంస్థ ANI నివేదిక ప్రకారం.. ‘‘ప్రైవేట్ సంస్థలు పాకిస్తాన్ పేరును తమ లీగ్లలో ఉపయోగిస్తే వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం.క్రికెట్ ఈవెంట్లలో దేశం పేరు వాడుకునే సర్వహక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రమే ఉన్నాయి. గురువారం జరిగిన బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో కూలంకషంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.డబ్ల్యూసీఎల్ రెండో ఎడిషన్లో భారత క్రికెటర్లు పాకిస్తాన్తో ఆడమంటూ తిరస్కరించడం.. దేశ గౌరవానికి భంగం కలిగించింది. అందుకే ప్రైవేటు లీగ్లలో దేశం పేరు వాడవద్దని నిర్ణయించారు’’ అని పీసీబీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.ఆసియా కప్లో మాత్రం దాయాదుల పోరు!ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2025లో మాత్రం టీమిండియా పాకిస్తాన్తో ఆడేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, తటస్థ వేదికలపై మాత్రమే ఆడతామంటూ దాయాదులు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. యూఏఈలో టోర్నీ జరుగనుంది.ఈ క్రమంలో లీగ్ దశలో ఓసారి, సూపర్ ఫోర్ మ్యాచ్లో ఓసారి చిరకాల ప్రత్యర్థులు తలపడే అవకాశం ఉంది. మరోవైపు.. డబ్ల్యూసీఎల్-2025లో శనివారం నాటి ఫైనల్లో పాకిస్తాన్.. సౌతాఫ్రికా చాంపియన్స్ను ఢీకొట్టనుంది. ఇదిలా ఉంటే.. పహల్గామ్లో ఉగ్రదాడికి బదులు.. భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం బదులివ్వగా.. భారత ఆర్మీ గట్టిగా బుద్ధిచెప్పింది.చదవండి: IPL 2026: గైక్వాడ్పై వేటు.. సీఎస్కే కెప్టెన్గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను? -
అప్పుడు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట! నీవు మారవా అఫ్రిది?
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో పాకిస్తాన్తో జరగాల్సిన సెమీఫైనల్ను ఇండియా ఛాంపియన్స్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. పాక్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా యువరాజ్ సింగ్ బృందం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే విషయంపై పాకిస్తాన్ ఛాంపియన్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు.ఇండియా జట్టు తీసుకున్న నిర్ణయం తమను నిరాశపరిచిందని అఫ్రిది అన్నాడు. కాగా ఈ లెజెండ్స్ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ జట్టు తొలుత పాకిస్తాన్తో లీగ్ స్టేజి మ్యాచ్ను బాయ్కాట్ చేసింది. దీంతో మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే యాదృఛ్చికంగా భారత్-పాకిస్తాన్ జట్లు తొలి సెమీఫైనల్లో తలపడాల్సి వచ్చింది.అయితే లీగ్ స్టేజిలో పాక్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసిన భారత జట్టు.. కీలకమైన సెమీస్లో ఆడుతుందా? అన్న సందేహం నెలకొంది. అంతలోనే సెమీస్కు ముందు షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు యువీ అండ్ కోనే కాకుండా ప్రతీ భారత పౌరుడికి కూడా ఆక్రోశం తెప్పించింది. ‘‘భారత జట్టు ఏ ముఖం పెట్టుకుని మాతో ఆడుతుందో చూడాలని ఉంది. మాతో ఆడటం తప్ప వాళ్లకు ఇప్పుడు మరోదారి లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. అందుకు కౌంటర్గా కొద్ది గంటల్లోనే సెమీఫైనల్ను బహిష్కరిస్తూ భారత జట్టు ప్రకటన విడుదల చేసింది. అయితే అప్పుడు భారత జట్టుపై విషం చిమ్మిన అఫ్రిది.. ఇప్పుడు మొసలి కన్నీరు కరుస్తున్నాడు."ఇరు దేశాల మధ్య దౌత్యాన్ని అభివృద్ధి చేయడానికి క్రికెట్కు మించిన క్రీడా మరొకటి లేదు. గతంలోనూ భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంత మంచిగా లేవు. కానీ క్రీడల్లో మాత్రం ఎటువంటి తారతామ్యాలు కన్పించేవి కావు. ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగాలి.క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని" ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడి వ్యాఖ్యలు భారత క్రికెట్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. నీవు మారవా అఫ్రిది అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా శనివారం జరగనున్న ఫైనల్లో సౌతాఫ్రికా ఛాంపియన్స్, పాక్ ఛాంపియన్స్ తలపడనున్నాయి.Shahid Afridi's Statement after India 🇮🇳 Champions refused to play against Pakistan 🇵🇰 Champions in WCL Semi Final 🧐A must watch video 👇🏻 pic.twitter.com/dCwxEs02iF— Richard Kettleborough (@RichKettle07) August 1, 2025 -
ఉత్కంఠ పోరు.. ఒక్క పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ అడుగుపెట్టింది. గురువారం ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్తో ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో ఒక్క పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను దక్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్ ఏబీ డివిలియర్స్(6) త్వరగా ఔటైనప్పటికి.. స్మట్స్(57), వాన్ వైక్(76) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడల్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. ఆర్చీ షార్ట్, బ్రెట్లీ, క్రిస్టియన్ తలా వికెట్ సాధించారు.పోరాడి ఓడిన ఆసీస్..అనంతరం లక్ష చేధనలో ఆసీస్కు షాన్ మార్ష్(25), క్రిస్ లిన్(35) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత షార్ట్(33), క్రిస్టియన్(49) ఆసీస్ను గెలుపు దిశగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి.వైన్ పార్నల్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి క్వినీ సిక్స్ బాదగా.. రెండు బంతికి సింగిల్ తీసి క్రిస్టియన్కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి రెండు, నాలుగు బంతికి ఒక పరుగు వచ్చింది. ఆ తర్వాత ఐదో బంతికి కూడా సింగిల్ రన్ మాత్రమే వచ్చింది. దీంతో చివరి బంతికి కంగారుల విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. డివిలియర్స్ అద్బుతమైన ఫీల్డింగ్తో ఒక్క రన్ మాత్రమే వచ్చింది.రెండో పరుగు తీసే క్రమంలో కౌల్టర్ నైల్ రనౌటయ్యాడు. ఒకవేళ రెండో పరుగు పూర్తి చేసి ఉంటే మ్యాచ్ టై అయ్యిండేది. ఇక శనివారం ఎడ్జ్బాస్టన్లో జరగనున్న ఫైనల్ పోరులో పాకిస్తాన్ ఛాంపియన్స్తో సౌతాఫ్రికా తలపడనుంది. కాగా ఇండియా ఛాంపియన్స్ సెమీఫైనల్కు ఆర్హత సాధించినప్పటికి, పాకిస్తాన్తో ఉద్రిక్తల కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు.చదవండి: IND vs ENG 5th Test: ఆధర్మసేన.. ఇంగ్లండ్కు ఫేవర్గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్ -
‘మీకు మరో దారి లేదు’.. ఆఫ్రిది ఓవరాక్షన్.. దిమ్మతిరిగిపోయింది!
పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)కి ఇండియా చాంపియన్స్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ‘ఏ ముఖం పెట్టుకుని వస్తారో చూడాలని ఉంది’ అంటూ అతడు చేసిన ‘అతి’ వ్యాఖ్యలకు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఆడకపోవడమే ఉత్తమం అంటూ వాకౌట్ ద్వారా సమాధానం ఇచ్చింది. కాగా ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’ (WCL) టోర్నమెంట్లో ఇండియా చాంపియన్స్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. అయితే, సెమీ ఫైనల్ పోరులో దాయాది పాకిస్తాన్తో భారత్ తలపడాల్సి వచ్చింది. అయితే, టీమిండియా ఇందుకు నిరాకరించింది.లీగ్ దశలోనూలీగ్ దశలోనూ పాకిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించిన భారత స్టార్లు... దాయాదితో మైదానంలో తలపడేది లేదని మరోసారి తేల్చిచెప్పారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడబోమని... భారత చాంపియన్స్ జట్టు ప్లేయర్లు శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా (Suresh Raina) స్పష్టం చేశారు.ఇక లీగ్ దశలో పాక్తో మ్యాచ్ను బహిష్కరించిన భారత్... మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఒక దాంట్లో గెలిచి మూడింట ఓడి 3 పాయింట్లు దక్కించుకుంది. అయితే చివరి లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్పై భారీ విజయం నమోదు చేసుకున్న భారత్... మెరుగైన రన్రేట్తో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్తో గురువారం ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత్ తలపడాల్సి ఉండగా... మన ప్లేయర్లు ఈ మ్యాచ్ను సైతం బహిష్కరించారు.వాళ్లకు మరోదారి లేదు.. అస్సలు ఆడముఅయితే, ఈ సెమీ ఫైనల్ కంటే ముందు మీడియాతో మాట్లాడుతూ షాహిద్ ఆఫ్రిది ఓవరాక్షన్ చేశాడు. ‘‘భారత జట్టు ఏ ముఖం పెట్టుకుని మాతో ఆడుతుందో చూడాలని ఉంది. మాతో ఆడటం తప్ప వాళ్లకు ఇప్పుడు మరోదారి లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. కానీ దేశమే తమకు ముఖ్యమంటూ భారత క్రికెటర్లు పాక్తో మ్యాచ్ను బహిష్కరించారు. అయితే, భారత జట్టు నిర్ణయంతో పాక్ ఫైనల్కు చేరింది. మరోవైపు.. యువీ సేన టోర్నీ నుంచి నిష్క్రమించినా.. దేశ ప్రజల కోసం సరైన పనే చేశామనే సంతోషంతో వెనుదిరిగింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో క్రీడల్లోనూ బంధం కొనసాగించడం సరికాదనే అభిప్రాయంతో డిఫెండింగ్ చాంపియన్ స్వయంగా సెమీస్ పోరు నుంచి బయటకు వచ్చింది.నాడు ఆఫ్రిదికి ధావన్ కౌంటర్కాగా షాహిద్ ఆఫ్రిదికి నోటి దురుసు ఎక్కువేనన్న విషయం తెలిసిందే. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం ‘ఆపరేషర్ సిందూర్’ పేరిట.. ముష్కరులను మట్టుపెడితే షాహిద్ ఆఫ్రిది బాధపడిపోయాడు. తప్పు మీదేనంటూ భారత ఆర్మీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ షాహిద్ ఆఫ్రిదిని ఉద్దేశించి.. ‘‘కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ను మట్టికరిపించిన భారత సైన్యం గురించి మాట్లాడుతున్నారా? మీకు ఇంకా బుద్ధిరాలేదా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే బదులు దేశ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి’’ అంటూ చురకలు అంటించాడు.ఆరు జట్లుఇక అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో కూడిన ఆరుజట్లు ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూసీఎల్ పేరిట టీ20 టోర్నమెంట్ ఆడుతున్నాయి. 2024లో ఈ టోర్నీ మొదలుకాగా.. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్.. ఫైనల్లో పాకిస్తాన్ చాంపియన్స్ను ఓడించి టైటిల్ గెలిచింది. కాగా భారత్, పాక్తో పాటు ఈ ఈవెంట్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ సీజన్లో భారత్- పాక్ మధ్య జరగాల్సిన తొలి సెమీ ఫైనల్ రద్దుకాగా.. రెండో సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా గురువారం (జూలై 31) అమీతుమీ తేల్చుకుంటాయి. చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు -
పాకిస్తాన్తో సెమీస్ మ్యాచ్ రద్దు.. టోర్నీ నుంచి వాకౌట్ చేసిన భారత్..?
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ నుంచి భారత్ వాకౌట్ చేసినట్లు తెలుస్తుంది. టోర్నీలో భాగంగా రేపు (జులై 31) సాయంత్రం 5 గంటలకు భారత్, పాకిస్తాన్ మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లంతా మూకుమ్మడిగా ఈ మ్యాచ్ను బహిష్కరించారని సమాచారం. దీంతో పాకిస్తాన్ ఫైనల్కు క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో లీగ్ దశలోనూ భారత్ ఇదే కారణంగా పాక్తో మ్యాచ్ రద్దు చేసుకుంది. అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.భారత్ సెమీస్కు చేరిందిలా..!పాక్తో లీగ్ దశలో మ్యాచ్ను రద్దు చేసుకున్న భారత్.. ఆతర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ల్లో వరుసగా పరాజయాలు ఎదుర్కొని సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్పై ఘన విజయం సాధించి, ఫైనల్ ఫోర్లో తుది బెర్త్ దక్కించుకుంది.అయితే అప్పటికే పాకిస్తాన్ వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో సెమీస్లోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనివార్యమైంది. ఒకవేళ లీగ్ దశలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసినా ఫైనల్లో అయినా పాక్తో పోరు తప్పేది కాదు.మరోపక్క పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో పాకిస్తాన్ ఫైనల్లో తలపడుతుంది. సెమీస్, ఫైనల్ మ్యాచ్లు బర్మింగ్హమ్లోని ఎడ్జ్బాస్టన్లో జరగాల్సి ఉంది.దేశమే ముఖ్యంపాక్తో సెమీస్ మ్యాచ్ రద్దు చేసుకోవాలని భారత ఆటగాళ్లు నిర్ణయించుకోకముందే టోర్నీ ప్రధాన స్పాన్సర్ 'ఈజ్మైట్రిప్' నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది. భారత్, పాక్ మ్యాచ్కు తాము స్పాన్సర్గా వ్యవహరించలేమంటూ సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించాడు.‘డబ్ల్యూసీఎల్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇక్కడి వరకు చేరుకుంది. దేశాన్ని గర్వించేలా చేసింది. అయితే, పాకిస్తాన్తో జరుగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆటలో భాగం కాదు.. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడలేవు. మేము ఎల్లప్పుడూ జాతికి మద్దతుగా నిలబడతాం.ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి సంబంధాన్ని మేము అంగీకరించము. దేశ ప్రజల మనోభావాలు మేము అర్థం చేసుకుంటాము. అందుకే మేము డబ్ల్యూసీఎల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కు అండగా ఉండలేము.కొన్ని విషయాలు క్రీడల కంటే కూడా ముఖ్యమైనవి. ముందు దేశం.. ఆ తర్వాతే వ్యాపారం. జై హింద్ ’ అంటూ నిశాంత్ పిట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లతో డబ్ల్యూసీఎల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
WCL: సెమీస్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. తప్పుకొన్నారు!
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)- 2025 సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాయింట్ల పట్టికలో టాపర్గా ఉన్న పాకిస్తాన్ చాంపియన్స్తో పాటు సౌతాఫ్రికా చాంపియన్స్, ఆస్ట్రేలియా చాంపియన్స్ ముందుగానే టాప్-4లో అడుగుపెట్టాయి.తాజాగా వెస్టిండీస్ చాంపియన్స్ను ఓడించి.. మెరుగైన నెట్రన్రేటు సాధించిన ఇండియా చాంపియన్స్ (India Champions) కూడా సెమీస్కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో తొలి సెమీ ఫైనల్లో టాపర్ పాకిస్తాన్ను ఇండియా ఢీకొట్టనుండగా.. రెండో సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా తలపడతాయి.బర్మింగ్హామ్ వేదికగా గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఇండియా వర్సెస్ పాక్ (Ind vs Pak), రాత్రి తొమ్మిది గంటలకు సౌతాఫ్రికా- ఆసీస్ (SA vs AUS) మ్యాచ్లకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో గ్రూప్ దశలోనే దాయాది పాక్తో ఆడేందుకు భారత జట్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్ రద్దు కాగా.. ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది.సెమీస్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్అయితే, తాజాగా సెమీస్లోనూ చిరకాల ప్రత్యర్థితో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ పోటీపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్ నుంచి తప్పుకొంటే.. టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇండియా చాంపియన్స్ ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో డబ్ల్యూసీఎల్ టాప్ స్పాన్సర్ ఈజ్మైట్రిప్ మాత్రం భారత్ వర్సెస్ పాకిస్తాన్ సెమీస్ పోరు నుంచి తప్పుకొంది. ఈ మ్యాచ్కు తాము స్పాన్సర్గా వ్యవహరించలేమంటూ సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించాడు.మాకు దేశమే ముఖ్యం‘‘డబ్ల్యూసీఎల్ సెమీ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్. వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇక్కడి వరకు చేరుకుంది. దేశాన్ని గర్వించేలా చేసింది. అయితే, పాకిస్తాన్తో జరుగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆటలో భాగం కాదు.. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడలేవు. మేము ఎల్లప్పుడూ జాతికి మద్దతుగా నిలబడతాం.ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి సంబంధాన్ని మేము అంగీకరించము. దేశ ప్రజల మనోభావాలు మేము అర్థం చేసుకుంటాము. అందుకే మేము డబ్ల్యూసీఎల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కు అండగా ఉండలేము. కొన్ని విషయాలు క్రీడల కంటే కూడా ముఖ్యమైనవి. ముందు దేశం.. ఆ తర్వాతే వ్యాపారం. జై హింద్ ’’ అంటూ నిశాంత్ పిట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూసీఎల్ పేరిట టీ20 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.చదవండి: బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. ఇండియా సెమీస్లో చేరిందిలా! -
బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్లో ఇండియా
ప్రపంచ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో ఇండియా చాంపియన్స్ సెమీస్ చేరింది. లీసెస్టర్ వేదికగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ చాంపియన్స్ను చిత్తు చేసి సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. డబ్ల్యూసీఎల్ తాజా సీజన్ (WCL 2025)లో టీమిండియాకు ఇది తొలి విజయమే అయినా.. ఏకంగా టాప్-4కు అర్హత సాధించడం విశేషం.వరుస ఓటములుఈ టీ20 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగింది ఇండియా. తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడాల్సి ఉండగా.. ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాయాదితో మ్యాచ్ను రద్దు చేసుకుంది. అనంతరం సౌతాఫ్రికా చాంపియన్స్తో తలపడి 88 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.ఆ తర్వాత ఆస్ట్రేలియా చాంపియన్స్తో మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం ఇంగ్లండ్ చాంపియన్స్ చేతిలో 23 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇలా వరుస ఓటములతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న యువరాజ్ సేన.. విండీస్తో తాజా మ్యాచ్లో మాత్రం అదరగొట్టింది.చెలరేగిన భారత బౌలర్లుగ్రేస్ రోడ్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఇండియా.. వెస్టిండీస్ను 144 పరుగులకు కట్టడి చేసింది. ఇండియా బౌలర్ల ధాటికి విండీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ (2), కెప్టెన్ క్రిస్ గేల్ (9)తో పాటు వన్డౌన్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.మిగతా వారిలో డ్వేన్ స్మిత్ (20) కాస్త ఫర్వాలేదనిపించగా.. కీరన్ పొలార్డ్ వింటేజ్ ఆటను గుర్తుచేశాడు. కేవలం 43 బంతుల్లోనే 3 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్నీ రెండేసి వికెట్లు కూల్చారు. పవన్ నేగి ఒక వికెట్ దక్కించుకున్నాడు.14 ఓవర్లలోనే ఛేదించాలిఅయితే, సెమీస్ సమీకరణల దృష్ట్యా ఈ లక్ష్యాన్ని ఇండియా చాంపియన్స్ 14 ఓవర్లలోనే ఛేదించాలి. తద్వారా సెమీ ఫైనల్ రేసులో ఉన్న ఇంగ్లండ్ కంటే మెరుగైన రన్రేటుతో ముందుకు వెళ్లే వీలుంటుంది. ఇలాంటి తరుణంలో ఇండియా చాంపియన్స్ అద్భుతమే చేసింది. కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది.బిన్ని మెరుపు అర్ధ శతకంస్టువర్ట్ బిన్ని మెరుపు అర్ధ శతకంతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 21 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (11 బంతుల్లో 21)తో పాటు యూసఫ్ పఠాన్ (7 బంతుల్లో 21 నాటౌట్) ధనాధన్ దంచికొట్టారు. Mountains are there to be climbed 💪Faced with a stiff target of 145 in 14.1 overs to qualify for the semis, India got there with ease thanks to fireworks from Stuart Binny & Yusuf Pathan 🇮🇳#WCL2025 pic.twitter.com/eGOorYFQbq— FanCode (@FanCode) July 29, 2025మిగతా వారిలో ఓపెనర్ శిఖర్ ధావన్ (18 బంతుల్లో 25) రాణించగా.. రాబిన్ ఊతప్ప (8), గురుకీరత్ సింగ్మాన్ (7), సురేశ్ రైనా (7) విఫలమయ్యారు. ఇక 13.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన ఇండియా చాంపియన్స్ ఇంగ్లండ్ను వెనక్కి నెట్టి సెమీస్లో అడుగుపెట్టింది.పాక్తో సెమీస్... ఇండియా ఆడుతుందా? ఆరుజట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాకిస్తాన్, సౌతాఫ్రికా చాంపియన్స్ ఐదింట చెరో నాలుగు గెలిచి ముందుగానే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఇక ఆస్ట్రేలియా చాంపియన్స్ ఐదింట రెండు, ఇండియా చాంపియన్స్ (రన్రేటు: -0.558) ఒకటి గెలిచి టాప్-4లో నిలిచాయి. ఇంగ్లండ్ ఐదింట ఒకటి (రన్రేటు: -0.809), వెస్టిండీస్ చాంపియన్స్ ఐదింట ఒకటి (రన్రేటు: -2.302) మాత్రమే గెలిచి.. నెట్ రన్రేటు పరంగానూ వెనుకబడి ఎలిమినేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తొలి సెమీ ఫైనల్లో ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్తో తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్లో ఇండియా ఆడుతుందా? లేదంటే టోర్నీ నుంచే తప్పుకొంటుందా? అనేది తేలాల్సి ఉంది. చదవండి: ‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’ -
ఆసీస్ బౌలర్ చెత్త ప్రదర్శన.. ఓవర్లో ఏకంగా 18 బంతులు..!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. పాకిస్తాన్ ఛాంపియన్స్తో ఇవాళ (జులై 29) జరిగిన మ్యాచ్లో ఓ ఓవర్లో ఏకంగా 18 బంతులు వేశాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్ ఓ ఓవర్లో ఇన్ని బంతులు వేయలేదు. గతంలో ఈ రికార్డు విండీస్ లోకల్ ప్లేయర్ రోషన్ ప్రైమస్ పేరిట ఉండేది. ప్రైమస్ కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఓ మ్యాచ్లో ఓవర్లో 13 బంతులు వేశాడు. తాజాగా ప్రైమస్ రికార్డును హేస్టింగ్స్ బద్దలు కొట్టాడు.పాకిస్తాన్తో మ్యాచ్లో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన హేస్టింగ్స్ 12 వైడ్లు, ఓ నో బాల్ వేశాడు. ఈ ఓవర్లో కేవలం ఐదు బంతులు మాత్రమే వేసిన అతను మొత్తంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఆసీస్ 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇది జరిగింది. హేస్టింగ్స్ గల్లీ బౌలర్ల కంటే అధ్వానంగా బౌలింగ్ చేసి అందరికీ విసుగు తెప్పించాడు. 39 ఏళ్ల హేస్టింగ్స్ ఆసీస్ తరఫున ఓ టెస్ట్, 29 వన్డేలు, 9 టీ20లు ఆడి ఉండటం కొసమెరుపు. ఇతగాడు ఐపీఎల్లోనూ 3 మ్యాచ్లు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాడిని నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించింది కాదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ చేసింది. సయీద్ అజ్మల్ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూల్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్ను గెలుపు తీరాలు దాటించారు.కాగా, ఈ టోర్నీలో పాక్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్తో ఆడాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
ఆరేసిన అజ్మల్.. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో పాకిస్తాన్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్లో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆ జట్టు.. ఇవాళ (జులై 29) ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి టేబుల్ టాపర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది.స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 74 పరుగులకే కుప్పకూలింది. అజ్మల్ ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. షాన్ మార్ష్ 7, క్రిస్ లిన్ 6, డి ఆర్చీ షార్ట్ 2, డేనియల్ క్రిస్టియన్ 0, బెన్ కటింగ్ 5, నాథన్ కౌల్టర్ నైల్ 0, పీటర్ సిడిల్ 5, స్టీవ్ ఓకీఫ్ 1, బ్రెట్ లీ 1 (నాటౌట్) పరుగులు చేశారు.పాక్ బౌలర్లలో అజ్మల్తో పాటు ఇమాద్ వసీం (3-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-8-1), సోహైల్ ఖాన్ (2-0-23-1) కూడా వికెట్లు తీశారు.అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్ను గెలుపు తీరాలు దాటించారు. ఆసీస్ కెప్టెన్ ఐదుగురు బౌలర్లను ప్రయోగించినా ఒక్క పాక్ వికెట్ను కూడా తీయలేకపోయారు.కాగా, ఈ టోర్నీలో పాక్తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా కూడా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్తో ఆడాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
విజృంభించిన పాక్ బౌలర్.. 74 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో పాకిస్తాన్ లెజెండ్స్ టీమ్ అదిరిపోయే ప్రదర్శనలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్లో 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించి, ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న పాక్.. ఇవాళ (జులై 29) ఆస్ట్రేలియా లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో మరోసారి సత్తా చాటింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది.ఆ జట్టు స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 74 పరుగులకే కుప్పకూలింది. అజ్మల్ ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. షాన్ మార్ష్ 7, క్రిస్ లిన్ 6, డి ఆర్చీ షార్ట్ 2, డేనియల్ క్రిస్టియన్ 0, బెన్ కటింగ్ 5, నాథన్ కౌల్టర్ నైల్ 0, పీటర్ సిడిల్ 5, స్టీవ్ ఓకీఫ్ 1, బ్రెట్ లీ 1 (నాటౌట్) పరుగులు చేశారు.పాక్ బౌలర్లలో అజ్మల్తో (3.5-0-16-6) పాటు ఇమాద్ వసీం (3-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-8-1), సోహైల్ ఖాన్ (2-0-23-1) కూడా వికెట్లు తీశారు.కాగా, ఈ టోర్నీలో పాక్తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్తో ఆడాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్తో మ్యాచ్.. పోరాడి ఓడిన టీమిండియా
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ కథ దాదాపు ముగిసినట్లే. ఆదివారం లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 23 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 224 పరుగుల లక్ష్య చేధనలో ఆఖరి వరకు టీమిండియా పోరాడింది.లక్ష్య చేధనలో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఇండియా బ్యాటర్లలో యుసఫ్ పఠాన్ మరోసారి తన బ్యాట్ ఝూళిపించాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52 పరుగులు చేశాడు.అతడితో పాటు యువరాజ్ సింగ్(38), బిన్నీ(35) పర్వాలేదన్పించారు. కానీ టాపర్డర్ విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో అజ్మల్ షాజాద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మీకర్ రెండు వికెట్లు సాధించాడు.బొపారా సూపర్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ రవి బొపారా విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 110 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో ఇయాన్ బెల్(54), మోయిన్ అలీ(33) రాణించారు. భారత బౌలర్లలో హార్భజన్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆరోన్ ఓ వికెట్ సాధించాడు.సెమీస్కు చేరాలంటే..కాగా ఈ ఓటమితో భారత్ సెమీస్ చేరే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇండియా ఛాంపియన్స్ సెమీస్ చేరాలంటే ఏదైనా అద్బుతం జరగాలి. భారత్కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ టోర్నీలో ఇప్పటికే సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా తమ సెమీస్ బెర్త్లను ఖారారు చేసుకున్నాయి.మరో బెర్త్ కోసం విండీస్, భారత్, ఇంగ్లండ్ పోటీపడతున్నాయి. విండీస్, భారత్ కంటే ఇంగ్లండ్కే సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్(3 పాయింట్లు) నాలుగో స్ధానంలో ఉంది. భారత్(-1.852), విండీస్(-1.974)తో పోలిస్తే రన్రేట్ పరంగా కూడా ఇంగ్లండ్(0.809) ముందంజలో ఉంది. భారత్ తమ ఆఖరి మ్యాచ్లో వెస్టిండీస్పై భారీ విజయం సాధిస్తే ఇంగ్లండ్ను వెనక్కి నెట్టి సెమీస్కు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. -
39 బంతుల్లో శతక్కొట్టిన ఏబీడి.. ఆసీస్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో (WCL) సౌతాఫ్రికా లెజెండ్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇవాళ (జులై 27) ఆస్ట్రేలియా లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సౌతాఫ్రికాతో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా కూడా సెమీస్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం వెస్టిండీస్, ఇంగ్లండ్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడిన 3 మ్యాచ్ల్లో రెండు ఓడి ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. పాకిస్తాన్తో జరగాల్సిన మ్యాచ్ను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ రాత్రి భారత్ ఇంగ్లండ్తో తలపడుతుంది.డివిలియర్స్ మహొగ్రరూపంఆసీస్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అతి భారీ స్కోర్ చేసింది. ఏబీడి కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేశాడు.ఏబీడీతో పాటు మరో ఓపెనర్ జేజే స్మట్స్ కూడా సునామీ ఇన్నింగ్స్తో (53 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. ఆరోన్ ఫాంగిసో (3.4-0-13-4), ఇమ్రాన్ తాహిర్ (4-0-27-3) చెలరేగడంతో 16.4 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో బెన్ కటింగ్ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కటింగ్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.అంతకుముందు 41 బంతుల్లో..!WCL 2025లో ఏబీడీ తొలి మ్యాచ్ నుంచే అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. భారత్తో జరిగిన తొలి మ్యాచ్లో 30 బంతుల్లో అజేయమైన 63 పరుగులు చేసిన అతను.. మూడు రోజుల కిందట ఇంగ్లండ్పై 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆ మ్యాచ్లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ అజేయమైన 116 పరుగులు చేశాడు. -
డివిలియర్స్ మహోగ్రరూపం.. మరో విధ్వంకసర శతకం.. ఈసారి 39 బంతుల్లోనే..!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో (WCL) సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే భీకర ఫామ్లో ఉన్న ఏబీడీ.. ఇవాళ (జులై 27) ఆస్ట్రేలియా లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ 15 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు.AB DE VILLIERS MADNESS IN WCL - HUNDRED vs AUS & ENG..!!!- The GOAT 🐐 pic.twitter.com/qHDkZbUKod— Johns. (@CricCrazyJohns) July 27, 2025ఏబీడీతో పాటు మరో ఓపెనర్ జేజే స్మట్స్ కూడా సునామీ ఇన్నింగ్స్తో (53 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ చేసిన సౌతాఫ్రికా అతి భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.ఏబీడీ-స్మట్స్ తొలి వికెట్కు 187 పరుగులు జోడించాక, సౌతాఫ్రికా స్వల్ప వ్యవధుల్లో వికెట్లు కోల్పోయింది. వీరి తర్వాత వచ్చిన బ్యాటర్లు జేపీ డుమిని (16), మోర్నీ వాన్ విక్ (3), హెన్రీ డేవిడ్స (1), వేన్ పార్నెల్ (1) పెవిలియన్కు క్యూ కట్టారు. ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడిల్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రెట్ లీ, స్టీవ్ ఓకీఫ్, డేనియల్ క్రిస్టియన్ తలో వికెట్ దక్కించుకున్నారు.మూడు రోజుల వ్యవధిలో రెండో శతకంWCL 2025లో ఏబీడీ తొలి మ్యాచ్ నుంచే అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. భారత్తో జరిగిన మ్యాచ్లో 30 బంతుల్లో అజేయమైన 63 పరుగులు చేసిన అతను.. మూడు రోజుల కిందట ఇంగ్లండ్పై 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆ మ్యాచ్లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ అజేయమైన 116 పరుగులు చేశాడు.ఈ టోర్నీలో ఏబీడీ సూపర్ ఫామ్లో ఉండటంతో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో భారత్ ఆడిన 3 మ్యాచ్ల్లో రెండు ఓడి చివరి స్థానంలో ఉంది. ఈ టోర్నీలో పాకిస్తాన్తో జరగాల్సిన మ్యాచ్ను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
కమ్రాన్ ఆక్మల్ సూపర్ సెంచరీ.. పాక్ వరుసగా మూడో విజయం
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం లీడ్స్ వేదికగా వెస్టిండీస్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో 49 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ కమ్రాన్ ఆక్మల్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 43 ఏళ్ల ఆక్మల్ విండీస్ బౌలర్లను ఊతికారేశాడు.లీడ్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. 62 బంతులు ఎదుర్కొన్న ఆక్మల్.. 13 ఫోర్లు, 5 సిక్స్లతో 113 పరుగులు చేశాడు. అతడితోపాటు హాఫీజ్(23) రాణించాడు. విండీస్ బౌలర్లలో మహ్మద్, పొలార్డ్, బ్రావో, నర్స్ తలా వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. విండీస్ టాపర్డర్ మొత్తం విఫలమైంది. క్రిస్ గేల్(5),స్మిత్(3), సిమ్మన్స్(0) తీవ్ర నిరాశపరిచారు. అయితే మిడిలార్డర్లో వాల్టన్(42), పెర్కిన్స్(30) పోరాడనప్పటికి విండీస్కు ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో రీస్ మూడు వికెట్లు పడగొట్టగా.. తన్వీర్, యమీన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ విజయం సాధించిన పాక్.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. -
WCL 2025: ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లీడ్స్ వేదికగా శనివారం ఆస్ట్రేలియా ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ విధ్వంసం సృష్టించాడు. ధావన్ 60 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 91 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు యూసఫ్ పఠాన్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరవగా.. రాబిన్ ఊతప్ప(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్(3), అంబటి రాయుడు(0) తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో డాన్ క్రిస్టియన్ ) రెండు వికెట్లు సాధించగా.. బ్రెట్ లీ, డీ ఆర్సీ షాట్ చెరో వికెట్ పడగొట్టారు.ఫెర్గూసన్ మెరుపులు.. అనంతరం 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆరంభంలో కంగారులు తడబడినప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో లక్ష్యాన్ని చేరుకున్నారు. కాలమ్ ఫెర్గూసన్ (38 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 70) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు.అతడితో పాటు డాన్ క్రిస్టియన్(39) రాణించాడు. భారత బౌలర్లలో పియూష్ చావ్లా(3/36) మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా పాయింట్ల పట్టికలో ఇండియా ఛాంపియన్స్ ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ తొలి మ్యాచ్ను రద్దు చేసుకున్న భారత్.. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ చేతిలో ఓటమి చవిచూసింది.చదవండి: IND vs ENG: షాకింగ్.. 'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే రిటైర్మెంట్' -
చాడ్విక్, పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్.. ఇంగ్లండ్కు తప్పని ఓటమి
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)లో ఇంగ్లండ్ చాంపియన్స్కు మరో చేదు అనుభవం ఎదురైంది. వెస్టిండీస్ చాంపియన్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో ఇంగ్లిష్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పది పరుగుల తేడాతో విండీస్ చేతిలో పరాజయం పాలై.. రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూసీఎల్ టీ20 టోర్నమెంట్లో ఆతిథ్య జట్టు తొలుత పాకిస్తాన్ చాంపియన్స్తో తలపడి ఓడిపోయింది. అనంతరం ఆస్ట్రేలియా చాంపియన్స్తో పోటీపడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైపోయింది. తాజాగా తమ మూడో టీ20లో ఇంగ్లండ్ వెస్టిండీస్ను ఢీకొట్టింది.నార్తాంప్టన్ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ మెరుపు అర్ధ శతకం సాధించాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు.చాడ్విక్కు తోడుగా కీరన్ పొలార్డ్ (16 బంతుల్లో 30) కూడా దంచికొట్టాడు. ఇక కెప్టెన్ క్రిస్ గేల్ (19 బంతుల్లో 21) మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ మేకర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అజ్మల్ షెహజాద్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో సమిత్ పటేల్, ఆర్జే సైడ్బాటమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ చాంపియన్స్ ఆది నుంచే తడ‘బ్యా’టుకు గురైంది. ఓపెనర్లలో సర్ అలిస్టర్ కుక్ డకౌట్ కాగా.. ఇయాన్ బెల్ (5) కూడా నిరాశపరిచాడు. వన్డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ (0) కూడా చేతులెత్తేయగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (9) కూడా విఫలమయ్యాడు.ఇలా టాపార్డర్ కుదేలైన వేళ రవి బొపారా (24), సమిత్ పటేల్ (36 బంతుల్లో 52) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ వీరికి మిగతా వారి నుంచి సహకారం లేకపోవడంతో విండీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చాంపియన్స్ తలవంచాల్సి వచ్చింది. ఫిడెల్ ఎడ్వర్డ్స్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ జట్టు పతనాన్ని శాసించగా.. షనన్ గాబ్రియెల్, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్లు పడగొట్టారు. సులేమాన్ బెన్ కూడా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 154 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా వెస్టిండీస్ చాంపియన్స్ పది పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా తమ తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా చాంపియన్స్ను ఎదుర్కొన్న విండీస్ బాలౌట్లో ఓటమిపాలైంది.Classic Caribbean flair on display 🔥🌴Chadwick Walton's dazzling 83 off 50 - just the kind of 𝕎𝕚𝕟𝕕𝕚𝕖𝕤 𝕗𝕚𝕣𝕖𝕨𝕠𝕣𝕜𝕤 we love 😍#WCL2025 pic.twitter.com/4OIQC3OIKM— FanCode (@FanCode) July 22, 2025 -
2007 వరల్డ్ కప్ సీన్ రిపీట్.. బౌల్ అవుట్లో గెలిచిన సౌతాఫ్రికా
2007 టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన బౌల్-అవుట్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోలేడు. టై అయిన మ్యాచ్లో బౌల్-అవుట్ నియమం ద్వారా భారత్ విజయం సాధించింది. ఇప్పడు అచ్చెం అటువంటి సీన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో రిపీటైంది.ఈ టోర్నీలో భాగంగా శనివారం వెస్టిండీస్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో బౌల్ అవుట్ ద్వారా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ క్రిస్ గేల్(2), పొలార్డ్(0) వంటి స్టార్ ప్లేయర్లు నిరాశపరచగా.. లెండల్ సిమ్మన్స్(28) టాప్ స్కోరర్గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో ఫంగిసో రెండు, విల్జోయెన్, స్మట్స్, ఓలీవర్ తలా వికెట్ సాధించారు. అనంతరం సౌతాఫ్రికా లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 81 పరుగులగా నిర్ణయించారు.లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత ఓవర్లలో 80 పరుగులే చేయగల్గింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్లు బౌల్ అవుట్ విధానాన్ని ఎంచుకున్నారు. సౌతాఫ్రికా ఆరు బంతుల్లో రెండు బౌల్డ్లు చేయగా.. విండీస్ ఒక్క బౌల్డ్ కూడా చేయలేకపోయింది.దీంతో సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. కాగా ఛాన్నాళ్ల తర్వాత ప్రొపిషనల్ క్రికెట్ ఆడిన సఫారీ దిగ్గజం ఎబీ డివిలియర్స్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.Bowl-Out Decides SA vs WI Thriller 🍿You can't write this drama! After the match ended in a tie, South Africa Champions edge out the Windies Champions 2-0 in a tense bowl-out 🎯#WCL2025 pic.twitter.com/lemLX9R0Ac— FanCode (@FanCode) July 19, 2025 -
అన్నా.. నీవు ఇప్పటికి మారలేదా? పాక్ ఆటగాడిపై సెటైర్లు
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) టోర్నమెంట్ను పాకిస్తాన్ ఛాంపియన్స్ విజయంతో ఆరంభించింది. శుక్రవారం ఇంగ్లండ్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించినప్పటికి.. ఆ జట్టు వికెట్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు.తొలుత బ్యాటింగ్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన ఆక్మల్.. అనంతరం ఫీల్డింగ్లో గల్లీ స్ధాయి వికెట్ కీపర్ను తలపించాడు. షోయబ్ మాలిక్ బౌలింగ్లో ఆక్మల్ ఈజీ స్టంపింగ్ను మిస్ చేసి నవ్వులు పాలయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షోయబ్ మాలిక్.. ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ మస్టర్డ్కు ఫుల్ ఔట్సైడ్ ఆఫ్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని మస్టర్డ్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి పిచ్ అయిన వెంటనే షర్ఫ్గా టర్న్ అవుతూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. నేరుగా చేతి లోకి వెళ్లిన బంతిని అందుకోలేక స్టంప్ ఔట్ చేసే అవకాశాన్ని కమ్రాన్ కోల్పోయాడు.దీంతో 23 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మస్టర్డ్ ఏకంగా హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్లు నీవు అన్నా.. నీవు ఇప్పటికి ఇంకా మారలేదా? అంటూ ట్రోలు చేస్తున్నారు. కాగా ఆక్మల్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే సమయంలో కూడా ఇటువంటి వికెట్ కీపింగ్తో చాలా మ్యాచ్ల్లో పాక్ కొంపముంచాడు. 2011 వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ ఇచ్చిన ఈజీక్యాచ్ను జారవిడిచిన ఆక్మల్.. పాక్ ఓటమికి కారణమయ్యాడు. ఆ మ్యాచ్లో ఆరంభంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న టేలర్.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుత మ్యాచ్లో పాక్ గెలవకపోయింటే అందుకు ఆక్మల్ కారణమయ్యేవాడు.చదవండి: ODI WC 2011: యువీని సెలక్ట్ చేద్దామా?.. ధోని నిర్ణయం మాత్రం అదే!Kamran Akmal Wicket keeping -Then, Now & Forever.....His wicket keeping costs Shoaib Akhter career - Ross Taylor assault in 2011 WC.#WCL2025 pic.twitter.com/HNcMCLRXUE— alekhaNikun (@nikun28) July 19, 2025 -
WCL 2025: హఫీజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన పాకిస్తాన్
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) టోర్నమెంట్కు శుక్రవారం తెర లేచింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టీ20 టోర్నీ తాజా సీజన్ తొలి మ్యాచ్లో.. ఇంగ్లండ్ చాంపియన్స్- పాకిస్తాన్ చాంపియన్స్ (ENG vs PAK)తో తలపడింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ చాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు కమ్రాన్ అక్మల్ (8), షార్జీల్ ఖాన్ (12) పూర్తిగా విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ ఉమర్ అమీన్ (6) కూడా నిరాశపరిచాడు.హఫీజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ఇలా టాపార్డర్ కుదేలైన వేళ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez) కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 34 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. మిగతా వారిలో ఆమీర్ యామిన్ (13 బంతుల్లో 27 నాటౌట్) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.ఇక ఇంగ్లండ్ చాంపియన్స్ బౌలర్లలో లియామ్ ప్లంకెట్, క్రిస్ ట్రెమ్లెట్ రెండేసి వికెట్లు కూల్చగా.. విన్స్, మాస్కరన్హస్, ఆర్జే సైడ్బాటమ్, స్టువర్ట్ మీకర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు.ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠఓపెనర్ ఫిల్ మస్టర్డ్ (58) అర్ధ శతకంతో రాణించగా.. మరో ఓపెనర్ సర్ అలిస్టర్ కుక్ (7)తో పాటు వన్డౌన్లో వచ్చిన జేమ్స్ విన్స్ (7) విఫలమయ్యారు. ఆఖర్లో ఇయాన్ బెల్ (35 బంతుల్లో 51).. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (16)తో కలిసి జట్టును గెలుపుతీరాలకు చేర్చే దిశగా పయనించాడు. అయితే, ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో పాకిస్తాన్ బౌలర్ సొహైల్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేసి.. బెల్పై పైచేయి సాధించాడు.ఇయాన్ బెల్ పోరాటం వృథాఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగుల వద్ద నిలిచిన ఇంగ్లండ్ చాంపియన్స్.. ఐదు పరుగుల స్వల్ప తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. పాక్ బౌలర్లలో ఆమిర్ యమిన్, రాయిస్, సొహైల్ తన్వీర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్కు స్వస్తి పలికిన మాజీ క్రికెటర్లతో కూడిన ఆరుజట్లు వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో తలపడుతున్నాయి. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ డిఫెండింగ్ చాంపియన్గా ఈసారి బరిలోకి దిగింది.చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
దిగ్గజ క్రికెటర్లు మరోసారి మైదానంలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వింటేజ్ ఇన్నింగ్స్ను గుర్తుచేసేలా మరోసారి బ్యాట్ ఝులిపించేందుకు యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్.. వికెట్ల వేట కొనసాగించేందుకు బ్రెట్ లీ, ఇమ్రాన్ తాహిర్ వంటి మాజీలు సన్నద్ధమయ్యారు. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)తో వినోదం పంచేందుకు సై అంటున్నారు. మరి టీ20 టోర్నమెంట్ షెడ్యూల్, జట్లు, ప్రత్యక్ష ప్రసారం తదితర అంశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆరు జట్లు ఈ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో భాగమయ్యాయి.బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇండియా చాంపియన్స్ జట్టుకు సహ యజమానిగా ఉన్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. నాకౌట్స్ ద్వారా విజేత ఎవరో తేలుతుంది. ఇండియా చాంపియన్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది.జట్లుఇండియా చాంపియన్స్యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్.ఆస్ట్రేలియా చాంపియన్స్షాన్ మార్ష్, ఆరోన్ ఫించ్, కల్లమ్ ఫెర్గూసన్, టిమ్ పైన్ (వికెట్ కీపర్), బెన్ డంక్, డేనియల్ క్రిస్టియన్, బ్రెట్ లీ (కెప్టెన్), బ్రాడ్ హాడిన్, క్రిస్ లిన్, రాబ్ క్వినీ, జాన్ హేస్టింగ్స్, జేవియర్ దొహర్టి, మోజెస్ హెండ్రిక్స్, పీటర్ సిడిల్, నాథన్-కౌల్టర్ నీల్, డిర్క్ నాన్స్.సౌతాఫ్రికా చాంపియన్స్హర్షల్ గిబ్స్, హషీం ఆమ్లా, ఏబీ డివిలియర్స్, జేపీ డుమిని, జేజే స్మట్స్, డేన్ విల్లాస్, రిచర్డ్ లెవీ, నీల్ మెకంజీ, ఎస్జే ఎర్వీ, మోర్నీ మ్యాన్ విక్, జాక్వెస్ కలిస్, క్రిస్ మోరిస్, రియాన్ మెక్లారెన్, అల్బీ మోర్కెల్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, వైన్ పార్నెల్, రోరీ క్లెన్వెల్ట్, హార్డస్ విల్జోన్, ఆరోన్ ఫంగిసో, డువాన్ ఓలీవర్.పాకిస్తాన్ చాంపియన్స్సర్ఫరాజ్ అహ్మద్, యూనిస్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్, షోయబ్ మసూద్, మిస్బా ఉల్ హక్, షార్జిల్ ఖాన్, ఆసిఫ్ అలీ, షాహిద్ ఆఫ్రిది, ఇమాద్ వాసిం, షోయబ్ మాలిక్, ఆమేర్ యామిన్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సొహైల్ తన్వీర్, రమన్ రాయీస్.ఇంగ్లండ్ చాంపియన్స్కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, అలిస్టర్ కుక్, ఫిలిప్ మస్టార్డ్, ఇయాన్ బెల్, క్రిస్ షోఫీల్డ్, టిమ్ ఆంబ్రోస్, రవి బొపారా, సమిత్ పటేల్, మొయిన్ అలీ, దిమిత్రి మస్కార్హ్నస్, స్టువర్ట్ మేకర్, రియాన్ సైడ్బాటమ్, లియామ్ ప్లంకెట్, టిమ్ బ్రెస్నాన్, సాజిద్ మహమూద్, అజ్మల్ షెహజాద్.వెస్టిండీస్ చాంపియన్స్క్రిస్ గేల్, శివ్నరైన్ చందర్పాల్, జొనాథన్ కార్టర్, చాడ్విక్ వాల్టన్, విలియమ్ పెర్కిన్స్, డేవ్ మహ్మద్, క్రిస్ గేల్, డారెన్ సామీ, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, డ్వేన్ స్మిత్, షెల్డన్ కార్టెల్, సామ్యూల్ బద్రీ, షనన్ గాబ్రియెల్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రవి రాంపాల్, ఆష్లే నర్స్, నికిత మిల్లర్, సులేమాన్ బెన్.షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం👉జూలై 18 (శుక్రవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 19 (శనివారం): వెస్టిండీస్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 19 (శనివారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 20 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 23 (బుధవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 24 (గురువారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శుక్రవారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శనివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 26 (శనివారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 27 (ఆదివారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 27 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 31 (గురువారం): తొలి సెమీ ఫైనల్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 31 (గురువారం): రెండో సెమీ ఫైనల్- రాత్రి 9 గంటలకు👉ఆగష్టు 2 (శనివారం): ఫైనల్- రాత్రి 9 గంటలకు.వేదికలు: ది ఓవల్, ఎడ్జ్బాస్టన్, హెడింగ్లీ, గ్రేస్ రోడ్, నార్తాంప్టన్ మైదానాలు.ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ?👉ఇండియాలో..టీవీ: స్టార్ స్పోర్ట్స్ 1డిజిటల్/ఓటీటీ: ఫ్యాన్కోడ్👉అమెరికా, కెనడాలో: విల్లో టీవీ👉యునైటెడ్ కింగ్డమ్: టీఎన్టీ స్పోర్ట్స్👉ఆస్ట్రేలియా: ఫాక్స్ స్పోర్ట్స్ స్ట్రీమ్, కయో స్పోర్ట్స్.👉సౌతాఫ్రికా: సూపర్స్పోర్ట్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? -
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా యువరాజ్ సింగ్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) సీజన్ 2 కోసం ఇండియా ఛాంపియన్స్ మెనెజ్మెంట్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఎంపికయ్యాడు. 2024లో అరంగేట్ర ఎడిషన్లో యువీ సారథ్యంలోనే భారత జట్టు విజేతగా నిలిచింది.ఇక ఈ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఇండియా జట్టు సమతుల్యంగా కన్పిస్తోంది.పేస్ బౌలింగ్ విభాగంలో వరుణ్ ఆరోన్, సిద్ధార్థ్ కౌల్, వినయ్ కుమార్ చోటు దక్కించుకోగా.. స్పిన్ బాధ్యతలు హర్భజన్, పియూష్ చావ్లా, పవన్ నేగి నిర్వహించనున్నారు. ఇక బ్యాటింగ్ లైనప్లో యువీ, ధావన్, సురేష్ రైనా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.తొలి పోరు పాక్తోనే..ఇక డబ్ల్యూసీఎల్ సెకెండ్ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లండ్లోని నాలుగు వేదికలలో జరగనుంది. ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ టోర్నీలో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ మెగా ఈవెంట్ రౌండ్-రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్దానాల్లో నిలిచే జట్లు సెమీ-ఫైనల్స్కు చేరుకుంటాయి. ఇక ఇండియా ఛాంపియన్స్ తమ తొలి మ్యాచ్లో జూలై 20న పాకిస్తాన్తో తలపడనుంది.ఇండియా ఛాంపియన్స్ జట్టుయువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్ -
28 బంతుల్లో సెంచరీ.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB DE Villiers) మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 (World Championship Of Legends) లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ (South Africa Champions) జట్టులో జాయిన్ కానున్నాడు. ఈ లీగ్లో ఏబీడీ సౌతాఫ్రికా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా జట్టులో ఏబీడీతో పాటు హషీమ్ ఆమ్లా, క్రిస్ మోరిస్, అల్బీ మోర్కెల్, వేన్ పార్నెల్, హార్డస్ విల్యోన్, ఆరోన్ ఫాంగిసో తదితర దిగ్గజాలు ఉన్నారు.2021 నవంబర్లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడీ.. ఇటీవలే ఓ సారి బ్యాట్ పట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడి తన సహజ శైలిలో రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్లో టైటాన్స్ లెజెండ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. బుల్స్ లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో 15 సిక్సర్లు ఉన్నాయి.ఆ మ్యాచ్ తర్వాత ఏబీడీ తిరిగి జులైలో బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టు ఏబీడీని సంప్రదించగా.. అతను ఒప్పుకున్నాడు. 41 ఏళ్ల ఏబీడీ తన అభిమానుల కోసమే ఈ లీగ్లో ఆడటానికి ఒప్పుకున్నానని చెప్పాడు.కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2025 ఇంగ్లండ్ వేదికగా జులైలో జరుగనుంది. ఇంగ్లండ్లోని బర్మింగ్హమ్, నార్తంప్టన్, లీడ్స్, లీసెస్టర్ నగరాల్లో మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ లీగ్లో మొత్తం 6 జట్లు (ఇండియా ఛాంపియన్స్, దక్షిణాఫ్రికా ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ మరియు పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటాయి. ఈ లీగ్లో ఇది రెండో ఎడిషన్. గతేడాది ఈ లీగ్ పురుడు పోసుకుంది. గతేడాది కూడా జులైలో జరిగిన ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా పాకిస్తాన్పై విజయం సాధించింది. ఆ మ్యాచ్లో భారత్ పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అంబటి రాయుడు 50, యూసఫ్ పఠాన్ 30 పరుగులు చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్రలు పోషించారు.ఏబీడీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ప్రొటీస్ విధ్వంసకర బ్యాటర్ దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడి 20,014 పరుగులు చేశాడు. ఏబీడీ తన అంతర్జాతీయ కెరీర్లో 47 సెంచరీలు, 99 అర్ద సెంచరీలు సాధించాడు. ఏబీడీ 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా వన్డేల్లో ఇప్పటికి అతని పేరిటే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉంది. 2015లో జోహనెస్బర్గ్లో అతను వెస్టిండీస్పై 31 బంతుల్లో సెంచరీ చేశాడు. ఏబీడీకి ఐపీఎల్లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. లీగ్ ప్రారంభం నుంచి క్యాష్ రిచ్ లీగ్ ఆడిన ఏబీడీ 2021లో రిటైరయ్యాడు. ఈ లీగ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడిన ఇతను.. 184 మ్యాచ్ల్లో 151.68 స్ట్రైక్-రేట్తో 5162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
సౌతాఫ్రికా కెప్టెన్గా డివిలియర్స్.. టీ20 టోర్నీతో రీఎంట్రీ
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(AB De Villiers) పునరాగమనానికి రంగం సిద్ధమైంది. మరోసారి అతడు ప్రొటిస్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని డివిలియర్స్ మంగళవారం స్వయంగా ప్రకటించాడు. తాను రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.కాగా సౌతాఫ్రికా(South Africa) తరఫున 2004లో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తనదైన బ్యాటింగ్ శైలితో లెజెండ్గా ఎదిగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు సౌతాఫ్రికా జట్టు కెప్టెన్గానూ పనిచేసిన అనుభం ఉంది. ఇక ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. తన ఇంటర్నేషనల్ కెరీర్లో 114 టెస్టు మ్యాచ్లు ఆడి 8765 పరుగులు చేశాడు.అదే విధంగా 228 వన్డేల్లో కలిపి 9577 రన్స్ సాధించాడు. ఇక ప్రొటిస్ జట్టు తరఫున 78 టీ20 మ్యాచ్లు ఆడిన డివిలియర్స్ 1672 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో డివిలియర్స్ 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే శతకాలు నమోదు చేశాడు.ఐపీఎల్లోనూ హవాఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చాలా ఏళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు ఆడాడు ఏబీ డివిలియర్స్. ఈ క్యాష్రిచ్ లీగ్లో మొత్తంగా 184 మ్యాచ్లు ఆడి.. మూడు శతకాల సాయంతో 5162 పరుగులు చేశాడు.ఈ క్రమంలో నలభై ఏళ్ల ఏబీ డివిలియర్స్ 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కుటుంబంతో కలిసి సమయం గడపడంతో పాటు.. సేవా కార్యక్రమాలు, బ్రాడ్కాస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. యూట్యూబర్గానూ అభిమానులకు ఎల్లప్పుడూ చేరువగా ఉంటున్న మిస్టర్ ‘360’.. కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని ఉందంటూ ఇటీవలే రీఎంట్రీ గురించి సంకేతాలు ఇచ్చాడు.తాజాగా తన పునరాగమనాన్ని ఖరారు చేస్తూ వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship of Legends- WCL) బరిలో దిగనున్నట్లు ఏబీడీ ప్రకటించాడు. ‘‘నాలుగేళ్ల క్రితం నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాను.ఇక నాలో క్రికెట్ ఆడే కోరిక మిగిలి లేదని భావించి నా నిర్ణయాన్ని వెల్లడించాను. కాలం గడిచింది. ఇప్పుడు నా కుమారులు నాలో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. మళ్లీ క్రికెట్ ఆడేలా ప్రేరేపించారు. నా పిల్లలతో కలిసి ఆడిన ప్రతిసారి.. తిరిగి మైదానంలో దిగాలనే కోరిక బలపడింది. అందుకే జిమ్కు తరచుగా వెళ్లి వ్యాయామం చేయడంతో పాటు.. నెట్స్లోనూ ప్రాక్టీస్ చేస్తున్నా. జూలైలో జరిగే డబ్ల్యూసీఎల్ టోర్నీకి నేను సంసిద్ధంగా ఉన్నాను’’ అని డివిలియర్స్ తెలిపాడు.ఆరు జట్లుకాగా డబ్ల్యూసీఎల్ ఒక ప్రీమియర్ టీ20 టోర్నమెంట్. ఇందులో రిటైర్ అయిన, నాన్- కాంట్రాక్ట్ క్రికెట్ దిగ్గజాలు ఆడతారు. గతేడాది డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్ జరిగింది. భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో పాల్గొనగా.. భారత్ మొట్టమొదటి చాంపియన్గా అవతరించింది. ‘సిక్సర్ల కింగ్’ యువరాజ్ సింగ్ సారథ్యంలో ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక ఈసారి ఈ లీగ్లో సౌతాఫ్రికా కెప్టెన్గా ఏబీ డివిలియర్స్ బరిలోకి దిగనుండటం అదనపు ఆకర్షణ కానుంది. కాగా ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగష్టు 2 వరకు ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 టోర్నీ జరుగనుంది. సౌతాఫ్రికా తరఫున గత సీజన్లో జాక్వెస్ కలిస్, హర్షల్ గిబ్స్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్ తదితరులు బరిలోకి దిగారు.చదవండి: Ind vs Pak: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. డబ్ల్యూసీఎల్ షెడ్యూల్ విడుదల -
Ind vs Pak: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త!.. వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship Of Legends T20 League) రెండో సీజన్కు ముహూర్తం ఖరారైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ షెడ్యూల్ను నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. కాగా భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ తదితర ఆరు జట్లు వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL)లో భాగమవుతున్న విషయం తెలిసిందే.యువీ కె ప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో ఆయా దేశాలకు ప్రాతినిథ్యం వహించిన టాప్ క్రికెటర్లు ఈ టీ20 లీగ్తో మరోసారి వినోదాన్ని పంచుతున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టిన WCLలో ఇండియా చాంపియన్స్ జట్టు ఫైనల్లో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చాంపియన్స్ టీమ్పై గెలుపొందింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో.. దాయాదిని ఐదు వికెట్ల తేడాతో ఓడించి WCLలో మొట్టమొదటి చాంపియన్గా నిలిచింది.పాక్ను ఓడించి టైటిల్ కైవసంపాక్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక వచ్చే ఏడాది లీగ్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మధ్య జూలై 20న తొలి మ్యాచ్ జరుగనుంది. కాగా ఇంగ్లండ్ వేదికగా WCL టోర్నీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 షెడ్యూల్👉జూలై 18- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 19- వెస్టిండీస్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 19- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 20- ఇండియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 22- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 22- ఇండియా చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 23- ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 24- సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్👉జూలై 25- పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 26- ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 27- సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 27- ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్👉జూలై 29- ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 29- ఇండియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 31- సెమీ ఫైనల్ 1(ఎడ్జ్బాస్టన్ స్టేడియం, బర్మింగ్హాం)👉జూలై 31- సెమీ ఫైనల్ 2(ఎడ్జ్బాస్టన్ స్టేడియం, బర్మింగ్హాం)👉ఆగష్టు 2- ఫైనల్(ఎడ్జ్బాస్టన్ స్టేడియం, బర్మింగ్హాం).చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!?