soldiers
-
ఉక్రెయిన్ సైనికులను దయతలచి వదిలేయండి
వాషింగ్టన్/మాస్కో: ‘‘పాపం ఉక్రెయిన్ సైనికులు! అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్లను రష్యా సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. వారినింకా వేటాడితే సామూహిక హననానికి, రెండో ప్రపంచయుద్ధం తర్వాత అతి దారుణమైన రక్తపాతానికి దారితీస్తుంది. కనుక వాళ్లను చంపకండి. దయచేసి వదిలేయండి’’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా విజ్ఞప్తులివి! ఈ విషయమై పుతిన్తో ఫోన్ చర్చలు జరిపినట్టు శుక్రవారం ఆయన ప్రకటించారు. ‘‘చర్చలు ఫలప్రదంగా సాగాయి. ఉక్రెయిన్ యుద్ధానికి, భయానక రక్తపాతానికి అతి త్వరలో తెర పడుతుందని ఆశిస్తున్నా’’ అని తన సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్లో చెప్పుకొచ్చారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఇప్పటికే అంగీకరించడం, పుతిన్ కూడా సూత్రప్రాయంగా సరేననడం తెలిసిందే. అయితే తాజాగా ఆయన స్వరం మార్చారు. కాల్పుల విరమణకు ముందు చర్చించుకుని తేల్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘‘వాటిపై బహుశా అమెరికా, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తాం. ట్రంప్కు కూడా కాల్చేసి మాట్లాడతా’’ అని ప్రకటించారు. దీనిపై ఉక్రెయిన్ మండిపడింది. కావాలనే శాంతిప్రక్రియకు మోకాలడ్డుతున్నారని ఆక్షేపించింది. -
Russia-Ukraine war: మూడేళ్లలో 1,65,000 మంది రష్యా సైనికులు మృతి
మాస్కో: ఉక్రెయిన్తో పోరాడుతూ 165,000 సైనికులు మరణించారని రష్యన్ స్వతంత్ర వార్తా సైట్ మీడియాజోనా ప్రకటించింది. అందులో 95,000 మందికి పైగా సైనికుల వివరాలను పేర్లతో సహా వెల్లడించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లయిన సందర్భంగా సైనికుల మరణాలకు సంబంధించిన చిత్రాలు, అధికారిక సమాచారంతో కూడిన కథనాన్ని మీడియాజోనా సోమ వారం ప్రచురించింది. రష్యన్ కళాకారుడు వాసిలీ వెరెష్చాగిన్ 1,871లో ‘ది అపోథియోసిస్ ఆఫ్ వార్’చిత్రాన్ని వేలాది మంది సైనికుల ఫొటోల గ్రాఫిక్స్తో రూపొందించింది. ప్రతి ఎంట్రీలో సైనికుడి వయస్సు, మరణించిన తేదీ, ప్రాంతం, యూనిట్, అందుబాటులో ఉంటే ఫొటోలను కూడా ప్రచురించింది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు రష్యన్ మరణాల సంఖ్యను 393గా పేర్కొంది.రష్యన్ల మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం దాదాపు రెట్టింపవుతూ వచ్చిందని వెల్లడించింది. తమ విశ్లేషణ ప్రకారం 2024 యుద్ధంలో అత్యంత రక్తసిక్త సంవత్సరమని పేర్కొంది. 2022లో సుమారు 20,000, 2023లో సుమారు 50,000 మంది మరణించగా.. ఒక్క 2024లో 1,00,000 మంది చనిపోయాడని వెల్లడించింది. బీబీసీ రష్యన్ సర్వీస్, వలంటీర్ల బృందం సహకారంతో జాబితాను రూపొందించామని తెలిపింది. మౌనం వహించిన ప్రభుత్వం... దీనిపై వ్యాఖ్యానించడానికి క్రెమ్లిన్ నిరాకరించింది. ఈ ప్రచురణ గురించి తనకు తెలియదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. మరణాల సంఖ్యను ధ్రువీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు. ఇది నిజమో కాదో తనకు తెలియదని, మృతుల సంఖ్య సమాచారం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక హక్కని ఆయన అన్నారు. యుద్ధానికి సంబంధించిన మరణాల గణాంకాలను రష్యా చాలా అరుదుగా ఇస్తోంది. 2022 సెపె్టంబర్లో జరిగిన యుద్ధంలో 5,937 మంది సైనికులు మరణించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అప్పట్లో తెలిపింది. మీడియాజోనాను రష్యన్ ప్రతి పక్ష కార్యకర్త ప్యోటర్ వెర్జిలోవ్ స్థాపించారు. కాగా, రష్యా ప్రభుత్వం మీడియాజోనాను ‘విదేశీ ఏజెంట్’గా ప్రకటించింది. వెర్జిలోవ్ను తీవ్రవాదుల జాబితాలో చేర్చింది. సైన్యం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని దోషిగా నిర్ధారించింది. మా సైనికులు 46 వేల మంది మరణించారు: జెలెన్స్కీ రష్యాతో యుద్ధంలో 46,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారని, సుమారు 3,80,000 మంది గాయపడ్డారని అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. ఇతర అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కాగా, 70,000 మంది చనిపోయారని, 35,000 మంది గల్లంతయ్యారని తమ సైనిక వర్గాలు అంచనా వేశాయని స్వతంత్ర ఉక్రేనియన్ వార్ కరస్పాండెంట్ యూరీ బుటు సోవ్ డిసెంబరులో చెప్పారు. -
జమ్ములో పేలుడు..ఇద్దరు జవాన్ల దుర్మరణం
జమ్ము:జమ్ముకశ్మీర్లో మంగళవారం(ఫిబ్రవరి11) ఐఈడీ(మందుపాతర) పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు తొలుత తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో భద్రతాదళాల కూంబింగ్ జరుగుతోంది. -
భారత జాలర్లపై శ్రీలంక జవాన్ల కాల్పులు
న్యూఢిల్లీ: శ్రీలంక సరిహద్దు సముద్రజలాల సమీపంలో చేపలవేటకు వెళ్లిన భారతీయ మత్స్యకారుల(Indian Fishermen)పై శ్రీలంక నావికాదళ సభ్యులు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జీవనోపాధి కోసం వచ్చిన జాలర్లపై గస్తీదళాల కాల్పుల ఘటనను భారత్ సీరియస్గా తీసుకుంది. మిత్రదేశ పౌరులపై శత్రువుల తరహాలో కాల్పులు జరపడమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి శ్రీలంక రాయబారిని పిలిపించి ఆయన ఎదుట తీవ్ర నిరసన వ్యక్తంచేసింది.‘‘క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాసరే బలగాలు ఆయుధాలకు పనిచెప్పడం లాంటి అసాధారణ చర్యలకు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు. ఇలాంటివి పునరావృతమైతే శ్రీలంకతో సత్సంబంధాల కొనసాగింపుపై మేం మరోసారి తీవ్రంగా సమీక్ష జరపాల్సి ఉంటుంది’’ అని భారత్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది.అసలేం జరిగింది?మంగళవారం తెల్లవారుజామున శ్రీలంక సమీపంలోని డెల్ఫ్ట్ ద్వీపం సమీప సముద్రజలాల్లో 13 మంది భారతీయ జాలర్లు చేపలు పడుతుండగా అక్కడికి శ్రీలంక నావికాదళంలోని గస్తీ బృందం చేరుకుంది. ఇక్కడ చేపలు పట్టే అధికారం భారతీయులకు లేదంటూ ఆ జాలర్లను అదుపులోకి తీసుకునే ప్రయత్నంచేశారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన జాలర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గర్లోని జాఫ్నా టీచింగ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెల్సుకున్న జాఫ్నాలోని భారత కాన్సులేట్ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి జాలర్ల ఆరోగ్యం గురించి వాకబుచేశారు. అత్యుత్తమ చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. -
అటు నలుగురు.. ఇటు 200
టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరువైపులా బందీల విడుదల ప్రక్రియ రెండోదఫా సజావుగా సాగింది. పెద్ద సంఖ్యలో తమ వాళ్లు ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదలకావడంతో వెస్ట్బ్యాంక్లోని రమల్లా నగరంలో పాలస్తీనియన్లు సంబరాలు చేసుకున్నారు. నలుగురు ఇజ్రాయెలీ మహిళా సైనికులు కరీనా అరీవ్(20), డేనియెలా గిల్బోవా(20), నామా లెవీ(20), లిరి అల్బాగ్(19)లను హమాస్ సాయుధులు విడిచిపెట్టారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ సైతం తమ కారాగారాల్లోని 200 మంది పాలస్తీనియన్లను వదలిపెట్టింది. వెస్ట్బ్యాంక్లోని ఒఫెర్ జైలు నుంచి బయటకొచ్చిన ఖైదీలను జెరూసలేం, రమల్లా సిటీలకు తరలించారు. విడుదలైన 200 మంది బస్సుల్లో బయల్దేరారు. ఈ 200 మందిలో 121 మంది జీవితఖైదు పడిన వాళ్లు ఉన్నారు. వీళ్లంతా గతంలో ఇజ్రాయెలీలపై దాడులకు పాల్పడ్డ నేరాలకు ఇజ్రాయెల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. విడుదలైన వారిలో కరుడుగట్టిన ఉగ్రవాదులు మొహమ్మద్ ఓదేహ్(52), వేయిల్ ఖాసిమ(54) సైతం ఉన్నారు. విడుదలైన 200 మందిలో 70 మందిని బహిష్కరించి ఈజిప్ట్ కు పంపేశారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకిరావడంలో ఈజిప్ట్ కీలక మధ్యవర్తిగా ఉన్న నేపథ్యంలో కొందరు ఖైదీలను ఈజిప్ట్ కు తరలించినట్లు అక్కడి ఖహేరీ టీవీ పేర్కొంది. అంతకుముందు ఈ నలుగురు ఇజ్రాయెలీ మహిళా సైనికులను గాజా సిటీలోని పాలస్తీన్ స్క్వేర్ వద్ద రెడ్క్రాస్ బృందానికి హమాస్ సాయుధులు అప్పగించారు. ఈ మహిళలు పూర్తి ఆరోగ్యంతో, నవ్వుతూ అక్కడి వేలాది మంది స్థానికులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. వీళ్ల రాకను ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగర వీధుల్లో ఎల్ఈడీ స్క్రీన్లపై చూసిన వందలాది మంది స్థానికులు సంబరాలు చేసుకున్నారు. ‘‘నమ్మలేకపోతున్నా. వాళ్లు అలా విడుదలకావడం చూసి మనసు ఉప్పొంగింది. యుద్ధం శాశ్వతంగా ఆగిపోతే ఎంత బాగుంటుందో’’అని సంబరాలు చేసుకున్న అవీవ్ బెర్కోవిచ్ అనే స్థానికుడు ఆనందం వ్యక్తంచేశారు. ఈ మహిళా సైనికులు సురక్షితంగా తమ ఆర్మీ స్థావరానికి చేరుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం ధృవీకరించింది. -
కశ్మీర్లో పేలిన మందుపాతర..ఆరుగురు జవాన్లకు గాయాలు
జమ్ము:జమ్ముకశ్మీర్లోని సరిహద్దు(ఎల్ఓసీ) వద్ద మంగళవారం(జనవరి14) ఉదయం భారీ పేలుడు సంభవించింది. మందుపాతర పేలిన ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. రాజౌరిలోని ఖంబా ఫోర్టు ప్రాంతంలో గోర్ఖా రైఫిల్స్కు చెందిన జవాన్లు రోజువారి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వారి వాహనం వద్ద మందుపాతర పేలింది.పేలుడులో గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. జవాన్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని అధికారులు తెలిపారు. -
సైనికుల్ని మార్చుకుందాం
కీవ్: నిర్బంధంలో ఉన్న సైనికులను మార్చుకుందామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాకు ప్రతిపాదించారు. రష్యా నిర్బంధంలోని తమ సైనికులను వదిలేస్తే పట్టుబడ్డ ఉత్తర కొరియా సైనికులను ఆ దేశానికి అప్పగించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను పట్టుకున్నామన్న ఉక్రెయిన్ ప్రకటనను దక్షిణ కొరియా ధ్రువీకరించడం తెలిసిందే. ‘‘మా దగ్గర మరింతమంది కొరియా సైనికులున్నారు. రష్యా పట్టుకున్న మా సైనికులను అప్పగిస్తే ఉత్తర కొరియాకు వారి సైనికులను అప్పగించడానికి సిద్ధం’’అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని గురించిన వాస్తవాలను బయట పెట్టేవారికి, శాంతి స్థాపనకు ప్రయత్నించే వారికి అవకాశం కల్పిస్తామన్నారు. బెడ్పై పడుకొన్న, దవడకు బ్యాండేజ్తో మంచంపై కూర్చున్న ఇద్దరు ఉత్తర కొరియా యుద్ధ ఖైదీల వీడియోను పోస్ట్ చేశారు. అందులో అనువాదకుల సహాయంతో జెలెన్స్కీ వారితో మాట్లాడుతూ కన్పించారు. ‘‘ఉక్రెయిన్తో పోరాడతామని నాకు తెలియదు. శిక్షణ మాత్రమేనని మా కమాండర్లు చెప్పారు’’అని ఆ సైనికులు చెప్పుకొచ్చారు. వారిలో ఒకరు ఉత్తరకొరియా తిరిగి వెళ్లాలని భావిస్తుండగా, అవకాశమిస్తే ఉక్రెయిన్లోనే ఉండిపోతానని రెండో సైనికుడు చెప్పాడు. 2022లో ఉక్రెయిన్పై దాడి మొదలైనప్పటి నుంచి రష్యా, ఉత్తర కొరియా సైనిక సహకారాన్ని పెంచుకుంటున్నాయి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా ఇప్పటికే 10,000 మందికి పైగా సైనికులను పంపిందని ఉక్రెయిన్, అమెరికా, దక్షిణ కొరియా ఆరోపించాయి. దీన్ని ఆ దేశాలు కొట్టిపారేశాయి. కానీ రష్యా సైన్యం ఉత్తర కొరియా సైనిక సాయంపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదని జెలెన్స్కీ అన్నారు. -
యుద్ధభూమిలో రక్తమోడుతున్న రష్యా
గుడ్లురిమి చూస్తూ పొరుగుదేశం ఉక్రెయిన్పైకి దురాక్రమణ జెండాతో దూసుకొచ్చిన రష్యా ఇప్పుడు యుద్ధభూమిలో నెత్తురోడుతోంది. రష్యా సేనలు రక్తమోడుతున్నా పుతిన్ పటాలానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని యుద్ధ విశ్లేషకులు తాజాగా ప్రకటించారు. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా దళాలు 2024 సంవత్సరంలో భారీ మూల్యం చెల్లించుకున్నాయని, ఏకంగా 4,30,790 మంది రష్యా సైనికులు అంటే రోజుకు 1,180 మంది సైనికులు రణక్షేత్రంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే యుద్ధరంగ మేథోసంస్థ ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’తాజాగా వెల్లడించింది. యుద్ధం మొదలవడానికి ముందు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని వీడియో ఫుటేజీలు, భౌగోళిక మార్పులకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి సంస్థ ఈ అంచనాకు వచ్చింది. గత ఏడాది ఒక్క నవంబర్ నెలలోనే 45,720 మంది రష్యా సైనికులు చనిపోయారు. డిసెంబర్లో ఏకంగా 48,670 మంది మృతిచెందారని సంస్థ పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే దురాక్రమణకు గతేడాది రష్యా సైన్యం భారీ మూల్యం చెల్లించుకుంది. రష్యా ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధట్యాంక్లు, సైనికులను అంతంచేశాం’’అని ఉక్రెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ ఒలెస్కాండర్ సిరిస్కీ చెప్పారు. కొన్ని గ్రామాల నుంచి తిరుగుముఖం గత ఏడాది తూర్పు ఉక్రెయిన్లోని డోనెట్స్క్ ప్రాంతంలోని 4,168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని రష్యా ఆక్రమించు కుంది. అయితే ఉక్రెయిన్ బలగాల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో కొన్ని గ్రామాల నుంచి రష్యా సేనలు వెనుతిరిగాయి. ఈ గ్రామాల విస్తీర్ణం ఉక్రెయిన్ మొత్తం విస్తీర్ణంలో 0.69 శాతం ఉండటం గమనార్హం. 31,000 జనాభా ఉన్న కురకోవ్తోపాటు అవ్దీవ్కా, సెలిడోవ్, వులేదార్లు రష్యా వశమయ్యాయి. అవ్దీవ్కాను ఆక్రమించడానికి రష్యా చెమటోడ్చింది. అవ్దీవ్కా ఆక్రమణకు రష్యాకు నాలుగు నెలలు, సెలిడోవ్, కురకోవ్ల ఆక్రమణకు రెండు నెలల సమయం పట్టింది. ఇంతచేసినా వీటి గుండా మరింతగా ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చు కుపోయే అవకాశం రష్యాకు దక్కలేదు. ఇంత నెమ్మదిగా ముందుకు సాగుతున్న రష్యాకు ఒక్క డోనెట్స్క్ ఆక్రమణకే మరో రెండు సంవత్సరాల సమయం పట్టొచ్చు. ఈ లెక్కన మొత్తం ఉక్రేయిన్పై ఆధిపత్యం సాధించాలంటే ఇంకెంత కాలంపడుతుందో మరి. రోజుకు 28 చదరపు కి.మీ.ల ఆక్రమణ గత ఏడాది నవంబర్లో అధిక సైన్యంతో రష్యా ఆక్రమణ స్థాయిని పెంచింది. దీంతో అక్టోబర్లో రోజుకు 14 చదరపు కి.మీ.లుగా ఉన్న ఆక్రమణ స్థాయి నవంబర్కొచ్చేసరికి రెట్టింపైంది. అంటే రోజుకు 28 చదరపు కి.మీ.లకు పెరిగింది. అయితే డిసెంబర్లో ఉక్రెయిన్ సేనల ప్రతిఘటన పెరగడంతో రష్యా బలగాలు కాస్తంత నెమ్మదించి రోజుకు 18 చదరపు కి.మీ.ల స్థాయిలోనే ఆక్రమించుకోవడడం మొదలెట్టాయి. అయినాసరే డిసెంబర్ 29వ నాటికి లెక్కేస్తే ఏకంగా 2,100 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ పేర్కొంది. డిసెంబర్ 19వ తేదీన 191 చోట్ల భీకర యుద్ధం జరిగిందని ఒలెక్సాండర్ చెప్పారు. వేల సైనిక వాహనాలు ధ్వంసం రష్యాకు చెందిన వేల సైనిక వాహనాలను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. 3,689 యుద్ధట్యాంక్లను పేల్చేసింది. 13,000 యుద్ధట్యాంక్ మందుగుండును నాశనంచేసింది. ‘‘సముద్రజలాల్లో ఐదు రష్యా యుద్ధనౌకలను దాడిచేసి ముంచేశాం. 458 చిన్నపాటి యుద్ధ పడవలను పేల్చేశాం’’అని ఉక్రెయిన్ నేవీ విభాగం తెలిపింది. ‘‘మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి రప్పించిన సైనికులను రణరంగంలోకి పంపినా లాభంలేకుండా పోయింది. ఉ.కొరియా సైనికుల్లో పావు శాతం మంది ప్రాణంతీశాం. ఒక్క కురŠస్క్ రీజియన్లో 3,000 మందిని మట్టుబెట్టాం. వారిని సజీవంగా పట్టుకోవడం కుదరట్లేదు. చిక్కే అవకాశమున్న వాళ్లను తోటి రష్యన్లే ముఖాలు కాల్చేసి చంపేస్తున్నారు’’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల ప్రకటించారు. సైన్యంలోకి మరింతగా జనం ఉపాధి, మెరుగైన జీవనం కోసం అనధికారికంగా రష్యాలోకి చొరబడుతున్న శరణార్థులు, వలసదారులను ఈ ఏడాది ఏప్రిల్కల్లా పంపేస్తానని పుతిన్ చెప్పారు. అయితే రష్యా సైన్యంలో చేరితే మాత్రం వారికి చట్టబద్ధంగా ఇక్కడే ఉండనిస్తామని పుతిన్ ప్రభుత్వం చెబుతోంది. దీంతో సైన్యంలోకి ఎక్కువ మంది చేరుతారని, వాళ్లందర్నీ ఉక్రెయిన్ యుద్దక్షేత్రంలోకి తరలించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. చమురు అమ్మకాలతో వస్తున్న అధిక లాభాలను యుద్దం కోసం రష్యా ఖర్చుచేస్తోంటే, పశ్చిమదేశాలు అందిస్తున్న ఆయుధాలు, ఆర్థికసాయంతో ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతోంది. లక్షలాది శ్రామికశక్తి లోటుతో రష్యా ఆర్థికవ్యవస్థ పలచబారుతుంటే, ప్రాణభయంతో కోట్లాది మంది ఉక్రేనియన్లు పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లోవేకియా తదితర దేశాలకు వలసపోతూ దేశాన్ని ‘తక్కువజనాభాగల దేశం’గా మార్చేస్తున్నారు. ఇలాంటి యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుందో మరి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉ.కొరియా సైనికుల మృతి..జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు
కీవ్:రష్యా తరపున యుద్ధం చేసేందుకు వచ్చిన ఉత్తరకొరియా(NorthKorea) సైనికులపై ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి స్పందించారు. ఉత్తర కొరియా సైనికులకు కనీస రక్షణ సౌకర్యాలు కల్పించకుండా రష్యా వారిని యుద్ధరంగంలోకి దించిందని జెలెన్స్కీ ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతూ గాయపడిన కొందరు ఉత్తర కొరియా సైనికులను తమ సైన్యం బంధించిందని,అయితే ఆ తర్వాత వారు చనిపోయారని తెలిపారు.తీవ్రంగా గాయపడిన ఉత్తరకొరియా సైనికులను తాము కాపాడలేకపోయామని జెలెన్స్కీ చెప్పారు. ఉత్తర కొరియా సైనికుడొకరు ఉకక్రెయిన్కు బందీగా చిక్కారని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించిన కొద్ది సేపటికే జెలెన్స్కీ స్పందించడం గమనార్హం.ఎంత మంది ఉత్తరకొరియా సైనికులు తమకు చిక్కి చనిపోయారన్నది మాత్రం జెలెన్ స్కీ వెల్లడించలేదు. సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ తెలిపిన దాని ప్రకారం దాదాపు వెయయ్యి మంది దాకా ఉత్తరకొరియా సైనికులు ఉక్రెయిన్ చేతిలో చనిపోయారని తెలుస్తోంది. మొత్తం 3వేల మంది దాకా ఉత్తరకొరియా సైనికులు తమతో యుద్ధంలో పాల్గొని మరణించారని జెలెన్స్కీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. -
Vijay Diwas: ‘చనిపోయానని ఇంటికి టెలిగ్రాం పంపారు’: నాటి సైనికుని అనుభవం..
అది 1971, డిసెంబర్ 16.. భారతదేశ చరిత్ర పుటల్లో గర్వకారణంగా నిలిచిన రోజు. ఆ రోజున భారతదేశం యుద్ధంలో పాకిస్తాన్కు ఘోరమైన ఓటమి ఎలా ఉంటుందో చూపింది. నాటి యుద్ధంలో సుమారు 3,900 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా, 9,851 మంది గాయపడ్డారు. యుద్ధం అనంతరం 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఈ నేపధ్యంలోనే తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది.నాటి యుద్ధంలో బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన పలువురు వీర సైనికులు పాకిస్తాన్ సేనను ధైర్యంగా ఎదుర్కొని, వారిని మట్టికరిపించారు. ప్రతీయేటా డిసెంబర్ 16 రాగానే.. నాటి యుద్ధంలో పాల్గొని, పాక్ సైనికులను ఓడించిన వీర జవాన్లకు నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.నాటి యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు మీడియాతో మాట్లాడుతూ ‘నేను యుద్ధం ప్రారంభమైనప్పుడు లక్నోలో వైర్లెస్ ఆపరేటర్గా పని చేశాను. నాడు నన్ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు పంపారు. అక్కడ మా ఎనిమిది మంది సైనికుల బృందం పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్పై మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలువురు పాకిస్తానీ సైనికులు మరణించారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మేము స్పృహ కోల్పోయాం. నేను చనిపోయానని సైన్యం భావించి, మా ఇంటికి టెలిగ్రామ్ పంపింది. అయితే ఆ తర్వాత నేను స్పృహలోకి రాగానే, నేను బతికే ఉన్నానంటూ మా ఇంటిలోనివారికి సైన్యం తిరిగి మరో సందేశం పంపింది’ అని తెలిపారు.మరో సైనికుడు తన యుద్ధ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ‘యుద్ధం జరుగుతున్న సమయంలో నేను ఢాకాలో ఉన్నాను. రాత్రంతా వైర్లెస్ బ్యాటరీని ఛార్జ్ చేసేవాడిని. కరెంటు లేకపోవడంతో జనరేటర్తో పని చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మేము నిత్యం అప్రమత్తంగా ఉన్నాం. పాకిస్తాన్ సైనికులు ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భావనతో ఉండేవాళ్లం’ అని తెలిపారు. నాడు భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యం అందరికీ ఎనలేని స్ఫూర్తినిస్తుంది. నాటి యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన సైనికులకు ప్రతి ఏటా డిసెంబర్ 16న దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: లక్షలాది రుద్రాక్షలు ధరించి ప్రయాగ్రాజ్కు.. -
ఉ.కొరియా చేతికి రష్యన్ గగనతల రక్షణ క్షిపణులు
సియోల్: ఉక్రెయిన్ యుద్ధం పరోక్షంగా ఉత్తర కొరియా, రష్యాల రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాల్లో పాల్గొనేందుకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు అక్టోబర్లో రష్యాకు తరలివెళ్లిన విషయం తెల్సిందే. ఉత్తరకొరియా సాయానికి బదులుగా రష్యా సైతం పెద్ద సాయమే చేసిందని దక్షిణకొరియా శుక్రవారం ప్రకటించింది. గగనతల రక్షణ క్షిపణులను ఉ.కొరియాకు రష్యా అందించిందని దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్సుక్కు జాతీయ భద్రతా సలహాదారు షిన్ వోన్సిక్ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు ఎస్బీసీ టీవీ కార్యక్రమంలో షిన్ మాట్లాడారు. ‘‘ ఉ.కొరియా గగనతల రక్షణ వ్యవస్థలో వాడే క్షిపణులను రష్యా సరఫరా చేసింది. వీటితోపాటు ఇతర ఉపకరణాలనూ ఉ.కొరియాకు పంపించింది. తమను ద్వేషించేలా దేశ వ్యతిరేక కరపత్రాలను తమ దేశంలోనే డ్రోన్ల ద్వారా జారవిడుస్తున్నారని, ఇది పునరావృతమైతే క్షిపణి దాడులు తప్పవని ఉ.కొరియా ఇటీవల ద.కొరియాను హెచ్చరించిన విషయం విదితమే. అయితే ఈ కరపత్రాలతో తమకు ఎలాంటి సంబంధంలేదని ద.కొరియా స్పష్టంచేసింది. -
Tony Radakin: రోజుకు 1,500!
లండన్: ఉక్రెయిన్పై దండెత్తిన రష్యా యుద్ధక్షేత్రంలో భారీగా రక్తమోడుతోందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. సంబంధిత వివరాలను బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ ర్యాడకిన్ ఆదివారం వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో అక్టోబర్లో ప్రతి రోజూ 1,500 మంది రష్యా సైనికులు చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని టోనీ చెప్పారు. ‘‘ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యా మొదట్లో పలు ఉక్రెయిన్ ప్రాంతాలను వేగంగా ఆక్రమించుకుంది. కానీ తర్వాత యూరప్ దేశాల దన్నుతో, అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ప్రతిఘటనను పెంచింది. దీంతో ఇటీవలి కాలంలో సమరంలో సమిధలవుతున్న రష్యా సైనికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్టోబర్లో ప్రతి రోజూ 1,500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, శరీరభాగాలు కోల్పోవడమో జరిగింది. యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే ఒక్క నెలలో ఇంతటి నష్టం ఇదే తొలిసారి. పుతిన్ రాజ్యవిస్తరణ కాంక్షకు ఇప్పటిదాకా ఉక్రెయిన్ యుద్ధంలో 7,00,000 మంది రష్యా సైనికులు బలయ్యారు. ఆక్రమణతో రష్యా భూభాగం పెరుగుతోంది. జాతీయభావనను పెంచి పుతిన్ రష్యాలో మరింత పాపులర్ అయ్యారు. కానీ ప్రభుత్వ ఖజానా, సైన్యంపరంగా దేశానికి అపార నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 40 శాతాన్ని కేవలం ఈ యుద్ధం కోసమే పుతిన్ కేటాయిస్తున్నారు. ఇది దేశార్థికంపై పెను దుష్ప్రభావం చూపుతుంది. పుతిన్ యుద్ధోన్మాదం లక్షలాది మంది రష్యన్లను కష్టాలపాలుచేస్తోంది. యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఎంతో మంది తమ ఆప్తులను యుద్ధభూమిలో కోల్పోతున్నారు’’ అని టోనీ అన్నారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. రష్యా 145, ఉక్రెయిన్ 70 డ్రోన్లతో దాడులు మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. రష్యా శనివారం రాత్రి 145 షహీద్ డ్రోన్లను ఉక్రెయిన్పైకి ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 62 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయంది. మరో 67 డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, 10 వరకు డ్రోన్లు గురితప్పి మాల్డోవా, బెలారస్, రష్యా ప్రాంతాలవైపు దూసుకెళ్లాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఆదివారం ఉదయం మాస్కో దిశగా ఉక్రెయిన్ ఆర్మీ అత్యధికంగా 34 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఆరు ప్రాంతాలపైకి మొత్త 70 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. ఈ సంఖ్యలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. వీటన్నిటినీ కూల్చేశామని వివరించింది. డ్రోన్ శకలాలు పడి రెండో చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. -
రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ కార్యదర్శిగా నియమితులైన రాజేశ్ కుమార్ సింగ్ ఢిల్లీ సౌత్ బ్లాకులో శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కేరళ కేడర్ 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆర్కే సింగ్ ఈ ఏడాది ఆగస్టు 20న రక్షణశాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (రక్షణ కార్యదర్శి పదవిలో)గా బాధ్యతలు చేపట్టారు. కాగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే కంటే ముందు ఆర్కే సింగ్ నేషనల్ వార్ మెమోరియల్కు వెళ్లి, అమరులైన జవానులకు నివాళులు సమర్పించారు. ‘మాతృభూమికి సేవ చేయడంలో అత్యున్నత త్యాగానికి వెనుదీయని మన శూర జవానులకు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అమర జవానుల అసాధారణ ధైర్య సాహసాలు, వారి త్యాగాలు భారత్ను ఒక సురక్షిత, సమృద్ధ దేశంగా తీర్చిదిద్దడానికి మనకందరికీ శక్తిని, ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’అని రాజేశ్ కుమార్ సింగ్ అన్నారు. అంతకు ముందు, ఆయన 2023 ఏప్రిల్ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం–పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. కాగా రక్షణ కార్యదర్శిగా గురువారం పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమానే స్థానంలో ఆ పదవిని ఆర్కే సింగ్ చేపట్టారు. -
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి.. పాక్కు వార్నింగ్
ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో గడిపే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ సారి కూడా కొనసాగించారు. సరిహద్దుల్లో గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు.. ‘‘కచ్వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘సర్ క్రిక్పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.’’ అని మోదీ అన్నారు.దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనూ కూడా రాజీపడలేని ప్రభుత్వం ఇప్పుడు ఉంది. దౌత్యం పేరుతో సర్ క్రీక్ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దానిని వ్యతిరేకించాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని చెప్పారు.2014 నుంచి ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్లోని హర్సిల్, 2019లో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, 2019లో రాజస్థాన్, 2019లో కాశ్మీర్లోని నౌషేరా, 2019లో నౌషేరా, 2022లో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్, 2023లో హిమాచల్లోని లెప్చాలో పర్యటించారు. Celebrating Diwali with our brave Jawans in Kutch, Gujarat.https://t.co/kr3dChLxKB— Narendra Modi (@narendramodi) October 31, 2024 -
ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు ఇరాన్ సైనికులు మృతి
టెహ్రాన్: ఇజ్రాయెల్ తమ దేశంపై జరిపిన దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ శనివారం(అక్టోబర్ 26) దాడులు జరిపింది.కొన్ని నెలలుగా తమ దేశంపై నిరంతరాయంగా జరుగుతున్న దాడులకు సమాధానంగానే తాము ఈ ప్రతిదాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తమకు పెద్దగా నష్టమేమీ జరగలేదని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల పట్ల ధీటుగా స్పందిస్తామని ఇరాన్ తెలిపింది.ఇదీ చదవండి: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు -
జమ్ముకశ్మీర్: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
గుల్మార్గ్: జమ్మూకశ్మీర్లోని గుల్మార్గ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని బోటాపాత్ర్ వద్ద ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.కాగా, గుల్మార్గ్లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని గంటల ముందు పుల్వామాలో ఉగ్రవాద దాడిలో వలస కార్మికుడు గాయపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన కార్మికుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. -
ఇజ్రాయెల్పై హెజ్బొల్లా భీకర దాడి
డెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్లోని ఆర్మీ బేస్పై ఆదివారం హెజ్బొల్లా చేపట్టిన భీకర దాడిలో నలుగురు సైనికులు చనిపోగా మరో 61 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. రెండు వారాల క్రితం లెబనాన్లో తాము భూతల దాడులు మొదలు పెట్టాక హెజ్బొల్లా జరిపిన అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ పేర్కొంది. గురువారం బీరుట్పై చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఆదివారం బిన్యామియా నగరంపై డ్రోన్లతో దాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలైన ‘గొలాన్ బ్రిగేడ్’లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను నిరీ్వర్యం చేసేందుకు డజన్ల కొద్దీ మిస్సైళ్లను, అదే సమయంలో పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించామని పేర్కొంది. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలున్నప్పటికీ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లడం చాలా అరుదైన విషయమని చెబుతున్నారు. స్కూలుపై దాడి..20 మంది మృతి గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంలోని స్కూలుపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో పలువురు చిన్నారులు సహా 20 మంది చనిపోయారు. సోమవారం ఉదయం డెయిర్ అల్–బలాహ్లోని అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వెలుపల జరిగిన మరో దాడిలో ముగ్గురు చనిపోయారు. దాడులతో టెంట్లతో మంటలు చెలరేగి, 50 మందికి కాలిన గాయాలయ్యాయి. లెబనాన్లో 21 మంది మృత్యువాత లెబనాన్లో ఉత్తర ప్రాంత అయిటో నగరంలోని ఓ చిన్న అపార్టుమెంట్ భవనంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 21 మంది చనిపోయారని రెడ్ క్రాస్ తెలిపింది. హెజ్బొల్లా బలంగా ఉన్న దక్షిణ లెబనాన్, బీరుట్ ఉత్తర శివారు ప్రాంతాలపైనే ప్రధానంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర భాగంపై దాడికి దిగడం ఇదే మొదటిసారి. ‘ఐరాస దళాల మాటున హెజ్బొల్లా’లెబనాన్లోని శాంతి పరిరక్షక దళాలు హెజ్బొల్లా మిలిటెంట్లకు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఐరాస దళాల ముసుగులో హెజ్బొల్లా మిలిటెంట్ల కార్యకలాపాలు దక్షిణ లెబనాన్ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని విమర్శించారు. తమ బలగాలు హెచ్చరికలను పాటించి, ఆ ప్రాంతం నుంచి వెంటనే ఐరాస బలగాలు వైదొలగాలన్నారు. ఉత్తర గాజాను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం ఉత్తర గాజా ప్రాంతంలో ఉన్న సుమారు 4 లక్షల మందిని అక్కడి నుంచి ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లి పోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. వీరిని ఎలాగైనా ఖాళీ చేయాలనే లక్ష్యంతోనే ఈ నెల ఒకటోతేదీ నుంచి ఈ ప్రాంతానికి ఆహార సరఫరాను సైతం నిలిపివేసింది. వెళ్లకుండా అక్కడే ఉండే వారిని మిలిటెంట్లుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ప్రణాళికను మాజీ సైనిక జనరళ్లు ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం. -
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్:కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కిష్త్వార్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచారు. అదే విధంగా కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు.కాగా చత్రూలోని నైద్ఘం గ్రామ సమీపంలోని పింగ్నాల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులుకాల్పులు జరిపాయి. వీటిని బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి#𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐀𝐫𝐦𝐲𝐎𝐏 𝐊𝐇𝐀𝐍𝐃𝐀𝐑𝐀In the Joint operation launched on 11 Sep by 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐑𝐢𝐬𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐂𝐨𝐫𝐩𝐬 & 𝐉&𝐊 𝐏𝐨𝐥𝐢𝐜𝐞, Two Terrorists Neutralised & Large War Like Stores Recovered. 𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 C𝐨𝐧𝐜𝐥𝐮𝐝𝐞𝐝 pic.twitter.com/QUc92EhElN— Rising Star Corps_IA (@RisingStarCorps) September 13, 2024ఇక ఉదంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. గత జూలైలో దోడాలో జరిగిన ఎన్కౌంటర్తో ముడిపడి ఉన్న ఉగ్రవాదులే తాజా కాల్పుల్లోనూ పాల్గొన్నట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. దోడా ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు.అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ప్రధాని రేపు దోడాను సందర్శించే అవకాశం ఉంది.దోడా, ఉదంపూర్, కథువా జిల్లాల్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరిగాయి దోడాలో జరిగిన ఆపరేషన్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ఏడుగురు సైనికులతో సహా దాదాపు డజను మంది మరణించారు.ఇక సెప్టెంబరు 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంత్నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్లోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతంలోని దోడా, కిష్త్వార్, రాంబన్ జిల్లాల్లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాల్లో భద్రతను పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండో, మూడో దశలలో ఓటింగ్ జరగనుంది. -
పట్టాలపై లైఫ్లైన్
నర్సు ఓల్గా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంతటా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. రోగుల ఆక్సిజన్ స్థాయిలను తనిఖీ చేసి నోట్ చేసుకుంటున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులను ఓ కంట కనిపెడుతున్నారు. ఓ ఆస్పత్రిలో ఇదో సాధారణ దృశ్యం. కానీ ఆమె పనిచేస్తున్నది నడుస్తున్న రైలులో. వైద్యం అందిస్తున్నది యుద్ధంలో గాయాలపాలైన సైనికులకు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి ఉక్రెయిన్ ఈ రైలాస్పత్రిని నడుపుతోంది. ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇప్పుడిది కీలక భాగంగా మారింది. యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం తూర్పు ఉక్రెయిన్లోని చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో పడకలు లేవు. అవి ఖాళీ చేయడానికి కొందరిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్సుల్లో సుదూర ప్రయాణంతో సైనికుల ప్రాణాలకే ముప్పుకావచ్చు. రష్యా దాడుల నేపథ్యంలో హెలికాప్టర్ అంబులెన్స్లు కూడా ఉపయోగించలేరు. ఈ క్లిష్ట స్థితిలో రైళ్లు సైనికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఇందులోని బోగీలు పూర్తి స్థాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఆర్మీ డాక్టర్లు, ఇతర సిబ్బంది సైనికులకు రైలులోనే సేవ లు అందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఐసీయూ యూనిట్ నడపడం చాలా కష్టమైన పని. అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడ మా సామర్థ్యం చాలా పరిమితం. ఏదైనా జరిగితే బయటి కన్సల్టెంట్ను పిలవలేం. రక్తస్రావాన్ని ఆపడానికి చిన్న చిన్న ఆపరేషన్లు వంటివి చేస్తాం. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయలేం’అని డాక్టర్స్ చీఫ్ ఒకరు తెలిపారు. పర్యాటక రైలు కాస్తా ఆస్పత్రిగా.. యుద్ధం ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఉక్రెయిన్ సమయస్ఫూర్తికి రైలాస్పిత్రి ఒక ఉదాహరణ. 2022 ఫిబ్రవరిలో దేశంపై రష్యా దాడులు ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ వద్ద ఎటువంటి మెడికల్ రైలు బోగీలు లేవు. గాయపడిన సైనికులను సాధారణ రైళ్లలోకి కిటికీల గుండా బలవంతంగా ఎక్కించేవారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఉక్రెయిన్ రైల్వే.. సాధారణ రోజుల్లో పర్యాటకులను కార్పాతియన్ పర్వతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించే రైళ్లను పునరుద్ధరించింది. అలా ఆస్పత్రి రైలుకు రూపకల్పన జరిగిందని ఉక్రెయిన్ రైల్వే ప్యాసింజర్ ఆపరేషన్స్ సీఈఓ ఒలెక్సాండర్ పెర్తోవ్స్కీ చెప్పారు. గంటకు 50 మైళ్ల వేగంతో.. ఈ రైలు గంటకు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ రైలు వేగంలో సగమే అయినప్పటికీ ఐసీయూ మాత్రం అటూఇటూ కదిలిపోతూంటుంది. దీంతో పనిచేసేటప్పుడు సిబ్బంది చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్ రైళ్లను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో ఉపయోగించారు. కానీ ఈ ఆధునిక వెర్షన్లలో వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ యంత్రాలు, అ్రల్టాసౌండ్ స్కానర్లు, పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ప్రతి క్యారేజీలో నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లుంటాయి. బోగీల్లో పిల్లల చిత్రాలు, ఉక్రెయిన్ జాతీయ జెండాలు ఉంటాయి. గాయపడిన సైనికులకు ఇవి కొంత ఓదార్పును అందిస్తాయి. రెండు భిన్న దృశ్యాలు.. తొమ్మిది గంటల ప్రయాణం తరువాత రైలాస్పత్రి ఒక నగరంలోని రైల్వేస్టేషన్లోకి ప్రవేశించగానే.. అంబులెన్సులు సైనికుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఐసీయూ లోని నర్సులు సైనికులను ప్లాట్ఫామ్పై ఎదురుచూస్తున్న వైద్యులకు అప్పగిస్తారు. స్టేషన్ నుంచి అంబులెన్సులు బయల్దేరి వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు. వారికి ఎదురుగా కొత్తగా రిక్రూట్ అయిన సైనికులతో ఓ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ పిల్లలు కనపడతారు. సాయంత్రానికి ఆ యువసైనికులు అపస్మారక స్థితిలోనో, తీవ్ర గాయాలతోనే అదే రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. ఈ రెండు దృశ్యాలకు ప్రత్యక్ష సాకు‡్ష్యలు రైలాస్పత్రి సిబ్బందే. యుద్ధం మిగుల్చుతున్న అంతులేని విషాదమిది. ‘యుద్ధ క్షేత్రం నుంచి తీవ్రంగా గాయపడి వచ్చే సైనికులను చూడటం బాధాకరమైన విషయమే. కానీ, వారికి సేవ చేస్తున్నామన్న తృప్తి మాత్రం మాకు మిగులుతుంది’అని చెబుతున్నారు ఐసీయూ నర్సు ఓల్గా. 2015లో సైన్యంలో నర్సుగా చేరిన ఆమె.. 2022 నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నారు. అలసిపోయాం.. యుద్ధం చెల్లించుకుంటున్న మూల్యానికి ఈ రైలాస్పత్రి ఓ చిన్న ఉదాహరణ. ‘రష్యన్ విసిరిన గ్రెనేడ్తో నా చేతులు, భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దాలు నా వినికిడి శక్తినే దెబ్బతీశాయి. నేనే కాదు.. చాలా మందికి మనోధైర్యం ఉంది. కానీ చాలా అలసిపోయారు. ఇలాంటప్పుడు ఏదేమైనా కానీ భారమంతా దేవుడిదే అనుకుంటాం’అని చెబుతున్నారు రష్యా డ్రోన్ దాడిలో గాయపడి రైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల సైనికుడు. అలసట యుద్ధక్షేత్రంలోని సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయన 18 నెలల నుంచి డోనెట్స్క్ ప్రాంతంలోని పదాతిదళంలో యాంటీ ట్యాంక్ గన్నర్గా పనిచేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రంట్లైన్కు దూరంగా ఉన్నారు. గాయాల నుంచి ప్రేరణ.. ఈయనకు కొన్ని పడకల దూరంలో కూర్చున్న స్టానిస్లావ్ మూడు నెలల క్రితం స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. అతడున్న కందకంపైన డ్రోన్ దాడి జరగడంతో ఊపిరితిత్తులకు గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. అయినా స్టానిస్లావ్ పూర్తి భిన్నమైన మానసిక స్థితిలో కనిపించారు. ‘‘గాయపడ్డాక నాలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. నేను మరింత ప్రేరణ పొందాను’’అని చిరునవ్వుతో చెబుతున్నారు. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జవాన్ ల స్వాతంత్య్ర దినోత్సవ విన్యాసాలు
-
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్, ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్లో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అనంత్నాగ్ జిల్లా అహ్లాన్ గడోల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్నాగ్ సబ్డివిజన్లోని అడవిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి.విదేశీ పౌరులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఆర్మీ పారాట్రూపర్లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు తనిఖీలు చేస్తుండగా జవాన్లపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. -
అమర వీరులకు ప్రధాని మోదీ నివాళి
-
జమ్ముకశ్మీర్లో నాల్గవరోజూ ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్లోని దోడాలో వరుసగా నాల్గవరోజు కూడా ఎన్కౌంటర్ జరిగింది. నేడు (గురువారం) తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించారు.కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. గంటకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక కెప్టెన్తో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన అనంతరం ఆర్మీ సిబ్బంది.. గ్రామంతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. జూన్ 12 నుంచి దోడాలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. చటర్గాలా పాస్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మరుసటి రోజు గండోలో కాల్పులు జరిగాయి. దానిలో ఒక పోలీసు గాయపడ్డాడు.జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, జూలై 9న ఘరీ కుంకుమ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూలోని ఆరు జిల్లాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మృతి చెందారు. -
కశ్మీర్లో ఉగ్రకాల్పులు... నలుగురు సైనికుల వీరమరణం
జమ్మూ: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, నాయక్ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడ్డ మరో సైనికున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.కథువా జిల్లా మారుమూల మఛేడీ అటవీప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. దోడాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య గత మూడు వారాల్లో ఇది మూడో ఎన్కౌంటర్. ఇది తమ పనేనని పాక్ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించుకుంది.ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారంతో రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దేసా అటవీ ప్రాంత పరిధిలోని ధారీ గోటే ఉరర్బాగీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 20 నిమిషాల ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు వెన్నుచూపారు. ప్రతికూల అటవీ ప్రాంతంలోనూ కెపె్టన్ సారథ్యంలో బలగాలు వారిని వెంటాడాయి. దాంతో సోమవారం రాత్రి 9 గంటల అనంతరం మరోసారి చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కెపె్టన్తో పాటు మరో ముగ్గురు అసువులు బాశారని అధికారులు తెలిపారు. ఈ ముష్కరులు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. వారికోసం అదనపు బలగాలతో సైన్యం, పోలీసులు భారీగా గాలిస్తున్నారు. ఎలైట్ పారా కమెండోలను కూడా రంగంలోకి దించారు. బాధగా ఉంది: రాజ్నాథ్ ముష్కరులను ఏరేసే క్రమంలో నలుగురు వీర జవాన్లు అమరులు కావడం చాలా బాధగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైనిక ఉన్నతాధికారులు వారికి ఘనంగా నివాళులరి్పంచారు. కుటుంబాలకు సానుభూతి తెలిపారు.నా కొడుకు త్యాగానికి గర్విస్తున్నా..దేశ రక్షణలో అమరుడైన కొడుకును చూస్తే గర్వంగా ఉందని కెప్టెన్ బ్రిజేశ్ థాపా తల్లిదండ్రులు కల్నల్ (రిటైర్డ్) భువనేశ్ కె.థాపా, నీలిమ అన్నారు. ‘‘నా కుమారుడు చిన్నతనం నుంచీ నన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు. సైన్యంలో చేరాలని ఉవి్వళ్లూరేవాడు. 27 ఏళ్ల వయసులో కల నెరవేర్చుకున్నాడు. రెండు రోజుల క్రితమే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిత్యం ప్రాణాపాయం పొంచి ఉండే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో నా కుమారుడు అమరుడైనందుకు గర్విస్తున్నా’’ అని భువనేశ్ చెప్పారు. ఆర్మీ డే రోజు పుట్టాడు కెపె్టన్ థాపా ఆర్మీ డే అయిన జనవరి 15న జని్మంచారని తల్లి తెలిపారు. తనకింకా పెళ్లి కూడా కాలేదని సుళ్లు తిరుగుతున్న బాధను అణచుకుంటూ చెప్పారామె. కుటుంబంలో ఆయన వరుసగా మూడో తరం సైనికుడు! థాపా తండ్రితో పాటు తాత కూడా సైన్యంలో సేవ చేశారు. ఆయన ఇంజనీరింగ్ చేసి కూడా పట్టుబట్టి ఆరీ్మలోనే చేరారు. 145, ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్కు చెందిన థాపా రాష్రీ్టయ రైఫిల్స్కు డిప్యూటేషన్పై వెళ్లారు.బీజేపీ తప్పుడు విధానాల వల్లే... జవాన్ల మృతిపై రాహుల్ నిప్పులుసాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో 78 రోజుల్లో 11 ఉగ్రదాడులు జరిగినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాన్ని వీర సైనికులు, వారి కుటుంబాలు అనుభవించాల్సి వస్తోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 11 ఉగ్రదాడుల్లో 13 మంది ఆర్మీ, పోలీసు సిబ్బంది అమరులయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దాడులను, సైనికుల బలిదానాలను ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆరి్టకల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని నాశనం చేశామనే బూటకపు వాదనకు సైనికులు తమ ప్రాణాలతో మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.ఆ అమర సైనికునిది ఏపీసంతబోమ్మాళి: దోడాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన డొక్కరి రాజేశ్ (25)ది ఆంధ్రప్రదేశ్. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం చెట్లతాండ్ర. రాజేశ్ ఐదేళ్ల కింద ఆర్మీలో చేరారు. వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు చిట్టివాడు, పార్వతి కేవలం ఎకరం పొలం సాగు చేస్తూ రాజేశ్ను, ఆయన సోదరున్ని చదివించారు. సోదరుడు మధుసూదనరావు డిగ్రీ పూర్తి చేశాడు. రాజేశ్ మృతితో తల్లిదండ్రులు కంటికో ధారగా విలపిస్తున్నారు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ ఏడాదే 12 మంది సైనికుల మృతి2024లో జమ్మూలో ఉగ్ర దాడులు... ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ప్రభుత్వోద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతోఎదురు కాల్పుల్లో విలేజీ రక్షక దళ సభ్యుని మృతి. మే 4: పూంచ్ జిల్లాలో ఉగ్ర దాడిలో ఐఏఎఫ్ సిబ్బంది మరణించగా ఐదుగురు గాయపడ్డారు. జూన్ 9: రీసీ జిల్లాలో ఉగ్ర దాడిలో 9 మంది భక్తులు మరణించగా 42 మంది గాయపడ్డారు. జూన్ 11, 12: కథువా జిల్లాలో ఎన్కౌంటర్లో ఇద్దరు విదేశీ ముష్కరులు హతమవగా ఒక సీఆరీ్పఎఫ్ జవాను అమరుడయ్యాడు. జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్ర దాడిలో ఓ పోలీసుకు గాయాలు. జూన్ 26: దోడా జిల్లాలో ముగ్గురు విదేశీ ముష్కరుల కాలి్చవేత. జూలై 7: రాజౌరీ జిల్లాలో ఉగ్ర దాడిలో సైనిక సిబ్బంది గాయపడ్డారు. జూలై 8: కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి ఐదుగురు సైనికులు బలయ్యారు. జూలై 15: దోడా ఎన్కౌంటర్లో కెప్టెన్తో పాటు మరో ముగ్గురు సైనికుల వీరమరణం. -
కొరత సృష్టించిన అగ్నిపథ్!
అయిదేళ్ల కాల పరిమితి తర్వాత కూడా సైన్యంలో కొనసాగడానికి అర్హత సాధించాలనే ప్రయత్నంలో అగ్నివీర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ, వారిపై స్పష్టమైన ఒత్తిడి ఉండటం కనిపిస్తోంది. అంతేకాదు, అగ్నిపథ్ పథకం... సైన్యంలో తీవ్రమైన కొరతకు కూడా దారి తీసింది. సైన్యంలోంచి ఏటా పదవీ విరమణ చేసేవారి సంఖ్యలో సగాని కంటే కాస్త మాత్రమే ఎక్కువగా అగ్నివీర్లను తీసుకున్నారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నిలుపుకొంటారు కనుక ఈ లోటు మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పథకం తీవ్రమైన లోపాలతో ఉన్నందున, చిన్న చిన్న మార్పులు విలువైన ప్రయోజనాన్ని అందించలేవనే భావన కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది.లోపాలను సరిదిద్దడానికి ‘ఫలితానంతర’ చర్యలపై ఆధారపడే వ్యవస్థీకృత మార్పు ఏదైనా సరే అంతర్గతంగా లోపభూయిష్ఠంగా ఉంటుంది. అగ్నిపథ్ పథకం అలాంటి ఉదాహరణగా నిలుస్తుంది. రెండేళ్ల క్రితం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆఫీసర్ ర్యాంకుకు కిందిస్థాయిలో ఉన్న సైనికుల నియామక ప్రక్రియను మార్చడానికి అంటూ దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. పెరిగిపోతున్న రిటైర్డ్ సైనికుల పెన్షన్ బిల్లును తగ్గించడానికి కూడా దీన్ని తీసుకొచ్చారు. సాయుధ దళాలలోని ఇతర ర్యాంకులు యువతతో నిండి వుండేలా ఇది దోహదపడుతుంది. అయితే ఈ పథకం సాయుధ దళాలలో చేరడానికి ఆసక్తి ఉన్న యువత నుండి ప్రతిఘటనను ఎదుర్కొంది. దీనిపై సమగ్ర సమీక్ష చేయాలంటూ రాజకీయవర్గాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. అగ్నిపథ్ ఆలోచన ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ (నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట సైనిక సేవలు) అనే భావన నుండి తీసుకోవటం జరిగింది. ఇది సైనిక సేవ కోసం ఎంపిక చేసేవారి కొరతను అధిగమించడానికి పాశ్చాత్య దేశ సైన్యాల్లో విస్తృతంగా ఆచరణలో ఉంది. అప్పటి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మన సాయుధ దళాలలో ఈ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. సైనికులను చిన్న సంఖ్యలలో రిక్రూట్ చేయడం ద్వారా ఈ ప్రతిపాదనను పరీక్షించడం అసలు ఉద్దేశం. అయితే, ఈ పథకం ఏకపక్షంగా ముందుకు సాగినట్లు తెలుస్తోంది. మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలో నివేదించిన అంశాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకాన్ని సైనిక విభాగాలకు ‘పిడుగుపాటు’గా ఆయన ఈ పుస్తకంలో అభివర్ణించారు.ప్రస్తుతం ఈ పథకం కింద 17.5 నుండి 21 సంవత్సరాల వయస్సు ఉండి 12వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ‘అగ్నివీర్’లుగా ఆరు నెలల శిక్షణ ఇచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల కాలానికి నియమించారు. వారిలో 25 శాతం మంది మాత్రమే పింఛను, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలతో మరో 15 సంవత్సరాల కాలం కొనసాగేందుకు అర్హులు అవుతారు. దీనికోసం వారిని తిరిగి నమోదు చేసుకుంటారు. ఇక సైన్యం నుంచి విడుదలైన మిగతా 75 శాతం మందికి పరిహారంగా ‘సేవా నిధి’ కింద రూ.10 లక్షల ప్యాకేజీ ఇస్తారు. ప్రస్తుతం మొత్తం రక్షణ శాఖ పెన్షనర్ల సంఖ్య దాదాపు 24.62 లక్షలు. వీరిలో సాయుధ దళాల సీనియర్లు దాదాపు 19 లక్షలు కాగా, పౌర విభాగ సిబ్బంది 5.62 లక్షల మంది ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రక్షణ బడ్జెట్ రూ. 5,25,166 కోట్లు. ఇందులో పింఛను ఖర్చు రూ.2,07,132 కోట్లు. రక్షణ సిబ్బంది వాటా రూ. 1,19,696 కోట్లు కాగా, పౌర విభాగం వాటా రూ. 87,436 కోట్లు. ఈ రెండో మొత్తం పెన్షనరీ బడ్జెట్లో 40 శాతం వాటాను కలిగి ఉంది.కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా సాయుధ దళాలలో గౌరవప్రదమైన వృత్తిని కోరుకునే వ్యక్తులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) అగ్ర ఎంపికగా ఉండటం వలన ఈ పథకంపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా ఉంది. నేను ఈ ధోరణిని నా సొంత రాష్ట్రమైన పంజాబ్లో చూశాను. సైన్యం నుంచి విడుదలైన అగ్నివీరులలో తాము విస్మరించబడ్డామనే అపకీర్తిని మోస్తున్నట్లు, గర్వించ దగిన అనుభవజ్ఞులుగా తమను చూడరనే సాధారణ భావన కూడా వారిలో ఉన్నట్లు నేను గ్రహించాను. ఇటీవల, అగ్నివీరులు కార్యాచరణ ప్రాంతాల్లో మోహరించినప్పుడు వారు అత్యున్నత త్యాగం చేసిన రెండు సందర్భాలు ఉన్నాయి. అయితే పూర్తి పెన్షన్ కు అర్హులైన సాధారణ సైనికులకు భిన్నంగా వారి బంధువులు ఏకమొత్తంలో మాత్రమే పరిహారం పొందేందుకు అర్హులు. ఈ వివక్ష తీవ్రమైన క్రమరాహిత్యంగా నిలుస్తోంది. ఈ రోజు సైనిక విభాగాల్లో రెగ్యులర్ సైనికులు, అగ్నివీరులు అనే రెండు వర్గాలు ఉన్నాయి. అయిదేళ్ల తర్వాత కూడా సైన్యంలో కొనసాగడానికి అర్హత సాధించాలనే వారి ప్రయత్నంలో అగ్నివీర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ, స్పష్టమైన ఒత్తిడి కనిపిస్తోంది. నిజానికి ఇది స్నేహబంధం, సైనికుల మధ్య పరస్పర సహకారం, యూనిట్ కల్చర్, రెజిమెంట్ పునాది వంటివాటికి హానికరమైనది. మెరుగైన ఆయుధాలతో సన్నద్ధమైన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మన సాయుధ దళాల అత్యాధునిక సామర్థ్యానికి ఇది చేటు కలిగిస్తుంది. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్లలో అమెరికన్లు; గాజాలో ఇజ్రాయెలీలు; రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రెండు వైపుల సైనికులు – ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ని నిష్ప్రయోజనమైనదిగా గుర్తించారు. మన విషయానికి వస్తే, నేటికీ కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రతిష్టంభన సమయంలో లద్దాఖ్లో చైనా సైన్యం కూడా పేలవంగా పని చేసింది.అగ్నిపథ్ పథకం సైనిక బలగంలో తీవ్రమైన కొరతకు కూడా దారితీసింది. సైన్యంలోంచి ఏటా పదవీ విరమణ చేసేవారి సంఖ్య 70,000 అయితే, కేవలం 42,000 మంది అగ్నివీర్లను మాత్రమే తీసుకున్నారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నిలుపుకోవడంతో ఈ లోటు మరింత పెరగనుంది. 39 గూర్ఖా బెటాలియన్ లలోని 60 శాతం సైనికులు ‘నేపాల్ స్థానిక గూర్ఖా’ల నుండి వచ్చినందున గూర్ఖాల నియామకం గరిష్ఠంగా దెబ్బతింది. నేపాల్ ప్రభుత్వం అగ్నిపథ్ను తిరస్కరించడం వల్ల తీవ్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో గూర్ఖాలను రిక్రూట్ చేయడానికి చైనీస్ సైన్యం చేసిన ప్రకటనలను తోసిపుచ్చలేము. భారతీయ యువత విదేశీ సైన్యంలో చేరడం ఆందోళన కలిగించే ధోరణి. రష్యా సైన్యంలో చేరేందుకు ఆకర్షితులవుతున్న కొంతమంది వ్యక్తుల గురించి వెలువడిన ఇటీవలి నివేదికలు దీనికి ఉదాహరణ.అగ్నిపథ్ పథకాన్ని పునస్సమీక్షిస్తున్నారనే నివేదికలు వస్తున్నాయి. వాటిని బట్టి అగ్నివీరులను నిలబెట్టుకోవడంతో పాటుగా, సేవా సంవత్సరాల పొడిగింపు శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం తీవ్రమైన లోపాలతో ఉన్నందున, చిన్న చిన్న మార్పులు విలువైన ప్రయోజనాన్ని అందించవు. రిక్రూట్మెంట్ ప్రక్రియ మరింత శాస్త్రీయంగా, కఠినంగా ఉండేలా మునుపటి వ్యవస్థను చక్కగా తీర్చిదిద్దడం ముఖ్యం. ఫిట్నెస్ శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ కలిగి ఉంటుంది కాబట్టి వయఃపరిమితిని 32 నుండి 26కి తగ్గించడంతో ఫలితం ఉండదు. సైనికుడిని సర్వతోముఖంగా తయారు చేయడానికి ఆరు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది; వ్యక్తిగత దారుఢ్యం 20ల చివరలో, 30ల ప్రారంభంలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే వివాదాస్పద సరిహద్దులను 42 ఏళ్లు పైబడిన మధ్యస్థ వయస్సుతో కాపు కాస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఫిట్నెస్ ఎప్పుడూ ప్రశ్నార్థకం కాకపోవడం గమనార్హం. సాయుధ దళాలు, రక్షణ విభాగంలోని పౌర సంస్థల సంఖ్యను సరైన పరిమాణంలోకి తీసుకురావడం ద్వారా పెన్షన్ బిల్లును గణనీయంగా తగ్గించవచ్చు. ఉదాహరణకు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) 10,000 మంది కాంట్రాక్టు కార్మికులను, సుమారు 50 పరిశోధన శాలలతో పాటు దాదాపు 30,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. డీఆర్డీఓని పునర్నిర్మించడం, కుదించటం కోసం విజయ్ రాఘవన్ కమిటీ ఇటీవలి సిఫార్సులు సరైన దిశలో ఒక అడుగు. దాదాపు 80,000 మంది కార్మికులు పనిచేస్తున్న 41 ఆర్డినెన్స్ కర్మాగారాలకు ఇదే విధమైన కసరత్తు అవసరం.ఒక వ్యవస్థ స్థితిస్థాపకత... తప్పును సరి చేయగల దాని సామర్థ్యంలో ఉంటుంది. సైనిక విభాగం పెద్దలు అన్ని ఇతర పరిగణనలను పక్కన పెట్టి భారీ సంస్థాగత ప్రయోజనార్థం అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తారని ఆశిస్తున్నాను.జి.జి. ద్వివేది వ్యాసకర్త రిటైర్డ్ మేజర్ జనరల్ -
‘లద్దాఖ్’లో జవాన్ల మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : లద్దాఖ్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఏపీ జవాన్ల కుటుంబాలకు కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం(జులై1) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లద్దాఖ్లో యుద్ధట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ రక్షణలో జవాన్ల సేవలు చిరస్మరణీయమని గుర్తుచేశారు. లడఖ్లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2024వారి త్యాగాలు మరువలేనివని కీర్తించారు. ‘కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ల కుటుంబాలకు నా సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలి. మరణించిన జవాన్ల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఆర్థికసాయం చేయాలి. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబాలకు బాసటగా నిలవాలి’అని వైఎస్ జగన్ కోరారు. -
గాజాలో భారీ పేలుడు.. 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో యుద్ధం కొనసాగుతోంది. దక్షిణ గాజాలో చోటు చోసుకున్న పేలుడులో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. దక్షిణ గాజాలోని రఫా నగరానికి సమీపంలో ఇజ్రాయెల్ సైనికులు ప్రయాణిస్తున్న నేమర్ వాహనం పేలటంతో ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.ఈ పేలుడు భారిగా సంభవించడంతో వాహనం పూర్తిగా దగ్ధం అయిదని, అదే విధంగా మృత దేహాలను గుర్తించటంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఎవరు జరిపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే ఆ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లు పేలుడు పరికరం అమర్చా? లేదా యాంటీ ట్యాంక్ మిసైల్ను నేరుగా ప్రయోగించారా? అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.❗🇵🇸⚔️🇮🇱 - An explosion in Rafah in southern Gaza killed eight Israeli soldiers in a Namer armored combat engineering vehicle, raising the Israel Defense Forces (IDF) death toll to 307 in the ground offensive against Hamas and operations throughout from the Gaza border. The… pic.twitter.com/5e1tiV6Hgb— 🔥🗞The Informant (@theinformant_x) June 15, 2024 శనివారం జరిగిన పేలుడులో 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందటం భారీ నష్టమని తెలిపారు. ఇక.. ఇప్పటివరకు 306 మంది ఇజాయెల్ సైనికులు మృతి చెందారని అన్నారు. మృతి చెందిన సైనికులకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాళులు అర్పించారు. సైనికుల భారీ నష్టంతో తన హృదయం ముక్కలైందని అన్నారు. అస్థిరమైన పరిస్థితులు నెలకొన్నా.. భారీ నష్టం జరిగినా యుద్ధ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. -
Rahul Gandhi: ‘అగ్నిపథ్’లో వివక్షను అడ్డుకోండి
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం అమలులో జోక్యం చేసుకుని అమర జవాన్ల కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ జాతి భద్రతపై ప్రభావం కలిగించే ఈ అంశంపై సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు శనివారం రాహుల్ ఒక లేఖ రాశారు. దేశం కోసం జీవితాలనే త్యాగం చేస్తున్న అగ్నివీర్లకు మిగతా సైనికుల మాదిరిగానే ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు. -
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
జమ్మూ: జమ్మూకశీ్మర్లోని పూంఛ్ జిల్లాలో భారత వాయుసేన జవాన్ల వాహనశ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. బలగాలు సనాయ్టోప్లోని శిబిరానికి తిరిగొస్తుండగా సురాన్కోటె పరిధిలోని షాసితార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఒక వాహనం విండ్్రస్కీన్పై డజనుకుపైగా బుల్లెట్ల దాడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఏకే రకం రైఫిళ్లతో దాడి చేసిన ఉగ్రవాదులు తర్వాత సమీప అడవిలోకి పారిపోయారు. గాయపడిన జవాన్లకు ఉధమ్పూర్లోని కమాండ్ ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. దాడి విషయం తెల్సి అప్రమత్తమైన సైన్యం, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రా్రïÙ్టయ రైఫిల్స్ బృందాలు అణువణువునా గాలిస్తున్నాయి. కాన్వాయ్ సురక్షితంగా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని వాయుసేన ‘ఎక్స్’లో పోస్ట్చేసింది. గత ఏడాది డిసెంబర్ 21న ఇక్కడి దగ్గర్లోని బఫ్లియాజ్లో సైన్యంపై మెరుపుదాడి చేసి నలుగురిని పొట్టనబెట్టుకున్న ఉగ్రముఠాయే ఈ దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఫూంచ్లో గత రెండేళ్లుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. -
Lok Sabha Election 2024: పొలిటికల్ టాప్ గన్స్.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు
వారు కదన రంగంలో శత్రువుల భరతం పట్టిన వీర సైనికులు. రెండో ఇన్సింగ్స్లో రాజకీయ రణరంగంలోనూ అంతే గొప్పగా రాణించారు. త్రివిధ దళాల్లో పలు హోదాల్లో దేశానికి సేవలందించిన సైనిక ఉన్నతాధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. జశ్వంత్సింగ్, రాజేశ్ పైలట్ మొదలుకుని తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) బదౌరియా దాకా ఈ జాబితా పెద్దదే...జశ్వంత్ సింగ్ బహుముఖ ప్రజ్ఞాశీలి సైనికాధికారిగా శత్రువులతో పోరాడిన జశ్వంత్ రాజకీయాల్లో చేరి రక్షణ మంత్రిగా త్రివిధ దళాలకు బాస్ అయ్యారు. 1965లో ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న జశ్వంత్ మేజర్ హోదాలో 1966లో పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జన సంఘ్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 దాకా ఐదుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989లో సొంత రాష్ట్రం రాజస్తాన్లోని జో«ద్పూర్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. వాజ్పేయి ప్రభుత్వంలో 1998 నుంచి 2004 దాకా కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు చూశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అత్యధిక కాలం పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన కొద్దిమందిలో జశ్వంత్ ఒకరు. రాజేశ్ ‘పైలట్’ అసలు పేరు రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి. పైలట్ వృత్తినే పేరులోనే చేర్చుకుని రాజకీయాల్లో వెలుగు వెలిగారు. భారత వైమానిక దళంలో బాంబర్ పైలట్గా 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడారు. స్క్వాడ్రన్ లీడర్ హోదాలో రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజీవ్కు సన్నిహితుడు. 1980లో కాంగ్రెస్ తరఫున భరత్పూర్ లోక్సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 దాకా ఎంపీగా గెలిచారు. కేంద్రంలో పలు కీలక శాఖలకు మంత్రిగా చేశారు. 2000 జూన్లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన తనయుడు సచిన్ పైలట్ కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగుతున్నారు.అమరీందర్ కెప్టెన్ టు సీఎం కెపె్టన్ అమరీందర్ సింగ్ జవాన్ల కుటుంబం నుంచి వచ్చారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుకు చుక్కలు చూపించారు. కెపె్టన్ హోదాలో రిటైరైన ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజీవ్. అమరీందర్ 1980లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2017 దాకా మూడుసార్లు పంజాబ్ పీసీసీ చీఫ్గా, 2002 నుంచి 2007 దాకా సీఎంగా చేశారు. 2017లో మళ్లీ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు. కాంగ్రెస్ వర్గ విభేదాలతో పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేశారు. బి.సి.ఖండూరీ స్వర్ణ చతుర్భుజి సారథి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించిన భువన్ చంద్ర ఖండూరీ 1954 నుంచి 1990 దాకా భారత సైన్యంలో సేవలందించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఆర్మీ ఇంజనీర్ ఇన్ చీఫ్ విభాగంలో అదనపు డైరెక్టర్ జనరల్ దాకా కీలక హోదాల్లో పని చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో రెజిమెంట్ కమాండర్గా పోరాడారు. మేజర్ జనరల్ హోదాలో రిటైరయ్యారు. 1991లో తొలిసారి ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ లోక్సభ స్థానం నుంచి నెగ్గారు. ఐదుసార్లు ఎంపీ అయ్యారు. వాజ్పేయి ప్రభుత్వంలో రహదారులు, హైవేల మంత్రిగా చేశారు. దేశ నలు దిక్కులను కలిపిన స్వర్ణ చతుర్భుజి హైవేల ప్రాజెక్టును దిగ్విజయంగా అమలు చేసిన ఘనత ఖండూరీదే. నిజాయితీకి మారుపేరైన ఆయన ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజేతగా నిలిపి సీఎం అయ్యారు.అయూబ్ ఖాన్ వార్ హీరో సైనికుల కుటుంబం నుంచి వచ్చిన అయూబ్ ఖాన్ 1965 ఇండో పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. భారత సైన్యంలోని 18వ సాయుధ అశి్వక దళంలో రిసాల్దార్గా పని చేస్తున్న అయూబ్ను యుద్ధంలో జమ్మూకశీ్మర్ సియాల్కోట్ సెక్టార్లో నియమించారు. పాకిస్తాన్ సైన్యం యుద్ధ ట్యాంకులతో మన జవానులను చుట్టుముడుతున్న తరుణంలో నాలుగు పాక్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంతో పాటు ఒక ట్యాంకును స్వా«దీనం చేసుకుని శత్రువుకు చుక్కలు చూపించారు. ఆ యుద్ధంలో పరాక్రమానికి వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు. గౌరవ కెపె్టన్ హోదా కూడా దక్కింది. ‘నేను పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ను కలుసుకోలేదు గానీ భారతీయ అయూబ్ను కలిసినందుకు గర్వంగా ఉంది’ అంటూ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ వీర సైనికున్ని హత్తుకోవడం విశేషం. 1983లో రిటైరయ్యాక అయూబ్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అయూబ్ను ఒప్పించి మరీ ఎన్నికల్లో నిలబెట్టారు. రాజస్తాన్లోని ఝుంఝును నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ రాష్ట్రం నుంచి తొలి ముస్లిం ఎంపీగా కూడా చరిత్ర సృష్టించారు. 1991లో రెండోసారి విజయం సాధించి, పీవీ కేబినెట్లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.కాండెత్ గోవా విముక్తి వీరుడు దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా గోవాలో మాత్రం 1961 దాకా పోర్చుగీసు వలస పాలనే సాగింది. 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను విలీనం చేసుకుంది. ఈ కీలక సైనిక చర్యకు సారథ్యం వహించిన ధీరుడు కేరళకు చెందిన మేజర్ జనరల్ కున్హిరామన్ పాలట్ కాండెత్. తర్వాత కొంతకాలం గోవా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో పశి్చమ కమాండ్ సైనిక బలగాన్ని నడిపించారు. పరమ విశిష్ట సేవా మెడల్తో పాటు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1972లో లెఫ్టినెంట్ జనరల్గా రిటైరయ్యారు. 1990ల్లో బీజేపీలో చేరారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా చేశారు. జనరల్ వీకే సింగ్... రాజకీయాల్లో సక్సెస్ భారత సైన్యంలో కమాండో స్థాయి నుంచి ఆర్మీ ఛీఫ్ అయిన తొలి వ్యక్తి జనరల్ విజయ్ కుమార్ సింగ్. 1971 ఇండో–పాక్ యుద్ధంతో సహా అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2012 దాకా సైనిక దళాధిపతిగా చేశారు. రిటైరయ్యాక 2014లో బీజేపీలో చేరారు. స్వరాష్ట్రం యూపీలోని ఘాజియాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. 2019లో రెండోసారి విజయం సాధించారు. మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేశారు.విష్ణు భగవత్... గురి తప్పిన టార్పెడో భారత నావికాదళంలో అత్యంత ప్రతిభాపాటవాలతో అత్యున్నత పదవికి చేరుకున్న అడ్మిరల్ విష్ణు భగవత్... వివాదాస్పద వ్యవహార శైలితో అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో, పోర్చుగీస్ చెర నుంచి గోవాకు విముక్తి కలి్పంచిన ఆపరేషన్ విజయ్లో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదాల కారణంగా 1998లో ఉద్వాసనకు గురయ్యారు. నేవీ చీఫ్గా ఉంటూ వేటుకు గురైన తొలి వ్యక్తి ఆయనే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అడ్మిరల్ హోదానూ కోల్పోయారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్ రాజకీయాల్లో కొంతకాలం చురుగ్గా వ్యవహరించారు. ‘ఉత్తమ’ ఫైటర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైమానిక దళంలో మిగ్ 21, మిగ్ 23 వంటి ఫైటర్ జెట్లు నడిపి శత్రువులపై పోరాడారు. రాజకీయాల్లోనూ రియల్ ఫైటర్గా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ 1982 నుంచి 1991 దాకా ఎయిర్ఫోర్స్లో ఫైటర్ పైలట్గా చేశారు. 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లో కోదాడ నుంచి ఓడినా 1999లో అక్కడి నుంచే విజయఢంకా మోగించారు. మూడు దశాబ్డాల రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్లగొండ ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా చేశారు. తాజాగా హుజారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఉత్తమ్ భార్య పద్మావతి కూడా రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో వచి్చన టెర్రర్ అనే తెలుగు సినిమాలో ఆయన సీఎం పాత్ర పోషించడం విశేషం!జేజే సింగ్... తొలి సిక్కు ఆర్మీ చీఫ్ జోగిందర్ జస్వంత్ సింగ్. తొలి సిక్కు ఆర్మీ జనరల్. 2005 నుంచి 2007 దాకా దేశ 21వ ఆర్మీ చీఫ్గా సేవలందించారు. రిటైరయ్యాక 2008లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా అయ్యారు. 2017లో అకాలీదళ్లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కెపె్టన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడారు. 2019లో అకాలీదళ్ (తక్సలీ)లో నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరారు. వీకే సింగ్ తర్వాత కాషాయం తీర్థం పుచ్చుకున్న రెండో జనరల్గా నిలిచారు.బదౌరియా... పొలిటికల్ టేకాఫ్ రాజకీయాల్లోకి వచి్చన తొలి వైమానిక దళపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా చరిత్ర సృష్టించారు. ఎయిర్ఫోర్స్ ఫైటర్గా విధుల్లో చేరిన ఆయన 41 ఏళ్ల కెరీర్లో 26 రకాల ఫైటర్ జెట్స్, రవాణా విమానాలు నడిపిన విశేష ప్రతిభావంతుడు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ చీఫ్ టెస్ట్ పైలట్గా, ప్రాజెక్ట్ టెస్టింగ్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. 2019 నుంచి 2021 దాకా ఎయిర్ఫోర్స్ చీఫ్గా చేసి రిటైరయ్యారు. ఇటీవలే బీజేపీలో చేరారు. రాథోడ్ గురి పెడితే... టార్గెట్ తలొంచాల్సిందే! యుద్ధభూమి అయినా, క్రీడా మైదానమైనా ఆయన గురి పెడితే టార్గెట్ తలొంచాల్సిందే! ఆయనే కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. విశ్వ క్రీడా ప్రపంచంలో భారత్కు ఘన కీర్తి సాధించి పెట్టిన అభినవ అర్జునుడు. చదువులోనూ, ఆటలోనూ ‘గోల్డెన్’ బాయ్గా నిలిచిన రాథోడ్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఆ ఈవెంట్లో ఆయన నెలకొలి్పన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 2004 గ్రీస్ ఒలింపిక్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో వెండి పతకం కొట్టడంతో రాథోడ్ పేరు మారుమోగింది. ఒలింపిక్స్లో భారత్కు అదే తొలి వ్యక్తిగత వెండి పతకం! కెరీర్లో ఏకంగా 25 అంతర్జాతీయ పతకాలను సొంతం చేసుకున్నారు. 2013లో ఆర్మీ నుంచి రిటైరై బీజేపీలో చేరారు. 2014 లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. మోదీ ప్రభుత్వంలో సమాచార, క్రీడా మంత్రిగా చేశారు. 2019లోనూ ఎంపీగా గెలిచారు. 2023లో రాజస్తాన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యాకు ఎదురుదెబ్బ
కీవ్: ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణాప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై రెండు క్షిపణిలు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గియో షొయిగూ నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో రష్యా సైన్యం విజయాలను పుతిన్కు వివరించిన సెర్గియో ఈ దాడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం డొనెట్కŠస్ రీజియన్లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రాంతంలో ఉండే 36వ రైఫిల్ బ్రిగేడ్ ట్రుడోవ్స్కే గ్రామంలో ఒక మేజర్ జనరల్ రాకకోసం వేచి చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఒకే చోట డజన్లకొద్దీ జవాన్లు విగతజీవులుగా పడి ఉన్న వీడియో ఒకటి అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది. అమెరికా తయారీ హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ సిస్టమ్(హిమార్స్) నుంచి దూసుకొచి్చన మిస్సైళ్లే ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా వ్యతిరేకంగా సైనిక వార్తలు రాసే బ్లాగర్ ఆండ్రీ మొరజోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన టెలిగ్రామ్ చానెల్కు లక్ష మంది చందాదారులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాల్లో రష్యా తోకముడిచిందంటూ, వేల మంది సైనికులు చనిపోయారని తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలను వెంటనే తొలగించాలంటూ రష్యా సైన్యం నుంచి ఈయన చాన్నాళ్లుగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంకెవరో వచ్చి చంపే బదులు తానే కాల్చుకుని చస్తానని తన బ్లాగ్లో రాశాడని వార్తలొచ్చాయి. ఇప్పటిదాకా యుద్ధంలో రష్యా 45వేలకుపైగా సైన్యాన్ని కోల్పోయిందని ‘బీబీసీ రష్యా’ తెలిపింది. -
Russia-Ukraine war: చేజారిన తోడే.. బొడ్డుతాడై...
ఉక్రెయిన్. ఒకప్పటి అందాల దేశం. ఇప్పుడు రష్యా రక్త దాహానికి బలైన శిథిల చిత్రం. యుద్ధం మిగిల్చే బీభత్సానికి సాక్షి. పోరులో ప్రాణాలొదిలిన వేలాది మంది ఉక్రెయిన్ యువ సైనికుల జీవిత భాగస్వాములది మాటలకందని దైన్యం. వారిలోనూ అసలు సంతానమే లేనివారిదైతే చెప్పనలవి కాని వ్యథ. ఎవరి కోసం బతకాలో తెలియని నైరాశ్యం. అయితే తమ జీవిత భాగస్వాములు ముందుజాగ్రత్తగా భద్రపరిచి వెళ్లిన వీర్యం/అండాలు వారిలో కొత్త ఆశలు నింపుతున్నాయి. వాటి సాయంతో బిడ్డలను కంటున్నారు. తమను శాశ్వతంగా వీడి వెళ్లిన తోడు తాలూకు నీడను వారిలో చూసుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు... ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలై రెండేళ్లవుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై రష్యా సైన్యం హఠాత్తుగా విరుచుకుపడింది. రోజుల్లో తల వంచుతుందనుకున్న ఉక్రెయిన్ దీటుగా పోరాడుతోంది. దాంతో రెండేళ్లయినా పోరు కొనసాగుతూనే ఉంది. యుద్ధమంటేనే ప్రాణనష్టం! ఇప్పటిదాకా ఏకంగా 70,000 మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించినట్లు అంచనా. మరో లక్షన్నర మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. యుద్ధంలో జవాను వీరమరణం పొందితే అతడి/ఆమె వంశం అంతమైపోవాల్సిందేనా? బతికుండగానే అండాలు, వీర్యం భద్రపర్చుకొని, తాము లేకపోయినా జీవిత భాగస్వామి ద్వారా సంతానం పొందే వెసులుబాటును ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇలాంటి ప్రశ్నలు ఉక్రెయిన్ సైన్యం నుంచి గట్టిగా వినిపించాయి. దీనిపై ప్రభుత్వమూ సానుకూలంగా స్పందించింది. పార్లమెంటులో ఇటీవలే ఒక బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్స్కీ సంతకం చేస్తే చట్టంగా మారనుంది. ఇదొక విప్లవాత్మక చట్టం కానుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. యుద్ధంలో మరణించినవారి వీర్యం/అండాలతో సంతానం పొందే అవకాశం ఇప్పటిదాకా ఉక్రెయిన్లో చట్టపరంగా లేదు. ఇక ఈ పరిస్థితి మారనుంది... ► ఉక్రెయిన్ పార్లమెంట్లో ఆమోదించిన బిల్లు ప్రకారం జవాన్లు తమ వీర్యం, అండాలు భద్రపర్చుకోవచ్చు. వారు యుద్ధంలో అమరులైతే వాటి సాయంతో జీవిత భాగస్వాములు సంతానం పొందవచ్చు. ► ఈ కొత్త చట్టాన్ని అంతా స్వాగతిస్తున్నారు. దీని ద్వారా అమర సైనికుల కుటుంబ వారసత్వం కొనసాగుతుందంటున్నారు. ► జవాన్ల వీర్యం/అండాలు ఉచితంగా భద్రపరుస్తామని ఉక్రెయిన్లో పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. యుద్ధం మొదలైనప్ప టి నుంచే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాయి. ► ఇందుకు వీలుగా యుద్ధంలో మృతి చెందిన జవాన్ల వీర్యం/అండాలను మూడేళ్ల పాటు భద్రపరుస్తారు. ఇందుకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తుంది. ► వీర్యం/అండాలు భద్రపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న సైనికుల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. ప్రభుత్వం అనుమతితో పాటు ఆర్థిక సాయమూ అందిస్తుందని స్పష్టత రావడమే కారణమని తెలుస్తోంది. ► యుద్ధంలో క్షతగాత్రులై, ఆరోగ్యం దెబ్బతిని సంతానోత్పత్తికి, బిడ్డలకు జన్మనిచ్చే సామర్థ్యానికి దూరమైన సైనికులు కూడా వీర్యం/అండాలను భద్రపర్చుకుని సంతానం పొందవచ్చు. ► యుద్ధంలో గాయపడిన పలువురు జవాన్లు ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ► ఇలా భద్రపర్చిన వీర్యం/అండాలతో పుట్టే పిల్లలకు చట్టబద్ధంగా అన్ని హక్కులూ ఉంటాయి. అమర వీరులైన తల్లి/తండ్రి పేరును వారి బర్త్ సరి్టఫికెట్లో ముద్రిస్తారు! ► ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నవారు కూడా మరో బిడ్డను కనడానికి ముందుకొస్తున్నారు. ఇలా భద్రపర్చుకుంటున్న జవాన్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. మన పాప నవ్వుల సాక్షిగా... నువ్వెప్పటికీ నాతోనే... మనసుతో చూడగలిగితే లక్ష భావాలను, కోటి ఊసులను కళ్లకు కట్టే ఫొటో ఇది. ఇందులో నేపథ్యంలోని పోస్టర్లో కనిపిస్తున్నది రష్యాతో పోరులో మరణించిన ఉక్రెయిన్ సైనికుడు విటాలీ. బుల్లి పాపాయిని ఎత్తుకున్నది అతని భార్య విటాలినా. భర్త మరణానంతరం ఆయన వీర్యంతో గర్భం దాల్చి ఈ పండంటి పాపాయికి జన్మనిచి్చందామె. కూతురిని భర్త ఫొటోకు చూపిస్తూ ఇలా భావోద్వేగానికి గురైంది. రష్యాతో యుద్ధం మొదలయ్యే కొద్ది నెలల ముందే విటాలీ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ యుద్ధం మొదలైన తొలి నాళ్లలోనే మరణించాడు. అప్పటికే విటాలినా 13 వారాల గర్భవతి. కానీ ఆ గర్భం నిలవలేదు. భర్త క్షేమం తాలూకు ఆందోళనే అందుకు ప్రధాన కారణమని ఇప్పటికీ కన్నీళ్లపర్యంతం అవుతుంటుంది విటాలినా. ‘‘అటు జీవితాంతం తోడుండాల్సిన భర్తను, ఇటు ఇంకా లోకమే చూడని మా కలల పంటను కొద్ది రోజుల తేడాతో శాశ్వతంగా కోల్పోయా. బతుకంతా ఒక్కసారిగా శూన్యంగా తోచింది’’ అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుందామె. ‘‘ఇలాంటి పరిస్థితిని ఊహించే నా భర్త వీర్యాన్ని భద్రపరిచి వెళ్లాడు. దాని సాయంతో తల్లిని కావాలని నిర్ణయించుకున్నా. అలా ఈ చిట్టి తల్లి ఈ లోకంలోకి అడుగు పెట్టింది. తన రాకతో నాకు నిజంగా సాంత్వన చేకూరింది. పాప వాళ్ల నాన్న పోలికలనే గాక హావభావాలను కూడా ముమ్మూర్తులా పుణికి పుచ్చుకుంది. దైవ కృప అంటే బహుశా ఇదేనేమో. నిజానికి గంపెడు సంతానాన్ని కనాలని, మాది పెద్ద కుటుంబం కావాలని పెళ్లికి ముందు నుంచీ ఎన్నెన్నో కలలు కన్నాం. కానీ విధి రాత మరోలా ఉంది. అయినా తను ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఈ చిట్టితల్లి రూపంలో ఇలా ఫలించింది’’ అంటుంటే విని చెమర్చని కళ్లు లేవు. కాస్త అటూ ఇటుగా ఉక్రెయిన్ సైనిక వితంతువులందరి గాథ ఇది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళా(ఐడీఎఫ్)నికి తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒకే ఘటనలో 27 మంది సైనికులు మృతి చెందారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్పై యుద్ధం మొదలయ్యాక ఇంతమంది సైనికులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. యుద్ధం నిలిపేసి, బందీలను విడుదలయ్యేలా చూడాలంటూ నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఇజ్రాయెల్కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. పూర్తి స్థాయి విజయం సిద్ధించే దాకా యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. -
భారత్లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మయన్మార్ ప్రభుత్వ ఆర్మీ(జుంటా) సైనికులు భారత్లోకి చొచ్చుకురావటంపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయటంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో పటిష్టమైన కంచెను ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలాంటి కంచె ఉందో.. ఇక్కడ (భారత్-మయన్మార్) సరిహద్దు వద్ద కూడా చాలా పటిష్టమైన కంచె ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో మనదేశంలోకి సరిహద్దులు దాటుకొని మయన్మార్ సైనికులు రావటం సాధ్యం కాదని పేర్కొన్నారు. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్లో ఆశ్రయం పొందుతున్నారు. మయన్మార్ ఆర్మీ సైనికుల విషయాన్ని.. మిజోరం సీఎం లాల్దుహోమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. భారత సరిహద్దుల్లోని మిజోరం ప్రాంతం నుంచి మయన్మార్ ఆర్మీ సైనికులను వెనక్కి పంపించాలని కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన విషయం తెలిసిందే. చదవండి: భారత్లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన -
భారత్లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన
గౌహతి: మయన్మార్లో కొన్ని రోజులుగా దేశ సైనిక ప్రభుత్వం, అక్కడి ప్రజాస్వామ్య సాయుధ దళాలకు మధ్య ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మయన్మార్ ఆర్మీ(జుంటా) సైనికులు భారత సరిహద్దులు దాటి భారత్లోని మీజోరంకి వరుసకడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం అప్రమత్తమైంది. మీజోరం భూభాగంలోకి చొచ్చుకువస్తున్న జుంటా సైనికులను వెంటనే మయన్మార్కు తిరిగి పంపిచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్లో ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద ఎత్తున సరిహద్దు దాటుకొని మిజోరం వైపు వస్తున్న మయన్మార్ సైనికులను వెనక్కి పంపిచాలని మిజోరం సీఎం లాల్దుహోమ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు మిజోరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిత్త పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్థిరత్వం నెలకొల్పడానికి మయన్మార్ సైనికులు వెనక్కి పంపించాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఇక.. ఇటీవల తరచూ మయన్మార్ సైనికలు భారత సరిహద్దులు దాటుకొని మిజోరం రాష్ట్రంలోకి వస్తున్నారని మిజోరం సీఎం లాల్దుహోమ తెలిపారు. మనవతా సాయం కింద మయన్మార్ సైనికులకు తాము సైనిక క్యాంప్లో సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇలా 450 మంది జుంటా సైనికులను వెనక్కి పంపించినట్లు తెలిపారు. 2021 నుంచి మయన్మార్లో సైనిక ప్రభుత్వం.. ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు నగరాల్లోని సైనిక స్థావరాలను తిరుగుబాటు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: గాంధీలను మించిన అవినీతి పరులు ఎవరైనా ఉంటారా? -
పూంచ్లో జిల్లాలో ఆర్మీ కాన్వాయ్పై మరోసారి ఉగ్రదాడి..
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలో ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్పై శుక్రవారం సాయంత్రం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. సమీపంలోని కొండపై నుంచి జవాన్లపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సైనిక బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచార మేరకు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది. సంఘటన స్థలంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా దాడికి గురైన ఆర్మీ కాన్వాయ్లో అనేక వాహనాలు ఉన్నట్లు సమాచారం. కాగా నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో సహా ఉన్నత స్థాయి అధికారులు ప్రస్తుతం పూంచ్లోనే ఉన్నారు. అక్కడ తరుచూ జరుగుతున్న తీవ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరగడం గమనార్హం. గత ఆరు ఏడు నెలల్లో పిర్ పంజాల్ ప్రాంతంలో( రాజౌరీ, పూంచ్) ఉగ్రదాడులు ఎక్కువయ్యాయని, ఈ కాలంలో అధికారులు కమాండోలతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఇక నెల రోజుల వ్యవధిలో పూంచ్ జిల్లాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. మూడు వారాల క్రితం పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల వాహానాలపై ముష్కరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. ఈ దాడుల వెనక పాకిస్థాన్ - చైనా పన్నిన కుట్ర దాగుందని భారత రక్షణశాఖ వర్గాలు విశ్వసించాయి. -
తీవ్ర గాయాలతో భారత్లోకి మయన్మార్ సైనికులు.. ఏమైందంటే?
మయన్మార్ (బర్మా) చెందిన 151 మంది సైనికులు భారత్లోకి చొచ్చుకొని వచ్చారు. మిజోరం రాష్ట్రంలో గల సరిహద్దు జిల్లా లాంగ్ట్లైలోకి మమన్మార్ సైనికులు తరలివచ్చినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి వెల్లడించారు. ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థ అయిన అరాకన్ ఆర్మీ(ఏఏ) ఆ దేశ సైన్యం ‘తత్మాదవ్’ క్యాంప్ను ధ్వంసం చేసింది. దీంతో మయన్మార్ సైన్యంలోని 151 మంది సైనికులు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోని మిజోరంలోకి ప్రవేశించారు. కాగా.. కొన్ని రోజులుగా భారత్ సరిహద్దుకు సమీపంలోని మయన్మార్ ప్రాంతంలో ఆ దేశ సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల సాయుధ సంస్థ అరాకన్ ఆర్మీకి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తీవ్రమైన గాయాలతో కొంతమంది సైనికులు భారత్లోకి వచ్చినట్లు ధ్రువీకరించారు. అయితే అస్సాం రైఫిల్స్ అధికారులు గాయపడిన మయన్మార్ సైనికులకు ప్రథమ చికిత్స అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మయన్మార్ సైనికులు అస్సాం రైఫిల్స్ కస్టడీలో మయన్మార్ సరిహద్దు వద్ద ఉన్నారని పేర్కొన్నారు. వారిని మయన్మార్ పంపించడానికి భారత దేశ విదేశాంగ శాఖ, మయన్మార్ మిలిటరీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయని అస్సాం రైఫిల్స్ అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్లో సైనిక పాలనను కూలదోసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అక్కడి ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు ఉమ్మడిగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్రీబ్రదర్హుడ్ అలయన్స్ (టీబీఏ), మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్డీఏఏ), టాంగ్ జాతీయ విమోచన సైన్యం(టీఎన్ఎల్ఏ), అరాకన్ ఆర్మీ(ఏఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. చదవండి: హౌతీ రెబెల్స్ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా -
ఉగ్రదాడులను తేలికగా తీసుకోవద్దు: రాజ్నాథ్ సింగ్
జమ్మూ కశ్మీర్: దేశం కోసం సేవ చేసే ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడు అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం జమ్మూ కశ్మీర్లోని రాజౌరీలో పర్యటించారు. ఉగ్రవాద దాడుల్లో రెండు ఆర్మీ వాహనాల్లో ఉన్న నలుగురు సైనికులు మృత్యువాతపడ్డ పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన జమ్మూ కశ్మీర్లోని భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు, సైనికులతో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. సరిహద్దుల్లో దేశ కోసం పోరాడే ప్రతి సైనికుడిని తమ కుటుంబ సభ్యుడిగా ప్రతి భారతీయుడు భావించాలని అన్నారు. భద్రత, ఇంటలీజెన్స్ విభాగాలు ఉగ్రదాడులను నిలువరించడానికి కృషి చేస్తాయని తెలిపారు. సైనికులకు ఈ విషయంలో ఎటువంటి నిఘా వ్యవస్థ అవసరం పడినా ప్రభుత్వం నుంచి అందిస్తామని పేర్కొన్నారు. భద్రతా బలగాలకు సౌకర్యాలు అందించడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ దాడులను ఎట్టి పరిస్థితుల్లో తేలికగా తీసుకోవద్దని మంత్రి సూచించారు. ‘మీరు(సైనికులు) అప్రమత్తంగా ఉన్నారని తెలుసు. కానీ ఇంకా ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి. మీ ధైర్యసాహసాలు మాకు గర్వకారణం. మీ త్యాగాలను ఎవరూ పూడ్చలేరు. దేశ సరిహద్దుల్లో వెలకట్టలేని సేవ చేస్తున్నారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం సంక్షేమం, భద్రత పరంగా అండగా ఉంటుంది’ అని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. చదవండి: ఉత్తరాఖండ్ భూ చట్టాల్లో భారీ మార్పులు ! -
Israel: సైనికులకు దొరికిన ‘అల్లావుద్దీన్’ దీపం !
జెరూసలెం: రెండు నెలలుగా హమాస్తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ సైనికులకు కాస్త ఆటవిడుపు లభించింది. గాజా సమీపంలో అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని పోలి ఉన్న ఒక వస్తువు వారికి దొరికింది. దీనిని 1500 సంవత్సరాల కిందటి బైజెంటీన్ కాలం నాటి దీపంగా గుర్తించారు. ‘ఫీల్డ్లో తిరుగుతున్నపుడు కింద ఒక పురాతన వస్తువు దొరికింది. దాని గుండ్రటి ఆకారం నన్ను ఆకర్షించింది. ఆ వస్తువు పై భాగం బురదతో కప్పి ఉంది. దానిని శుభ్రం చేశాను. వెంటనే ఆ వస్తువను ఇజ్రాయెల్ ఆంటిక్విటీస్ అథారిటీ(ఐఏఏ)కి చెందిన ఆర్కియాలజిస్ట్కు అప్పగించాను’ అని సైనికుడు తెలిపాడు. ‘పురాతన వస్తువును పరిశీలించిన ఐఏఏ అది 5 లేదా 6వ శతాబ్దానికి చెందిన బైజెంటీన్ కాలం నాటి ‘సాండల్ క్యాండిల్’ అని వెల్లడించింది. క్యాండిల్ దొరికిన వెంటనే తమకు ఇచ్చిన సైనికులకు ఐఏఏ ధన్యవాదాలు తెలిపింది. ఇజ్రాయెల్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గొప్ప సంస్కృతి, పురాతన కాలం నాటి విలువైన సంపద ఉందని వెల్లడించింది. ఇదీచదవండి..హౌతీ రెబెల్స్పై అమెరికా కీలక ప్రకటన -
జమ్మూకశ్మీర్లో ఉగ్ర ఘాతుకం.. వెలుగులోకి కీలక విషయాలు
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సాయుధ ఉగ్రవాదులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. రెండు సైనిక వాహనాలపై మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సురాన్కోట్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి జరిగింది. గాలింపు చర్యల కోసం వెళ్తున్న సైనిక వాహనాలపై దత్యార్మోర్హ్ వద్ద ముష్కరులు దాడి చేశారు. ఒక ట్రక్కు, మరో జిప్సీపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కాగా ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూంచ్లో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ ఆధారిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ యాంటీ–ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. గతంలో కూడా ఈ సంస్థ దాడులకు పాల్పడింది. 2019లో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా(ఆర్టికల్ 370) రద్దు చేసిన తర్వాత తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు, పౌరులపై జరిగిన ఉగ్రదాడుల్లో చాలా వరకు పీఏఎఫ్ఎఫ్ చేసినవే. ఈ అటాక్లో ఉగ్రవాదులు అమెరికా తయారీ రైఫిళ్లు 4 కార్బైన్ను ఉపయోగించారు. దాడికి పాల్పడిన ఆయుధాలతో ఉగ్రవాదులు సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు. M4 కార్బైన్ అనేది 1980లలో యూఎస్లో అభివృద్ధి చేశారు. గ్యాస్ ఆపరేటెడ్, తేలికపాటి మ్యాగజైన్ ఫెడ్ కార్బైన్. ఇది అమెరికా సాయుధ దళాల ఆయుధం. ప్రస్తుతం దీనిని 80కి పైగా దేశాల్లో వాడుతున్నారు. పలు తీవ్రవాద సంస్థలు ఈ ఆయుధాన్ని వాడుతున్నాయి. వారు దాడులను రికార్డు చేసేందుకు బాడీ కెమెరాలను ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాత ఈ వీడియోలను తమ సంస్థను ప్రచారం చేసేందుకు ఉపయోగించుకుంటాయి. ఈ విధంగానే ఈ ఏడాది ఏప్రిల్లో పూంచ్లో ఆర్మీ ట్రక్కుపై పీఏఎఫ్ఎఫ్ దాడి చేసి వీడియో తీసింది. దాడిలో మరణించిన సైనికుల ఆయుధాలతో ఉగ్రవాదులు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నట్లు చూపించిన వీడియోను తరువాత విడుదల చేసింది. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఆర్మీ అధికారుల మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజౌరి జిల్లాలోని కలకోట్ అడవిలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో ఇద్దరు ఆర్మీ అధికారులతోపాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ సమచారంతో ఆర్మీ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసుల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. కాగా జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్ల జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు స్థావరాలుగా మారాయి. దీంతో ఈ ప్రాంతం భద్రతా దళాలకు సవాలుగా మారింది. గత వారం కూడా రాజౌరీ జిల్లాలో భద్రతాబలగాలకు, ఆర్మీకి మధ్య ఎన్కౌంటర్లో ఓఉగ్రవాది హతమయ్యాడు. బుధాల్ తహసీల్ పరిధిలోని గుల్లెర్-బెహ్రూట్ ప్రాంతంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ కార్డన్ సెర్చ్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చదవండి: Air India: టాటా గ్రూప్ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా.. -
ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం
జెరూసలేం: హమాస్ పాశవిక దాడిపై ఇజ్రాయెలీలు మండిపడుతున్నారు. చీకటిమాటున తీసిన దొంగ దెబ్బపై కనీవినీ ఎరగని రీతిలో ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. హమాస్ను సర్వనాశనం చేసి గానీ విశ్రమించేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేసిన నెతన్యాహు.. యుద్ధంలో మరోస్థాయికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ మేరకు గాజాపై పోరాడుతున్న ఫ్రంట్లైన్ ఇజ్రాయెల్ దళాలను ప్రధాని బెంజమన్ నెతన్యాహు కలిశారు. తొమ్మిదో రోజు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సైనికులను సందర్శించి వారిలో మనోధైర్యాన్ని పెంచారు. యుద్ధంలో మరో స్థాయికి వెళ్లనున్నామని తెలిపిన నెతన్యాహు.. ఇందుకు సిద్ధమేనా అంటూ సైనికులను అడిగారు. అందుకు వారు సిద్ధమని చెబుతూ తలలు ఊపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. యుద్ధంలో అసలైన ఘట్టం వచ్చేసిందని ప్రధాని నెతన్యాహు అన్నారు. హమాస్ 'ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ బ్యాటిల్'కు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' గురించి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని సైనికులతో కరచాలనం చేశారు. యుద్ధంలో మరోస్థాయికి వెళుతున్నామని సైనికులకు తెలిపిన వీడియో బయటకు వచ్చింది. గాజాను ఖాలీ చేయాలని పౌరులను హెచ్చరించిన ఇజ్రాయెల్.. యుద్ధాన్ని తదుపరి మరింత ఉద్ధృతం చేయనున్నట్లు స్పష్టమవుతోంది. అటు.. గాజాను వీడకూడదంటూ హమాస్ దళాలు పిలుపునిచ్చాయి. ఈ హోరాహోరి పోరు రానున్న రోజుల్లో యుద్ధం మరింత భీకర స్థాయికి చేరనున్నట్లు తెలుస్తోంది. భూతల దాడి.. ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి దళాలను సమన్వయం ఏర్పరిచింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి డానిల్ హాగరీ అన్నారు. ఇస్మాయిల్ హనియే తర్వాత రెండవ స్థానంలో ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ను నిర్మూలించడం గ్రౌండ్ అటాక్ ముఖ్య లక్ష్యం. బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను ఈ దాడుల ద్వారా కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. గత శనివారం ఇజ్రాయెల్లపై జరిగిన అకృత్యాలకు సిన్వార్ బాధ్యత వహించాడని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనికి గ్రౌండ్ అటాక్ మాత్రమే సరైనదని భావిస్తున్నారు. ఈ వారాంతంలో ఈ దాడి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా సరిహద్దులో 30,000 ఇజ్రాయెల్ సైనికులు వేచి ఉన్నారు. 10,000 మంది సైనికులు గాజాలోకి అడుగుపెట్టారు. ఈ దాడులకు కావాల్సిన యుద్ధ సామగ్రిని, యుద్ధం ట్యాంకులను సరిహద్దుకు చేర్చారు. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేయడంతో యుద్ధం ఆరంభం అయింది. హమాస్ దాడులకు ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో బదులిస్తోంది. భూతల, వాయు మార్గాల్లో వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. తొమ్మిది రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరుపక్షాల వైపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్లో 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలో 1900 మంది మృత్యువాతపడ్డారు. ఇదీ చదవండి: అల్ఖైదా కంటే ప్రమాదకరం -
పాక్లో ఆత్మాహుతి దాడి.. 9 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లో ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ బన్ను జిల్లాలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది సైనికులు మృతి చెందారు. నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి చెందిన ఉగ్రవాది బైక్పై వచ్చి భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వ్యాన్ను ఢీకొట్టాడు. భారీ పేలుడు సంభవించడంతో వ్యానులోని 9 మంది మరణించగా మరో అయిదుగురు గాయపడ్డారని సైన్యం తెలిపింది. దాడికి తామే కారణమంటూ టీటీపీ ప్రకటించుకుంది. పలు ఉగ్ర సంస్థలు కలిసి 2017లో టీటీపీగా ఏర్పాటయ్యాయి. అల్ ఖాయిదాతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న టీటీపీ ఇటీవల తరచూ దాడులకు తెగబడుతోంది. జనవరిలో పెషావర్లోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది చనిపోగా మరో 200 మంది గాయపడ్డారు. -
ఏడాదికి ఒక్కరోజే ఆ గ్రామంలోకి ఎంట్రీ! ఎందుకంటే..
ప్రపంచంలో అక్కడక్కడా జనసంచారం లేని ఊళ్లు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల జనాలు ఆ ఊళ్లను విడిచిపెట్టి, అక్కడి నుంచి వేర్వేరు చోట్లకు తరలిపోయి ఉంటారు. అలాంటి ఊళ్లను ఆసక్తిగా చూడటానికి అప్పుడప్పుడు పర్యాటకులు వస్తుంటారు. ఇంగ్లండ్లోని సాలిస్బరీ మైదాన ప్రాంతంలోని ఇంబర్ గ్రామం కూడా అలాంటిదే! ఎనిమిది దశాబ్దాలుగా ఇక్కడ జనసంచారం లేదు. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలోనే ఈ ఊరు పూర్తిగా ఖాళీ అయిపోయింది. మిత్రశక్తులకు చెందిన సైనిక బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం ఈ ఊరిని ఖాళీ చేయించారు. యుద్ధంలో అణుబాంబుల వల్ల ఒకవేళ పెనువిపత్తు తలెత్తితే, ఎదుర్కోవడానికి మిత్రశక్తుల సైనికులకు ఈ గ్రామంలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు అణుబాంబులు జపాన్ మీద పడ్డాయి గాని, ఇంగ్లండ్ మీద పడలేదు. యుద్ధం ముగిసిన తర్వాత ఇక్కడి సైనిక శిబిరాలను కూడా ఖాళీ చేసేశారు. ఈ ఊరికి ఒక రైల్వే స్టేషన్ ఉంది. బ్రిటిష్ సైనికులు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు జరుపుతుంటారు. నిరంతరం ఇక్కడ సైనికులు కాపలా ఉంటారు. మామూలు సమయాల్లో జనాలు ఇక్కడ అడుగు పెట్టకుండా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. ఈ ఊరి ప్రవేశమార్గం సమీపంలోనే నిషేధాజ్ఞల హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. అయితే, ఏడాదికి ఒకసారి మాత్రమే ఇక్కడకు జనాలను అనుమతిస్తారు. ఏటా ఆగస్టు 19న ఈ గ్రామ ప్రవేశ ద్వారం జనాల కోసం తెరుచుకుంటుంది. వందల సంఖ్యలో జనాలు ఆ రోజు ఇక్కడకు చేరుకుంటారు. ఇక్కడి శ్మశానవాటికలోని తమ పూర్వీకుల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి ప్రార్థనలు జరుపుతారు. అలాగే, ఈ ఊళ్లోని పురాతనమైన సెయింట్ జైలిజ్ చర్చిలోనూ ప్రార్థనలు జరుపుతారు. ఈ ఒక్కరోజు జనాల రాకపోకలకు వీలుగా వార్మినిస్టర్ పట్టణం నుంచి ఇక్కడకు ప్రత్యేక బస్సులను నడుపుతారు. (చదవండి: ఆ చిన్న పింగాణి పాత్ర ధర తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే!) -
హాంకాంగ్లో ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’
దేశభక్తిని ప్రబోధించే ‘సురభి ఏక్ ఎహసాన్ హాంకాంగ్లో ప్రవాస భారతీయుల ప్రత్యేక కార్యక్రమం. అమరవీరులైన సైనికుల స్ఫూర్తిని చాటిన జయ పీసపాటి టోరీ రేడియోల ప్రసారం సాక్షి, సిటీబ్యూరో టోరీ రేడియో పరిచయాల ద్వారా సైనికుల త్యాగాలు, వారి కుటుంబాలపైన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, విశేషాలను సామాన్య ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. ఆ జయ పీసపాటి...మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్కు చెందిన ఆమె హాంకాంగ్లో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే చాలాకాలంగా ఆమె టోరి రేడియో వ్యాఖ్యాతగా సేలందజేస్తున్నారు. తాజాగా ‘సురభి ... ఏక్ ఎహసాన్ ’ అనే పేరుతో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని టోరి రేడియో ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల హాంకాంగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనేక మంది ప్రవాస భారతీయులు పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. పిల్లలు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తి పాటలలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ప్రవీణ్ అగర్వాల్, సౌరభ్ రాఠీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మంజరి గుహ, నేహా అగర్వాల్ , సాక్షి గోయల్ , సుగుణ రవి, కొరడ భరత్ కుమార్, ప్రశాంత్ పటేల్, శ్రీదేవి బొప్పన, లక్ష్మి యువ,సంజయ్ గుహ, తదితరులు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయ పీసపాటి నిర్వహించిన ‘ జై హింద్ ’ టాక్ షోలో ఉమేష్ గోపీనాథ్ జాదవ్ పాల్గొని ప్రసంగించారు. ‘సురభి ఏక్ ఎహసాన్‘కార్యక్రమానికి ఆయన అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘బి ది చేంజ్’ సంస్థ వ్యవస్థాపకులు పూనమ్ మెహతా, రిటైర్డ్ సివిల్ సర్వెంట్ నీనా పుష్కర్ణ, రుట్టోంజీ ఎస్టేట్స్ కంటిన్యూయేషన్ లిమిటెడ్ డైరెక్టర్ రానూ వాసన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంఘాల నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.కార్గిల్ యుద్ధంలో భారతీయ సైనికులు ప్రదర్శించిన అద్భుతమైన ధైర్యసాహసాలు, పరాక్రమాన్ని శ్లాఘిస్తూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాయి. సాయుధ దళాల వైద్య కళాశాలలో చదవాలనే ఆశయాన్ని సాధించలేకపోయినప్పటికీ టోరి రేడియో వ్యాఖ్యాతగా అనేక దేశభక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జయ పీసపాటి ‘‘జై హింద్’’ అనే టాక్ షో ద్వారా ఆమె పలువురు సాయుధ దళాల అధికారులు, విశ్రాంత అధికారులు, అమర వీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించి ప్రపంచలోని ప్రవాస తెలుగు వారికి పరిచయం చేశారు. (చదవండి: శాన్ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్గా తెలుగు వ్యక్తి!) -
లోయలో పడిన ఆర్మీ వాహనం.. 9 మంది జవాన్లు మృతి
లడఖ్ ఖేరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు మృతిచెందారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇందులో ఎనిమిది మంది జవాన్లు కాగా, ఒకరు జేసీవో (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్) ఉన్నారు. లేహ్ ప్రాంతానికి సుమారు 150కిమీ దూరంలో ఉన్న ఖేరీలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియన్ ఆర్మీ జవాన్లు మరణించడంతో యావత్ భారతదేశం ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురైంది. -
మార్పు మన నుంచే ప్రారంభం కావాలి
హిమాయత్నగర్: మార్పు మనఇంట్లో నుంచి..అంటే వ్యక్తి నుంచే ప్రారంభమైతే దేశం ప్రగతిపథంలో ముందుకెళుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. నేటితరం పిల్లలు ఏసీ లేకపోయినా, చెమట పట్టినా భరించలేని పరిస్థితుల్లో పెరుగుతున్నారన్నారు. దేశ రక్షణ, భావితరాల భవిష్యత్కు సరిహద్దుల్లో మన సైనికులు రక్తం కారుస్తూ, చెమటోడుస్తూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రాణాలను అడ్డేస్తున్నారని చెప్పారు. 24వ కార్గిల్ దివస్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్లోని కేఎంఐటీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ దేశంకోసం త్యాగం చేస్తున్న సైనికులను ప్రతిరోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటితరం వారు సినిమా హీరోలు, క్రీడాకారులను మాత్రమే గుర్తించగలుగుతున్నారని, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు, వారిత్యాగాల గురించి ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందినవారి కుటుంబీకులకు గవర్నర్ ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్, మేజర్ జనరల్ వీకే పురోహిత్, జమ్మూకశ్మీర్కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామం
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 500వ రోజుకు చేరుకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం స్నేక్ ఐల్యాండ్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్నేక్ ఐల్యాండ్ విముక్తికి పోరాడిన ఉక్రెయిన్ సైనికులను సన్మానించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామమన్నారు. ఆక్రమణకు గురైన ప్రతి అంగుళాన్ని తిరిగి స్వా«దీనం చేసుకుంటామనేందుకు ఈ ఘటనే ప్రబల తార్కాణమని వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఏరోజు రికార్డయిందో తెలియలేదు. జెలెన్స్కీ శనివారం తుర్కియేలో ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా బలగాలు ఈ ఐల్యాండ్ను ఆక్రమించుకోగా ఉక్రెయిన్ జూన్ 30న తిరిగి స్వా«దీనం చేసుకుంది. కాగా, లీమాన్ పట్టణంలో శనివారం రష్యా రాకెట్ దాడిలో ఎనిమిది మంది మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. -
పరేడ్లో కుప్పకూలిన బ్రిటిష్ సైనికులు..వీడియో వైరల్
బ్రిటన్లో వార్షిక ట్రూపింగ్ ది కలర్ సందర్భంగా ప్రిన్స్ విలయమ్స్ ఎదుట సైనికులు పరేడ్ రిహార్స్ల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో లండన్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు చేరుకోవడంతో.. సైనికులు ఆ వేడికి తాళ్లలేక స్ప్రుహ తప్పి పడిపోయారు. చక్రవర్తి అధికారిక పుట్టిన రోజు సందర్భంగా ప్రతి జూన్లో లండన్లో ట్రూపింగ్ ది కలర్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అందుకోసం వార్షిక కవాతు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే విలియమ్స్ ఎదుట రిహార్సల్స్ చేస్తున్నారు సైనికులు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో..ఆ వేడికి తాళ్లలేక ముగ్గురు సైనికులు కుప్పకూలినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఈ మేరకు ప్రిన్స్ విలియం సైనికులను కృతజ్ఞతలు తెలుపుతు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో విలియమ్స్..ఈ ఉదయం కల్నల్ రివ్యూలో పాల్గొన్న ప్రతి సైనికుడుకి చాలా కృతజ్ఞతలు. Conducting the Colonel's Review of the King's Birthday Parade today. The hard work and preparation that goes into an event like this is a credit to all involved, especially in today’s conditions. pic.twitter.com/IRuFjqyoeD — The Prince and Princess of Wales (@KensingtonRoyal) June 10, 2023 క్లిష్ట పరిస్థితుల్లో మీరు నిబద్ధతతో మీ విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమం విజయవంతం కావడం కోసం తమ వంతుగా కృషి చేస్తున్నందుకు ధన్యావాదాలు అని ట్వీట్ చేశారు. సైనికులు విధి నిర్వహణలో భాగంగా ఆ సమయంలో ఉన్ని ట్యూనిక్స్, బేర్ స్కిన్ టోపీలు ధరించడంతో ఎండకు తాళ్లలేకపోయారు. దీంతో స్ప్రుహ కోల్పోయిన ఆ సైనికులకు వైద్యులు తక్షణ చిక్సిత్స అందించారు. కాగా, జూన్ 17న అంగరంగ వైభవంగా జరగనున్న సదరు కార్యక్రమాన్ని చార్లెస్ III పర్యవేక్షిస్తారు. 💂 At least three British royal guards collapsed during a parade rehearsal in London ahead of King Charles' official birthday as temperatures exceeded 88 degrees Fahrenheit pic.twitter.com/V0fLjROoD5 — Reuters (@Reuters) June 10, 2023 (చదవండి: రన్వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ..ప్రయాణికులకు తీవ్ర గాయాలు) -
జెలెన్స్కీ ఇంటి ముంగిటే..నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
‘నాకేమీ వద్దు ప్లీజ్ లే నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు..’
దాల్పట్: ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్.. లే నాన్నా!’’ అంటూ ఓ చిన్నారి.. జవాన్ తండ్రి కోసం కంటతడి పెట్టుకుంది. ఆమె కన్నీరు చూసి అక్కడున్న వారంతా ఆవేదన చెందారు. కాగా, జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో ఉగ్రదాడుల్లో మృతిచెందిన పారాట్రూపర్ నీలంసింగ్ ముఖాన్ని చేతితో తాకుతూ పదేళ్ల చిన్నారి పావన రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. వివరాల ప్రకారం.. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. మృతిచెందిన వారిలో హవిల్దార్ నీలంసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నీలంసింగ్ శవపేటిక శనివారం స్వగ్రామం చేరుకుంది. దీంతో, స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నీలంసింగ్కు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. ఇక, నీలంసింగ్ పార్థివ దేహాన్ని చూసి ఆయన కుమార్తె పవనా చిబ్(10).. ‘‘నాన్నా.. నువ్వెందుకు లేవడం లేదు? నాకేమీ వద్దు. ప్లీజ్.. లే నాన్నా!’’ అంటూ కన్నీరుపెట్టింది. పక్కనే నిలుచున్న నీలంసింగ్ భార్య వందన.. భర్త ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. ఏడేళ్ల కుమారుడు అంకిత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాగా, వేల మంది సమక్షంలో దలపత్ గ్రామంలో శనివారం నీలంసింగ్ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు.. రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అడవిలో కొంతమంది ఉగ్రవాదులు దాగివున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో అడవిలోని ఓ గుహలో ఉగ్రవాదులు దాగివుండటాన్ని జవాన్లు శుక్రవారం ఉదయం గుర్తించారు. దీంతో సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదంపూర్ దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలతో మరో ముగ్గురు దవాఖానలో మరణించారని ఆర్మీ పేర్కొన్నది. Papa aap ku nhai bol rahe, Papa Aap Ku Humain Chor ker jaa rahey hain, 😢😢 Last rites of Martyr Havildar Neelam Singh at his native village in Akhnoor. This bloodshed must stop now. How will this daughter live without her father now? I request the governments of India and… pic.twitter.com/dpLawcSr3Q — Mohammed Hussain (@hussain_hrw) May 7, 2023 ఇది కూడా చదవండి: హింసాకాండలో 54 మంది మృతి.. మణిపూర్లో కనిపిస్తే కాల్చివేత -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ
కశ్మీర్: అయిదుగురు భారత జవాన్లను హతమార్చిన ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం కాసేపట్లో జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాకు చేరుకోనున్నారు. ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోపాటు ఎన్ఐఏ బృందం మధ్యాహ్నం 12.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకోనుంది. General Manoj Pande #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of 05 #IndianArmy Bravehearts, Hav Mandeep Singh, L/Nk Debashish Baswal, L/Nk Kulwant Singh, Sep Harkrishan Singh & Sep Sewak Singh who laid down their lives in the line of duty at #Poonch Sector. https://t.co/7YSI1sEiEb — ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2023 అమరులైన జవాన్లు వీరే ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్నాయక్ కుల్వంత్ సింగ్, హర్కిషన్ సింగ్, సేవక్ సింగ్గా గుర్తించారు. వీరులైన సైనికులకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: Char Dham Yatra: ‘ఛార్ధామ్’కు మంచు తిప్పలు అసలేం జరిగిందంటే.. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్కు చెందిన జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్పై గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భింబెర్ గలి నుంచి సింగియోట్ వైపు వస్తుండగా గ్రనేడ్లు విసరడంతో వాహనానికి నిప్పంటుకుంది. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు వీర మరణం పొందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం, తక్కువ వెలుతురు మాటున ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను మట్టుబెట్టేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుపేర్కొన్నారు. J&K | Visuals from Bhimber Gali in Poonch where five soldiers lost their lives in a terror attack yesterday. (Visuals deferred by unspecified time) pic.twitter.com/331XNOeQWj — ANI (@ANI) April 21, 2023 హై అలర్ట్ పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ దాడి అనంతరం బటా-డోరియా ప్రాంతంలోని అడవులలో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనా ప్రాంతాన్ని చుట్టిముట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్నారు. దాడిని పరిశీలించేందుకు బాంబు డిస్పోసల్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కూడా సంఘటనా ప్రాంతంలో ఉన్నాయి. మరోవైపు పూంచ్లో దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. 2021 అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు. చదవండి: Karnataka: ఈశ్వరప్ప కుమారుడికి మొండిచేయి -
గల్వాన్ లోయలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
న్యూఢిల్లీ: 2020 జూన్ 15. తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ. భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–14. సరిగ్గా అక్కడే ఇరు దేశాల సైనికుల నడుమ భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. పదునైన ఆయుధాలతో చైనా జవాన్లు దాడి చేయగా, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ కొట్లాటలో తమ జవాన్లు ఎంతమంది బలయ్యారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. 40 మందికిపైగానే చనిపోయి ఉంటారని అంచనా. భారత్ వైపు నుంచి దాదాపు 20 మంది చనిపోయారు. రణక్షేత్రంగా రక్తంతో తడిసిపోయిన పీపీ–14 ఇప్పుడు క్రికెట్ మైదానంగా మారింది. పటియాలా బ్రిగేడ్కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీ నిర్వహించింది. సైనికులు సరదాగా క్రికెట్ ఆడారు. పీపీ–14కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ పోటీ జరిగింది. జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత సైన్యం శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేసింది. గడ్డ కట్టించే తీవ్రమైన చలిలో పూర్తి ఉత్సాహంతో ఈ పోటీ జరిగిందని వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఉద్ఘాటించింది. జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే గల్వాన్లో భారత సైనికులు క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం విశేషం. -
జమ్ముకశ్మీర్లో విషాదం.. ముగ్గురు సైనికులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. ట్రాక్పై దట్టమైన పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్లో కుప్వారా జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు బుధవారం పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు. కాగా, లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పెట్రోలింగ్ చేస్తుండగా చినార్ క్రాప్స్కు చెందిన జేసీఓతోపాటు మరో ఇద్దరు సైనికులు లోయలోకి జారిపడిపోయారు. ఈ క్రమంలో వారు మరణించినట్టు ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే, ట్రాక్పై దట్టమైన మంచు కురవడంతో ఈ ప్రమాదం జరిగనట్టు అధికారులు చెప్పారు. -
Russia-Ukraine war: ఒక్క క్షిపణితో 400 మంది హతం !
కీవ్: దురాక్రమణకు దిగిన రష్యా సేనలను క్షిపణి దాడుల్లో అంతమొందించే పరంపర కొనసాగుతోందని ఉక్రెయిన్ ప్రకటించింది. డోనెట్స్క్ ప్రాంతంలో తమ సేనలు జరిపిన భారీ క్షిపణి దాడిలో ఏకంగా 400 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ దాడిలో మరో 300 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే 63 మంది సైనికులే మరణించారని రష్యా స్పష్టంచేసింది. మకీవ్కా సిటీలో ఆదివారం అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఒక పెద్ద భవంతిలో సేదతీరుతున్న రష్యా సైనికులే లక్ష్యంగా ఉక్రెయిన్ క్షిపణి దాడి జరిగింది. అమెరికా సరఫరా చేసిన హిమార్స్ రాకెట్లను ఆరింటిని ఉక్రెయిన్ సేనలు ప్రయోగించగా రెండింటిని నేలకూల్చామని మిగతావి భవనాన్ని నేలమట్టంచేశాయని రష్యా సోమవారం తెలిపింది. భవనంలోని సైనికులు ఇంకా యుద్ధంలో నేరుగా పాల్గొనలేదని, ఇటీవల రష్యా నుంచి డోనెట్స్క్కు చేరుకున్నారని, అదే భవనంలో యుద్ధంతాలూకు పేలుడుపదార్థాలు ఉండటంతో విధ్వంసం తీవ్రత పెరిగిందని స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, డోనెట్స్క్లో దాడి తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి డ్రోన్లకు పనిజెప్పింది. కీలకమైన మౌలిక వ్యవస్థలపై సోమవారం 40 డ్రోన్లు దాడికి యత్నించగా అన్నింటినీ కూల్చేశామని కీవ్ మేయర్ విటలీ క్లిష్చెకో చెప్పారు. కీవ్ ప్రాంతంలో కీలక మౌలిక వ్యవస్థలు, జనావాసాలపై డ్రోన్ దాడులు సోమవారం సైతం కొనసాగాయని కీవ్ ప్రాంత గవర్నర్ కుబేలా చెప్పారు. -
రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ధైర్యం.. చావడమే గానీ వెనక్కి రాలేం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రోజుకో వ్యూహంతో యుద్ధాన్ని మరింత ముమ్మరం చేస్తామే గానీ వెనక్కి తగ్గేదే లేదని ప్రగల్పాలు పలుకుతున్నారు. పైగా మా దళాలు వివిధ శక్తిమంతమైన క్షిపణులు, బాంబులతో ఉక్రెయిన్ని దద్ధరిల్లేలా చేస్తున్నారని కొద్దిరోజుల్లో విజయం సాధిస్తామంటూ గొప్పలు చెబుతున్నారు. కానీ ఉక్రెయిన్లో రష్యా దళాల పరిస్థితి అందుకు చాలా విభిన్నంగా ఉందనడానికి సాక్ష్యం వారి ఫోన్ కాల్స్. రష్య బలగాలు తమ ఆవేదనను తమవారితో ఫోన్లో వెళ్లబోసుకుంటున్నారు. తమకు సరైన ఆహారం, నీరు లేదని వధించబడతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు పది నెలలుగా సాగుతున్న నిరవధిక యుద్ధంలో రష్యా గణనీయమైన నష్టాన్నే చవి చూసింది. అయినప్పటికీ రష్యా పెద్ద ఎత్తున సైనిక సమీకరణలతో సైనికులను రిక్రూట్ చేసుకుని యుద్ధం చేసేందకు సిద్ధమైంది. కానీ సైనికులు పోరాటం చేయలేక సరైన తిండిలేక నిసత్తువతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఒక సైనికుడు తన తల్లితో అమ్మ మాకు ఎవరూ సరైన ఆహారం అందించరని, నీటి కోసం గుమ్మడికాయాల నుంచి తీసిని నీటిని వడకట్టుకుని తాగుతున్నామని ఆవేదనగా చెబుతున్నాడు. అధ్యక్షుడు పుతిన్ గొప్పగా చెబుతున్న క్షిపణుల ఎక్కడ ఉన్నాయని కొందరూ సైనికులు ప్రశ్నిస్తున్నారు. తమ ఎదురుగా ఎత్తైన భవనం ఉందని, దానిని మన సైనికుల కొట్టలేరు ఎందుకంటే దాన్ని కూల్చడం కోసం కాలిబర్ క్రూయిజ్ క్షిపణి కావాలని చెప్పాడు. మరో రష్యా సైనికుడు తల్లి తన కొడుకు తనతో లేడని కన్నీళ్లు పెట్టుకుంది. మరోక పోన్ సంభాషణలో ఒక సైనికుడు తాము వెనక్కి వెళ్లేందుకు అనుమతి లేదని, పోరాడేందుకు సరైన ఆర్మీబలం, ఆయుధ బలం గానీ లేవని వాపోయాడు. ఇంకో రష్యా సైనికుడు తన భార్యతో ముగ్గురు సైనికులతో పారిపోయానని, లొంగిపోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. మరోక సైనికుడు మమ్మల్ని అందర్నీ చంపేస్తున్నారంటూ భయాందోళనతో చెప్పాడు. ఈ సుదర్ఘీ యుద్ధ రష్యన్ మిలటరీలో ధైర్యాన్నీ బలహీనపరిచింది. వారు కుటుంబాలకు చేసిన కాల్స్ని బట్టి వారంతా ఎంత నిస్సహాయ స్థితిలో పోరాడుతున్నారో అవగతమవుతోంది. (చదవండి: చైనాలో నిమ్మకాయలకు అమాంతం పెరిగిన డిమాండ్! కారణం ఏంటంటే..) -
Ukraine-Russia war: రష్యాకు లక్ష, మాకు 13 వేలు సైనిక నష్టంపై ఉక్రెయిన్
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. యుద్ధం మొదలైన ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా 13 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదార మైఖైలో పోడోల్యాక్ వెల్లడించారు. వీరిలో సాధారణ పౌరులే అధికమన్నారు. రష్యా సైనికులు లక్ష మంది దాకా మరణించినట్టు అంచనా వేశామన్నారు. లక్షన్నర మంది గాయపడి ఉంటారని తెలిపారు. ఉక్రెయిన్ వైపు చనిపోయిన, గాయపడ్డ వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ రెండు పక్షాల్లో కలిపి మృతుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లీ అన్నారు. ఉక్రెయిన్ పౌరులు 40 వేల మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇక ఇరువైపులా కలిపి 6,655 మంది పౌరులు మరణించారని, 10, 368 మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. సైనికులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఐరాస వెల్లడించలేదు. -
సైనికుల భార్యలే అత్యాచారాలు చేయమనడం దారుణం!
లండన్: ఉక్రెయిన్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ భార్య ఒలెనా జెలెన్స్కీ.. రష్యా సైనిక కుటుంబాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దళాలు లైంగిక వేధింపులనే ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ ఒలెనా ఆక్రోశించారు. సంఘర్షణ సమయంలో జరుతుగున్న లైంగిక వేధింపులను పరిష్కరించడం కోసం లండన్లో జరుగుతున్నఅంతర్జాతీయ సమావేశంలో ఒలెనా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో రష్యా సైనికుల భార్యలే.. ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు తెగబడమని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచి రష్యా బలగాలు ఇలా బహిరంగంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. యుద్ధ సమయంలో లైంగిక వేధింపులనేవి అత్యంత హేయమైన, క్రూరమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఇలా మృగంలా పాశవికంగా ప్రవర్తించి తమ గొప్పతనాన్ని చాటుకోవడం అమానుషం అని రష్యా దళాలపై ఒలెనా విరుచుకుపడ్డారు. యుద్ధ సమయంలో ఎవరూ సురక్షితంగా ఉండే అవకాశం ఉండదని, ఇదే అదనుగా చేసుకుని మహిళలపై ఇలాంటి దుశ్చర్యలకు పూనుకోవడం అనేది అనైతికం అన్నారు.అంతేగాదు రష్యా బలగాలు దీన్ని ఒక అతిపెద్ద ఆయుధంగా, తమ ఇష్టరాజ్యంగా ఉపయోగిస్తున్నారని ఆవేదనగా చెప్పారు. ఈ విషయం పట్ల ప్రపంచవ్యాప్తంగా స్పందన రావాలన్నారు. దీన్ని యుద్ధ నేరంగా గుర్తించి, నేరస్తులందర్నీ జవాబుదారీగా చేయడం అత్యంత ముఖ్యం అని ఒలెనా అన్నారు. (చదవండి: యుద్ధ సమయంలో ఆఫ్రికన్ దేశాలకు ఉక్రెయిన్ చేయూత) -
పుతిన్కి భంగపాటు.. అస్సలు ఊహించి ఉండడు!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఊహించని షాక్ తగిలింది. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న రష్యా సైనికుల తల్లులు, భార్యలు.. ఆయన్ని నిలదీసే పరిస్థితికి చేరుకున్నారు. తమ వాళ్ల పేరిట కుటుంబాలకు ఇచ్చిన భద్రత హామీల అమలు ఏమయ్యిందంటూ, తమకు సమాధానం చెప్పాలంటూ ఆయన్ని నిలదీస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలై తొమ్మిది నెలలు పూర్తైంది. కానీ, ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని వాళ్లు సోషల్ మీడియా సాక్షిగా పుతిన్ను నిలదీస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. రష్యా సైనికుల కుటుంబ సభ్యులతో పుతిన్ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సమయంలోనే కొందరు కుటుంబ సభ్యులు వీడియో పోస్టులు అక్కడి సోషల్ మీడియాలో పెడుతుండడం గమనార్హం. కొన్ని కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసు. అది ఊహించే ఈ సమావేశానికి వాళ్లను దూరంగా ఉంచారు. కేవలం అధ్యక్షుడు పుతిన్కు కృతజ్ఞతలు తెలిపేందుకు కొన్ని కుటుంబాలను మాత్రమే ఆ సమావేశానికి ఆహ్వానించారు అని రష్యా ఉద్యమవేత్త ఓల్గా సుకనోవా అంటున్నారు. ఆమె తన 20 ఏళ్ల కొడుకు ఉక్రెయిన్ యుద్దంలో పాల్గొనడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే.. సమారా నగరం నుంచి వోల్గా నది వెంట 900 కిలోమీటర్లు ప్రయాణించి మరీ క్రెమ్లిన్కు చేరుకుంది. అలాగే కొందరు మహిళలు.. పుతిన్ ముందర ఫిర్యాదులు చేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడి ఫిర్యాదు చేయలేదని ఆమె అంటున్నారు. అత్యవసరంగా తమ వాళ్లను యుద్ధం రొంపిలోకి దింపిన అధ్యక్షుడు పుతిన్.. చేసిన వాగ్దానాలను నెరవేర్చాలంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు రష్యా సైనికుల కుటుంబ సభ్యులు. యుద్ధ సమయంలో సైనికుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక అలవెన్సులతో పాటు జీవిత బీమా, పిల్లలకు చదువులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీలు ఇచ్చింది క్రెమ్లిన్. అంతేకాదు యుద్ద కాలంలో వాళ్లతో మాట్లాడించేలా ఏర్పాట్లు కూడా చేయిస్తామని తెలిపింది. కానీ, వాటి విషయంలో ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు సెప్టెంబర్లో ఉక్రెయిన్ యుద్ధం కోసం లక్షల మంది కావాలంటూ ప్రకటన ఇచ్చి.. అన్ని వయస్కుల వాళ్లను బలవంతపు శిక్షణకు ఆదేశించింది. అయితే.. అందులో వృద్ధులు, పిల్లలు సైతం ఉండడంతో నాలుక కర్చుకున్న క్రెమ్లిన్ వర్గాలు.. ప్రకటనలో పొరపాటు దొర్లిందంటూ సవరణ ప్రకటన ఇచ్చాయి. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ఎలా పుట్టిందో తెలుసా? -
వివాదంలో ఇరుక్కున్న నటి.. నా ఉద్దేశం అది కాదంటూ.. క్షమాపణలు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రిచా చద్దా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్ సైనికుల్ని అవమానించేలా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రిచా క్షమాపణలు చెప్పారు. ఆ ట్వీట్ను కూడా తొలగించారు. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కేంద్రం ఆదేశాల కోసం చూస్తున్నామంటూ ఒక ట్వీట్ చేశారు. రిచా దీనిని ప్రస్తావిస్తూ ‘‘గల్వాన్ సేస్ హాయ్’’ అని పోస్టు పెట్టారు గల్వాన్ ప్రస్తావన తీసుకురావడంతో నెటిజన్లు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుల్ని ఎగతాళి చేయడానికి ఈ ట్వీట్ చేశారంటూ విరుచుకుపడ్డారు. దీంతో రిచా ఆ ట్వీట్ను తొలగించారు. సైనికుల్ని అవమానపరచడం తన ఉద్దేశం కాదని క్షమాపణ కోరారు. చదవండి: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు
ఇప్పట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపొవడం లేదా ఒకకొలిక్కి వచ్చే సూచనలు కనబడటం లేదు. ఒకవైపు రష్యా మిసైల్ దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి దక్షిణ ఉక్రెయిన్లోని ఖేర్సన్ బాంబు దాడులకు కేంద్రంగా మారింది. అదీగాక ఈ యుద్ధంలో అత్యంత ఘోరంగా ఖేర్సన్ ప్రాంతం నాశనమైంది. దీంతో రష్యా బలగాలు పట్టణాల్లోకి చొరబడి స్థానిక పౌరులను బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు. వారి నివాస స్థలాలను రష్యా బలగాలు ఆక్రమించుకుని వారిని డ్నీపర్ నది వెంబడి పారిపోవాల్సిందిగా పౌరులపై ఒత్తిడి తెస్తున్నారు. పైగా వారికి కనీస ప్రాథమిక సౌకర్యాలు లేకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీన్ని రష్యా బలగాలు తరిలింపు చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ....ఉక్రెయిన్ దళాలతో ముఖాముఖీ తలపడేందుకు రష్యా బలగాలు ఇలా చేస్తున్నాయంటూ ఆక్రోశించారు. నగరవాసులను బలవంతంగా ఖాళీ చేయించి రష్యా బలగాలు అపార్ట్మెంట్లోకి చొరబడుతున్నారని ఆరోపించారు. అలాగే ఖైర్సన్లోని క్లినిక్లు, ఆస్పత్రులు రోగులకు సేవలందించడం లేదని, స్థానికులు కనీస ప్రాథమిక అవసరాల లేమితో అల్లాడుతున్నారని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్ బలగాలు ఖైర్సన్ని తిరిగి స్వాధీనం చేసుకోనివ్వకుండా నియంత్రించేలా వంతెనలను కూల్చి ప్రధాన ఆహార పదార్థాలు, ఆయుధాల సరఫరా రవాణాలపై రష్యా మిసైల్ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ వాలెరీ జలుజ్నీ మాట్లాడుతూ...గత కొద్ది రోజులుగా రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసిందన్నారు. ప్రతిరోజు సుమారు 80కి పైగా దాడులు చేస్తోంది. ఒక్క శుక్రవారం రష్యా బలగాలు జరిపిన దాడుల్లో సుమారు తొమ్మిది మంది పౌరులు మరణించగా, 16 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సైనిక సమీకరణలు ఇంకా అయిపోలేదని, సుమారు 3 లక్షల మంది సైనికుల రిజర్వ్ను సమీకరించడమే తమ లక్ష్యం అని పుతిన్ చెబుతున్నారు. -
సైనిక బలగాల మోహరింపు అట్టర్ ప్లాప్...షాక్లో పుతిన్
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులోనే దాదాపు వెయ్యిమంది రష్యా బలగాలు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరిలో దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచే దాదాపు 71, 200 మందికి పైగా రష్యా బలగాలు మృతి చెందినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ పేర్కొంది. అదీగాక కేవలం ఒక్క ఆదివారం నాడే సుమారు 950 మంది నెలకొరిగారని వెల్లడించింది. ఉక్రెయిన్ దళాలు కీలకమైన దక్షిణ నగరంలోని ఖైర్సన్ వైపుగా ముందుకు సాగుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్ స్కీ వెల్లడించారు. అదీగాక ఇటీవల పెద్ద సంఖ్యలో సైనిక మొబైలైజేషన్ చేసింది. కానీ ఆ బలగాలు మాస్కో పంపిన రిజర్వ్స్ట్ పరికరాలతో సమస్యలను ఎదుర్కొనడమే గాక పోరాడే సన్నద్ధత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు యూకే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకున్న సైనికులు చాలా పేలవంగా పోరాడుతున్నట్లు కూడా వెల్లడించింది. మరికొంత మంది రిజర్వ్ బలగాలు ఆయుధాలు లేకుండా మోహరించడం వంటివి చేస్తున్నారంటూ స్వయంగా రష్యా అధికారులే తలలు పట్టుకుంటున్నట్లు పేర్కొంది. అదీగాక మాస్కో బలగాలు 1959 నాటి ఏకేఎం రైఫిల్స్ వాడుతున్నట్లు తెలిపింది. పేలవమైన నిల్వ ఆయుధాల కారణంగానే వేలాదిమంది సైనికులు యుద్ధంలో పోరాడ లేక నెలకొరుగుతున్నట్లు యూకే రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ రష్యా తన దూకుడును తగ్గించకపోగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతంలో పౌర సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మాస్కో దాడులు కొనసాగిస్తుండటం గమనార్హం. (చదవండి: రష్యా సైన్యంలోకి అఫ్గాన్ కమాండోలు) -
Russia-Ukraine war: రష్యా సైన్యంలోకి అఫ్గాన్ కమాండోలు
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్లో అమెరికా సేనలతో కలిసి తాలిబన్లపై పోరాడిన ప్రత్యేక దళాల సైనికులు ఇప్పుడు రష్యాకు క్యూ కడుతున్నారు. రష్యా సైన్యంలో చేరి, ఉక్రెయిన్పై యుద్ధంలో పాలుపంచుకుంటున్నారు. వీరంతా అమెరికా సైన్యం శిక్షణ ఇచ్చిన కమాండోలు కావడం విశేషం. అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం వెనక్కి మళ్లిన తర్వాత తాలిబన్ల నుంచి ముప్పును తప్పించుకొనేందుకు ఈ కమాండోలు ఇరాన్కు చేరుకున్నారు. వీరిని రష్యా తన సైన్యంలో చేర్చుకొని, ఉక్రెయిన్కు పంపిస్తోంది. ఈ విషయాన్ని ముగ్గురు అఫ్గాన్ మాజీ సైనికాధికారులు స్వయంగా వెల్లడించారు. యుద్ధంలో పాల్గొన్నందుకు గాను ఒక్కో జవానుకు రష్యా ప్రతినెలా 1,500 డాలర్ల చొప్పున వేతనం చెల్లిస్తోందని తెలిపారు. నిజానికి ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో పాల్గొనడం అఫ్గాన్ కమాండోలకు ఇష్టం లేదని, కానీ, వారికి మరో దారి కనిపించడం లేదని అబ్దుల్ రవూఫ్ అనే మాజీ అధికారులు తెలిపారు. -
కార్గిల్ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
-
సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఉక్రెయిన్తో యుద్ధంలో 66,000 మంది రష్యా సైనికులు మృతి!
కీవ్: రష్యాతో 240 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఆ దేశానికి చెందిన 66,750 మంది సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ భీకరు పోరులో శుత్రుదానికి జరిగిన నష్టాన్ని ఓ చిత్రం రూపంలో విడుదల చేసింది. ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం ఇరు దేశాలకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. దాదాపు 9 నెలలు కావస్తున్నా యుద్ధం ఆగే సూచలను కన్పించడం లేదు. ఉక్రెయిన్ చెప్పిన వివరాల ప్రకారం ఈ యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టం.. చనిపోయిన సైనికులు - 66750 ధ్వంసమైన యుద్ధ విమానాలు- 269 హెలికాప్టర్లు - 263 ట్యాంకులు - 2573 మానవ రహిత విమానాలు - 1325 స్పెషల్ ఎక్విప్మెంట్ - 147 పడవలు - 16 సాయుధ వాహనాలు - 5258 ఆయుధ వ్యవస్థలు - 1648 బహుళ రాకెట్ లాంచర్లు - 372 వాహనాలు, ఇంధన ట్యాంకులు - 4006 యుద్ధ విమాన నిర్వీర్య వవస్థలు - 189 క్రూజ్ క్షిపణులు - 329 2️⃣4️⃣0️⃣ days of full-scale Russia’s war on #Ukraine. Information on #Russian invasion. Losses of #Russia’s armed forces in Ukraine, October 21. pic.twitter.com/SidRhOrGdk — MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) October 21, 2022 ప్రపంచానికే సంక్షోభం తెచ్చేలా ఉన్న ఈ భీకర యుద్ధాన్ని ఆపాలని అన్ని దేశాలు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం ఆపే ప్రసక్తే లేదని పుతిన్ చెబుతున్నారు. జెలెన్స్కీ కూడా రష్యాతో చర్చలకు ససేమిరా అంటున్నారు. చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు షాక్.. ఐదేళ్లు వేటు -
విషాదం.. యుద్ధ ట్యాంకర్ పేలి ఇద్దరు సైనికులు మృతి
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ఝాన్సీలో విషాదం జరిగింది. సైనికులు ఏటా నిర్వహించే ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ సమీపంలోని బబినా కంటోన్మెంట్ ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించే సమయంలో టీ-90 యుద్ధ ట్యాంకర్ బ్యారెల్ పేలింది. మూడో తరానికి చెందిన ఈ ట్యాంకర్ను రష్యా తయారు చేసింది ఈ దర్ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్ర గాయాలైనప్పటికీ అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. . పేలుడు జరిగిన సమయంలో ట్యాంకర్లో ముగ్గురు సైనికులు ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. కమాండర్, గన్నర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడని పేర్కొన్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సైనికాధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో తవాంగ్లో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ మరునాడే ఝాన్సీలో మరో ప్రమాదం జరిగి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు -
ఉక్రెయిన్తో యుద్ధంలో అన్ని వేల మంది రష్యా సైనికులు చనిపోయారా?
కీవ్: రష్యాతో ఆరు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఆ దేశానికి చెందిన 45,550 మంది సైనికులను మట్టబెట్టినట్లు ఉక్రెయిన్ శనివారం వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 250 రష్యా బలగాలను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఫేస్బుక్ వేదికగా తెలిపారు. అంతేకాదు ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న ఈ భీకర పోరులో రష్యాకు చెందిన 2,000 యుద్ధ ట్యాంకులు, 1,045 ఆయుధ వ్యవస్థలు, 836 డ్రోన్లు, 3,165 వాహనాలను ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ చెప్పిన లెక్కలకు ఆధారాలు లేకపోయినప్పటికీ ఇటీవల బ్రిటన్ రక్షణమంత్రి బెన్ వాలేస్ అంచనాలకు ఇవి దాదాపు సమానంగా ఉన్నాయి. యుద్ధంలో రష్యాకు ఇప్పటివరకు మొత్తం 80వేల మంది ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. అమెరికాకు న్యూయార్క్ టైమ్స్ నివేదిక మాత్రం యుద్ధంలో 25 వేల మంది రష్యా సైనికులు మరణించి ఉంటారని అంచనా వేసింది. అలాగే 9000 మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉంటారని పేర్కొంది. రష్యా దాడుల్లో 5,587మంది ఉక్రెయిన్ పౌరులు మరణించి ఉంటారని కచ్చితంగా చెప్పగలమని ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించింది. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు యుద్ధంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. తాము ఒకవేళ నాటోలో చేరాలనే ఆలోచన మార్చుకున్నా యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. చదవండి: అంతా చీకటే.. షింజో అబే హంతకుడి ఆవేదన -
ఉక్రెయిన్లోని రష్యా సైనికులపై విష ప్రయోగం!
మాస్కో: గత ఏడు నెలలుగా ఉక్రెయిన్పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు. ఒక్కో నగరాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో రసాయన విష ప్రయోగం జరగటం వల్ల ఉక్రెయిన్లోని తమ సైనికులు ఆసుపత్రుల పాలైనట్లు ఆరోపించింది రష్యా రక్షణ శాఖ. ‘బోటులినమ్ టాక్సిన్ టైప్ బీ’ అనే సేంద్రియ విషం నమూనాలను సైనికుల్లో గుర్తించినట్లు పేర్కొంది. కీవ్ కెమికల్ టెర్రరిజానికి పాల్పడుతోందని ఆరోపించింది. ‘జులై 31న జపోరోఝీ ప్రాంతంలోని వసిలియేవ్కా గ్రామం సమీపంలోని రష్యా సైనికులు తీవ్ర విష ప్రయోగంతో ఆసుపత్రుల పాలయ్యారు. రష్యా సైనికులు, పౌరులపై జెలెన్స్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెర్రరిస్టులు విషంతో నిండిన వాటితో దాడులకు పాల్పడుతున్నారు.’ అని పేర్కొంది రష్యా రక్షణ శాఖ. సైనికులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైన క్రమంలో వారి నుంచి సేకరించిన విష నమూనాలను అంతర్జాతీయ ‘రసాయన ఆయుధాల నిషేధ సంస్థ’(ఓపీసీడబ్ల్యూ)కు పంపించేందుకు సిద్ధమవుతోంది రష్యా. బోటులినమ్ టాక్సిన్ అనేది సైన్స్లో అత్యంత విషపూరితమైనదిగా గుర్తింపు పొందినట్లు పేర్కొంది మాస్కో. దీనిని క్లోస్ట్రిడియమ్ బోటులినియమ్ బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి చేస్తారని, ఇది ఎసిటైల్కోలిన్ న్యూరోట్రాన్స్మిటర్ విడుదలను అడ్డుకుంటుందని తెలిపింది. దాని ద్వారా కండరాల పక్షవాతం వస్తుందని స్పష్టం చేసింది. ‘బోటులినమ్ టాక్సిన్ టైప్ ఏ’ను కొన్నేళ్ల క్రితం కండరాల సమస్యల చికిత్స ఔషధాల్లో ఉపయోగించేవారు. దీనిని కాస్మెటోలజీలో బొటాక్స్గా పిలిచేవారు. అయితే, బోటులినమ్ టాక్సిన్ సులభంగా ఉత్పత్తి చేయటం, సరఫరా చేయటం వల్ల దానిని జీవ ఆయుధంగా ఉపయోగించే ప్రమాదం అధికంగా ఉంది. దీనిని ప్రయోగిస్తే మరణాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ విష ప్రయోగం బారినపడిన వారు దీర్ఘకాలం పాటు ఐసీయూలో చికిత్స తీసుకుంటేనే ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇదీ చదవండి: పుతిన్కు షాక్.. బాంబు దాడిలో ఉక్రెయిన్ యుద్ధ వ్యూహకర్త కుమార్తె దుర్మరణం! -
సండే సినిమా: వెండితెరపై జై జవాన్
సైనికులు అంటే యుద్ధం. దేశభక్తి. ప్రేమ. వియోగం. గెలుపు. మరణం. అందుకే ప్రపంచ సినిమాతో పాటు భారతీయ సినిమాలో తెలుగు సినిమాలో కూడా సైనికుడు కథానాయకుడు అవుతాడు. ‘సీతా రామమ్’లో హీరో సైనికుడు. ప్రేక్షకులు ఆ పాత్రను మెచ్చుకున్నారు. గతంలోనూ ఇలాగే మెచ్చారు. కాని నిజం చెప్పాలంటే తెలుగు సినిమాకు సైనికుడు అంతగా అచ్చి రాలేదు. ‘సండే సినిమా’లో ఈవారం ‘సైనిక సినిమా’. తెలుగు సినిమాల్లో సైనికుణ్ణి ఎక్కువగా తీసుకోరు. సైనికుడు అంటే ప్రేక్షకులు ఒక రకంగా ప్రిపేర్ అవుతారు... ఏ వీరమరణం పొందుతాడోనని. అదీగాక ఉత్తరాది వారితో పోలిస్తే దక్షిణాది వారికి సైనికులతో మానసిక అటాచ్మెంట్ తక్కువ. ఉత్తరాది వారే ఎక్కువగా సైన్యంలో భర్తీ కావడం ఇందుకు కారణం. అయినప్పటికీ మనవాళ్లు సైనిక నేపథ్యం ఉన్న పూర్తి సబ్జెక్ట్లను లేదా ఫ్లాష్బ్యాక్ కోసం కథ మలుపు కోసం సైనికుల సినిమాలు తీశారు. ‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ అని ఏ.ఎన్.ఆర్ ‘సిపాయి చిన్నయ్య’ చేశారు. అది ఒక మోస్తరుగా ఆడింది. అదే అక్కినేని ‘జై జవాన్’లో నటిస్తే ప్రేక్షకులు మెచ్చలేదు. ఎన్.టి.ఆర్. ‘రాము’లో మిలట్రీ జవాను. హిట్ అయ్యింది. కాని అదే ఎన్.టి.ఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సైనిక సినిమాల్లోకెల్లా పెద్ద హిట్గా ఇప్పటికీ నిలిచి ఉంది. అందులోని ‘జననీ జన్మభూమిశ్చ’ పాట దేశభక్తి గీతంగా మార్మోగుతూ ఉంది. కృష్ణ ‘ఏది ధర్మం ఏది న్యాయం’లో మిలట్రీ కేరెక్టర్ చేస్తే ఆడలేదు. కృష్ణ మరో సినిమా ‘చీకటి వెలుగులు’ కూడా అంతే. శోభన్ బాబు ‘బంగారు కలలు’ (ఆరాధన రీమేక్)లో ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా కనిపిస్తాడు. చిరంజీవి సైనికుడిగా నటించిన భారీ చిత్రం ‘యుద్ధభూమి’ సినీ సైనిక సెంటిమెంట్ ప్రకారం ఫ్లాప్ అయ్యింది. దీనికి దర్శకత్వం కె.రాఘవేంద్రరావు. అదే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి ఎయిర్ఫోర్స్ కస్టమ్స్ ఆఫీసర్గా ‘చాణక్య శపథం’లో నటించినా ఫలితం అదే వచ్చింది. బాలకృష్ణ ‘విజయేంద్ర వర్మ’, ‘పరమవీర చక్ర’ తగిన ఫలితాలు రాబట్టలేదు. కాని ‘మంగమ్మ గారి మనవడు’లో చిన్న సైనిక నేపథ్యం ఉంటుంది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రాజశేఖర్ నటించిన ‘మగాడు’ పెద్ద హిట్ అయితే ‘అంగరక్షకుడు’, ‘ఆగ్రహం’ విఫలం అయ్యాయి. నాగార్జున ‘నిన్నే ప్రేమిస్తా’లో సైనికుడిగా కనిపిస్తాడు. సుమంత్ ‘యువకుడు’, ‘స్నేహమంటే ఇదేరా’లో సైనిక పాత్రలు చేశాడు. ఈ కాలం సినిమాలలో మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్హిట్ కొట్టింది. సరిహద్దులో రాయలసీమలో మహేశ్ ప్రతాపం చూపగలిగాడు. కామెడీ ట్రాక్ లాభించింది. అడవి శేష్ ‘మేజర్’ తెలుగులో అమర సైనికుల బయోపిక్ను నమోదు చేసింది. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మిశ్రమ ఫలితాలు సాధించింది. రానా ‘ది ఘాజీ అటాక్’ హిట్. నాగ చైతన్య ‘లాల్సింగ్ చడ్డా’లో తెలుగు సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సైనిక సెంటిమెంట్ గండాన్ని దాటి ‘సీతా రామమ్’ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇందులో రామ్ అనే సైనికుడు నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మి అనే యువరాణితో ప్రేమలో పడటమే కథ. దుల్కర్ సల్మాన్, మృణాల్ పాత్రలు తెర మీద మంచి కెమిస్ట్రీని సాధించాయి. పాటలు మనసును తాకాయి. హిమాలయ సానువులు, మంచు మైదానాలు కూడా ఈ కథలో భాగమయ్యి కంటికి నచ్చాయి. గొప్ప ప్రేమకథలు విషాదాంతం అవుతాయి అన్నట్టుగా ఈ కథ కూడా విషాదాంతం అవుతుంది. అందుకే ప్రేక్షకులకు నచ్చింది. బాంధవ్యాలను, కుటుంబాలను వదిలి దేశం కోసం పహారా కాసే వీరుడు సైనికుడు. అతని చుట్టూ ఎన్నో కథలు. ఆ కథలు సరిగా చెప్తే ఆదరిస్తామని ప్రేక్షకుడు అంటున్నాడు. మున్ముందు ఎలాంటి కథలు వస్తాయో చూద్దాం. -
భారతీయతే మన ఐక్యత
కంటోన్మెంట్ (హైదరాబాద్): భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేలా చేస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంత విభిన్నత ఉన్నా భారతీయతే మన ఐక్యత అని చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఆర్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. కాలికి తగిలిన గాయం వల్ల మూడు వారాలుగా ఇంటికే పరిమితమైన తాను.. బయటికి వచ్చాక మొదట ఆర్మీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ‘‘నేను ఐటీ, పరిశ్రమల మంత్రిగా వివిధ దేశాలు తిరిగినప్పుడు చాలా మంది మన దేశాన్ని చైనాతో పోల్చి మాట్లాడారు. అధిక జనాభా, వనరులున్న చైనా, భారత్ అన్నింటా పోటీపడటం సహజమే. అయితే విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు కలిగిన మన దేశంలో ప్రతి 100 కిలోమీటర్లకు అన్నీ మారిపోతూ ఉంటాయి. భాష, యాస, కట్టుబొట్టు, ఆహార అలవాట్లు అన్నింటా వ్యత్యాసం ఉంటుంది. కానీ అందరినీ ఒక్క తాటిపై నిలిపేది మాత్రం భారతీయతే. 75 ఏళ్లలో మనం సాధించిన విజయాలకు తోడు.. మన ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దీన్ని భవిష్యత్లోనూ కొనసాగించాలి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పరేడ్ గ్రౌండ్లో సైనికులు, కళాకారులు, విద్యార్థుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని.. ఇంత మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ఆర్మీ దక్షిణ భారత్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్, లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ కుమార్కు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఆకట్టుకున్న లెఫ్టినెంట్ జనరల్ ప్రసంగం పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ కార్యక్రమాల ముగింపు సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ అరుణ్కుమార్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు వ్యక్తి అయిన ఆయన మన భాషతోపాటు హిందీ, ఇంగ్లిష్లోనూ మాట్లాడుతూ ఉత్తేజపరిచారు. ప్రసంగం మధ్యలో ఆర్మీ జవాన్లు త్రివర్ణ పతాకంతో గగనంలో ఎగురుతూ చేసిన విన్యాసాన్ని తిలకించాల్సిందిగా ఆహుతులను కోరారు. అమర జవానులకు నివాళి పరేడ్ గ్రౌండ్స్లో కార్యక్రమాల సందర్భంగా తెలంగాణ–ఏపీ ఆంధ్రా సబ్ ఏరియా ప్రాంతానికి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషి, మేజర్ పద్మపాణి ఆచార్య సతీ మణి చారులత, కంటోన్మెంట్కు చెందిన లాన్స్నాయక్ రాంచందర్ సతీమణి ఎంఆర్ దివ్యతోపాటు అమరవీరుల కుటుంబ సభ్యులు విమలారావు, లక్ష్మీదేవి, నస్రీన్ ఖాన్, గీత మాధవ్, సుభాషిణీ, నీలం దేష్కర్, సర్వాహ్జా, శివలీల, కిరణ్ గుప్తా, సుహాసినీ మహేశ్వర్, నసీమ్ సుల్తానా తదితరులకు మంత్రి పురస్కారాలు అందజేశారు. ఇక ఇటీవల జరిగిన మిలటరీ ఆపరేషన్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, సేవా పురస్కారాలు పొందిన టీఎన్ సాయికుమార్, కల్నల్ సురేంద్ర పోలా, కల్నల్ రాహుల్ సింగ్ తదితరులకు సైతం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రశంసా పురస్కారాలు అందజేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పరేడ్ గ్రౌండ్స్లో ఆర్మీ ఏర్పాటు చేసిన యుద్ధ ట్యాంకులు, ఆయుధ ప్రదర్శన ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని సందర్శించి, ఆర్మీ విన్యాసాలను తిలకించారు. కలరిపయట్టు, పేరిణి నృత్యాలు, ఆర్మీ బ్యాండ్ ప్రదర్శనలు, బొల్లారం ఆర్మీ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
AP: ఆ ఊరే ఒక సైన్యం.. వీరుల పురిటిగడ్డ అది..
తాడేపల్లిగూడెం: అక్కడి తల్లులు తమ పిల్లలకు ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని రంగరించి పోస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ఊరు ఊరంతా ఒక సైన్యమే అంటే అతిశయోక్తి కాదు. టెక్నాలజీతో అందివస్తున్న జాబ్లెన్నో ఉన్నా.. తమ మొగ్గు మాత్రం దేశమాత సేవకే అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం భారత సైన్యంలో ఈ ఊరి నుంచి 1,650 మంది పనిచేస్తున్నారు. వీరిలో కల్నల్స్, లెఫ్టినెంట్ కల్నల్స్ ఉండటం విశేషం. భారత సైన్యంలో చేరాలనుకునే తమ ఊరి యువతకు ఎక్స్సర్వీస్మెన్ అసోసియేషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పుడు అగ్నిపథ్ ద్వారా భారత సైన్యంలోకి చేరికలు ఉండటంతో యువత సులువుగా ఎంపికయ్యేలా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభిస్తామని ఎక్స్సర్వీస్మెన్ అసోసియేషన్ బాధ్యులు ప్రత్తి రామకృష్ణ, బొల్లం వీరయ్య చెబుతున్నారు. దేశంలోనే రెండో స్థానం.. మాధవరం గ్రామస్తులు స్వాతంత్య్రానికి ముందు నుంచే సైనికులుగా, అధికారులుగా సేవలు అందించారు. దేశంలోనే అత్యధికంగా సైన్యంలోకి యువకులను పంపిస్తున్న ప్రాంతంగా మాధవరం రెండో స్థానం పొందడం విశేషం. గ్రామస్తులు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, దేశ స్వాతంత్య్ర పోరాటం, పాకిస్థాన్, చైనాలతో యుద్ధాలు, బంగ్లాదేశ్, శ్రీలంక తరఫున చేసిన యుద్ధాల్లో ప్రతిభ చూపారు. సిపాయి, హవల్దార్, సుబేదార్, సుబేదార్ మేజర్, నాయక్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్ వంటి హోదాల్లో సేవలను అందించారు. భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో 1,850 మంది మాధవరం సైనికులు పాల్గొని సత్తా చాటడం విశేషం. వార్ మెమోరియల్ ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉండగా రెండోది మాధవరంలో మాత్రమే ఉంది. ఇది కూడా చదవండి: సచివాలయ సేవలు బాగున్నాయి.. కేంద్ర మంత్రి కితాబు -
ఎట్టి పరిస్థితుల్లోను అగ్నిపథ్ ను ఆపేది లేదు
-
‘అగ్నివీరుల’ ఆగమనం!
దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచే త్రివిధ దళాల్లో సంస్కరణలకు అంకురార్పణ చేస్తూ కేంద్రం ‘అగ్నిపథం’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేర్చుకునేవారికి కూడా ఘనమైన పేరే పెట్టారు. వారిని ‘అగ్నివీర్’లు అంటారు. 17.5– 21 ఏళ్ల మధ్యవయస్కులను సైనికులుగా ఎంపిక చేస్తారని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ప్రకటించారు. ఇది నాలుగేళ్ల కాంట్రాక్టు నియామకానికి సంబంధించిందే అయినా, మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించేవారి సర్వీసు కొనసాగుతుంది. ఏటా నాలుగోవంతు మంది బయటకు రాకతప్పదు. సాంకేతిక నైపు ణ్యాలు తప్పక అవసరమైన వైమానిక, నావికా దళాలకు ఈ పథకం సాధ్యపడకపోవచ్చు. కనుక ప్రధానంగా సైనికదళంలోనే ఈ ‘అగ్నివీర్’ల ఉనికి ఉంటుందనుకోవాలి. ఈ పథకానికి లభించే ఆదరణనుబట్టి ప్రస్తుత నియామక విధానానికి క్రమేపీ స్వస్తి పలుకుతారు. సైనిక వ్యవస్థలో సంస్కర ణలు తీసుకురావాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. కార్గిల్ యుద్ధ సమయం నుంచీ అది తరచు ప్రస్తావనకొస్తూనే ఉంది. కానీ జరిగిందేమీ లేదు. 2014లో అధికారంలోకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం 2016లో ఒక కమిటీని నియమించింది. ఫలితంగా ఈ ‘అగ్నిపథం’ ఆవిష్కృతమైంది. పరిపాలకు లెలా ఉండాలో, ఆర్థిక రాజకీయ వ్యవహారాలు ఎలా చక్కబెట్టాలో చెప్పిన చాణక్యుడు ఏ పనైనా మొదలెట్టినప్పుడు పాలకులు మూడు ప్రశ్నలు వేసుకోవాలన్నాడు. ‘ఎందుకు చేస్తున్నాను... ఇలాచేస్తే రాగల ఫలితం ఏమిటి... ఈ కృషిలో విజయం సాధిస్తానా’ అనేవి ఆ ప్రశ్నల సారాంశం. ప్రపంచవ్యాప్తంగా సైనికరంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతం మాదిరి దీర్ఘకాలిక యుద్ధాలకు ఇప్పుడు పెద్దగా అవకాశం లేదు. చాలా యుద్ధాలు మొదలైనంత వేగంగా ముగిసిపోతున్నాయి. పైగా వీటిలో సాంకేతిక నైపుణ్యానిదే పైచేయి. రిమోట్ కంట్రోల్ ఆయుధాలు, లక్ష్యంవైపు మారణాయుధాలతో దూసుకుపోగల డ్రోన్లు, కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే స్వయంచాలిత ఆయుధాలదే ఇప్పుడు కీలకపాత్ర. అందుకే అమెరికా మొదలుకొని చైనా వరకూ సైనిక రంగంలో సంస్కరణలు మొదలై చాన్నాళ్లయింది. అయితే అమెరికాకైనా, ఇతర పాశ్చాత్య దేశాలకైనా జనాభా తక్కువ గనుక సైనిక రిక్రూట్మెంట్ మొదటినుంచీ సమస్యే. మనకుండే సమస్యలు వేరు. మన త్రివిధ దళాలు సంఖ్యాపరంగా చూస్తే దాదాపు 14 లక్షలు. ఇందులో పౌర సిబ్బంది దాదాపు 3.75 లక్షలు. మొత్తంగా ఏటా రిటైరయ్యేవారి సంఖ్య 55,000. సంస్కరణలు ప్రతి పాదించే కమిటీలన్నీ సైన్యంకన్నా పౌరసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని సూచిస్తూనే ఉన్నాయి. కానీ అనేక కారణాలవల్ల కేంద్రంలో ఎవరున్నా వారి జోలికిపోరు. పైగా ఈ పౌర సిబ్బందికి జీతాలు, రిటైర్మెంట్ తర్వాత వచ్చే పింఛన్ అదే క్యాడర్లో సైన్యంలో పనిచేస్తున్నవారికన్నా చాలా ఎక్కువ. ఎందుకంటే సైన్యంలో కనిష్ఠంగా పదేళ్లకు రిటైర్ కావొచ్చు. పౌరసిబ్బంది దాదాపు మూడున్నర దశాబ్దాల సర్వీసు పూర్తిచేస్తారు. అంకెలు ఘనంగా కన్పించవచ్చుగానీ ద్రవ్యోల్బణాన్ని పరిగణన లోకి తీసుకుంటే 80వ దశకం మధ్యనుంచీ మన రక్షణ కేటాయింపులు క్రమేపీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం మన జీడీపీలో ఆ రంగం వాటా 1.5 శాతం. ఇందులో గణనీయమైన భాగం జీతాలకూ, పింఛన్లకూ పోతుందంటారు. సంస్కరణలను వ్యతిరేకించాల్సిన పని లేదు. కానీ అవి ఎక్కడ, ఎలా ఉండాలన్నదే ప్రశ్న. కార్గిల్ యుద్ధం ముగిశాక ఆనాటి సీనియర్ అధికారులు మన దగ్గర కాలం చెల్లిన ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రి అధికమని ఎత్తిచూపారు. ఎన్డీఏ అధికారంలోకొచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఈ విషయంలో పెద్దగా మారిందేమీ లేదు. నిజమే... రాఫెల్ యుద్ధ విమానాలవంటి అత్యంతాధునిక యుద్ధ విమానాలు, అణు క్షిపణులను అడ్డుకోగల సామర్థ్యం ఉండే ఎస్–400 క్షిపణి వ్యవస్థ వంటివి మన రక్షణ అమ్ములపొదిలో వచ్చి చేరాయి. శత్రువును నిలువరించడంలో, మట్టికరిపించడంలో అవి తిరుగులేని అస్త్రాలు. కానీ ఇతరత్రా రక్షణ సామగ్రి మాటేమిటి? సాధారణ సైనికులకు అవసరమైన ఆయుధాల సంగతేమిటి? కాంట్రాక్టు పద్ధతిలో చేర్చుకుంటే పెన్షన్, ఇతరత్రా ప్రయోజనాలకయ్యే వ్యయం చాలా వరకూ తగ్గుతుందనీ, ఆ మొత్తాన్ని సైనికదళాల ఆధునికీకరణకు ఖర్చు చేయొచ్చనీ ‘అగ్నిపథం’ పథకాన్ని సమర్థిస్తున్నవారు చెబుతున్నారు. కానీ ఆమేరకు సామాజిక అశాంతి ప్రబలదా? రిటైరైనప్పుడు వచ్చే మొత్తం మినహా మరేంలేకపోతే కుటుంబాలన్నీ ఎలా నెట్టు కొస్తాయి? అసలు వచ్చింది కొలువో, కాదో తెలియని అయోమయం... నాలుగేళ్ల తర్వాత బయటికి రావడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈ పథకం ప్రకటించి 24 గంటలు తిరగకుండానే బిహార్లో నిరసన స్వరాలు వినిపించాయి. నాలుగేళ్లు సైన్యాన్ని నమ్ముకుని పనిచేశాక మళ్లీ కొత్త కొలువు కోసం వేట మొదలుపెట్టాలా అన్నది వారి ప్రశ్న. నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని మాత్రమే సర్వీసులో కొనసాగిస్తారు. 75 శాతం మంది బయటకి రావాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెబుతున్నట్టు వారందరికీ కొత్త ఉపాధి చూపడం సాధ్యమేనా? అక్కడ నేర్చుకున్న విద్యలతో, కొలువుపోయిందన్న అసంతృప్తితో పెడదోవ పట్టేవారుండరా? అసలు ‘అగ్నివీర్’లను సాధారణ సైనికుల మాదిరి పరిగణించి బాధ్యతలు అప్పగించడం ఆచరణలో అధికారులకు సాధ్యమేనా? అనుకోని పరిణామాలు వచ్చిపడితే ఇతర సైనికుల తరహాలో ‘అగ్నివీర్’లు పూర్తి సంసిద్ధత ప్రదర్శించగలరా? కేంద్రం జాగ్రత్తగా ఆలోచించి అడుగులేయాలి. -
త్రివిధ దళాల్లో అగ్నిపథ్ నియామకాలు
-
ఉక్రెయిన్ యుద్ధం: ప్రైవేట్ సైనికులు కావలెను.. భారీగా జీతం, బోనస్ ప్రత్యేకం
‘‘ఉక్రెయిన్ శిథిలాల్లో, కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు ప్రైవేట్ సైనికులు కావలెను. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల డాలర్ల జీతం. బోనస్ ప్రత్యేకం’’ – సైలెంట్ ప్రొఫెషనల్స్ అనే ప్రైవేట్ సైనిక సంస్థ ప్రకటన ఇది. కొన్నేళ్లుగా ఇలాంటి ప్రకటనలు వెబ్సైట్లలో అనేకం ప్రత్యక్షమవుతున్నాయి. అమెరికా, యూరప్కు చెందిన వందలాది మంది మాజీ సైనికులు ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో పని చేస్తున్నారు. ఇంకా చాలామంది వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. సంక్షుభిత ఉక్రెయిన్ నుంచి పౌరులను సురక్షిత దేశాలకు తీసుకెళ్లేందుకూ ప్రైవేట్ సైనిక సంస్థలు కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి. కుటుంబాలను, సమూహాలను సురక్షితంగా తరలించేందుకు 30,000 డాలర్లు మొదలుకొని 60,000 డాలర్ల దాకా కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నాయి ఈ సంస్థలు. ప్రోత్సహిస్తోంది ప్రభుత్వాలే చాలా దేశాల్లో సైన్యానికి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ సంస్థలు ఇలా బలగాలను పోషిస్తున్నాయి. పరిశ్రమలు, కార్యాలయాలకు రక్షణ కల్పించే సెక్యూరిటీ సంస్థల్లాగే సైనిక అవసరాలను తీరుస్తున్న ఈ కంపెనీలను ప్రైవేట్ మిలటరీ కంపెనీలు (పీఎంసీ) అంటారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా పని చేస్తున్నాయి. ప్రభుత్వాలు, సైన్యం అధికారికంగా చేయలేని పనులను వీటితో చేయించుకుంటారు. వీటి కార్యకలాపాలు వివాదాస్పదమైతే తమకు సంబంధం లేదని ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటాయి. ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులూ వీటి సేవలను వాడుకుంటున్నారు. వేలు, లక్షల కోట్ల వ్యాపారం చేసే బడా కార్పొరేట్ సంస్థ లు ఆరితేరిన మాజీ సైనికులను నియమించుకుంటున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా పీఎంసీల వ్యాపార విలువ 22,400 కోట్ల డాలర్లని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ న్యూస్ చెబుతోంది. 2030 నాటికి 45,700 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. వాగ్నర్ VS అకాడమీ ఇవి రెండూ ప్రస్తుతం ఉక్రెయిన్లో వైరి పక్షాల తరఫున బరిలో దిగాయి. గతంలో సిరియా, లిబియాల్లో రష్యా ప్రయోజనాలు కాపాడేందుకు పనిచేసిన వాగ్నర్ ఇప్పుడు ఉక్రెయిన్ సైనికాధికారులు, నేతలే లక్ష్యంగా 400 మంది కిరాయి సైనికులను దించిందని ది టైమ్స్ పత్రిక వెల్లడించింది. వీరిని గుర్తించి హతమార్చేందుకు ఉక్రెయిన్ కోరిక మేరకు అకాడమీ పని చేస్తోంది. ఇరాక్, అఫ్గానిస్తాన్ల్లో అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు పని చేసిన అకాడమీ ఉక్రెయిన్లో మాజీ సైనికులను రిక్రూట్ చేసుకొని పౌరులకు సైనిక శిక్షణ ఇస్తోంది. సైనిక సామగ్రి బాధ్యతలూ దీనివే. కంపెనీల స్వరూపం ప్రపంచవ్యాప్తంగా, అమెరికా, సంపన్న యూరప్ దేశాల్లో వందలాది పీఎంసీలున్నాయి. అంతర్జాతీయ సూత్రాలకు, ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమైన పనులూ చేసే ఈ కంపెనీలను పలు దేశాల్లో ప్రభుత్వాలే రంగంలోకి దించి తమ టార్గెట్లు పూర్తి చేసుకుంటుంటాయి. ఈ కంపెనీల్లో ముఖ్యమైనవి.. చదవండి: McDonald's: మూతపడ్డ 2 నెలలకు రీ ఓపెన్. అయితే కొత్త పేరు, లోగో! ► అకాడమీ: బ్లాక్ వాటర్ పేరుతో నడిచిన ఈ సంస్థ చేతులు మారి అకాడమీగా అవతరించింది. అమెరికాలో ని నార్త్ కరోలినా కేంద్రంగా పని చేస్తుంది. 25,000కు పైగా ఉద్యోగులున్నారు. 90% కాంట్రాక్టులు అమెరికా ప్రభుత్వం, నిఘా సంస్థ సీఐఏ నుంచి వస్తాయి. ► వాగ్నర్ గ్రూప్ రష్యా రాజధాని మాస్కో కేంద్రంగా పని చేసే ఈ సంస్థలో 10,000కు పైగా కిరాయి సైనికులున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడైన యవ్జెన్ ప్రిగోజిన్ దీని అధిపతి. ► జీఫోర్ఎస్ ప్రపంచంలో అత్యంత పెద్ద పీఎంసీల్లో ఒకటి. లండన్ కేంద్రంగా పని చేస్తుంది. 5 లక్షలకుపైగా ఉద్యోగులున్నారు. ► యూనివర్సల్ ప్రొటెక్షన్ అమెరికాకు చెందిన కంపెనీ. 2 లక్షల మంది పని చేస్తున్నారు. ► కేబీఆర్ అమెరికాలోని టెక్సాస్కు చెందిన సంస్థ. 40,000 మంది ఉద్యోగులున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా సైనికుల దొంగ పెళ్లిళ్లు.. ఫోన్ సంభాషణ లీక్!
మాస్కో: ఉక్రెయిన్లో నెలల తరబడి విసుగెత్తిపోయిన రష్యా సైనికులు యుద్ధం నుంచి తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సొంత దేశం చేరుకోవడానికి ఉత్తుత్తి పెళ్లిళ్లకు తెర తీస్తున్నారు. నకిలీ శుభలేఖలు సమర్పించి సెలవులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా ఓ ఫోన్ సంభాషణ ద్వారా బయటపడింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మంగళవారం విడుదల చేసిన ఒక ఫోన్ కాల్ ప్రకారం.. ఉక్రెయిన్లో ఉన్న రష్యా సైనికుడికి, అతడి స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈ తతంగం బయటపడింది. నకిలీ పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నానని, చాలామంది ఇలాగే చేశారని అతను చెప్పుకున్నాడు. ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి ఇదొక్కటే మార్గమన్నాడు. చదవండి: రష్యా యుద్ధం.. ఉక్రెయిన్ దళాల వెనుకంజ! -
Ukraine Russia War: 31,000 రష్యా సైనికుల మృతి
Russia has Lost Over 31000 Soldiers in Ukraine: ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య 31 వేలు దాటినట్టు సమాచారం. తాజాగా వ్లాదిమిర్ నిగ్మతులిన్ (46) అనే కల్నల్ మరణించడంతో యుద్ధంలో బలైన రష్యా కల్నల్స్ సంఖ్య 50కి చేరింది. మేజర్ జనరల్ రోమన్ కుజుతోవ్, లెఫ్టినెంట్ జనరల్ బెర్డ్నికోవ్ మరణంతో యుద్ధానికి బలైన రష్యా జనరళ్ల సంఖ్య 12కు చేరింది. మరోవైపు వాగ్నర్ గ్రూప్కు చెందిన వ్లాదిమిర్ ఆండొనోవ్ (44) అనే రష్యా కిరాయి సైనికున్ని ఉక్రెయిన్ స్నైపర్లు మట్టుబెట్టారు. ఇతను క్రిమియా యుద్ధమప్పుడు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలకు నరకం చూపించి ‘తలారి’గా పేరుమోశాడు. చదవండి: (దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేసిన... గుప్తా బ్రదర్స్ చిక్కారు) -
18 రోజులు.. 12వేల కిలోమీటర్ల బైక్ ప్రయాణం
మందస: కొండలు దాటారు.. కోనలు దాటారు.. లోయలు చూశారు.. శిఖరాల పక్క నుంచి ప్రయాణించారు... ‘ఏడుగురు అక్కచెల్లెళ్లు’ను పలకరించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు. ఒకటా రెండా.. పన్నెండు రాష్ట్రాలు.. పన్నెండు వేల కిలోమీటర్ల దూరా న్ని 18 రోజుల్లో పూర్తి చేశారు. సైని కులు తలపెట్టిన బృహత్తర సాహస యాత్ర ఇది. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా కోవిడ్, వైద్యంపై అవగాహన కల్పించడానికి 12 మంది సోల్జర్ల బృందం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించా రు. ఈ బృందంలో ఓ సిక్కోలు సైనికుడు కూడా ఉన్నాడు. మందస గ్రామానికి చెందిన డుంకురు సతీష్కుమార్ ఈ సాహస బృందంలో ఓ సభ్యుడు. ఈయన నాయక్ క్యాడర్లో పనిచేస్తున్నారు. సెవెన్ సిస్టర్స్గా ముద్దుగా పిలిచే ఈశాన్య రా ష్ట్రాలో బైక్ రైడింగ్ అంత ఈజీ కాదు. సులభమైన పనులు చేస్తే వారు సైనికులు ఎందుకవుతారు. అందుకే ఈ 12 మంది బృందం ఈ రాష్ట్రాల మీదుగా బైక్లతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేశ్ అడావ్ ఆధ్వర్యంలో నలుగురు డాక్టర్లు, నలుగురు ఆర్మీ అధికారులు, నాయక్ కేడర్ కలిగిన ఇద్దరు సైనికులు, హవల్దార్ కేడరు ఇద్దరు మొత్తం 12 మందితో కూడిన బృందం న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుంచి ఈ నెల 9న బయలుదేరింది. ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరాంఛల్ రాష్ట్రాల మీదుగా 18 రోజుల పాటు 12వేల కిలో మీటర్లు మోటారు వాహనాలతో సాహస యాత్ర సాగింది. దారిలో 78 ఆర్మీ మెడి కల్ యూనిట్లలో ఈ బృందం అవగాహన కల్పించింది. యాత్ర ఈ నెల 27తో ముగియగా, ఆర్మీ ఉన్నతాధికారులు ఈ బృందాన్ని అభినందించారు. సాహస యా త్రలో పాల్గొ న్న సతీష్కుమార్కు మందస ప్రజలు అభినందనలు తెలిపారు. గర్వంగా ఉంది 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆర్మీ సాహస యాత్ర చేయడానికి నిర్ణయించింది. 12 మందితో కూడిన బృందం, 12 రాష్ట్రాల మీదు గా 18వేల కిలోమీటర్లు యాత్ర చేయడానికి సంకల్పించాం. వివిధ రాష్ట్రాల్లోని వాతావరణాలను తట్టుకున్నాం. నిజంగా సాహసంగానే యాత్ర జరిగింది. పెద్ద లక్ష్యం, రోజూ వందల కిలోమీటర్ల ప్రయాణం. సమస్యలు ఎన్ని వచ్చినా అధిగమించాం. చైనా బోర్డరును దాటాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం గర్వకారణంగా ఉంది. ఈ యాత్రతో మందసకు పేరు రావడం ఆనందంగా ఉంది. – డుంకురు సతీష్కుమార్, సాహస బృందం సభ్యుడు, మందస -
సిల్వర్ స్క్రీన్ కోసం సోల్జర్లుగా మారిన యంగ్ హీరోలు
వేరీజ్ దట్ మోడ్రన్ హెయిర్ స్టయిల్.. వాటీజ్ దిస్ మీసకట్టు.. వేరీజ్ దట్ లవర్ బోయ్ లుక్ అంటే... కట్ చేశా.. లుక్ మార్చేశా అంటున్నారు కుర్ర హీరోలు. మరి.. సైనికుడా? మజాకానా? సిల్వర్ స్క్రీన్ కోసం సోల్జర్లుగా మారిన ఈ హీరోలు ఆ పాత్రకు తగ్గట్టుగా మారిపోయారు. సోల్జర్.. ఆన్ డ్యూటీ అంటున్న వెండితెర సైనికుల గురించి తెలుసుకుందాం. 'వెంకీమామ’ (2019)లో కొన్ని సీన్ల కోసం సరిహద్దుకు వెళ్లొచ్చారు నాగచైతన్య. మళ్లీ ఇప్పుడు బోర్డర్కు వెళ్లొచ్చారు. ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో ‘లాల్సింగ్ చద్దా’ అనే సినిమా రపొందిన సంగతి తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. ఈ చిత్రంలో బాల అనే పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. కథ రీత్యా ఈ చిత్రంలో కొన్ని సీన్స్లో ఆమిర్ ఖాన్, నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్స్గా కనిపిస్తారు. సినివలో ఓ వార్ బ్యాక్డ్రాప్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్స్లో రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగులోన ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే హిందీలో నాగచైతన్య నటించిన తొలి సినిమా కూడా ‘లాల్సింగ్ చద్దాయే’ కావడం విశేషం. అయితే ఇందులో చైతూది స్పెషల్ రోల్. మరోవైపు విజయ్ దేవరకొండ ఫుల్ లెంగ్త్ సోల్జర్గా కనిపించనున్న చిత్రం ‘జేజీఎమ్’ (జేజీఎమ్ అంటే ‘జన గణ మన’ అనే ప్రచారం జరుగుతోంది). ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్ మూవీ ‘లైగర్’ తర్వాత వెంటనే దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ‘జేజీఎమ్’. ‘‘ఇండియన్స్ ఆర్ టైగర్స్, ఇండియన్స్ ఆర్ ఫైటర్స్, ఇండియన్స్ కేన్ రూల్ దిస్ వరల్డ్.. 'జన గణ మన’... ఇది ‘జేజీఎమ్’ చిత్రం ప్రారంభోత్సవంలో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్. దీన్నిబట్టి ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ ఏ లెవల్లో ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా కశ్మీర్లోనే టైమ్ స్పెండ్ చేశారు దుల్కర్ సల్మాన్. ఎందుకంటే.. ‘సీతారామం’ సినివ కోసం. ‘మహానటి’ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న రెండో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ఇది. నాని హీరోగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తీసిన హను రాఘవపూడి ఈ ‘సీతారామం’ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీత పాత్రలో హీరోయిన్గా మృణాళినీ ఠాకూర్, కీలక పాత్రలో అఫ్రీన్గా రషి్మకా మందన్నా కనిపిస్తారు. ‘సీతారామం’ బోర్డర్ బ్యాక్డ్రాప్లో సాగే లవ్స్టోరీ అని తెలిసింది. ఈ చిత్రంలో సుమంత్ ఓ కీ రోల్ చేస్తున్నారు. సుమంత్ది కూడా సోల్జర్ పాత్ర అని సమాచారం. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో రపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ మలయాళ స్టార్ మమ్ముట్టి ‘ఏజెంట్’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రపొందుతోన్న ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరో. ఈ చిత్రంలో మమ్ముట్టీది మిలిటరీ ఆఫీసర్ పాత్ర అని సమాచారం. ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఈ ముగ్గురే కాదు.. మరికొందరు తెలుగు హీరోలు కూడా సోల్జర్స్గా వెండితెరపై కనిపించనున్నారని తెలుస్తోంది. చదవండి: మందు తాగుతా, ఆ టైమ్లోనే కథలు రాస్తాను: ప్రశాంత్ నీల్ దటీజ్ రామ్చరణ్, ఆయన వ్యక్తిత్వానికి ఇదే ఎగ్జాంపుల్! -
ఇలా జరుగుతుందని అనుకోలేదు.. చాలా విషాదకరం: రష్యా
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ ఆపరేషన్ ప్రకటించి నాలభై రోజులు దాటింది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా భారీగానే నష్టపోయింది. ముఖ్యంగా ఇరువర్గాలు తమ సైనిక బలగాలను చాలా వరకు కోల్పోయినట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. దిమిత్రీ మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా భారీ స్థాయిలో రష్యన్ బలగాలను కోల్పోయామని, జరిగిన ఘటన చాలా విషాదకరమని ఆయన అవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. యుద్ధ ప్రారంభంలో ఇంత నష్టం జరుగుతుందని ఊహించనట్లు తెలిపారు. ఇక తొందర్లోనే తమ యుద్ధ లక్ష్యాలను చేరుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టి ఆరు వారాల కాగా ఇప్పటికే 4 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్ని విడిచి విదేశాలకు వలస వెళ్లారు. అంతేకాకుండా వేలాది మంది గాయపడడంతో పాటు మరణాలతో కీవ్ నగరం మారుమోగింది. దీనికి ప్రతీకాత్మక చర్యగా.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రష్యాను యూఎన్ మానవ హక్కుల మండలి నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత రష్యా కూడా ఈ కౌన్సిల్ నుంచి వైదొలిగింది. ఉక్రెయిన్లో రష్యా జరుపుతున్న దాడులు కారణంగా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా రష్యా గత మూడు దశాబ్దాలుగా రష్యా చూడని అత్యంత క్లిష్ట ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటుందని ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ అన్నారు. యూఎస్ కాంగ్రెస్ కూడా రష్యాని దాని మోస్ట్ వాంటెడ్ కంట్రీ జాబితా నుంచి తొలగించింది. దీని మూలాన వాణిజ్య పరంగా రష్యాకు మరింత దెబ్బ తగలనుంది. చదవండి: వార్నింగ్ ఇచ్చినా హ్యాండ్ ఇచ్చిన భారత్.. పుతిన్ రెస్పాన్స్పై టెన్షన్! -
రష్యా సైనికుల దురాగతం... ఉక్రెయిన్ మహిళపై అత్యాచారం
Ukrainian woman recalls horror: రష్యా ఉక్రెయిన్పై వైమానిక దాడులతో యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఒక పక్క శాంతి చర్చలు అంటూనే మరోపక్క యథావిధిగా దాడులకు తెగబడుతోంది. మరోవైపు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం లేదంటూనే నివాసితుల ఇళ్లపై బాంబుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు ఒక ఉక్రెయిన్ మహిళ రష్యా సైనికులు తన ఇంటిపై దాడి చేశారని తెలిపింది. తొలుత తమ పెంపుడు కుక్కను చంపారని, ఆ తర్వాత తన భర్తను చంపినట్లు వెల్లడించింది. తదనంతరం రష్యా సైనికులు తన తలపై గన్పెట్టి తాము చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని బెదిరించి ఆత్యాచారం చేశారని తెలిపింది. ఆ సమయంలో తన నాలుగేళ్ల కొడుకు భయంతో బాయిలర్ రూమ్లో గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నాడంటూ ఆనాటి ఘటనను గుర్తుతెచ్చుకుంటూ కన్నీటిపర్యంతమైంది. ఆ తర్వాత తాము అక్కడి నుంచి భయంతో పారిపోయామని, తన భర్త శవాన్ని కూడా అక్కడే వదిలేశామని చెప్పింది. ప్రస్తుతం అధికారులు ఆమె ఆరోపణలపై విచారణ చేపట్టారు. (చదవండి: పుతిన్ ధీమా... జెలెన్ స్కీ అభ్యర్థన) -
Ukraine Russia War: 9,861 రష్యా సైనికుల మృతి!
Russian Soldiers Killed in Ukraine War: ఉక్రెయిన్తో యుద్ధంలో ఇప్పటిదాకా ఏకంగా 9,861 మంది రష్యా సైనికులు మరణించారని రష్యాకు చెందిన ఓ ప్రముఖ వార్తా పత్రిక పేర్కొంది. 16 వేలకు పైగా తీవ్రంగా గాయపడ్డారని రష్యా రక్షణ శాఖ వర్గాలనే ఉటంకిస్తూ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా హాకర్ల పని అని చెప్తూ ఈ కథనాన్ని కాసేపటికే వెబ్సైట్ నుంచి తొలగించింది. దీనిపై స్పందించేందుకు అధ్యక్ష భవన అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నిరాకరించారు. చదవండి: (రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం) -
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. దాదాపు నెల రోజుల యుద్ధంలో ప్రధానంగా ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్ తాజాగా రష్యా దళాలపై ఎదురుదాడికి దిగుతోంది! మంగళవారం హోరాహోరీ పోరులో రాజధాని కీవ్ శివార్లలో వ్యూహాత్మకంగా కీలకమైన మకరీవ్ నుంచి రష్యా సేనలను వెనక్కు తరిమి దాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో కీలకమైన స్థానిక హైవేపై ఉక్రెయిన్ సైన్యానికి తిరిగి పట్టు చిక్కింది. వాయవ్య దిక్కు నుంచి కీవ్ను చుట్టముట్టకుండా రష్యా సైన్యాన్ని అడ్డుకునే వెసులుబాటు కూడా దొరికింది. అయితే బుచా, హోస్టొమెల్, ఇర్పిన్ తదితర శివారు ప్రాంతాలను మాత్రం రష్యా సైన్యం కొంతమేరకు ఆక్రమించగలిగిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ పేర్కొంది. ఎలాగోలా కీవ్ను చేజిక్కించుకునేందుకు యుద్ధం మొదలైనప్పటి నుంచీ రష్యా విశ్వప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం కూడా బాంబు, క్షిపణి దాడులతో కీవ్, శివార్లు, పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూను బుధవారం దాకా పొడిగించారు. మారియుపోల్లో వినాశనం కీలక రేవు పట్టణం మరియుపోల్లో రష్యా గస్తీ బోటును, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. నగరాన్ని ఆక్రమించేందుకు రష్యా సైన్యాలు చేస్తున్న ప్రయత్నాలను నిరంతరం తిప్పికొడుతున్నట్టు చెప్పింది. నగర వీధుల్లో శవాలు గుట్టలుగా పడున్నాయని నగరం నుంచి బయటపడ్డ వాళ్లు చెప్తున్నారు. మారియుపోల్లోనే కనీసం 10 వేల మందికి పైగా పౌరులు మరణించి ఉంటారని భావిస్తున్నారు! మూడో వంతుకు పైగా ప్రజలు ఇప్పటికే నగరం వదిలి పారిపోయారు. ప్రధానంగా నగరాలే లక్ష్యంగా రష్యా సేనలు వైమానిక, భూతల దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. అయితే రష్యా సేనలకు ఎక్కడికక్కడ తీవ్ర ప్రతిఘటనే ఎదురవుతోంది. ఉక్రెయిన్ సేనలు మెరుపుదాడులతో వాటిని నిలువరిస్తున్నాయి. యుద్ధం వల్ల ఇప్పటికే కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. దేశ జనాభాలో ఇది దాదాపు నాలుగో వంతు. వీరిలో కనీసం 40 లక్షలకు పైగా దేశం వీడారు. యుద్ధాన్ని నివారించేందుకు తమతో కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. తాజా పరిస్థితిపై నేతలిద్దరూ ఫోన్లో చర్చించారు. రష్యా గెలుపు అసాధ్యమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ఈ సమస్యకు చర్చలతో మాత్రమే పరిష్కారం సాధ్యమన్నారు. ఉక్రేనియన్లు నరకం చవిచూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రష్యా గ్యాస్ వదులుకోలేం: జర్మనీ రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నా, ఆ దేశం నుంచి ఇంధన సరఫరాలను వదులుకోలేమని జర్మనీ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ వైఖరిలో ఏ మార్పూ లేదని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ మంగళవారం చెప్పారు. పలు యూరప్ దేశాలు రష్యా గ్యాస్పై తమకంటే ఎక్కువగా ఆధారపడ్డాయన్నారు. తమ ఇంధన అవసరాలను ఇతర మార్గాల్లో తీర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశామని చెప్పారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో కలిసి రష్యాను కఠినాతి కఠినమైన ఆంక్షలతో ఇప్పటికే కుంగదీస్తున్నామని గుర్తు చేశారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో దాదాపు సగం రష్యానే తీరుస్తున్న విషయం తెలిసిందే. -
రష్యా బలగాలను తరిమికొడుతున్న ఉక్రెనియన్లు! గోబ్యాక్ అంటూ నినాదాలు
Unarmed Ukranian People Are Ready To Do Anything: ఉక్రెయిన్పై గత మూడువారాలకు పైగా రష్యాయుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యా సైన్యం ముందు ఏ మాత్రం సరితూగని చిన్న దేశం అయినప్పటికీ తమ గడ్డను దురాక్రమణకు గురవ్వనివ్వమంటూ ఉక్రెనియన్లు సాగిస్తున్న పోరు ప్రపంచదేశాల మన్ననలను పొందుతోంది. మహిళలు, వృద్ధుల, చిన్నపిల్లలు అని తేడా లేకుండా ఇది తమ భూమి.. దీన్ని రక్షించుకుంటామంటూ రైఫిల్స్ చేతబట్టారు. పైగా రష్యా బలగాలను చూసి ఏ మాత్రం జంకకుండా ఉత్త చేతులతో యుద్ధ ట్యాంకులను అడ్డుకునేందుకు యత్నించారు. ఉక్రెయిన్ల దేశభక్తిని చూసి.. రష్యా బలగాలు చలించడమే కాక వారు సైతం యుద్ధం చేసేందుకు వెనకడువేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో!. అయితే ఇప్పుడూ మరోసారి అలాంటి తాజా ఘటన ఉక్రెయిన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉక్రెయిన్లోని ఎనర్గోదర్ అనే నగరంలోకి రష్యా ఆర్మీ వాహనం ఒకటి వచ్చింది. అందులోంచి సైనికులు దిగుతున్నారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న చుట్టుపక్కల స్థానికులు ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. ఇది తమ దేశమని.. ఈ దేశాన్ని వదిపోవాలంటూ గట్టిగా నినాదాలు చేస్తూ సైనికులను చుట్టుముట్టారు. ముందుకు వెళ్లడానికి వీలు లేదు.. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాలంటూ రష్యా ఆర్మీ వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. దీంతో రష్యన్ సైనికులు స్థానికులను భయపెట్టేందుకు గాల్లో గట్టిగా కాల్పుల కూడా జరిపారు. కానీ ఉక్రెనియన్ వాసులు ఏ మాత్రం భయపడకుండా కాల్పుల జరుపుతున్న సైనికుడిని తిడుతూ.. అతని మీదకి గుంపుగా నినాదాలు చేస్తూ వెళ్లారు. దీంతో రష్యాన్ సైనికులు చేసేదేమీ లేక వెంటనే అక్కడున్న వాహనం ఎక్కితిరిగి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. In #Energodar, unarmed people are ready to do anything to defend their land They are not even frightened by gunfire. pic.twitter.com/ZOlIoSvg77 — NEXTA (@nexta_tv) March 20, 2022 (చదవండి: ఉక్రెయిన్: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఆమె.. ఇప్పుడు మాతృభూమి కోసం సై అంటోంది మరి!) -
కుప్పకూలిన నాటో విమానం.. ‘ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో సంబంధం లేదు’
హెల్సింకీ: నార్వేలో ఆర్కిటిక్ సర్కిల్లో కోల్డ్ రెస్పాన్స్ పేరిట ‘నాటో’ దేశాలు నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమెరికా నావికా దళానికి చెందిన ఎంవీ–22బీ ఓస్ప్రే ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలింది. ఇందులో ఉన్న నలుగురు అమెరికా నావికాదళం సైనికులు మృత్యువాత పడ్డారు. ఉత్తర నార్వేలోని నార్డ్ల్యాండ్ కౌంటీలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన జరిగింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ఈ సంఘటనతో సంబంధం లేదని నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహర్ స్టొయిరీ, రక్షణ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ప్రతికూల వాతావరణం వల్లే అమెరికా విమానం కూలిపోయిందని నార్వే పోలీసులు వెల్లడించారు. ఈసారి నాటో సైనిక విన్యాసాల్లో 27 దేశాలకు చెందిన 30 వేల మంది సైనికులు, 220 విమానాలు, 50 నౌకలు పాల్గొంటున్నాయి. నాటోయేతర దేశాలైన ఫిన్ల్యాండ్, స్వీడన్ కూడా ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి. ఇవి ఏప్రిల్ 1న ముగియనున్నాయి. (చదవండి: ఉక్రెయిన్పై ‘అణు’ ఖడ్గం!) -
రష్యా బలగాల అరాచకం.. ఉక్రెయిన్ మేయర్ని కిడ్నాప్ చేసి..
Ukrainian officials said Melitopol Mayor Kidnapped: ఉక్రెయిన్ రష్యా మధ్య సాగుతున్న పోరు నేటికి 17వ రోజుకి చేరుకుంది. రష్యా బలగాల దాడిలో ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారిపోయింది. ఇప్పుడప్పుడే కోలుకోలేనంత దారుణంగా దెబ్బతింది. ఒకపక్క వైమానిక క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న రష్యా ఉక్రెయిన్లోని నగరాలను స్వాధీనం చేసుకుంటూ పోతుంది. ఇందులో భాగంగానే రష్యా బలగాలు దక్షిణ ఉక్రెయిన్లోని మెట్రోపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే కాక ఆ నగర మేయర్ని కూడా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. అంతేకాదు సుమారు 10 మంది ఆక్రమణదారుల బృందం మెట్రోపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ను కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ పార్లమెంట్ ట్విట్టర్లో పేర్కొంది. అయితే, అతను రష్యా బలగాలకు సహకరించడానికి నిరాకరించినందుకే కిడ్నాప్ చేసినట్లు జెలెన్ స్కీ ఒక వీడియో సందేశంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. అంతేకాదు ఆ వీడియోలో మేయర్ను తన సభ్యుల కోసం ప్రాణాలను ఫణంగా పట్టి పోరాడిన గొప్ప ధైర్యశాలిగా పేర్కొన్నారు. నిజానికి ఇది ఆక్రమణదారుల బలహీనతకు సంకేతం, వారు చట్టబద్దమైన స్థానిక ఉక్రెయిన్ అధికారుల ప్రతినిధులను బలవంతంగా తొలగించి ఉగ్రవాద చర్యలకు బీజం వేస్తున్నారు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆక్రోశించారు. ఇతి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చర్యగా పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల మాదిరిగినే రష్యన్ బలగాల దురాక్రమణ చర్యలు ఉన్నాయన్నారు. అంతేకాదు రష్యా దురాక్రమణదారులు మెట్రోపోల్ నగర ఆక్రమణకు ముందు ఈ నగరంలో సుమారు లక్షమంది నివాసితులు ఉన్నారు. (చదవండి: రష్యా ఘాతుకం ప్రపంచానికి తెలియాలి.. పుతిన్ పక్కా ప్లాన్తో ఉన్నాడు’) -
ఊరే.. ఓ సైన్యం: ఇంటికో సైనికుడే ఆ గ్రామ ప్రత్యేకత!
కశింకోట: విశాఖ జిల్లా విసన్నపేట.. సైనికుల గ్రామంగా పేరొందింది. ఇక్కడ దాదాపు ఇంటికో సైనికుడు ఉండటం ప్రత్యేకత. ఒక్కో ఇంట్లో ఇద్దరు నుంచి నలుగురు వరకు ఉన్నారు.. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారత్ తరఫున పోరాడిన ఘనత ఇక్కడి సైనికులకు సొంతం. విసన్నపేట జనాభా దాదాపు 1600. సుమారు 400 వరకు కుటుంబాలు ఉండగా.. 200 మంది వరకు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. సుమారు 70 మంది రిటైర్ అయి పింఛన్ తీసుకుంటున్నారు. సుమారు వందేళ్ల కిందట నుంచి గ్రామస్తులు రక్షణ రంగంలో విధులు నిర్వర్తిస్తుండటం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం, చైనా, పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో గ్రామ సైనికులు సేవలందించారు. ఆంగ్లేయుల హయాంలో గ్రామానికి చెందిన నడిశెట్టి అప్పన్న, చిదిరెడ్డి కన్నయ్య, నడిశెట్టి చెల్లయ్య, నడిశెట్టి సూర్యనారాయణ తదితరులు సిఫాయి, హవల్దార్, నాయబ్ సుబేదార్ తదితర హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం అధికారి హోదాలో మేజర్ నడిశెట్టి గణేష్ విధులు నిర్వర్తిస్తున్నారు. పదో తరగతి పూర్తి కాగానే ఇక్కడి గ్రామ యువత ఆర్మీలో ఆసక్తిగా చేరుతోంది. ఆర్మీలో పనిచేసే వారు తమ పిల్లలు, బంధువులను దేశ సేవకు అంకితం చేస్తున్నారు. సర్వీస్ పూర్తి చేసుకున్న వారు కొందరు ప్రైవేట్ పరిశ్రమల్లో.. మరికొందరు గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంతా దేశ సేవలోనే.. గ్రామానికి చెందిన ఓ కుటుంబం నుంచి నలుగురు అన్నదమ్ములు సైనికులయ్యారు. వీరిలో ఒకరు పదవీ విరమణ చేయగా.. మిగిలిన ముగ్గురు సేవలందిస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఉప్పునూరి అచ్చిలినాయుడు, లక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు. వీరంతా టెన్త్ పూర్తి కాగానే ఒకరి తర్వాత ఒకరు ఆర్మీలో చేరారు. పెద్దవాడైన శ్రీను, ఆ తర్వాత వరసగా నాగేశ్వరరావు, సత్తిబాబు, పరమేష్ ఆర్మీలో చేరారు. శ్రీను, నాగేశ్వరరావు కార్గిల్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించారు. ముగ్గురు అన్నదమ్ములు దక్షిణాఫ్రికాలోని లిబనాన్, కాంగోలో కూడా దేశం తరఫున విధులు నిర్వర్తించారు. నాగేశ్వరరావు సుమారు 18 ఏళ్లపాటు పని చేసి 2020లో హవల్దార్ ఏసీపీగా పదవీ విరమణ చేశారు. అచ్యుతాపురంలోని ఐవోసీఎల్లో ప్రస్తుతం సెక్యూరిటీగా పని చేస్తున్నారు. మిగిలిన ముగ్గురు ఆర్మీలో కొనసాగుతున్నారు. అదొక్కటే లోటు మాది వ్యవసాయ కుటుంబం. జీవనోపాధి కోసం ఆర్మీలో చేరాం. నేను 18 ఏళ్ల పాటు పనిచేసి హవల్దార్గా గతేడాది పదవీ విరమణ చేశారు. ఆర్మీలో చేరడంతో మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. దాని కన్నా దేశానికి సేవలందించగలిగామన్న సంతృప్తి మిగిలింది. ఎత్తైన కార్గిల్ ప్రాంతంలో ఊపిరి ఆడక, సరైన తిండి లేక ఇబ్బందులు ఎదురైనా.. ఎంతో ఇష్టంగా సేవలందించాను. ఆరేళ్లపాటు అక్కడ విధులు నిర్వర్తించా. జమ్ము, కశ్మీర్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలతోపాటు దక్షిణాఫ్రికాలో కూడా ఇండియన్ ఆర్మీ తరఫున సేవలందించా. విధి నిర్వహణ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా కలిసి గడిపే క్షణాలు చాలా తక్కువే. ఆర్మీలో చేరిన తర్వాత.. ఇప్పటివరకు అన్నదమ్ములమంతా ఒక్కసారి కూడా కలవలేదు. అదొక్కటే వెలితిగా ఉంది. – ఉప్పునూరి నాగేశ్వరరావు, రిటైర్డు హవల్దార్, విసన్నపేట సరిహద్దుల్లో విధులు నిర్వర్తించా.. ఆర్మీలో 28 ఏళ్లపాటు పని చేశారు. సుబేదార్గా పదవీ విరమణ చేశాను. నా తమ్ముడు సత్యారావు కూడా ఆర్మీలో చేరాడు. పాకిస్తాన్ యుద్ధ సమయంలో సరిహద్దుల్లో విధులు నిర్వర్తించాను. – నడిశెట్టి పడమటయ్యనాయుడు, రిటైర్డు సుబేదార్, విసన్నపేట సేవా దృక్పథంతోనే చేరుతున్నారు దేశానికి సేవ చేయాలనే దృక్పథంతో ఆర్మీలో చేరుతున్నారు. ఆర్మీలో సురక్షితంగా విధులను నిర్వర్తించి రిటైర్ అవుతున్నారు. ఉద్యోగం అనంతరం ప్రైవేటు పరిశ్రమల్లో కొందరు పనిచేస్తున్నారు. మరికొందరు వ్యవసాయం సాగు చేస్తూ ప్రజాసేవకు అంకితమవుతున్నారు. – కొఠారి నాగేశ్వరరావు, రిటైర్డ్ సుబేదార్, విసన్నపేట -
ఊహించని పరిణామం.. రష్యాకు మరో షాకిచ్చిన ఉక్రెయిన్ సైనికులు
ఉక్రెయిన్ నగరాలలో రష్యన్ బలగాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ మారణహోమం మాత్రం ఆగడం లేదు. రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించినా, గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా తీవ్ర నష్టాలను చవి చూస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: Russia Ukraine War: ‘భారతీయులు తక్షణమే ఖార్కివ్ను వీడండి.. లేదంటే’ ) తాజాగా రష్యాకు మరో గట్టి షాక్నిచ్చారు ఉక్రెయిన్ సైనికులు. ప్రపంచంలోనే అత్యంత శక్తి సామర్థ్యా లు కలిగిన యుద్ధ విమానం సుఖోయ్ (ఎస్యూ-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్) రష్యా సైనిక పటాలంలో శత్రు దేశాలను ఇట్టే భయపెట్టే ఎయిర్ క్రాఫ్ట్. ఈ యుద్ధ విమానాన్ని కూల్చడం అంత ఈజీ కాదు. రష్యా కంటే సాంకేతిక పరిజ్ఞానంలో మెరుగ్గా ఉంటే తప్పించి అది సాధ్యం కాదు. అయితే చిన్న దేశమైనప్పటికీ ఉక్రెయిన్.. తన గగన తలం మీదకు వచ్చిన రష్యా సుఖోయ్ విమానాన్ని ఒక్క దెబ్బకు కూల్చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ సైనిక బలగాల కమాండర్ ఇన్ ఛీప్ లెఫ్ట్ నెంట్ జనరల్ వాలేరీ జాలుజ్నియి కాసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ సైనికులు రష్యా సుఖోయ్ను కూల్చడంలో పర్ఫెక్ట్గా పనిచేశారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు యుద్ధంతో ఏడు లక్షల మంది దేశం విడిచి పారిపోతుండగా.. వాళ్లకు ఆశ్రయం ఇచ్చేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా యుద్ధం ఆపేందుకు ఇరుదేశాలు జరిపిన మొదటి దశ చర్చలు ఫలించాలేదు. తాజాగా బెలారస్ బ్రెస్ట్ ప్రాంతంలో చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. -
కంగనా కంగు తినేలా ట్రోలింగ్.. కారణం ఇదే
Kangana Ranaut Gets Trolled For Soldiers Securiting Her: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏ అంశంపైనైనా సూటిగా సుత్తిలేకుండా మాట్లేడుస్తుంటుంది. సమాజంలోని పరిస్థితులపై తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పేస్తుంది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్గా రికార్డుకెక్కింది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి భయం లేకుండా బయటకు చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వ్యాఖ్యలతో కంగనా రనౌత్ పలుసార్లు వివాదాలపాలైంది కూడా. అయితే తాజాగా ఈ బ్యూటీ ట్రోలింగ్ బారిన పడింది. మార్చి 1న మంగళవారం ఉదయం కంగనా ఎయిర్పోర్ట్లో మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ షేర్ తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్గా మారింది. ఈ వీడియోల కంగనాకు సెక్యూరిటీగా సైనికులు దర్శనమిచ్చారు. ఇది చూసిన నెటిజన్లు కంగనా కంగు తినేలా కామెంట్లు చేస్తున్నారు. 'కంగనాకు ఎవరూ వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు', 'నేను కట్టే టాక్స్ తన సెక్యూరిటీ కోసమా?', 'అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావులా కంగనా కనిపిస్తోంది', 'ఈరోజు వేస్ట్ అయింది' అంటూ ట్రోలింగ్కు దిగారు నెటిజన్స్. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
వీరుడి త్యాగం.. కన్నీరు కారుస్తున్న ఉక్రెయిన్
Russia-Ukraine War: రష్యన్ బలగాలను ఎలాగైనా నిలువరించి తమ దేశాన్ని కాపాడుకోవాలి. అందుకోసం ఏమైనా చేయాలి. ఎంతకైనా సాహసించాలి. అతి పెద్ద ఆయుధ సంపద కల్గిన రష్యాను నిలువరించాలంటే కదన రంగంలో కలియాడాలి. అవసరమైతే ప్రాణాలను సైతం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇదే ఉక్రెయిన్ సైన్యం ముందన్న కర్తవ్యం. ఇదే తరహాలో తన దేశం కోసం ఏం చేయాలో అది చేసి చూపించాడు ఓ ఉక్రెయిన్ సైనికుడు. చివరకు వీర మరణం పొందినా ఆ దేశ మిలటరీ గుండెల్లో నిలిచిపోయాడు. రష్యన్ ట్యాంకర్లు ఖెర్సన్ సౌత్ ప్రొవెన్స్లోని హెనిచెస్క్ బ్రిడ్జ్వైపు దూసుకొస్తున్న సమయంలో ఉక్రెయిన్ సైనికుడి సాహసం ఔరా అనిపించింది. రష్యన్ ట్యాంకర్లు బ్రిడ్జివైపు వస్తుండటం చూసి వాటిని ఆడ్డుకోవడానికి బ్రిడ్జినే కూల్చివేశాడు. ఆ బ్రిడ్జిని కూల్చే సమయంలో తనకు ఏమౌతుందనే విషయాన్ని పక్కనపెట్టి ప్రాణాలు సైతం వదిలాడు. మెరైన్ బెటాలియన్కు చెందిన వాలోదైమైరోవిచ్ రష్యన్ బలగాలని ఆపే ప్రయత్నంలో వంతెను ధ్వంసం చేసి తనను తానే పేల్చేసుకున్నాడని ఉక్రెయిన్ మిలటరీ విభాగం తమ ఫేస్బుక్ పేజీలో పేర్కొంది. క్రిమియా- మెయిన్ల్యాండ్ ఉక్రెయిన్కు అనుసంధానించబడి ఉన్న ఆ బ్రిడ్జిపైకి రష్యన్ బలగాలు సమీపిస్తుండటం చూసిన జవాను.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తనను తాను పేల్చేసుకుని బ్రిడ్జిని ధ్వంసం చేశాడని ఉక్రెయిన్ మిలటరీ విభాగం తెలిపింది. రష్యన్ బలగాలను కొంచెంలో కొంచెం నిలువరించాలనే తలంపుతో ఆ సైనికుడి చేసిన సాహసాన్ని తలచుకుని ఉక్రెయిన్ కన్నీరు కారుస్తోంది. చదవండి: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు! మా దేశాన్ని రక్షించుకుంటాం -
ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం పని మీకు ?
Ukrainian Woman Confronts Russian Soldiers: రష్యా దళాలు గురువారం ఉక్రెయిన్ సరిహద్దును దాటి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవి ఇప్పుడు రాజధాని కైవ్కు సమీపంలో ఉన్నాయి. రష్యా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దును దాటి వీధుల్లోకి ప్రవేశించడంతో ఉక్రెనియన్లు రష్యా దాడిని ఖండిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా విస్తృత నిరసనలు చేపట్టారు. టోక్యో నుంచి న్యూయార్క్ వరకు రష్యా కార్యాలయలు వద్ద, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు సైతం సైనిక దుస్తులతో యుద్థ రంగంలోకి వెళ్లి తమ సైనికులకు ధైర్యాన్ని నింపడమే కాక తాను సైతం రష్యా బలగాలతో తలపడుతున్నాడు. ఇంకో వైపు ఆ దేశపు మహిళలు సైతం తాము కూడా తమ దేశం కోసం ఏం చేయడానికైన సిద్ధం అంటున్నారు. ఈ మేరకు రాజధానికి సమీపంలోని ఓడరేవు నగరమైన హెనిచెస్క్లోని వీధుల్లోకి వస్తున్న రష్యా బలగాలకు ఒక ఉక్రెయిన్ మహిళ ఎదురు నిలబడి ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ మాత్రం బెరుకు లేకుండా మా దేశంలో ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. తుపాకులు, పెద్ద మెషిన్ గన్లు పట్టుకున్న ఆ సైనికులు నివ్వెరపోయాలా ఆక్రోసించింది. దీంతో వారు ఆ మహిళతో ఇక్కడ ఏం జరగటం లేదంటూ..ఆమెను శాంత పరచడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ఏ మాత్రం ఖాతరు చేయకుండా మీకు ఇక్కడేం పని అంటూ గర్జించింది. దెబ్బకు ఆ రష్యా సైన్యం తాము ఇక్కడ సైనిక కసరత్తులు చేస్తున్నాం దయచేసి మీరు వెళ్లండి అని వాళ్లు సున్నితంగా చెబుతున్న ఆమె లక్ష్యపెట్టలేదు. పైగా ఈ భూమి పై మీకు ఏం దొరకదు. కనీసం ఈ గింజలైన తీసుకుని జేబులో పెట్టుకోండి. మీరంతా ఇక్కడ పడుకున్నప్పుడు కనీసం ఆ పొద్దుతిరుగుడు పువ్వులు అయిన పెరుగుతాయని వ్యంగ్యంగా చెప్పి నిష్క్రమించింది. పొద్దు తిరుగుడు పువ్వు ఉక్రెయిన్ జాతీయ పుష్పం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ సైనికులను చూసి ఏ మాత్రం భయపడకుండా నిలబడిన "నిర్భయ", ఆమెను తమ దేశ దళాలతో మాట్లాడమని చెప్పాలి ఎందుకంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తమ బలగాలను ధైర్యంగా పోరాడేలా చేయగల సమర్థురాలు అని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. Woman in Henichesk confronts Russian military. “Why the fuck did you come here ? No one wants you!” 🤣#Russia #Ukraine #Putin pic.twitter.com/wTz9D9U6jQ — Intel Rogue (@IntelRogue) February 24, 2022 (చదవండి: చనిపోతున్నప్పుడు మన మెదడు ఏం ఆలోచిస్తుందో తెలుసా!) -
Army Day 2022: ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫాం ఇదే!
న్యూఢిల్లీ: మన ఆర్మీ యూనీఫాం మారబోతోంది. సౌకర్యవంతమైన, వాతావరణ అనుకూలమైన, డిజిటల్ డిస్రప్టీవ్ ప్యాట్రన్లో కొత్త యూనీఫాంను ఇండియన్ ఆర్మీ శనివారం ఆవిష్కరించింది. కొత్త యూనీఫాంలను ధరించిన ప్యారాచూట్ సైనిక దళం నిన్న (శనివారం) ఆర్మీ డే పరేడ్లో పాల్గొన్నారు. భారత ఆర్మీ కొత్త యూనీఫాం రూపురేఖల విశేషాలు ఇవే.. ►ఆలివ్, మట్టి రంగులతో సహా వివిధ రంగుల సమ్మేళనంతో రూపొందించిన కొత్త యూనిఫాం, దళాల వ్యూహరచన ప్రాంతాలు, వివిధ వాతావరణ పరిస్థితులు వంటి అంశాల దృష్ట్యా రూపొందించడం జరిగింది. ►నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి వివిధ దేశాల ఆర్మీల యూనిఫాంలను విశ్లేషించిన అనంతరం కొత్త యూనిఫాంలను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ►ఈ యూనిఫాం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, అన్ని రకాల వాతావరణాల్లో ధరించవచ్చని తెలిపారు. కంప్యూటర్ సహాయంతో డిజిటల్ డిస్రప్టివ్ ప్యాటర్న్లో ప్రత్యేకంగా రూపొందించారు. ►కొత్త యూనిఫాంలోని షర్టును, ట్రౌజర్లో టక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇకపై మన ఆర్మీ డ్రెస్ ఇన్షర్ట్ లేకుండా ఉండబోతుందన్నమాట. ►కొత్త ఆర్మీ యూనిఫామ్లు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండవని సంబంధిత వర్గాలు తెలిపాయి. #WATCH | Delhi: Indian Army’s Parachute Regiment commandos marching during the Army Day Parade in the new digital combat uniform of the Indian Army. This is the first time that the uniform has been unveiled in public. pic.twitter.com/j9D18kNP8B — ANI (@ANI) January 15, 2022 -
పాక్ యుద్ధంలో అమరుడైన సైనికుడికి కేటాయించిన భూమి కోసం దశాబ్ధాలుగా పోరాటం!
తెనాలి: రాజధాని ఏరియాలో దళితులకు ఇళ్ల స్థలాలనిస్తే, సమతౌల్యత దెబ్బతింటుందని కోర్టును ఆశ్రయించి అడ్డుకున్న టీడీపీ, అధికారంలో ఉండగా దివంగత సైనికుడికి ఇవ్వాల్సిన భూమికి సైతం రాజధాని పేరుతో మొండిచెయ్యి చూపింది. పాకిస్తాన్తో యుద్ధంతో వీరమరణం పొందిన సైనికుడికి ప్రభుత్వం కేటాయించిన భూమి కోసం అతడి మాతృమూర్తి, దశాబ్దాలుగా చేసిన పోరాటానికి ఫలితం దక్కలేదు. టీడీపీ ప్రభుత్వ వైఖరితో తనకు జరిగిన అన్యాయానికి మనస్తాపంతో ఆమె అనారోగ్యానికి గురైంది. తాను తనువు చాలించేలోగానైనా న్యాయం జరగాలని 92 ఏళ్ల ఆ వీరమాత వేడుతోంది. ఆ తల్లి పేరు తోట వెంకాయమ్మ. భర్త 35 ఏళ్ల క్రితమే కాలం చేశాడు. స్థానిక గంగానమ్మపేటలో ఇల్లు మినహా మరేం లేదు. ఆమె నలుగురు కుమారుల్లో ఒకరైన తోట వీరనాగప్రసాద్ యుక్తవయసులోనే సైన్యంలో చేరాడు. చేరిన కొద్దికాలానికే 1965లో వచ్చిన ఇండియా – పాకిస్తాన్ యుద్ధంలో అమరుడయ్యాడు. అతని తాగ్యానికి నివాళిగా 1966లో ప్రభుత్వం అప్పట్లో గుంటూరు జిల్లా పరిధిలోని చినగంజాంలో 2.5 ఎకరాల వర్షాధారమైన భూమిని (సర్వే నెం.701/1) కేటాయించింది. వీరనాగప్రసాద్ అవివాహితుడు కావటంతో ఆ భూమిని తల్లి వెంకాయమ్మకు ఇచ్చారు. పేరుకైతే భూమిని ఇచ్చారుగానీ, అధికారుల అర్థంకాని నిర్ణయాలు, అంతులేని అలసత్వంతో ఆ భూమి ఇప్పటికీ తనకు దక్కనేలేదు. అసంబద్ధ నిర్ణయాలతో కోర్టుల చుట్టూ.. 1965లో ఇచ్చిన భూమిని మరో మూడేళ్లకు ప్రభుత్వ అవసరాల కోసమంటూ మరొకరికి కేటాయించారు. అక్కడే సర్వే నంబరు 704/2లో అంతే విస్తీర్ణంలో భూమిని వెంకాయమ్మకు ఇచ్చారు. 1982లో దానినీ స్వాధీనం చేసుకుంది. 396/4, 396/5 సర్వే నంబర్లలోని 2.85 ఎకరాల చెరువు భూమిని ఇచ్చారు. ఒండ్రు మట్టితో గల ఆ భూమి సుభిక్షమైందని నమ్మబలికారు. అదైనా తీసుకుందామని వెళ్లిన వెంకాయమ్మ కుటుంబసభ్యులను పంచాయతీవారు అడ్డుకున్నారు. చెరువు భూమి పంచాయతీదేనని, రెవెన్యూకు సంబంధం లేదని నిరోధించారు. పైగా న్యాయస్థానాన్నీ ఆశ్రయించారు. తమ ప్రమేయం లేని వ్యవహారంలో వెంకాయమ్మ కోర్టు వాయిదాలకు తిరగాల్సి వచ్చింది. కోర్టులో పంచాయతీకి అనుకూలంగా తీర్పు రావటంతో ప్రభుత్వమిచ్చిన భూమినీ కోల్పోయింది. ‘ప్రకాశం’కు చేరిన పొలం వ్యవహారం.. ఈలోగా జిల్లాల విభజన జరగటంతో చినగంజాం ప్రకాశం జిల్లాలోకి వెళ్లింది. జరిగిన విషయాన్ని వెల్లడిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టరుకు వెంకాయమ్మ దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ కె.దేవానంద్ స్పందించారు. వెంకాయమ్మ కుటుంబం తెనాలిలోనే ఉంటున్నందున వారికి గుంటూరు జిల్లాలోనే వ్యవసాయ భూమిని కేటాయించాలంటూ 2009 ఏప్రిల్ 13న లేఖ రాశారు. బ్యూరోక్రసీ జాప్యంతో ఆ లేఖ 2016 ఫిబ్రవరి 15న తగుచర్యల నిమిత్తం జిల్లా కలెక్టరేట్ నుంచి తెనాలి ఆర్డీవో కార్యాలయానికి చేరింది. అనువైన భూమి కోసం అప్పటి ఆర్డీవో జి.నరసింహులు డివిజనులోని తహసీల్దార్లను నివేదిక కోరారు. నివేదికతో సహా అప్పటి ప్రభుత్వానికి పంపారు. రాజధాని పేరుతో మొండిచెయ్యి.. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం ‘కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించటం, వివిధ పరిపాలన విభాగాలను స్థాపించటం వంటి భవిష్యత్ అవసరాల దృష్ట్యా గుంటూరు జిల్లా ప్రభుత్వ ఖాళీస్థలం చాలా అవసరమైనందున దరఖాస్తుదారు అభ్యర్థన ఆచరణీయం కాదు’ అంటూ తిరస్కరించింది. దీనితో మనస్తాపం చెందిన ఆ మాతృమూర్తికి అనారోగ్యం ప్రాప్తించింది. తన గోడునంతా వివరిస్తూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి దరఖాస్తును పంపారు. న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. చదవండి: Inspirational Story: నా కొడుకుకు కళ్లులేకపోతేనేం.. నా కళ్లతో లోకాన్ని పరిచయం చేస్తా! -
Nagaland Tragedy: నాగాలాండ్ నరమేథం
ఈశాన్య భారతంలో తిరుగుబాట్లను అణిచే పేరిట దశాబ్దాలుగా అమలవుతున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం పౌరుల జీవితాల్లో ఎంతటి కల్లోలం సృష్టిస్తున్నదో తెలియడానికి శనివారం చోటుచేసుకున్న నాగాలాండ్ నరమేథమే తార్కాణం. ఆ రాష్ట్రంలోని మోన్ జిల్లాలో 13మంది పౌరులు, ఒక జవాను మరణించడానికి దారి తీసిన ఈ ఉదంతం అత్యంత విషాదకరమైనది. వాహ నంలోని వారిని తిరుగుబాటుదారులుగా పొరబడి కాల్పులు జరిపామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ నేర తీవ్రతను తగ్గించలేదు. వారి ప్రకటన ప్రకారం నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగా లాండ్ –ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే)లోని చీలిక వర్గం తిరుగుబాటుదారులు ఫలానా వాహనంలో వస్తున్నారని నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయి. దాని ఆధారంగా కాల్పులు జరిపామని సైన్యం అంటున్నది. తిరుగుబాటుదారుల గురించి అంత ఖచ్చితమైన సమాచారం అందించిన నిఘా సంస్థకూ, దాన్ని విశ్వసించిన సైన్యానికీ సమీపంలోని బొగ్గు గనిలో పనిచేస్తూ రోజూ అదే సమయా నికి వాహనంలో కూలీలు వెళ్తారన్న ఇంగితం లేకపోవడం, జాగరూకతతో వ్యవహరించాలన్న స్పృహ కొరవడటం క్షమార్హంకాదు. పద్ధతిగా అయితే ఇలాంటి దాడుల సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలి. కానీ, అక్కడ కార్యకలాపాలు చూసే అస్సాం రైఫిల్స్కు కూడా చెప్పకుండా సైన్యంలోని ఒక ఎలైట్ యూనిట్ తనకు తానే నిర్ణయం తీసుకుని ఈ దాడికి పాల్పడిందని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. బలగాలమధ్య సమన్వయం లేదని దీన్నిబట్టి అవగతమవుతోంది. అసలు సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ల తీరుతెన్నులనే ఈ ఉదంతం ప్రశ్నార్థకం చేస్తున్నది. ఆ వాహనంలో నిజంగా తిరుగుబాటుదారులే వెళ్తున్నా అచ్చం వారి మాదిరే పొంచివుండి దాడి చేయాలనుకోవడం సరికాదు. గత నెలలో మణిపూర్లో అస్సాం రైఫిల్స్కు చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్నూ, మరో ఆరుగురినీ తిరుగుబాటుదారులు బలితీసుకున్ననాటినుంచీ సూత్రధారుల కోసం గాలింపు మొదలైంది. తిరుగుబాటుదారులను సజీవంగా పట్టుకుంటేనే ఆ అధికారి మరణానికి కారకులెవరో, వారి కార్యకలాపాలేమిటో తెలిసేది. అందుకు భిన్నంగా పొంచివుండి హఠాత్తుగా గుళ్ల వర్షం కురిపించడం వల్ల దేశ భద్రతకు కలిగే ప్రయోజనమేమిటి? కాస్తయినా ఆలోచించారా? వాహ నాన్ని ఆపడానికి బలగాలు ప్రయత్నించాయని, కానీ వారు ‘పారిపోయే ప్రయత్నం’ చేయడంతో అందులో తీవ్రవాదులు వెళ్తున్నారని భావించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటన హేతుబద్ధంగా లేదు. తీవ్రవాదులు వాహనంలో ఉండుంటే మారణాయుధాలతో దాడికి దిగరా? వాహనం ఆపనంత మాత్రాన అందులో తీవ్రవాదులే ప్రయాణిస్తున్నారన్న నిర్ధార ణకు రావడం సబబేనా? నాగాలాండ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ఘటన జరిగాక మృతదేహాలపై ఉన్న దుస్తులను తొలగించి, ఖాకీ దుస్తులు వేసేందుకు బలగాలు ప్రయత్నించాయని ఆ దర్యాప్తు చెబుతోంది. మరణించినవారు తీవ్రవాదులని కట్టుకథలల్లడానికి ఈ పని చేశారా అన్నది తేలాలి. ఆ రాష్ట్రంలో ఉన్నది ఎన్డీపీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం. కానీ బీజేపీ నేతలకే అక్కడ రక్షణ కరువు! ఘటనాస్థలికి బీజేపీ జెండాతో వెళ్తున్న తమ వాహనంపై కూడా బలగాలు కాల్పులు జరిపి, ఒకరి ప్రాణం తీశాయని, మరో ముగ్గురు గాయపడ్డా రని మోన్ జిల్లా బీజేపీ నేత అంటున్నారు. ఇదంతా వింటుంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే జీవిస్తున్నామా అనే సందేహం రాకమానదు తీవ్రవాదాన్ని అదుపు చేయడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం. మయ న్మార్కూ, చైనాకూ కూతవేటు దూరంలో ఉండే నాగాలాండ్ వంటిచోట అది మరింత అవసరం. కానీ కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా చట్టాలు ఉండకూడదు. రాజ్యాంగంలోని అధికరణలను సైతం అపహాస్యం చేసేలా సైన్యానికి అపరిమిత అధికారాలిస్తున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం ఈ పోకడే పోతోంది. పర్యవసానంగా ఇది అమలవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన సాగుతూనే ఉంది. అక్రమ నిర్బం ధాలు, అత్యాచారాలు, బూటకపు ఎన్కౌంటర్లు, మనుషుల్ని మాయం చేయడం వంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మణిపూర్ ఎన్కౌంటర్ ఘటనలపై 2013లో దర్యాప్తు చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్ సాయుధ బలగాల చట్టం అశాంతికి కారణమవుతున్నదని తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధ చర్య లకు పాల్పడిన భద్రతా బలగాలకు ఏ రక్షణా ఉండబోదని సుప్రీంకోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఆ చట్టాన్ని రద్దు చేయాలని 2005లో సూచించింది. నిర్భయ ఉదం తంలో నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ నివేదిక సైతం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పింది. అయినా ఆనాటి యూపీఏ సర్కారుకు పట్టలేదు. అది జరిగితే భద్రతా బలగాల నైతిక స్థైర్యం దెబ్బ తింటుందన్నదే ప్రభుత్వాల వాదన. మరి పౌరుల నైతిక స్థైర్యం సంగతేమిటి? నాగాలాండ్ ఉదం తంలో కారకుల్ని శిక్షిస్తామని సైన్యం అంటున్నది. కేంద్రం కూడా హామీ ఇస్తోంది. మంచిదే. కానీ ఇన్ని దశాబ్దాలుగా ఎంతమందిని శిక్షించారు... లెక్కలు తీస్తారా? సాయుధ బలగాల (ప్రత్యేకాధి కారాల) చట్టం అమల్లో ఉన్నంతకాలం ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. చట్టం రద్దు చేయాలన్న నాగాలాండ్, మేఘాలయ సీఎంల తాజా డిమాండ్ ముమ్మాటికీ సబబే. ఇప్పటికైనా కేంద్రం ఆలోచించాలి. ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. -
సిరియాలో సైన్యం లక్ష్యంగా బస్ బాంబు పేలుడు
డమాస్కస్: సిరియా సైనికులను లక్ష్యంగా చేసుకుని జరిగిన బస్ బాంబు దాడిలో 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా రాజధాని నగరం డమాస్కస్లో బుధవారం ఈ దాడి జరిగింది. బుధవారం ఉదయం రద్దీ సమయంలో డమాస్కస్లోని ఒక జంక్షన్ వద్ద ఈ పేలుడు జరిగింది. సిరియా సైనికులు ప్రయాణిస్తున్న ఒక బస్కు ముందుగానే ఆగంతకులు రెండు శక్తివంతమైన బాంబులను అమర్చారు. సైనికులతో బస్సు కదులుతుండగా ఆ బాంబులను పేల్చేశారు. ఈ ఘటనలో 14 మంది సైనికులు మరణించారు. సిరియా అధ్యక్షుడు బషర్–అల్–అస్సద్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించే విపక్ష సాయుధ కూటములు, జిహాదీ సంస్థలు ఈ దాడికి పాల్పడి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసద్ ప్రభుత్వ వ్యతిరేక శక్తుల అధీనంలోని ప్రాంతంలో సైన్యం జరిపిన దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్లోని ఓ పట్టణంపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో ఎనిమిది మంది చిన్నారులు, ఒక ఉపాధ్యాయురాలు, ఒక మహిళ చనిపోయారు. -
కశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి
కశ్మీర్: జమ్మూకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో బుధవారం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో భారత ఆర్మీ సైనికులు ఐదుగురు మరణించారు. మృతిచెందిన వారిలో నలుగురు జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఉన్నారు. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు.. సూరంకోట్లోని డీకేజీకి దగ్గరగా ఉన్న గ్రామంలో ఈ సర్చ్ ఆపరేషన్ ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి తెలిపారు. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. (చదవండి: తాలిబన్ల రాజ్యం: ‘పరిణామాలు ఎదుర్కొనేందుకు మేం సిద్ధం’) గాలింపు చర్యలు జరుపుతున్న ఆర్మీ అధికారులపైకి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జేసీఓతో పాటు మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా "తీవ్రంగా గాయపడిన జేఓవీ, నలుగురు జవాన్లను సమీప ఆస్పత్రికి తరలించాము. చికిత్స అందిస్తుండగా వారు మరణించారు. సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది" అని ఆర్మీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. చదవండి: చదువు కోసం వెళ్తారు.. ఉగ్రవాదులుగా తిరిగొస్తారు -
సరిహద్దులో చైనా దూకుడు!
న్యూఢిల్లీ: భారత్తో సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సైనికుల కోసం కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. తూర్పు లద్దాఖ్లో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్ ఆధారిత స్థావరాలను నిర్మిస్తోంది. తషిగాంగ్, మాంజా, హాట్ స్ప్రింగ్స్, చురుప్సహా మరి కొన్ని ప్రాంతాల్లో వీటిని సిద్ధంచేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సైనిక మోహరింపుతోపాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్లో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ తాము వినియోగించని భూభాగాల్లోనూ సైన్యాన్ని మోహరించాలని యోచిస్తోంది. గల్వాన్ ఘర్షణల తర్వాత మరిన్ని ‘ఫార్వర్డ్’ ప్రాంతాల్లో తమ సైన్యాన్ని మోహరించనుంది. ‘ గతంలో దిష్టవేయని సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో ఉండటమనేది చైనా సైనికులకు కష్టమైన పని. చైనా సేనలకు కొత్త కష్టం వచ్చి పడింది’ అని భారత సైన్యానికి సంబంధించిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. భారత్ సైతం చైనాకు ధీటుగా స్పందిస్తోంది. -
ప్రజలను ప్రేమించడమే దేశభక్తి!
అడివి శేష్ పెరిగింది అమెరికాలో. కానీ ఆలోచనలన్నీ తన మాతృదేశం ఇండియా చుట్టే. అమెరికాలో ‘వందేమాతరం’ వినబడినా లేచి నిలబడేంత ప్రేమ తన దేశం మీద శేష్కి ఉంది. ఇప్పుడు ‘మేజర్’లో నటించాక దేశ సైనికులపై ప్రేమ, గౌరవం పెరిగాయి. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్గా ‘మేజర్’ తెరకెక్కుతోంది. సందీప్ పాత్రను అడివి శేష్ చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో అడివి శేష్ చెప్పిన విశేషాల్లో ముఖ్యమైనవి ఈ విధంగా... ►నా భవిష్యత్ కోసం అమ్మానాన్న అమెరికా షిఫ్ట్ అయ్యారు. నేను చిన్నప్పుడు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్ స్కూల్లో చదువుతున్నప్పుడే ఇండియా గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏఆర్ రెహమాన్గారి ‘వందేమాతరం’ పాట వచ్చినప్పుడు నిలబడేవాడిని. మా తాతగారు స్వాతంత్య్ర సమరయోధులు. అందువల్లే దేశభక్తి గీతాలు వచ్చినప్పుడు నిలబడుతుంటానేమో. ►సైనికులు మన రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ఎంతో కష్టపడుతున్నారు. ‘మేజర్’ సినిమా కోసం కొంత పరిశోధన చేశాను. దేశ సైనికులపై నాకు ఉన్న గౌరవం, ప్రేమ, అభిమానం ఇప్పుడు మరింత పెరిగాయి. ‘మేజర్’ సినిమా కోసం నేను కొన్ని బోర్డ్ క్యాంపస్లలో పాల్గొన్నాను.. శిక్షణ తీసుకున్నాను. అతి వేడి, అతి చలిలో ఉండాలి. కొన్నిసార్లు ఆహారం కూడా లభించని పరిస్థితులు ఉంటాయి. అలా ఓ సైనికుడిలా ఉండగల పట్టుదల, శక్తి నాలో ఉన్నాయో? లేవో కూడా నాకు తెలియదు. ►26/11 ముంబై దాడుల్లో చనిపోయిన అమరవీరుల్లో సందీప్ ఉన్నికృష్ణన్గారు ఉన్నారు. ఆర్మీ సైడ్ నుంచి మనం కోల్పోయిన వీరజవాన్ ఆయన. అందుకే ఆయన జీవితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత సందీప్గారి జీవితం గురించి తెలుసుకుని ఆయనకు అభిమాని అయిపోయాను. ఫాలోయర్ అయ్యాను. ►సూపర్స్టార్ మహేశ్బాబుగారి ‘సరిలేరు నీకెవ్వరు’, సై్టలిష్స్టార్ అల్లు అర్జున్గారి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలు ‘బయోపిక్’లు కాదు. ఆ కథలోని ఆర్మీ ఆఫీసర్ పాత్రకు జస్టిస్ చేసే ఒక స్టార్ని ప్రేక్షకులు చూడాలనుకుంటారు. కానీ ‘మేజర్’ విషయానికొస్తే.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ను వెండితెరపై చూడాలనుకుంటారు. ఎందుకంటే ఇది రియల్ స్టోరీ.అలాగే ‘మహానటి’ చూస్తున్నప్పుడు, ఆ సినిమాను ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ చేసినప్పటికీ మనం వెండితెరపై సావిత్రిగారినే చూడాలనుకుంటాం. అలాగే ఎంత పెద్ద స్టార్ ప్లే చేసినా మనం మేజర్ సందీప్నే చూడాలనుకుంటాం. ‘మేజర్’లో సందీప్నే చూస్తారు. ►ఆర్టికల్స్, బుక్స్లలో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి కొన్ని విషయాలు, విశేషాలను తెలుసుకున్నాను. కానీ ఆయన కుటుంబసభ్యుల వల్ల, వారు ఇచ్చిన గైడెన్స్ వల్ల ఆయన గురించి నాకు కొత్త సంగతులు తెలిశాయి. ‘మేజర్’ చిత్రానికి డెప్త్ ఇచ్చిందే వాళ్లు. ►‘మేజర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ...‘ఇండియన్ అంటే ఏంటి’? సాటి మనిషికి మనం సాయం చేయడం అంటే ఏంటి?, ‘సోషల్ మీడియాలో మనం యాష్ట్యాగ్తో జైహింద్ అని పెట్టేస్తే సరిపోతుందా? ఇలాంటి అంశాల గురించి ప్రేక్షకులు ఆలోచిస్తారు. అయితే ఒక సినిమా ఒక మనిషిని ఎంత మారుస్తుంది? అనేది నాకు తెలియదు. ►నేనొక మంచి రైటర్, మంచి యాక్టర్.. కానీ బ్యాడ్ డైరెక్టర్ (సరదాగా). నా ఫస్ట్ ఫిల్మ్కు నేనే దర్శకత్వం వహించాను. కానీ డైరెక్షన్ అనేది నాకు సూట్ కాదని అర్థమైంది. ‘గూఢచారి’ సినిమాకు నేను కథ రాసుకున్నట్లే స్క్రీన్పై దర్శకుడిగా శశికిరణ్ చూపించారు. కానీ విజువల్గా బాగా చూపించడం గ్రేట్. అయితే ఇప్పుడు ‘మేజర్’ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. సో.. ఈ సినిమాను మరింత గ్రాండియర్గా తీయాలంటే శశికిరణే కరెక్ట్ అనిపించింది. ►ప్రస్తుతానికి సినిమాలనే పెళ్లి చేసు కున్నాను. సినిమాలు కాకుండా ఆలోచించాలంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో నేను దేశభక్తిని ఎక్కువగా ఫీలయ్యాను. చాలామందికి సహాయం చేశాను. ప్రజలను ప్రేమించడం దేశభక్తే అవుతుందని నమ్ముతాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి నీరు తాగే సౌకర్యం లేకపోవడం ఏంటి? నాకు తెలిసిన వాళ్లలో వారికి కరోనా టైమ్లో బెడ్స్ దొరక్కపోవడం ఏంటి? ఇంట్లో పేరెంట్స్కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేకపోవడం ఏంటి? కాస్త ఎమోషనల్గా ఫీలయ్యాను. కరోనా టైమ్లో ఎవరికో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే డబ్బులు పంపించాను. సాయం చేసిన మనిషిని కూడ నేను చూడలేదు. ఆయన నాకు థ్యాంక్స్ చెప్పలేదు. కానీ మనం ఒకరికొకరం సాయం చేసుకోవాలి. కెరీర్ సక్సెస్లో, నా సంపాదనలో ప్రజలు ఉన్నప్పుడు మనం కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? -
అమెరికా సంచలన ప్రకటన: అఫ్గాన్ నుంచి బలగాలు వెనక్కి
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్లో అమెరికా బలగాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్ 11 నాటికి అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలన్నీ వెనక్కు వచ్చేస్తాయని ప్రకటించారు. అమెరికా అత్యధిక కాలం చేసిన యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందన్నారు. బైడెన్ బుధవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అఫ్గాన్లో యుద్ధం తరతరాల పాటు కొనసాగించేది కాదని బైడెన్ స్పష్టం చేశారు. ఏటా కోట్లాది డాలర్లు ఖర్చు చేస్తూ ఒకే దేశంలో వేలాది సైనికులను మోహరించడం అర్థం లేని చర్య అని బైడెన్ అభివర్ణించారు. అఫ్గానిస్తాన్లో శాంతి నెలకొనడం కోసం మరిన్ని చర్యలు చేపట్టాలని భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్, టర్కీలను కోరారు. అఫ్గానిస్తాన్లో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత, అవసరం ఆ దేశాలపై ఉందన్నారు. వైట్హౌజ్లోని ట్రీటీ రూమ్ నుంచి టీవీ మాధ్యమం ద్వారా బైడెన్ ప్రసంగించారు. అంతకుముందు, ఆయన మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్లతో సంప్రదింపులు జరిపారు. అఫ్గాన్లో 2001 నుంచి కొనసాగుతున్న యుద్ధంతో లక్షల కోట్ల డాలర్ల ఖర్చుతో పాటు దాదాపు 2400 మంది సైనికుల ప్రాణాలను అమెరికా కోల్పోయింది. బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి సుమారు 3 వేల అమెరికా బలగాలు అఫ్గాన్లో ఉన్నాయి. మే 1 నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమవుతుందని బైడెన్ ప్రకటించారు. ‘మా నిష్క్రమణ హడావుడిగా ఏమీ ఉండదు. ప్రణాళికాబద్ధంగా, సురక్షితంగా ఈ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అఫ్గాన్లో మా కన్నా ఎక్కువ సంఖ్యలో బలగాలున్న మిత్రపక్షాలు, ఇతర భాగస్వాములతో సమన్వయంతో సాగుతాం’ అని వివరించారు. ‘2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిగిన దాడికి ఇరవై ఏళ్లయ్యేనాటికి అమెరికా, నాటో దళాలు, ఇతర భాగస్వామ్యులు అఫ్గాన్ నుంచి వైదొలగుతాయి’ అని బైడెన్ స్పష్టం చేశారు. ప్రసంగం అనంతరం బైడెన్ ఆర్లింగ్టన్ నేషనల్ సిమెటరీకి వెళ్లి అఫ్గాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు. అఫ్గాన్ నుంచి బలగాలను ఉపసంహరించాలనే నిర్ణయంపై అత్యంత స్పష్టతతో ఉన్నామని అక్కడ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అమెరికా నిర్ణయంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ఉగ్రవాద శక్తులకు ఊతమిచ్చే అవకాశముందని పేర్కొంది. చైనా నుంచి వచ్చే ముప్పులపై దృష్టి పెట్టాల్సి ఉందన్న అమెరికా వ్యాఖ్యలపై మండిపడింది. భారత్కు ఆందోళనకరం అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వైదొలగితే ఆ ప్రాంతం మళ్లీ ఉగ్రవాద సంస్థలకు సురక్షిత ప్రదేశంగా మారే ప్రమాదముందని నిపుణులు భావిస్తున్నారు. తాలిబన్ మళ్లీ మరింత క్రియాశీలమయ్యే అవకాశముందని, అమెరికా నిర్ణయంతో భారత్కు ఉగ్ర ముప్పు మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్తున్నారు. -
అఫ్ఘాన్కు అమెరికా గుడ్బై
అఫ్ఘానిస్తాన్లో రెండు దశాబ్దాలుగా సాగిస్తున్న ‘ఖరీదైన’ యుద్ధానికి ముగింపు పలకాలని నిర్ణయిం చినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల 1తో మొదలుపెట్టి సెప్టెంబర్ 11 కల్లా అక్కడున్న తమ 2,500 మంది సైనికులనూ ఉపసంహరించుకుం టామని ఆయన చేసిన ప్రకటన అమెరికా మూటగట్టుకున్న అతి పెద్ద వైఫల్యంగా చరిత్రలో నమోదవుతుంది. 2,448 మంది సైనికులను పోగొట్టుకొని, 2 లక్షల కోట్ల డాలర్ల వ్యయం చేసి అది అక్కడ మిగిల్చిందల్లా శిథిలప్రాయమైన దేశాన్ని. అణ్వస్త్రం తప్ప తన అమ్ములపొదిలో వున్న సమస్త ఆయుధాలనూ అమెరికా అక్కడ కుమ్మరించింది. క్షిపణి దాడులతో అఫ్ఘాన్ చిగురుటాకులా వణికింది. నలుగురు గుమిగూడితే వాళ్లను ఉగ్రవాదులుగా భావించి వైమానిక దాడుల్లో హత మార్చడం చాలా సందర్భాల్లో జరిగింది. ఈ పాపాలకు సంబంధించి జూలియన్ అసాంజ్ బయట పెట్టిన ఎన్నో పత్రాలు, వీడియోలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో పడేశాయి. ఉగ్రవాదుల మాటేమో గానీ... వేలమంది సాధారణ పౌరులు మరణించారు. ఫలితంగ్లా అక్కడ ఉగ్రవాదం మరింత ముదిరింది. అయినా తాజా ప్రకటనలో బైడెన్ స్వోత్కర్ష మానుకోలేదు. ‘స్పష్టమైన లక్ష్యాలతో అక్కడికెళ్లాం... వాటిని సాధించాం’ అని ఆయన చెప్పుకున్నారు. భూగోళంలో ఏమూలనవున్నా ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రతినబూని 2001 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ అఫ్ఘాన్కు పంపిన అమెరికన్ సైనికుల సంఖ్య లక్షకు పైమాటే. వీరికి నాటో కూటమి దేశాల సైనికులు అదనం. ఇప్పుడు అమెరికా సైనికులతోపాటు ఆ కూటమికి చెందిన 7,000మంది సైనికులు కూడా నిష్క్రమిస్తారు. ఏ దేశమైనా మరో దేశాన్ని దురాక్రమించటం, పెత్తనం సాగించటం, అక్కడి పౌరుల జీవితాన్ని అల్లకల్లోలం చేయటం అనాగరికం. రిపబ్లికన్ల ఏలుబడి ముగిసి ఒబామా నాయకత్వంలో డెమొక్రాటిక్ పార్టీ ప్రభుత్వం వచ్చాక అమెరికాకు జ్ఞానోదయమైంది. 2014నాటికల్లా అమెరికా దళాలు అక్కడినుంచి వైదొలగుతాయని ఒబామా అప్పట్లో చెప్పారు. కానీ అదేమీ జరగలేదు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ దీనిపై విశేషంగా ప్రచారం చేశారు. తాను వచ్చిన వెంటనే దళాలన్నీ వెనక్కి రప్పిస్తామని ప్రకటించారు. కానీ అదేమీ జరగలేదు. ఆ దిశగా మాత్రం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. పాకిస్తాన్ ప్రాపకంతో తాలిబన్లతో చర్చోపచర్చలు జరిపి మొత్తానికి ఈ ఏడాది మే 1నుంచి మొదలుపెట్టి దశలవారీగా సైనిక దళాలను వెనక్కి తీసు కొస్తామని మొన్న అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ప్రకటించారు. కొత్తగా వచ్చిన అధ్యక్షుడు ఈ విష యంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసింది. చివరకు బైడెన్ తాలి బన్లకు ట్రంప్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చదల్చుకున్నట్టు ప్రకటించారు. బైడెన్ చెప్పినట్టు అమెరికా లక్ష్యాల్లో ఒకటైతే నెరవేరింది. 2001 సెప్టెంబర్లో అమెరికాలో విమానాలను దారి మళ్లించి నరమేథానికి కారణమైన అల్ కాయిదా నేత ఒసామా బిన్ లాడెన్ను ఆ దేశం హతమార్చగలిగింది. అలాగే అల్ కాయిదా సంస్థను కూడా చిన్నాభిన్నం చేయటంలో విజయం సాధించింది. కానీ ఆ సంస్థకు మించిన భయంకరమైన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. అనేకానేక ముఠాలుగా విడిపోయిన ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా ఆధిపత్యం కోసం సాగించిన హింసాకాండ అంతా ఇంతా కాదు. మహిళలదైతే దుర్భరమైన స్థితి. అఫ్ఘాన్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పామని, మహిళల హక్కులకు రక్షణ ఏర్పడిందని అమెరికా చెప్పుకుం టోంది. కానీ అవన్నీ కాబూల్ వంటి కొన్నిచోట్లకే పరిమితం. పేరుకు ప్రభుత్వమంటూ వున్నా దాని ఏలుబడిలో వున్న ప్రాంతం అతి తక్కువ. ఉగ్రవాద ముఠాల్లో తాలిబన్లది ప్రస్తుతానికి పైచేయి. వారి మాటే శాసనం. గత కొన్నేళ్లుగా గ్రీన్జోన్ పేరిట పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకుని అమెరికా, నాటో దళాలు దానికే పరిమితమవుతుండగా, వారి దగ్గర శిక్షణ పొందిన అఫ్ఘాన్ పోలీ సులు, సైనికులు శాంతిభద్రతలు చూస్తున్నారు. గ్రీన్జోన్పై సైతం పలుమార్లు దాడులు జరిగా యంటే అఫ్ఘాన్ పోలీసులు, సైనికుల దుస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అన్ని విధాలా భంగపడ్డ అమెరికా తమ గడ్డపై ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన రోజైన సెప్టెంబర్ 11నాడే అక్కడినుంచి పూర్తిగా వైదొలుగుతామని అంటున్నది. ఏదో ఒక సాకుతో దేశాలను దురాక్రమించటం నేరమే. ఆ కోణంలో అమెరికా దళాల ఉప సంహరణ సరైందే కూడా. అలాగని అమెరికా దళాల ఉపసంహరణకు పరిస్థితులు పరిపక్వమయ్యాయని బైడెన్ చేస్తున్న వాదనతో ఎవరూ ఏకీభవించలేరు. దాన్ని తనకూ, తాలిబన్లకూ మధ్య నడిచే లడాయిగా పరిగణించకుండా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదిక సారథ్యంలో ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారానికి ప్రయత్నించి వైదొలగివుంటే అది ఆ దేశ పౌరులకు మాత్రమే కాదు... భారత్తోసహా ఈ ప్రాంత దేశాలన్నిటికీ ఉపయోగకరంగా వుండేది. ఒకసారంటూ అమె రికా దళాలు వైదొలగి, తాలిబన్ల ఏలుబడి మొదలైతే ఎలాంటి అరాచకాలు తలెత్తుతాయోనన్న భయాందోళనలు ఆ దేశంలోని మైనారిటీలకూ, మహిళలకూ, ఇరుగుపొరుగు దేశాలకూ వుంది. వారి రాకను ఆహ్వానిస్తున్నది ఒక్క పాకిస్తాన్ మాత్రమే. భారత్కు తాలిబన్లతో చాలా చేదు అనుభవా లున్నాయి. అన్నిటినీ బేఖాతరుచేసి, ఇప్పటికీ హింసను విడనాడని తాలిబన్ల దయాదాక్షిణ్యాలకు వదిలేయడం అమెరికా బాధ్యతారాహిత్యానికి చిహ్నం. -
దేశ సరిహద్దులో సైనికుల డ్యాన్స్ వైరల్
లఢాఖ్: సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో భారత్ చైనా మధ్య యుద్ధం తలెత్తేలా పరిణామాలు కనిపించాయి. అనంతరం అనూహ్యంగా చైనా బలగాల ఉపసంహరణకు నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితులు శాంతంగా మారాయి. ఈ క్రమంలో భారత సరిహద్దు తూర్పు లడ్డాఖ్ ప్రాంతంలో కొన్ని రోజులుగా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు వద్ద సైనికులు ఆనందంలో మునిగారు. ఈ సందర్భంగా వారు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇద్దరు సైనికులు ఉత్సాహవంతంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ట్విటర్లో షేర్ చేశారు. షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్గా మారింది. లక్షల్లో వ్యూస్.. వేలాది లైక్స్, రీట్వీట్స్ వచ్చాయి. లడ్డాఖ్ ప్రాంతంలో సైనికులు ఇంత ఆనందంలో ఎప్పుడు కనిపించలేదని కిరణ్ రిజుజు ఆనందం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో స్థానిక ‘పెప్పీ’ పాటను పెద్ద సౌండ్లో పెట్టుకుని నృత్యాలు చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైనికుల సేవలను కీర్తిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను పెద్ద సంఖ్యలో షేర్ చేస్తున్నారు. It feels great whenever soldiers enjoy! Brave Indian Army Gorkha Jawans and colleagues with full music at Pangong Tso in Ladakh. pic.twitter.com/d56Qjl3RhN — Kiren Rijiju (@KirenRijiju) March 25, 2021 -
ప్రతి మహిళా ఒక సోల్జర్
నేషనల్ జియోగ్రాఫిక్ వాళ్లు ఢిల్లీలో నిన్న ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ను ప్రదర్శించారు. ఆ షో కి ఎన్.సి.సి. గర్ల్ కెడేట్స్, ఉమెన్ ఆఫీసర్స్ వచ్చారు. చీఫ్ గెస్ట్ లెఫ్టినెంట్ జనరల్ మాధురీ కణిట్కర్! షో అయ్యాక ‘‘హౌ ఈజ్ ది జోష్’’ అని అమ్మాయిల్ని అడిగారు. ‘‘ఓ..’’ అని నోటికి రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి ఉత్సాహంగా అరిచారు అమ్మాయిలు. ‘‘మనలో ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉంది. మల్టీ టాస్కింగ్ చేయగలం. ఆర్మీ మిమ్మల్ని ఉమన్గా కాదు, ఒక సోల్జర్ గా గుర్తిస్తుంది. అదే మనకు కావలసిన గుర్తింపు’’ అంటూ.. వాళ్ల జోష్ ను మరింతగా పెంచారు కణిట్కర్. మాధురీ కణిట్కర్ ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్నెంట్ జనరల్. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఎన్.సి.సి. ఆడిటోరియంలో శుక్రవారంనాడు ఎన్.సి.సి. గర్ల్ కెడెట్లు, ఎన్.సి.సి. ఉమెన్ ఆఫీసర్స్ హాజరైన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఆ ప్రత్యేక కార్యక్రమం ఓ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ వాళ్లు ఆర్మీలో చేరాలని అనుకుంటున్న అమ్మాయిల కోసం ఆ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ అనే ఆ చిత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మహిళాశక్తికి ఒక పవర్ ప్రెజెంటేషన్లా ఉంది. గర్ల్ కెడెట్స్ లీనమైపోయి చూస్తున్నారు. అప్పటికప్పుడు ఆర్మీలో చేరిపోయి తమ సత్తా ఏంటో చూపించాలన్నంతగా వారిని ఆ చిత్రం బందీని చేసింది. మాధురీ కణిట్కర్ కూడా వాళ్లతో కూర్చొని ఆ డాక్యుమెంటరీని చూశారు. చిత్రం పూర్తవగానే గర్ల్ కెడెట్స్ అరుపులు, చప్పట్లు! ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ స్క్రీనింగ్ కార్యక్రమంలో మాధురీ కణిట్కర్ అప్పుడు అడిగారు మాధరి.. ‘హవ్వీజ్ ద జోష్?’ అని! ‘సూపర్బ్గా ఉంది మేడమ్’ అన్నారు అమ్మాయిలు. ‘‘కానీ ఆర్మీలో ఉద్యోగం బెడ్ ఆఫ్ రోజెస్ కాదు’’ అన్నారు మాధురి. ఆ మాటకు కొంచెం నిరుత్సాహం. ‘‘అయితే ఆర్మీ మిమ్మల్ని ఒక శక్తిగా మలుస్తుంది’’ అని కూడా అన్నారు మాధురి. నిరుత్సాహం స్థానంలో మళ్లీ ఉత్సాహం! అప్పుడిక ఆమె భారత సైన్యంలో తన ప్రయాణం ఎలా ఆరంభమైందీ చెప్పడం మొదలు పెట్టారు. మాధురి ఆర్మీలోకి వచ్చేటప్పటికి మహిళా అధికారులు సంప్రదాయ వస్త్రధారణ అయిన చీరలో కనిపించారు! క్రమంగా యూనిఫామ్లోకి మారిపోయారు. 37 ఏళ్లుగా ఆర్మీలో ఉన్నారు మాధురి. ఆర్మీలోని మెడికల్ విభాగంలో ఆఫీసర్ తను. లెఫ్ట్నెంట్గా చేరి లెఫ్ట్నెంట్ జనరల్ ర్యాంకుకు చేరుకున్నారు. ఆర్మీలో పైనుంచి మూడో ర్యాంకే లెఫ్టినెంట్ జనరల్. (మొదటి ర్యాంక్ ఫీల్డ్ మార్షరల్. రెండో ర్యాక్ జనరల్). ఆర్మీలో తన వైద్య సేవలకు అతి విశిష్ట సేవామెడల్, విశిష్ట సేవామెడల్ కూడా పొందారు. ∙∙ నేషనల్ జియోగ్రాఫిక్ షోకి ఆమె ఆర్మీ దుస్తుల్లోనే వచ్చారు మాధురీ కణిట్కర్. ‘‘ఆర్మీలో చేరాక మీరు స్త్రీనో, పురుషుడో కాదు. ఒక సోల్జర్ మాత్రమే. స్త్రీ అనే గుర్తింపు కన్నా, సోల్జర్ అనే గుర్తింపే మనకు ముఖ్యం. ఆర్మీలో చేరక ముందు కూడా మనం సోల్జరే. స్త్రీలో సహజంగానే సైనిక శక్తి ఉంటుంది కనుక’’ అని మాధురి చెప్పడం కెడెట్ గర్ల్స్కి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్.సి.సి.లో కొత్తగా జాయిన్ అయినవాళ్లే వాళ్లంతా. ‘‘సోల్జర్కి జెండర్ ఉండదు. అది మన మైండ్లో ఉంటుంది. మహిళల జెండర్ వారిలో పవర్ మాత్రమే’’ అని మాధురి చెప్పడం కూడా ఆ పిల్లల్ని బాగా ఆకట్టుకుంది. ఒక ఆర్మీ పర్సన్ మాటలు ఎంతలా పని చేస్తాయంటే.. అది ఆర్మీ గొప్పతనమే అనాలి. ఆర్మీలో చేరిన ప్రతి వ్యక్తినీ అలా తీర్చిదిద్దుతుంది ఆర్మీ. సమాజంలో స్ఫూర్తిని నింపేలా. ‘‘అమ్మాయిలూ మీకొక మాట చెప్తాను వినండి. మనకు అదనంగా ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ ఉంది. అది మన చేత మల్టీ టాస్కింగ్ చేయిస్తుంది. లక్ష్యం కోసం పరుగులు తీయిస్తుంది. కలల్ని నిజం చేసుకుని శక్తిని ఇస్తుంది. ఏ ఉద్యోగంలోనైనా మనకు ఛాలెంజింగ్ ఏమిటంటే.. ఇంటిని, ఆఫీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం. అది సాధ్యమైతే మనకు ఏదైనా సాధ్యమే. ఉద్యోగానికి ఇల్లు, ఇంటికి ఉద్యోగం అడ్డుపడవు. నన్నే చూడండి. నా భర్త కూడా ఆర్మీలోనే చేసేవారు. ఇద్దరం ఆర్మీలోనే ఉన్నా 24 ఏళ్ల పాటు ఒకేచోట లేము. కానీ ఆర్మీ మాకు సపోర్ట్గా ఉంది. ఇద్దరం ఒకచోట లేకున్నా ఇద్దరం ఆర్మీలోనే ఉన్నామన్న భావనను ఆర్మీనే మాకు కలిగించింది. మహిళలకు సురక్షితమైన ఉద్యోగరంగం ఆర్మీ అని చెప్పగలను’’ అని మాధురి తన అనుభవాలు కొన్ని చెప్పారు. ‘‘ఉమన్లో ఆర్మీ పవర్ ఉంది. ఆర్మీకి ఉమన్ పవర్ అవసరం ఉంది’’ అని చివర్లో మాధురీ కణిట్కర్ అన్నమాట.. అమ్మాయిలకు డాక్యుమెంటరీ ఎంత జోష్ని ఇచ్చిందో అంతే జోష్ను ఇచ్చి ఉండాలి. వారంతా నోటికి రెండు చేతులూ అడ్టుపెట్టుకుని కోరస్గా మళ్లొకసారి ‘ఓ’ అని ఉల్లాసంగా చప్పట్లు చరిచారు. -
సైనికుల కోసం సోలార్ టెంట్లు
దేశ రక్షణ కోసం సైనికులు ఎండకు, వానకు, చలికి తట్టుకొని అత్యంత కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తారు. జమ్ము కాశ్మీర్, శ్రీనగర్, లడక్ వంటి ప్రాంతాల్లో శీతాకాలంలో గడ్డ కట్టే చలిలో విధులు నిర్వహించాలంటే కత్తి మీద సాములాగా ఉంటుంది. ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఒకొక్కసారి ఇక్కడ చలికి సైనికులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయితే ఇప్పటి వరకూ సైనికుల క్యాంపుల్లో వాడే టెంట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ '3 ఇడియట్స్'సినిమాలోని 'ఫన్సుఖ్ వాంగ్డు' పాత్ర వెనుక ఉన్న వ్యక్తి సోనమ్ వాంగ్చుక్. ఈ సోనమ్ వాంగ్చుక్ లడఖ్ లాంటి ప్రాంతంలో ఉన్న ఆర్మీ జవాన్లకు వెచ్చదనం కోసం ఒక పరిష్కారం కనుగొన్నారు. అతను ఒకేసారి 10 మంది జవాన్లకు వసతి కల్పించే సౌరశక్తితో నడిచే పోర్టబుల్ సైనిక గుడారాన్ని నిర్మించాడు. గాల్వన్ వ్యాలీ వంటి ప్రాంతాలలో రాత్రి 10 గంటలకు గుడారం బయట మైనస్ 14 డిగ్రీలు ఉన్నప్పటికీ గుడారం లోపల సుమారు 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపారు. 10మంది జవాన్లకు వసతి కల్పించే విధంగా ఈ టెంట్ ను తయారు చేశారు. దీని బరువు 30 కిలోల కన్నా తక్కువ ఉంటుంది. ఈ సోలార్ టెంట్ పూర్తిగా పోర్టబుల్. కనుక సైనికులకు ఈ టెంట్ అత్యంత శీతల ప్రాంతాల్లో కూడా ఉపయోగపడుతుందని వారు సురక్షితంగా సోనమ్ ఉంటారని చెప్పారు. SOLAR HEATED MILITARY TENT for #indianarmy at #galwanvalley +15 C at 10pm now. Min outside last night was -14 C, Replaces tons of kerosesne, pollution #climatechange For 10 jawans, fully portable all parts weigh less than 30 Kgs. #MadeInIndia #MadeInLadakh #CarbonNeutral pic.twitter.com/iaGGIG5LG3 — Sonam Wangchuk (@Wangchuk66) February 19, 2021 చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు '5జీ'తో ఐటీ దిగ్గజాలకు కాసుల పంట -
స్వర్ణిం విజయ్ వర్ష్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
-
పురస్కార గ్రహీతలకు సీఎం జగన్ భారీ నజరానా
-
పురస్కార గ్రహీతలకు సీఎం జగన్ భారీ నజరానా
సాక్షి, తిరుపతి: భారత సైన్యానికి వందనం.. 135 కోట్ల మందిని పరిరక్షిస్తున్న వీర సైనికులకు వందనం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎండ, చలి, వర్షాన్ని లెక్కచేయకుండా కాపలా కాస్తున్నారని సైనికుల సేవలను కొనియాడారు. బంగ్లాదేశ్ ఏర్పడింది అంటే.. అది మన సైన్యం గొప్పతనమని గుర్తుచేశారు. మృత్యుభయం వీడి మాతృభూమి సేవలో తరిస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా వీర పురస్కారాలు పొందేవారికి ఏపీ ప్రభుత్వం తరఫున భారీ నజరానా సీఎం జగన్ ప్రకటించారు. తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. సైనికుల త్యాగాలు మరువలేనివని, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. పరమవీరచక్ర పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి, మహావీరచక్ర, కీర్తిచక్ర పురస్కారాలకు రూ.80 లక్షలు, వీరచక్ర, శౌర్యచక్ర పురస్కారాలకు రూ.60 లక్షలు ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అంతకుముందు 1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధంలో విశేష సేవలందించిన మహావీరచక్ర, పరమవిశిష్ట సేవా మెడల్ గ్రహీత, యుద్ధవీరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ను సీఎం జగన్ సత్కరించారు. అనారోగ్యానికి గురవడంతో సీఎం జగన్ నేరుగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి ఘనంగా సన్మానించారు. పరేడ్ మైదానంలో మరికొంత మంది సైనికులకు సీఎం జగన్ సన్మానించారు. చదవండి: యుద్ధవీరుడికి సీఎం జగన్ ఘనంగా సన్మానం చరిత్రలో లేని విధంగా ఇళ్లు నిర్మాణం : సీఎం జగన్ -
మరోసారి చైనా దుస్సాహసం, తిప్పి కొట్టిన సైనికులు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మరోసారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది.లడాఖ్లో భారతీయ సైనికులను పొట్టన పెట్టుకున్న వివాదం ఇంకా సమపిపోక ముందే చైనా దళాలు మరో దుస్సాహసానికి పూనుకున్నాయి. హద్దు మీరి చొరబాటుకు ప్రయత్నించడంతో వారిని భారత జవాన్లు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. సిక్కిం సెక్టార్లోని నాథూ లా సమీపంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసి) మూడు రోజుల క్రితం ఈ ఉదంతం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఏ) సైనికులకు భారతీయ జవాన్లు సరియైన రీతిలో బుద్ధి చెప్పారు. ఈ ఘర్షణలో ఇరువైపులా సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై భారత సైన్యం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఉత్తర సిక్కింలోని నాకూలాలో చైనా సైనికులు ఇండియాలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించిన ఘటన గతవారం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో 20 మంది గాయపడినట్టు సమాచారం. గాయనపడిన వారిలో నలుగురు భారత జవాన్లు కూడా ఉన్నారు. అలాగే ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా తూర్పు లడాఖ్లో చైనా దుశ్చర్య కారణంగా జూన్ 2020 లో, గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు మరణించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ ప్రతిష్టంభను తొలగింపునకు సంబంధించి భారత్, చైనా మధ్య ఈ రోజు (జనవరి,25) తొమ్మిదో రౌండ్ సైనిక చర్చలను నిర్వహించనున్నాయి. Troops of India and China involved in a physical brawl along the Line of Actual Control (LAC) last week near Naku La area in Sikkim. Soldiers from both sides are injured. More details awaited: Sources pic.twitter.com/Sff5eVDP1K — ANI (@ANI) January 25, 2021 -
అప్ఘన్లో ఆస్ట్రేలియా సైనికుల విధ్వంస క్రీడ!
కాన్బెర్రా: అఫ్ఘనిస్తాన్లో ఆస్ట్రేలియా సైనికులు జరిపిన దుశ్చర్యలు ఆలస్యంగా వెలుగులోనికి వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రత్యేక దళాలు 39 మంది నిరాయుధ పౌరులను, ఖైదీలను చట్టవిరుద్ధంగా చంపినట్లు విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని ఆస్ట్రేలియా జనరల్ గురువారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రత్యేక యుద్ధ నేరాల ప్రాసిక్యూటర్తో ప్రస్తావించారు. 2005 నుంచి 2016 మధ్య ఆఫ్ఘనిస్తాన్లో సైనికుల దుష్ప్రవర్తనపై సంవత్సరాల తరబడి జరిపిన దర్యాప్తులో భయంకరమైన నిజాలను తెలుసుకున్నామని డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ అంగస్ కాంప్బెల్ తెలిపారు. ఒక దశాబ్దం పాటు సైనికుల్లోని ఉన్నత దళాలు శిక్ష మినహాయింపుకోసం "విధ్వంసకర"మైన సంస్కృతిని అవలంభించాయని, తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో హత్యలు జరిగాయని పేర్కొన్నారు. బయటకు వచ్చిన నిజాలు.. ‘నిఘా సిబ్బందిలో కొంతమంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. నియమాలను కాలరాశారు, కల్పిత కథలను సృష్టించారు. అబద్ధాలు చెప్పారు. పలు ఖైదీలను చంపేశారు’ అని కాంప్బెల్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. కాగా 'బ్లడింగ్' (వేట) అని పిలువబడే వికృత క్రీడలో కొంత మంది నిఘా సిబ్బంది మొదటిసారిగా కాల్చే అవకాశం కోసం ఖైదీలను బలవంతంగా కాల్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలు జరగడానికి జూనియర్ సైనికులే కారణమని ఆరోపించారు. మిలిటరీ ఇన్స్పెక్టర్ జనరల్ గురువారం 465 పేజీల అధికారిక నివేదికలో డజన్ల కొద్దీ హత్యలు జరిగాయని తెలిపింది. ఈ నివేదికలో బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సిఫార్సుచేసింది. 39 మందిని చట్టవిరుద్ధంగా హత్య చేయడంతో రెజిమెంట్, సాయుధ దళాలు, ఆస్ట్రేలియాకు మాయని మచ్చ తెచ్చారని కాంప్బెల్ అన్నారు. యుద్ధ నేరాలకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు అధికారికి ఈ వివరాలను పంపుతామన్నారు. సేవా పతకాలు తిరిగి వెనకీ.. కాంప్బెల్ 2007- 2013 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన సైనిక దళాలకు ఇచ్చిన కొన్ని విశిష్ట సేవా పతకాలను ఉపసంహరించుకుంటామన్నారు. సెప్టెంబర్ 11, 2001 దాడుల తరువాత, తాలిబన్, అల్-ఖైదా, ఇతర ఇస్లామిస్ట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యుఎస్, మిత్రరాజ్యాల దళాలతో కలిసి పోరాడటానికి 26,000 మందికి పైగా ఆస్ట్రేలియా సైనికులను ఆఫ్ఘనిస్తాన్కు పంపారు. ఆస్ట్రేలియన్ సైనిక దళాలు అధికారికంగా 2013లో దేశంను విడిచి వెళ్లినా, ఉన్నత బలగాలు తరచూ క్రూరమైన పనులు చేసే వారని తెలిసింది. సైనికులు జరిపిన దాడిలో ఆరేళ్ల చిన్నారిని చంపినట్లు నివేదికలు వచ్చాయి. అంతేకాకుండా హెలికాప్టర్లో స్థలం లేకపోవడంతో ఖైదీని కాల్చి చంపేశారు.(చదవండి: లాక్డౌన్ నియమాలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియా ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం నివేదిక తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు.. మోరిసన్ ప్రభుత్వం బుధవారం ఈ చర్యలను చాలా తీవ్రంగా పరిగణించిందని ఆఫ్ఘాన్ రాయబారికి తెలిపింది. ఇక సైనిక చర్యలపై ప్రధాని మోరిసన్ తన ప్రగాడ సానుభూతిని తన ట్వీట్లతో వ్యక్తం చేశారు. గత వారం, మోరిసన్ యుద్ధ నేరాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక పరిశోధకుడిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. మీడియాపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం గతంలో తప్పు చేసినట్లు తెలిపిన సంస్థ నివేదికలను అణిచివేసేందుకు ప్రయత్నించింది, పోలీసులు నివేదికలను వెలుగులోకి తెచ్చే విలేకరులపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం మొదట ప్రజల దృష్టికి ‘ఆఫ్ఘన్ ఫైల్స్’ పేరుతో 2017లో ఆస్ట్రేలియా జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. ఆస్ట్రేలియా దళాలు ఆఫ్ఘనిస్తాన్లో నిరాయుధ పౌరులను, పిల్లలను చంపారని ఆరోపించారు. ప్రతిస్పందనగా, ఆస్ట్రేలియా పోలీసులు ఇద్దరు రిపోర్టర్లపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును విరమించుకునే ముందు, గత సంవత్సరం సిడ్నీలో ఏబీసీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. -
ఈ సైనిక శిబిరాలు స్మార్ట్
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు సమర్థంగా పనిచేయడానికి వీలుగా అత్యంత ఆధునిక వసతి సౌకర్యాలను కల్పించారు. కొద్ది రోజులుగా చైనాతో ఉద్రిక్తతలు నెలకొని ఉండడంతో శీతాకాలంలో సైనికుల ఆరోగ్యానికి పూర్తిగా రక్షణ కల్పించేలా స్మార్ట్ శిబిరాలను ఏర్పాటు చేశారు. నవంబర్ నుంచి ఈ ప్రాంతంలో రక్తం గడ్డకట్టే చలి మొదలవుతుంది. ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 40 డిగ్రీ సెల్సియస్కు పడిపోతాయి. 40 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోతుంది. ఇలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ దేశ రక్షణ కోసం కంటి మీద రెప్ప వేయకుండా కాపలా కాసే మన జవాన్ల కోసం నిర్మించిన ఈ స్మార్ట్ క్యాంపుల్లో అన్ని రకాల సదుపాయాలున్నాయి. చలిని తట్టుకోవడానికి శిబిరాల్లో హీటర్లు, 24 గంటలు వేడి నీళ్ల సదుపాయం, విద్యుత్, బెడ్లు, కబోర్డులు ఇలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘లద్దాఖ్లో గస్తీ ఉండే సైనికులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. వారు చలిని తట్టుకునేలా స్మార్ట్ శిబిరాల నిర్మాణం పూర్తయింది. దేశ రక్షణ కోసం పాటు పడే జవాన్లు శీతాకాలంలో సమర్థమంతంగా విధులు నిర్వహించడం కోసం మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాం’అని భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. స్మార్ట్ శిబిరాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేయడంతో అవి విస్తృతప్రచారం పొందాయి. గత నెలలోనే చైనా కూడా ఈ ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసి, వాటి వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. చైనా శిబిరాలకు ఏమాత్రం తీసిపోకుండా భారత్కి చెందిన స్మార్ట్ శిబిరాలు కూడా ఉండడం గమనార్హం. -
ఆ ఊరే.. ఒక సైన్యం
కొమరోలు: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు ఆర్మీ జవాన్లు. ఆ ఊరిలో 86 కుటుంబాలు ఉంటే అందులో 130 మంది సైనికులు, మాజీ సైనికులే. వీరంతా ముస్లింలే కావడం మరో విశేషం. ప్రస్తుత కాలంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నా తమ ప్రాధాన్యత మాత్రం దేశ రక్షణకే అంటోంది.. ఈ గ్రామం. ఐదు దశాబ్దాల క్రితం నుంచే ఊరు మొత్తం దేశసేవకే అంకితమవుతూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ గ్రామమే.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని మల్లారెడ్డిపల్లె. ఇండియన్ ఆర్మీకి వీర సైనికులను అందిస్తున్న ఈ గ్రామంపై ప్రత్యేక కథనం.. ఆయన పేరుతోనే ఊరు.. శతాబ్దం కిందట ఈ గ్రామ ప్రాంతానికి మల్లారెడ్డి అనే రైతు వలస వచ్చి వ్యవసాయం చేసుకుంటూ కొన్నాళ్లు అక్కడే ఉన్నారు. దీంతో ఊరిపేరు మల్లారెడ్డిపల్లెగా స్థిరపడిపోయింది. కాలక్రమేణా మల్లారెడ్డి కుటుంబీకులు గ్రామం నుంచి వలస వెళ్లిపోయారు. తర్వాత ముస్లింలు గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ముస్లింలు తప్ప మరే సామాజికవర్గానికి చెందినవారు లేరు. మల్లారెడ్డిపల్లె గ్రామం వ్యూ 5 దశాబ్దాల క్రితం నుంచే దేశసేవ.. మల్లారెడ్డిపల్లెలో మొత్తం 86 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఐదు దశాబ్దాల క్రితమే అంటే.. 1970 నుంచే దేశ సేవలో ఉన్నారు. పెద్దవాళ్లు ఉద్యోగ విరమణ చేశాక తమ పిల్లలను సైతం దేశ రక్షణకు అంకితం చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 130 మంది ఆర్మీ జవాన్లు, మాజీ సైనికులు ఉండగా వీరిలో ప్రస్తుతం 80 మంది దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకరూ లేదా ఇద్దరు సైనికులుగా సేవలందిస్తుండటం విశేషం. పాకిస్థాన్తో జరిగిన పలు యుద్ధాల్లో పాల్గొని తమ సత్తా చాటిన సైనికులు ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామంలోనే ఉంటున్నారు. వ్యవసాయం చేసుకుంటూ అందులోనూ రాణిస్తున్నారు. మదరసా నిర్వహణ దేశ రక్షణలో రాణిస్తున్న మల్లారెడ్డిపల్లె గ్రామస్తులు తమ మాతృభాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. తమ మండలంలో ఉర్దూ పాఠశాల, ఉర్దూ ఉపాధ్యాయులు లేకపోవడంతో గ్రామస్తులే చందాలు వేసుకుని ఉర్దూ ఉపాధ్యాయుడిని నియమించుకున్నారు. ప్రైవేటు మదరసా నిర్వహిస్తూ 35 మంది విద్యార్థులకు ఉర్దూను నేర్పిస్తున్నారు. ప్రభుత్వం తమ గ్రామంలో ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. సైన్యంలో 23 ఏళ్లపాటు విధులు నిర్వహించా.. 1981లో ఆర్మీలో జవానుగా చేరి 23 ఏళ్లపాటు విధులు నిర్వహించాను. కార్గిల్ యుద్ధంతోపాటు పలు యుద్ధాల్లో పాల్గొన్నా. – షేక్ మహబూబ్, మాజీ సైనికుడు 1971 పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్నా 1970లో ఆర్మీలో చేరాను. 1971లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడాను. ఆర్మీలో 24 ఏళ్లపాటు విధులు నిర్వహించి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నా. నా ముగ్గురు కుమారులు కూడా ఆర్మీలోనే ఉన్నారు. – షేక్ మదార్ వలి, మాజీ సైనికుడు నా ఇద్దరు కుమారులు కూడా ఆర్మీలోనే ఉన్నారు.. భారత సైన్యంలో 17 ఏళ్లపాటు జవాన్గా విధులు నిర్వహించాను. ప్రస్తుతం సైనికులకు గౌరవప్రదమైన వేతనాలు ఇస్తున్నారు. దేశం మీద ప్రేమతో నా ఇద్దరు కుమారులను కూడా ఆర్మీలోనే చేర్పించాను. – ఎం.మహబూబ్ బాషా, మాజీ సైనికుడు -
‘సోషల్’ ఖాతాల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తమ 1.62 లక్షల మంది సైనికులకు సోషల్ మీడియా వాడకంపై మార్గదర్శకాలను ఇచ్చింది. అంతేగాక సైనికులు వాడుతున్న ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటి యూజర్ ఐడీలు వెల్లడించాలని కోరింది. ఆన్లైన్ ప్రపంచంలో ఉన్న ప్రమాదాల రీత్యా, భారత్ పై ఇతర దేశాల నుంచి ఉన్న ముప్పు రీత్యా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దేశంలోని 63 విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ జవాన్లు సేవలందిస్తున్నారు. వాటితో పాటు కొన్ని ఏరోస్పేస్, న్యూక్లియర్ డొమన్ తో పాటు పలు మంత్రిత్వ శాఖల భవనాల వద్ద వీరు పనిచేస్తున్నారు. సైనికులు ఉపయోగిస్తున్న ఐడీల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు వస్తున్నాయేమో గమనించనున్నారు. తప్పుడు ఐడీలు సమర్పించడంగానీ, కొత్త ఐడీలు క్రియేట్ చేయడంగానీ చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
భారత్, చైనా శాంతి మంత్రం
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పూర్తిస్థాయిలో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. తూర్పు లద్దాఖ్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. ఇరు దేశాల దౌత్య ప్రతినిధులు మరోసారి శుక్రవారం ఆన్లైన్ ద్వారా చర్చలు జరిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిస్థాపన కోసం సరిహద్దుల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించారు. ఎల్ఏసీ వెంబడి సైనికుల ఉపసంహరణ పురోగతిపై సమీక్షించారు. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం అమెరికా రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్తో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్లో పరిస్థితిపై రాజ్నాథ్ సమీక్ష తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ అనంతర పరిస్థితులపై శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష జరిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియాతోపాటు పలువురు సీనియర్ సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణలో మొదటి దశ పూర్తయినట్లేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ అమ్ముల పొదిలో మరిన్ని ‘అపాచీ’లు భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల అందజేత పూర్తి చేసినట్లు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ప్రకటించింది. ఒప్పందం ప్రకారం అపాచీ యుద్ధ హెలికాప్టర్లలోని చివరి ఐదింటిని ఇటీవల భారత వైమానిక దళానికి అందజేసినట్లు బోయింగ్ సంస్థ వెల్లడించింది. (చైనా హెచ్చరికలు.. ఖండించిన కజకిస్థాన్!) -
ఆ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
పట్నా: ఈ నెల 15న గల్వాన్ వ్యాలీలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో అమరులైన జవానుల కుటుంబాలకు సాయం చేసేందుకు బిహార్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో నాటి ఘర్షణలో అసువులు బాసిన రాష్ట్రానికి చెందిన అమర జవాన్ల కుటంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును బిహార్ క్యాబినేట్ ఆమోదించింది. చైనాతో గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. వీరిలో తెలంగాణకు చెందిన కల్నల్ బి సంతోష్ బాబు కూడా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్గ్రేషియాతో పాటు హైదరాబాద్లో ఇంటి స్థలం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సంతోష్బాబుతో పాటు నాటి ఘర్షణలో చనిపోయిన మిగతా జవాన్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం రూ. 10లక్షల ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. (వాజ్పేయి చాణక్యం.. చైనాకు గుణపాఠం) -
మీ చొరవ అసమానం
సాక్షి, హైదరాబాద్: లద్దాఖ్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి అత్యంత ఉదారంగా పునరావాస ప్యాకేజీని ప్రకటించడమే కాకుండా, సత్వరమే అందజేయడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చూపిన చొరవను డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ కొనియాడారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెల 24న ఆయన లేఖ రాశారు. ఉన్నత ప్రమాణాలను నిర్దేశించారు.. ‘సంతోష్బాబు కుటుంబానికి ప్యాకేజీ ప్రకటించి, సత్వరంగా అందించడానికి మీరు చూపిన చొరవ అసమానమైనది. ఇతరులు అనుసరించడానికి ఉన్నతమైన ప్రమాణాలను నిర్దేశించింది. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగానికి భారతీయ సైనికుడు ఎప్పుడూ భయపడడు అనేదానికి చరిత్రే సాక్ష్యం. జాతీయ యుద్ధ స్మారక వనంలో చెక్కిన అనేక మంది అమరవీరుల పేర్లు ఇందుకు నిదర్శనం. నా కార్యాలయానికి రోజూ వెళ్లే సమయంలో సౌత్బ్లాక్ కారిడార్లలో శౌర్య పురస్కారాలు అందుకున్న వీరుల చిత్రాలను చూస్తూ గర్వపడుతుంటాను. యుద్ధరంగంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా దేశం మా కుటుంబాలకు అండగా నిలుస్తుందని సైనికులకు మీరు నిలిపిన ఈ ప్రమాణాలు భరోసా ఇస్తాయి. అనుసరించడానికి ఉన్నతమైన ప్రమాణాలను నిర్దేశించింది. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగానికి భారతీయ సైనికుడు ఎప్పుడూ భయపడడు అనేదానికి చరిత్రే సాక్ష్యం. జాతీయ యుద్ధ స్మారక వనంలో చెక్కిన అనేక మంది అమరవీరుల పేర్లు ఇందుకు నిదర్శనం. నా కార్యాలయానికి రోజూ వెళ్లే సమయంలో సౌత్బ్లాక్ కారిడార్ల లో శౌర్య పురస్కారాలు అందుకున్న వీరుల చి త్రాలను చూస్తూ గర్వపడుతుంటాను. యుద్ధరంగంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా దేశం మా కుటుంబాలకు అండగా నిలుస్తుందని సైనికులకు మీరు నిలిపిన ఈ ప్రమాణాలు భరోసా ఇస్తాయి. అమరుడైన ఓ సైనికుడి కుటుంబాన్ని ఓదార్చడానికి ఒక రాష్ట్ర సీఎం వందల కిలోమీట ర్లు ప్రయాణించడం అరుదైన విషయం. సంతోష్బాబు కుటుంబంతో పాటు ఆయన సహచరులైన మిగిలిన 19 మంది సైనికులు తెలంగాణవాసులు కాకపోయినా వారి పట్ల మీరు చూపిన ఆదరణ.. మీ నాయకత్వ లక్షణాలు, సైన్యం పట్ల మీ దృక్పథానికి, సహృద్భావానికి అద్దంపడుతోంది. ఈ విషయంలో మీ కుమార్తె కె.కవిత చూపిన చొరవ సైతం ప్రశంసనీయం’అని పవార్ తన లేఖలో పేర్కొన్నారు. కోరుకొండలోని సైనిక్ స్కూల్ను సందర్శించాలని సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు. కల్నల్ సంతోష్ ఇక్కడి పూర్వ విద్యార్థి అని, ఇక్కడ తెలంగాణకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. -
‘ఒక్క ట్వీట్ చేస్తారు.. పూర్తిగా మర్చిపోతారు’
న్యూఢిల్లీ: గాల్వన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది అనే వార్త తెలిసినప్పటి నుంచి రిటైర్డ్ బ్రిగేడియర్ సీకే సూద్ స్థిమితంగా ఉండలేకపోతున్నారు. 20 మంది సైనికులు చనిపోయారని తెలిసినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎంత విలవిల్లాడిపోయారో.. సూద్ కూడా అలానే బాధపడ్డారు. ఈ ఘటన ఆయన కుమారుడిని గుర్తు చేసింది. సీకే సూద్ కుమారుడు మేజర్ అంజు సూద్ కూడా గత నెల 2న కశ్మీర్ హంద్వారా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అసువులు బాశారు. ఉగ్రవాదుల చేతిలో చిక్కుకున్న పౌరులను కాపాడే క్రమంలో అంజు సూద్ మరణించారు. ఈ ఘటనలో మొత్త ఐదుగురు చనిపోయారు. కొడుకు మరణించిన విషాదం నుంచి బయటపడక ముందే మరో 20 మంది సరిహద్దులో నెలకొరిగారనే విషయం ఆయనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!) ఈ సందర్భంగా సీకే సూద్ మాట్లాడుతూ.. ‘నా కుమారుడు మరణించాడనే వార్త నాకు ఒక రోజు తర్వాత తెలిసింది. ఆలోపే ఈ వార్త అన్ని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది’ అన్నారు. రాజకీయ నాయకులు అమర జవాన్ల మృతికి సంతాపంగా ఓ ట్వీట్ చేసి చేతులు దులుపుకుంటున్నారని.. ఆ తర్వాత వీరుల కుటుంబాలను పట్టించుకునే నాదుడు లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమరుల కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సీకే సూద్ గత నెల 30న Change.org అనే ఆన్లైన్ పిటీషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీకే సూద్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం మన హీరోల త్యాగాన్ని ఎలా గుర్తిస్తుందో మీకు తెలుసా.. ఓ ట్వీట్తో. ఒక ట్వీట్ అంటే కేవలం 140 అక్షరాల్లో. వారు ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో ఐదుగురు వీర జవాన్లు మృతి చెందారని తెలుపుతారు. కానీ వారి పేర్లును వెల్లడించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (బాయ్కాట్ చైనా) ఈ పిటీషన్లో (Change.org/MartyrsOfIndia) సీకే సూద్ దేశ ప్రధాని / రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ.. అమరులైన జవాన్ల త్యాగాన్ని గుర్తు చేస్తూ వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున ఓ మెమోంటో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘ఒక బలమైన కారణం కోసం ప్రతి ఏడాది ఎందరో జవాన్లు అమరులవుతున్నారు. వారిని ఒక్క సారి స్మరించుకుని తర్వాత మర్చిపోతారు. వారి కుటుంబాలను అస్సలు పట్టించుకోరు. ఈ పద్దతి మారాలి’ అన్నారు. ఇందుకు జనాలు తనకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. ఈ ఆన్లైన్ పిటీషన్ ఇప్పటికే 19,800 సంతకాలు సేకరించింది... వీటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. -
‘అందుకు మూల్యం జవాన్లు చెల్లించారు’
న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్ గాల్వన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘటనలో కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాహుల్ గాంధీ.. ‘చైనా పథకం ప్రకారమే దాడి చేసింది. ఇది తెలిసి కేంద్రం నిద్రపోతుంటే.. మన అమర జవాన్లు అందుకు మూల్యం చెల్లించారు’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య తలెత్తిన ఘర్షణలో 20 మంది ఇండియన్ సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ట్విట్టర్లో ‘ఇది ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. గాల్వన్ వ్యాలీలో చైనా దాడి ముందస్తు ప్రణాళికతో జరిగింది. ఇది తెలిసి కేంద్ర ప్రభుత్వం నిద్ర పోయింది. ఈ హెచ్చరికలను ఖండించింది. ఫలితంగా మన అమర జవాన్లు మూల్యం చెల్లించారు’ అని ట్వీట్ చేశారు. అంతేకాక కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ వెల్లడించిన నివేదికను ట్వీట్తో పాటు షేర్ చేశారు. జూన్ 15న గాల్వన్ లోయలో జరిగిన దాడి గురించి శ్రీపాద నాయక్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే చైనా దాడి చేసిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. (మన సైనికుల్ని చంపడానికి వారికెంత ధైర్యం..?) గాల్వన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటంతో రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. మన సైనికులను చంపడానికి వారికెంత ధైర్యం..? వారు మన భూమిని ఆక్రమించకునే దుస్సాహసానికి ఒడిగడతారా..? ఇప్పటి వరకు జరిగింది చాలు.. అక్కడ ప్రస్తుతం ఏమి జరుగుతోందో తెలియాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాక ఎలాంటి ఆయుధాలు లేకుండా భారత సైనికులను సరిహద్దుకు ఎందుకు పంపారని రాహుల్ ప్రశ్నించారు. -
డ్రాగన్తో ఢీ!
-
భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ..
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా జవాన్ల మధ్య ఆదివారం ఉదయం ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిక్కిం సెక్టార్ ‘నకులా’ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘర్షణ సమయంలో దాదాపు 150 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత చైనా జవాన్లు కవ్వింపు చర్యలకు దిగడంతో.. ఇరువురి మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. అనంతరం చిన్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారి ఘర్షణకు కారణమైందని సమాచారం. అయితే ఈ ఘర్షణ అనంతరం ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. ఈ సంఘటనలో నలుగురు భారత జవాన్లు గాయపడ్డారని ఆర్మీ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. కాగా చాలా కాలం తర్వాత ఇలాంటి ఘటన జరిగింది. సాధారణంగా.. భారత్-పాక్ సరిహద్దుల వద్ద ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే చైనా, భారత్ల మధ్య ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో డోక్లామ్ విషయంలో భారత్, చైనా జవాన్ల మధ్య యుద్దవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరు దేశాల జవాన్ల మధ్య అనేక ఘర్షణలులు చోటుచేసుకున్నాయి. తాజాగా అదే తరహా ఘటన నకులా సెక్టార్లో చోటు చేసుకుంది. చదవండి: ఆశలు రేపుతున్న ఫేజ్–2 ట్రయల్ వైట్హౌస్కి కరోనా దడ -
వీర సైనికా నీకు వందనం
జైపూర్: ఆరున్నర సంవత్సరాలు కష్టపడి 13 సార్లు ప్రయత్నించి ఆర్మీలో చేరారు ఆయన. దేశం కోసం పోరాడాలి అన్న ఆలోచన తప్ప మరే ఆలోచన లేని ఆయన ఎట్టకేలకు ఎంతో కష్టపడి భారత సైన్యంలో చేరారు. భారత సైన్యం నిర్వహించిన ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆర్మీలో చేరిన తరువాత వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా అంచెలంచెలుగా ఎదిగి కల్నల్స్థాయికి చేరారు. ఆయన మరెవరో కాదు ఆదివారం జమ్మూ కశ్మీర్లోని హంద్వారా జరిగిన ఉగ్రదాడిలో అమరులైన కల్నల్ ఆశుతోష్ శర్మ. ఆయన మృతదేహాన్నిస్వగ్రామమైన జైపూర్కు తీసుకురానున్నారు. సోమవారం సాయంత్రం కల్లా ఆయన శరీరాన్ని జైపూర్లో ఉంటున్న ఆయన తల్లిదండ్రులకు అందించనున్నారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు సైనికవందనంతో జరగనున్నాయి. (కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) కల్నల్ శర్మ భార్య పల్లవి, కూతురు తమన్నాతో కలిసి ఉంటున్నారు. ఆయన భార్య పల్లవి మాట్లాడుతూ తన భర్త ఒక గొప్ప కారణంతో ప్రాణాలు త్యాగం చేశారని, అశుతోష్ని చూసి గర్వపడుతున్నానని తెలిపారు. ఆయనని చూసి ఏడవనని తెలిపారు. చివరిగా కల్నల్తో మే 1 న మాట్లాడానని చెప్పారు. ఆయన కూతురు తమన్నా మాట్లాడుతూ ఆపరేషన్ ముగియగానే ఇంటికి తిరిగి వస్తానని చెప్పిన నాన్నకి ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అయ్యింది. అశుతోష్ తల్లి దండ్రులు మాట్లాడుతూ తమ కొడుకుని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. (హంద్వారా అమరులకు మహేష్ నివాళి) ఆయన సోదరుడు పీయూష్ శర్మ మాట్లాడుతూ ‘మా సోదరుడు చాలా ధైర్యవంతుడు, దేశభక్తి కలవాడు. నా సోదరుడి లాగానే నా కొడుకు కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. ఆయన మా అందరికి ఆదర్శం’ అని తెలిపారు. కల్నల్ అశుతోష్ శర్మ స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని బులందర్షహర్ కాగా ఆయన అంత్యక్రియలు మాత్రం జైపూర్లో జరగనున్నట్లు ఆయన సోదరుడు తెలిపారు. ఆదివారం కశ్మీర్లోని హాంద్వారా ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో ఒక కల్నల్, ఒక మేయర్, ఇద్దరు జవాన్లతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసు ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. -
పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు మృతి
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జమ్మూ కశ్మీర్ బారాముల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఈ అప్రకటిత కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భారత భద్రతా దళనికి చెందిన ఇద్దరు సైనికులు శనివారం మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బారాములల్లా జిల్లా రాంపూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ.. భారత భద్రతా సైనికులపై కాల్పులు జరిపిందని కల్నల్ రాజేష్ కలియా తెలిపారు. అంతకు ముందు ఏప్రీల్ 30న పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఆయుధాలతో అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘన ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. -
ఆపరేషన్ నమస్తే
న్యూఢిల్లీ/చండీగఢ్: కరోనా వైరస్ విస్తృతి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికుల కోసం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవాణే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఆపరేషన్ నమస్తే అనే ఈ కార్యక్రమంలో కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయం అందించడంతోపాటు పాక్, చైనా సరిహద్దుల్లోని 13 లక్షల మంది సైనికులు, వారి కుటుంబాలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకోనున్నారు. సైనిక సిబ్బంది తమ క్లిష్టమైన విధుల దృష్ట్యా సామాజిక దూరం పాటించడం సాధ్యం కాదని, అందుకే సాధ్యమైనన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘మీ కుటుంబాల సంక్షేమం గురించి మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని సరిహద్దులోని జవాన్లకు హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మేం విజయం సాధిస్తాం’ అని తెలిపారు. ఆపరేషన్ నమస్తేలో భాగంగా ప్రత్యేకంగా కమాండ్ల వారీగా సాయం అందించేందుకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేయడంతోపాటు పలు సూచనలు జారీ చేసింది. అదేవిధంగా, కరోనా వైరస్ అనుమానిత కేసుల కోసం ఆర్మీ వెస్టర్న్ కమాండ్ పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా బారినపడిన సైనిక సిబ్బందికి, ప్రజలకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను 28 సైనికాస్పత్రుల్లో సిద్ధం చేసింది. కేంద్రానికి నోటీసులు... ఇరాన్కు తీర్థయాత్రకు వెళ్లిన 850 మందిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. కరోనా నేపథ్యంలో ఇరాన్లోని క్వోమ్ నగరంలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించాలంటూ లదాఖ్కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా, బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన 580 మంది కశ్మీర్ వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన చర్యలను తెలపాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. -
చొరబాట్లను ఆపుతూ అమరులయ్యారు
జమ్మూ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. సాయుధులైన ఉగ్రవాదులకు, ఇద్దరు భారత సైనికుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో గాయపడిన ఇద్దరు సైనికులు మరణించారని లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ బుధవారం చెప్పారు. ఈ ఘటన మంగళ, బుధవారాల మధ్య రాత్రిలో జరిగిందన్నారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో చోటుచేసుకుందని తెలిపారు. ఉగ్రవాదులతో పోరాడి మరణించిన సైనికులు నాయక్ సావంత్ సందీప్ రఘునాథ్ (29), రైఫిల్మ్యాన్ అర్జున్ తపా మగర్ (25)లకు దేశం రుణపడి ఉంటుందన్నారు. వీరిలో సావంత్ మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందినవ్యక్తి కాగా, అర్జున్ నేపాల్లోని గోర్ఖా జిల్లాకు చెందినవారు. కాల్పుల అనంతరం ఉగ్ర కదలికలు ఉన్నట్లు అనుమానించిన చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ‘చైనా సరిహద్దుల్లో సామర్థ్యం బలోపేతం’ చైనాతో సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొంటే.. క్రమంగా సరిహద్దు సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె పేర్కొన్నారు. దేశ ఉత్తర సరిహద్దుల్లో మిలటరీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి: గవర్నర్
లక్డీకాపూల్: దేశానికి సైనికులు చేసే సేవలు వెలకట్టలేనివని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వారి కుటుంబాలకు ఆర్థిక చేయూతనందించేందుకు నిధిని ఏర్పా టుచేయడం అభినందనీయమన్నారు. శని వారం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ.52 లక్షలు విరాళాలను సేకరించిన హైద రాబాద్ ప్రాంతీయ సైనిక్ సంక్షేమ అధికారి శ్రీనేష్కుమార్ నోరి సేవలను గవర్నర్ కొనియాడారు. ఈ సందర్భంగా నోరికి రాష్ట్ర స్థాయిలో రోలింగ్ ట్రోఫీని ప్రదానం చేశారు. సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కల్నల్ రమేశ్ కుమార్ మాట్లాడారు. గవర్నర్ తమిళిసైతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ శనివారం గవర్నర్ తమిళిసైని రాజ్ భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇక అంతకుముందు తనను కలిసిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్డే ఫండ్కు కొంతమొత్తాన్ని ఆయన విరాళంగా అందజేశారు. మోడ్రన్గా తీర్చిదిద్దుతాం... సుల్తాన్బజార్: ఉస్మానియా ఆస్పత్రిని మోడ్రన్గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ అల్యూమినీ అసోసియే షన్ ఆధ్వర్యంలో శనివారం కోఠిలోని ఓఎంసీ ఆడిటోరియంలో గ్లోబల్మీట్– 2019 నిర్వహించారు. దీనికి హాజరైన గవర్నర్.. ప్రొఫెసర్ ధర్మరెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్కిషన్ని సత్కరించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ కార్యదర్శి డాక్టర్ కృష్ణమూర్తి, అధ్యక్షులు ఆర్ఎస్ తపాడియా, ట్రస్ట్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. రేపు యాదాద్రికి గవర్నర్ 10, 11 తేదీల్లో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన ఖరారైంది. అదే రోజు స్వామి దర్శనం అనంతరం వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగే ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రోజున అక్కడే బస చేసి, 10వ తేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం లక్ష్మీ పంప్హౌస్, లక్ష్మీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీలను సందర్శిస్తారు. 11వ తేదీన పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్న గవర్నర్, మహిళా సంఘాలు చేస్తున్న కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం నందిమేడారంలోని ప్యాకేజీ–6 పనులను తమిళిసై పరిశీలించనున్నారు. -
మంచు తుఫాన్లో నలుగురు సైనికుల మృతి
న్యూఢిల్లీ: సియాచిన్లోని ఉత్తర సెక్టార్లో సోమవారం మంచు తుఫాన్లో చిక్కుకుని నలుగురు సైనికులు, ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో 8 మంది సైనికులు సియాచిన్లో సుమారు 19 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మంచు తుఫాన్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. వారిని గుర్తించి, వెలికి తీసేందుకు సహాయక బృందాలను సంఘటనాస్థలికి పంపామన్నారు. మంచు కింది చిక్కుకుపోయిన 8 మందిని వెలికి తీశామని, వారిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే హెలికాప్టర్ల ద్వారా మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు వివరించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ నలుగురు జవాన్లు, ఇద్దరు కూలీలు మరణించారని వెల్లడించారు. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామన్నారు. -
ఉగ్రదాడిలో 35మంది జవాన్ల మృతి
బమాకో (మాలి) : వైశాల్యపరంగా ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా పిలవబడుతున్న మాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. మాలిలోని మేనక ఔట్పోస్టు ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారుగా 35 మంది సైనికులు మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా అనేక మంది సైనికులు మరణించారు. ఇటీవలే ఓ నెల రోజుల క్రితం బుర్కినో ఫాసోలో ఇద్దరు జిహాదీలు చేసిన దాడిలో సుమారు 40 మంది సైనికులు మృతిచెందారు. అయితే శుక్రవారం జరిగిన దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఉత్తర మాలి ప్రాంతంలో ఆల్ ఖైదా ఉగ్రవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే ఫ్రెంచ్ దళాలు చేపట్టిన ఆపరేషన్తో ఉగ్రవాదులు ప్రతిదాడులకు దిగుతున్నారు. 2016లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 2018లో 40మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2015లో మాలి రాజధాని బమాకో నగరం మధ్య ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు 18మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. -
వీరజవాన్లకు సాయం 4రెట్లు
న్యూఢిల్లీ: యుద్ధభూమిలో మరణించే సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. ప్రస్తుతం ఈ మొత్తం రూ.2 లక్షలు మాత్రమే ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచేందుకు మంత్రి అంగీకరించారని శనివారం కొందరు అధికారులు తెలిపారు. యుద్ధాల్లో 60 శాతం కంటే ఎక్కువ వైకల్యం ప్రాప్తించిన వారికీ ఈ మొత్తం చెల్లిస్తారు. పెరిగిన మొత్తాన్ని ఆర్మీ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇస్తారని, సవరించిన పింఛన్ సదుపాయం, ఆర్థిక సాయం, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, ఎక్స్గ్రేషియా మొత్తాలకు ఇది అదనమని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
మత్స్యకారులే సైనికులు..
సాక్షి, అమరావతి: తమిళనాడు సముద్ర తీరం నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారన్న కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి అప్రమత్తత పెరిగింది. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరంలో చొరబాటుకు అవకాశం ఉన్న దాదాపు 380 బ్లాక్ స్పాట్లలో భద్రత చర్యలు ముమ్మరమయ్యాయి. మెరైన్ పోలీస్స్టేషన్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు కోస్తా తీరం వరకు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ (ఏపీసీఎస్పీ), కోస్ట్ గార్డ్స్, నేవీ బృందాలు గస్తీ కట్టుదిట్టం చేశాయి. ఐబీతో పాటు రాష్ట్రానికి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్లు కూడా కోస్తా తీరంలో అపరిచితుల కదలికలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో డేగ కళ్లతో కాపు కాస్తున్నాయి. మత్స్యకారులే సైనికులు.. ఆంధ్రప్రదేశ్లో సువిశాల కోస్తా తీరంలో మత్స్యకారులే పౌర సైనికులని చెప్పక తప్పదు. సముద్ర తీరంలో ఏపీసీఎస్పీ, కోస్ట్గార్డ్స్కు కూడా తెలియని ప్రాంతాలపై మత్స్యకారులకు అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తీరంలో అపరిచితులు ఎవరైనా చొరబడితే తమకు సమాచారం అందించేలా ఏపీసీఎస్పీ, నేవీ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర తీరం వెంబడి దాదాపు 541 గ్రామాల్లో 3.04 లక్షల మంది మత్స్యకారులున్నారు. మొత్తం 70 వేలకు పైగా బోట్లు నిత్యం తిరుగుతుంటాయి. మత్స్యకారులకు తగిన సౌకర్యాలు సమకూర్చి మరింత ప్రాధాన్యత ఇస్తే దేశ అంతర్గత భద్రతకు మేము సైతం అంటూ ముందు నిలుస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముంబై దాడుల తర్వాత తీరం పటిష్టం దశాబ్ధం కిందట ముంబైలో టెర్రరిస్ట్ దాడులు దేశంలోని సముద్ర తీరం భద్రతను సవాలు చేశాయి. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చిన కేంద్ర హోంశాఖ 2017లో సముద్ర తీర రాష్ట్రాలకు 183 మెరైన్ పోలీస్స్టేషన్లను మంజూరు చేసింది. ఏపీలో కళింగపట్నం (శ్రీకాకుళం జిల్లా), రుషికొండ (విశాఖపట్నం), వాకలపూడి (తూర్పుగోదావరి), గిలకలదిండి (కృష్ణా), సూర్యలంక (గుంటూరు), దుగరాజపట్నం (నెల్లూరు) ప్రాంతాల్లో మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉండగా.. మరో 15 కొత్తగా ఏర్పాటయ్యాయి. వాటికి తగిన పోలీస్ సిబ్బంది నియామకంతోపాటు, మరబోట్లు, జెట్టీలు, అధునాతన ఆయుధాలు సమకూర్చాల్సి ఉంది. -
ఫాం కోల్పోయిన మిలటరీ డెయిరీ
హైదరాబాద్: వెయ్యి ఎకరాల విస్తీర్ణం.. వందలాది ఆవుల ‘మంద’హాసం. ఉద్యోగుల ఆలనా‘పాల’నా... 125 ఏళ్లపాటు నిరుపమాన సేవలు... సైనికులకు స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తుల సరఫరా... బలగాలకు అంతులేని బలం.. ఇదీ మిలటరీ డెయిరీ ఫార్మ్ సర్వీసెస్ ఘనమైన గతచరిత్ర. మరిప్పుడో! అది ‘ఫాం’కోల్పోయింది.. చివరికి మూసివేత ‘పాలు’అయింది.. కేవలం 20 ఆవులు మాత్రమే మిగిలాయి. వాటిని కూడా నేడోరేపో తరలించనున్నారు. ఇప్పుడది పశువులులేని కొట్టంలా మారింది. ఒడిసిన ముచ్చట అయింది. వెటర్నరీతో మొదలై... ఈస్టిండియా కంపెనీ తమ సైనిక బలగాలలోని గుర్రాలు, ఒంటెలుసహా ఇతర జంతువుల సంరక్షణ కోసం 1794లో రిమౌంట్, వెటర్నరీ ఫార్మ్స్ సర్వీసెస్ ప్రారంభించింది. సైనికులకు స్వచ్ఛమైన, నాణ్యమైన పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు అందించేందుకు ప్రత్యేకంగా మిలటరీ ఫార్మ్స్ సర్వీసెస్ పేరిట దేశవ్యాప్తంగా 39 మిలటరీ డెయిరీఫామ్లు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అలహాబాద్లో తొలి డెయిరీని నెలకొల్పింది. అదే ఏడాది సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అల్వాల్ (అప్పట్లో కంటోన్మెంట్లో అంతర్భాగం)లో 450 ఎకరాల విస్తీర్ణంలో మిలటరీ డెయిరీ ఫామ్ ఏర్పాటైంది. ఈ ఫామ్కు ఓ దాత మరో 550 ఎకరాలు విరాళంగా ఇవ్వడంతో మొత్తం 1,000 ఎకరాలకు విస్తరించింది. నాటి నుంచి సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్ పరిధిలోని సైనిక శిక్షణ కేంద్రాలు, బెటాలియన్లు, ట్రూపులకు పాలు, పాల ఉత్పత్తులను అందిస్తూ వచ్చింది. అయితే, బహిరంగ మార్కెట్లో సరసమైన ధరలకే నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు లభిస్తున్న నేపథ్యంలో డెయిరీఫామ్లు కొనసాగించాల్సిన అవసరం లేదని మిలటరీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 2017 ‘మిలటరీ ఫామ్స్ సర్వీసెస్’మూసివేత ప్రక్రియను షురూ చేశారు. చివరగా, తాజాగా సికింద్రాబాద్ డెయిరీఫామ్ను మూసివేశారు. ఫామ్లోని 498 జెర్సీ ఆవులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు అక్కడ కేవలం 20 ఆవులు మాత్రమే మిగిలాయి. సిబ్బందిని సైతం కొద్దిరోజుల్లో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. దీంతో డెయిరీ ఫామ్ పూర్తిస్థాయిలో కనుమరుగు కానుంది. బస్తీ ఖాళీకి ఆదేశాలు... డెయిరీఫామ్లో పనిచేసే శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల కోసం 120 క్వార్టర్లను అధికారులు నిర్మించారు. కాలక్రమేణా ఉద్యోగుల వారసులు సైతం అక్కడే స్థిరపడ్డారు. దీంతో ఇక్కడో బస్తీ వెలిసింది. అయితే, ఈ బస్తీలోని ఇళ్లను వచ్చే నెల పదోతేదీ నాటికి ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించినట్లు స్థానికులు చెప్పారు. కాగా, ఫామ్ ఆవరణలోనూ 170 ఎకరాల్లో జట్రోఫా మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికీ ఇక్కడ బయోడీజిల్ ఉత్పత్తి కొనసాగుతోంది. కార్గిల్ వార్లోనూ కీలక పాత్ర ‘వెటర్నరీ, ఫార్మ్స్ సర్వీస్’విభాగం కార్గిల్ యుద్ధంలోనూ సైనికులకు కీలక సేవలు అందించాయి. శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పి ఉండే కార్గిల్ సెక్టార్లో సైనికుల పహారాను కూడా నిలిపివేస్తారు. దీన్ని అదనుగా తీసుకుని పాక్ సైన్యం కార్గిల్ను ఆక్రమించింది. అయితే ఈ విషయం స్థానిక పశువుల కాపరుల ద్వారా తెలుసుకున్న భారత ఆర్మీ పాక్ సైనికులను తిప్పి పంపింది. అయితే, మిలటరీ డెయిరీ ఫామ్ల మూసివేతలో భాగంగా కార్గిల్ మిలటరీ ఫామ్ను సైతం మూసివేశారు. పాడి పరిశ్రమకు మార్గదర్శి పల్లెల్లో కుటుంబ పరిశ్రమగా కొనసాగుతున్న పాలపరిశ్రమను మిలటరీ డెయిరీ ఫామ్స్ వ్యవస్థీకృతం చేశాయి. ఈ డెయిరీ ఫామ్స్ పలు కీలక విజయాలను సొంతం చేసుకున్నాయి. వాటిలో కొన్ని.. - జంతువుల్లో కృత్రిమ గర్భధారణ ప్రక్రియ తొలుత మిలటరీ డెయిరీ ఫామ్లలోనే మొదలైంది - దేశంలో డెయిరీ అభివృద్ధికి మార్గదర్శిగా నిలిచింది - ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తో కలిసి సంకర జాతి పశువుల ఉత్పత్తిలో ప్రపంచంలో పెద్దదైన ‘ప్రాజెక్ట్ ఫ్రీస్వాల్’ను విజయవంతంగా కొనసాగించింది. -
‘హిమాచల్’ మృతులు14
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య సోమవారానికి 14కు చేరింది. గాయపడిన వారి సంఖ్య 28కి చేరింది. మరణించిన వారిలో 13 మంది సైనికులు ఉన్నారు. వారితో పాటు మృతి చెందిన ఓ పౌరుడి మృతదేహాన్ని శిధిలాల నుంచి వెలికితీశారు. గాయపడిన 28 మందిలో 17 మంది ఆర్మీ సైనికులు కాగా మరో 11 మంది సాధారణ పౌరులు ఉన్నారు. వీరంతా నాలుగు అంతస్తుల రెస్టారెంట్లో ఉండగా ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి భవనం కూలిపోయింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు సహాయక చర్యలు కొనసాగాయని జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శివ్ కుమార్ తెలిపారు. భవనాన్ని నిబంధనలకు లోబడి నిర్మించకపోవడం వల్లే కూలిపోయిందని పోలీసులు గుర్తించారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చాక పరిశీలించాక తగు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఆదివారం నుంచే హెలికాప్టర్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు ప్రారంభించారు. జిల్లా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రోహిత్ రాథోర్ను ఈ ఘటన వివరాలు సేకరించేందుకు నియమించామని డిప్యూటీ కమిషనర్ కేసీ చమాన్ అన్నారు. మొదట అది భూకంపం అనుకున్నామని గాయపడిన ఓ సైనికుడు చెప్పారు. -
వైరల్ వీడియో : జవాన్లపై కర్రలతో దాడి
లక్నో : భాగ్పత్లోని ఓ హోటల్ సిబ్బంది ఇద్దరు జవాన్లపై కర్రలతో దాడికి దిగింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జవాన్లను తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. కర్రలతో దాడి చేసిన ఈ ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్చేశారు. వివరాలు.. రెస్టారెంట్లో పని చేస్తున్న వ్యక్తులకు జవాన్లకు మధ్య వాగ్వాదం జరుగుతుండగా.. ఇంతలో ఒక్కసారిగా ఇరు వర్గాలు కొట్టుకోవడం ప్రారంభించాయి. అయితే జవాన్లు ఇద్దరే ఉండడంతో ప్రత్యర్థి గుంపు దాడిని నిలువరించలేకపోయారు. దీంతో అవతలి బృందం కర్రలు, రాడ్లతో జవాన్లు ఇద్దరినీ చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. హోటల్ సిబ్బందికి చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఇద్దరు జవాన్లపై హోటల్ సిబ్బంది కర్రలతో దాడి -
జార్ఖండ్లో ఐఈడీలు పేల్చిన మావోలు
రాంచీ: జార్ఖండ్లో మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడ్డారు. జవాన్ల వాహనాలు లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున వరుసగా ఐఈడీలు పేల్చడంతో 15 మంది గాయపడ్డారు. సెరైకెలా–ఖర్సవాన్ జిల్లాలోని హుర్దా అటవీ ప్రాంత సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. పోలీసు అధికారుల కథనం ప్రకారం.. సీఆర్పీఎఫ్ జవాన్లు, కోబ్రా, జార్ఖండ్ పోలీసులు కుచాయ్ ప్రాంతంలో కూంబింగ్ నిమిత్తం వాహనాల్లో బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వీరిని గమనించిన మావోయిస్టులు వరుసగా 15కు పైగానే ఐఈడీ (ఆధునిక పేలుడు పదార్థాలు) పేలుళ్లకు పాల్పడ్డారు. కాగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో రాంచీకి తరలించారు. మావో నేత మహరాజ్ ప్రమాణిక్ నాయకత్వంలో ఈ పేలుళ్లు జరిగాయని జిల్లా ఎస్పీ తెలిపారు. -
తాలిబన్ల చెరలో 58 మంది సైనికులు
హీరత్: అఫ్గానిస్తాన్ అంతర్యుద్ధంలో భద్రతా బలగాలపై తాలిబన్లదే పైచేయిగా మారుతోంది. అఫ్గాన్–తుర్కిమెనిస్థాన్ సరిహద్దుల్లో జరుగుతున్న పోరులో తాలిబన్లు సుమారు 58 మంది సైనికులను బందీలుగా పట్టుకున్నారు. పదుల సంఖ్యలో సైనికులు భయంతో తుర్కిమెనిస్తాన్ భూభాగంలోకి పారిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బద్ఘిస్ ప్రావిన్స్లోని బలమార్ఘాబ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుందని రక్షణ శాఖ తెలిపింది. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంది. సరిహద్దు ఆవలికి వెళ్లిన సైనికులు తిరిగి వచ్చి విధుల్లో చేరారని తెలిపింది. అయితే, 72 మంది సైనికులు తమకు చిక్కినట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. అంతర్యుద్ధాన్ని ముగించేందుకుగాను అమెరికా ఒక వైపు తాలిబన్లతో చర్చలు కొనసాగిస్తుండగానే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. -
సైనికుల ఫొటోలు వాడొద్దు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలో సైనికుల ఫొటోలను ప్రదర్శించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్, బీజేపీ నాయకులతో కూడిన హోర్డింగ్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ హోర్డింగ్ ఎక్కడ ఏర్పాటుచేశారో తెలియరాలేదు. ప్రచార చిత్రాలు, హోర్డింగ్లలో సైనిక సిబ్బంది ఫొటోలు లేకుండా చూడాలని 2013లోనూ ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. సైనికుల ఫొటోలను రాజకీయ నాయకులు, పోటీచేస్తున్న అభ్యర్థులు వాడుకుంటున్నారని, ఈ పోకడను నియంత్రించేందుకు తగిన ఆదేశాలు జారీచేయాలని అప్పట్లో రక్షణ మంత్రిత్వ శాఖ ఈసీని కోరింది. -
ప్రతీకారంతో స్వీయ విధ్వంసం తథ్యం
పుల్వామాలో సైనికులపై దాడి తర్వాత మన టీవీ స్టూడియోలు వార్ రూమ్లుగా మారిపోయి ఎక్కడ దాడి చేయాలో, ఏ ఆయుధాలు వాడాలో కూడా అవే సూచిస్తున్న సమయంలో, దేశమంతటా పాక్పై ప్రతీకారం తప్పదంటూ ఆగ్రహం రేగుతున్న సమయంలో అందరూ గుర్తుంచుకోవలసిన పాఠం ఒక్కటే. ప్రతీకారంతో రగిలిపోయే జాతి విజయాన్ని సాధించడం కంటే స్వీయ విధ్వంసాన్నే చవిచూడవచ్చు. శతాబ్దాలుగా ప్రతీకార భావనలో మునిగిన ఆప్ఘానిస్తాన్ ఇప్పుడు మధ్యయుగాల స్థాయికి దిగజారిపోయింది. ప్రతీకారం మతిహీనులు ప్రకటించే భావోద్వేగం మాత్రమే. అదే సమయంలో స్వీయ నిరోధకత విజ్ఞుల మనస్సుల్లోంచి పుట్టుకొచ్చే సజీవ భావన. పాకిస్తాన్ వెన్నుదన్నుతో పుల్వామాలో ఉగ్ర దాడి జరిగిన వెంటనే ప్రతీకారం తీర్చుకోవలసిందేనంటూ యావద్దేశం ఊగిపోయింది. కొద్దిరోజులపాటు దీనిపై టీవీల్లో, ఇతర మీడియాలో బహిరంగ చర్చ కొనసాగింది. దీంతో అనివార్యంగానే ప్రతికారానికి సంబంధించిన కొత్త పదబంధం పుట్టుకొచ్చింది. ప్రతీకారమే ఉత్తమ మార్గం. ఈ పదబంధాన్ని కనిపెట్టిన ఘనత మాత్రం ఆప్ఘాన్లకే దక్కుతుంది. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోవడం అనేది వారి జీవన శైలికి అత్యవసర లక్షణంగా మారింది. పైగా ఆ ప్రతీకారం తరాలపాటు కొనసాగేది. దాంట్లో వారెం తగా రాటుదేలిపోయారో తెలుసుకోవడం కోసం సోవియట్లను, అమెరికన్లను, లేదా పాకిస్తానీయులను అడిగితే చాలు. ఆప్ఘాన్లతో పెట్టుకో కండి. మీరు అంతకంతా అనుభవిస్తారు. ఈ ప్రతీకార చరిత్రను పక్కనబెట్టి ప్రస్తుతం ఆప్ఘానిస్తాన్ పరిస్థితిని చూడండి. వారు సాధించిన గత విజయాలు, భారత్లోని సంపన్నులను కొల్లగొట్టడం, రెండు అగ్రరాజ్యాలను చిత్తుగా ఓడించడం తర్వాత ఆప్ఘనిస్తాన్ చెల్లాచెదురైపోవడమే కాదు, నిరుపేద దేశంగా, దాదాపు మధ్యయుగ పరిస్థితుల్లోకి, పాలించడానికి వీల్లేని విధ్వంసంలోకి దిగజారిపోయింది. బహుశా మానవ చరిత్రలోనే ఇంత శాశ్వత నష్టాల్లో కూరుకుపోయిన మరో దేశాన్ని మనం చూడలేం. దీని వెనుక గుణపాఠం ఏమిటి? ప్రతీకారం అనే వంటకాన్ని వేడిగా లేక చల్లగా వడ్డించినా సరే అది ఆరగించడానికి చాలా అద్భుతమైన వంటకంగానే కనపడవచ్చు. కానీ మీ రక్తపిపాసను సంతృప్తిపరచుకోవడం తప్పితే అది మీకు ఒరగబెట్టేది ఏమీ ఉండదు. ప్రతీకారంతో రగిలిపోయే జాతి విజయాన్ని సాధించడం కంటే స్వీయ విధ్వంసాన్నే చవిచూడవచ్చు. ఇక పాకిస్తాన్ విషయానికి వద్దాం. 1971లో భారత్ చేతుల్లో ఘోర పరాజయం పొందాక ప్రతీకారం తీర్చుకోవాలని దశాబ్దాల ఘర్షణను అది కొనసాగించింది. ఈ క్రమంలో పాక్ ఆర్థికవ్యవస్థ, సమాజం, రాజ్యపాలన పూర్తిగా ధ్వంసమైపోయింది. మరోవైపున యుద్ధంలో గెలిచిన విజేత భారత్ ప్రతీకారం కంటే ‘నిరోధకత’కు ప్రాధాన్యమిచ్చింది. ప్రతీకారం మందబుద్ధులు, మతిహీనులు ప్రకటించే కేవల భావోద్వేగం మాత్రమే. అదే సమయంలో స్వీయ నిరోధకత అనేది విజ్ఞత కలిగిన వారి మనస్సుల్లోంచి నిత్యం పుట్టుకొచ్చే సజీవ భావన. ఉదాహరణకు ఉడీలో ఫిదాయీలు దాడి తర్వాత భారత్ జరిపిన సర్జికల్ దాడులను చూడండి. వాళ్లు 19మంది మన సైనికులను చంపారు. మనం అంతకంటే ఎక్కువమంది ఉగ్రవాదులను చంపేశాం. రక్తానికి రక్తం సమాధానం అన్నమాట. కానీ వాళ్లు పుల్వామాలో మళ్లీ మన గొంతుకోశారు. దీనికి మళ్లీ మనవైపునుంచి ప్రతీకారం ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో టీవీ స్టూడియోలు వార్ రూమ్లుగా మారిపోయాయి. ఎక్కడ దాడి చేయాలో, ఏ ఆయుధాలు వాడాలో కూడా అవే సూచిస్తున్నాయి. ఇక మన ప్రధాని నరేంద్రమోదీ ‘మీ ప్రతి కన్నీటిబొట్టు’కు బదులు తీరుస్తాం అంటూ వాగ్దానం చేస్తున్నారు. ఇక మన వ్యాఖ్యాతలు ఈసారి తప్పకుండా ఏదో ఒకటి చేసేయాల్సిందే అని మోత మోగిస్తున్నారు. ఎంత సీరియస్ ఘటనలకూ స్పందించని వారు కూడా ప్రతీకారమే ఉత్తమం అంటున్నారు. ఇది సరిగ్గా ఆప్ఘాన్లు చాలాకాలంగా చెబుతున్నట్లే ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న. ప్రతీకారం తర్వాత ఏం జరుగుతుంది? అది మీకు శాంతిని, భద్రతను సంపాదించిపెడుతుందా? అది మీకు ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెట్టవచ్చు. కానీ అది మీ శత్రువును నిరోధించగలుగుతుందా? చరిత్రలోకి వెళితే.. కౌటిల్యుడి ధోవతి ఒక ముళ్లపొదలో చిక్కుకుని చిరిగిపోయినప్పుడు ఆ ముళ్లపొదను తెగనరకడానికి అతడు ప్రయత్నించలేదు. కాస్త సమయం తీసుకుని తీపి పాలను ఆ ముళ్లపొద కుదురులో పోశాడు. చంద్రగుప్తుడు ఎందుకలా చేశావని అడిగితే ‘నేను దాన్ని నరికినట్లయితే అది మళ్లీ వేర్లనుంచి పెరుగుతుంది. అదే చక్కెర కలిపిన పాలను దాని కుదుళ్లలో పోస్తే, ఆ తీపి పాలు లక్షలాది చీమలను ఆకర్షించి అవి ముళ్లపొద వేర్లతో సహా తినివేస్తాయి’ అన్నాడు కౌటిల్యుడు. ఇక్కడ ముళ్లపొదను తెగనరిగే కొడవలి ప్రతీకారం అయితే, తీపిపాలు అనేది నిర్మూలన అవుతుంది. ఈ భావన ఏమాత్రం ఆకర్షణీయమైనది కాదు పరమ పాశవికమైనది. కానీ కౌటిల్యం అంటే అదే మరి. అలాగే 1962లో చైనా చేసిన దురాక్రమణ భారత్ను శిక్షించడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి, భూభాగాన్ని లాక్కోవడానికి కాదు. అది నిరోధకతను సృష్టించడమే. అది భారత్ ముందుకు పురోగమించే పాలసీకి భరతవాక్యం పలికింది. టిబెటన్లతో సరసమాడటం అనే మన వ్యూహానికి ఆ దాడి చెక్ పెట్టింది. అంతేకాకుండా సరిహద్దుల రక్షణకోసం 1962 నాటి యుద్ధపద్ధతుల్లోనే పోరాడాలనుకుంటున్న భారతీయ వ్యూహకర్తలను తరాలపాటు రక్షణాత్మక తత్వంలోకి నెట్టేసింది. తర్వాత చైనీయులు పాకిస్తాన్ను తమ విలువైన క్లయింటుగా మార్చిపడేశారు. అయిదు దశాబ్దాల నుంచి భారత్ను నిలువరించేందుకు అతి చిన్న దేశ మైన పాక్ని చైనీయులు అత్యంత తెలివిగా వాడుకుంటూ వస్తున్నారు. 1971లో ఇందిరాగాంధీ తనదైన అర్థశాస్త్రాన్ని అమల్లో పెట్టారు. ఆ సంవత్సరం మార్చి నెలలో పశ్చిమ పాకిస్తాన్ పాలకులు తమ ఆధీనంలోని తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)పై సైనిక చర్యలకు పాల్పడినప్పుడు ఆమె ప్రజాగ్రహం పట్ల స్పందించకుండా, 9 నెలలపాటు తగిన సైనిక, దౌత్యపరమైన సన్నాహక చర్యలను చేపడుతూ వచ్చారు. ఈ విరామ సమయంలో ఆమె సైన్యాన్ని సిద్ధపర్చారు. అమెరికాను, చైనాను అడ్డుకోవడానికి సోవియట్లతో సంధి కుదుర్చుకున్నారు. పాకిస్తాన్ అతి చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచమంతటా తిరిగి ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించారు. పాక్ను ఆమె ఎంతగా ఊపిరాడకుండా చేశారంటే డిసెంబర్లో పాక్ సైనిక జనరల్ యాహ్యాఖాన్ను యుద్ధం ప్రకటించని స్థితిలోకి నెట్టారు. అనంతరం పాక్ ఈ 50 ఏళ్ల కాలంలో తన కలలో కూడా ఎన్నడూ కశ్మీర్ ఆక్రమణకోసం తన సైన్యాన్ని ఉపయోగించే ఆలోచనలకు పోలేదు. 1980ల చివరి నుంచి అది ఉగ్రవాదానికి, మంద్రస్థాయి ఘర్షణలకు మళ్లింది. చివరగా పాకిస్తాన్పై మీరు ప్రతీకారం తీసుకోండి. అది వారినేం చేయలేదు. వారిపై సైనిక దాడులను చేయండి. వారు ఎదురుదాడి చేస్తారు. ఈ క్రమంలో మనం మరింత ఆగ్రహానికి గురవుతుంటాం. ప్రతీకారం తప్పదంటుంటాం, నిస్పృహకు గురవుతుంటాం కూడా. అటు తన వద్ద ఉన్న అణ్వాయుధాలు, ఇటు సాంప్రదాయిక సైనికబలంలో తన సరిపోలని అసౌష్టవం రెండూ కలిసి భారతీయ నిర్ణయాత్మక దాడిని నిరోధిస్తాయన్న నమ్మకంతో పాకిస్తాన్ ఒక దేశంగా కొనసాగుతూనే ఉంటుంది. మనం ఈ కలుగులోంచి బయటకు వెళ్లేముందు, ఇక్కడ మనకు ఏం లభించిందో అర్థం చేసుకోవాలి. నేను నిర్ధారణకు వచ్చిన అంశాలు ఇవి. 1. విజేత కంటే ఓటమి పాలైనవారే ఎక్కువ గుణపాఠం నేర్చుకుంటారనేది పాత సామెత. పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రమాదాలకు 1971 పూర్తిగా అడ్డుకట్ట వేస్తుందని భారత పాలకులు తప్పుగా భావించారు. అందుకు భిన్నంగా జుల్ఫికర్ అలీ భుట్టో సంప్రదాయ సైనిక దాడులకు స్వస్తి పలికారు. కానీ, భారత్ను కాదంటూ అణుశక్తిగా పాక్ ఎదిగింది. 1980 నాటికి పాకిస్తాన్ తన అణుశక్తితో తగిన బలం సంపాదించుకుంది. అప్పటి నుంచి తొలుత పంజాబ్లో, తర్వాత కశ్మీర్లో అల్లర్లు సృష్టిం చడం ప్రారంభించింది. భారత్ నిశ్చింతంగా ఉంది. 2. 1998లో జరిగిన పరీక్షలతో రెండు దేశాలు అణుశక్తితో సమాన స్థాయిని పొందాయి. దీంతో పాకిస్తాన్ మళ్లీ కొత్త ఎత్తుగడలకు పోగా, భారత్ అణుశక్తికి కట్టుబడింది. దీంతో సంప్రదాయ యుద్ధం వచ్చే అవకాశం పోయింది. భారత విధాన నిర్ణయిక బృందం ‘న్యూక్లియర్ లేజీ’గా మారిందని చెప్పడం కాస్త సాహసమే అవుతుంది. పెను విధ్వంసాలను సృష్టించే మారణయుధాలు ఓటమిపాలైనవారి చివరి అస్త్రాలని ఆ బృందం మరిచిపోయింది. ఈ విషయంలో పాక్ తెలివిగా వ్యవహరించింది. 3. ఫలితంగా తన ఆర్థిక స్థాయికి తగినట్టుగా సంప్రదాయ సైనిక బలం పెంచుకోవడంలో భారత్కు ఆసక్తి లేకపోయింది. సంప్రదాయ సైనిక బలం పెంపుతో దండించగలిగే స్థాయి ద్విగుణీకృతమవుతుందని, తద్వారా మెరుపుదాడుల నుంచి పాక్ను నియంత్రించవచ్చనీ, అణుశక్తి స్వీయ వినాశనానికేననే భావనవైపు పాక్ను నెట్టవచ్చని భారత్ మరి చిపోయింది. లేకపోతే, ఇక్కడ బస్సులను పేల్చివేసేప్పుడు పాక్ పునరాలోచనలో పడి ఉండేది. ఈ న్యూక్లియర్ లేజీనెస్ కారణంగా జీడీపీలో భారత రక్షణ బడ్జెట్ల శాతం తగ్గుతూ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు యుద్ధమే గనుక వస్తే.. మూడు దశాబ్దాల క్రితం రాజీవ్గాంధీ కొనుగోలు చేసిన వాటినే మొదటి వరుసలో నిలపాల్సి వస్తుంది. అణుశక్తివల్ల యుద్ధాలు వచ్చే అవకాశం లేనప్పుడు ఎందుకు అధికంగా ఖర్చు చేయాలి? దేశభద్రత కోసం ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే మోదీ ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో బ్రెయిన్ వాష్ అవసరం. అది ఏడవ వేతన సంఘం సిఫారసులు అమలు చేసింది. కానీ, జీడీపీలో రక్షణ బడ్జెట్ శాతాన్ని తగ్గించివేసింది. అంతో, ఇంతో ప్రతీ కారం తీర్చుకోవడం ద్వారా మనల్ని మనం బాగానే సమర్థించుకోవచ్చు. కానీ, పాకిస్తాన్కు అడ్డుకట్టవేయలేం. మనం ముందుకెలా వెళ్లాలి? పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనే అంశాన్ని పక్కనబెట్టి, భారీగా సైన్యాన్ని పెంపొందించుకోవాలి. సైనిక బలంతో ప్రత్యర్థిలో వణుకు పుట్టించాలి. పాతకాలం నాటి సంప్రదాయక సైనిక శక్తిగా అవతరించి వారిని నిరోధించాలి. ఇది కౌటిల్యుడు చెప్పిన తియ్యని పాలు వంటి ఉపదేశంలా అనిపించవచ్చు. తలనొప్పిగా కూడా భావించొచ్చు. కాస్త సమ యం, సహనం ఉంటే ఇది పని చేస్తుంది. అప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రగుప్తుడిని గెలిపించాల్సిన తప్పనిసరి బాధ్యత కౌటిల్యుడిపై పడదు. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మనమే సైన్యం
బాలీవుడ్ రక్తంలో త్రివర్ణాలు ఉన్నాయి.దేశభక్తి తిలకం దిద్దుకుంది హిందీ సినిమా.‘జైహింద్’ అని జయధ్వానం చేస్తూ థియేటర్లలో జోష్ నింపేది హిందీ సినియాయే. యుద్ధాలు బార్డర్ల మీదే కాదు... మన గుండె అంచుల్లో కూడా ఉంటాయని చాటి చెప్పిన వీర సైనికుడు, దేశం మొత్తానికి పెద్ద కొడుకు, దేశభక్తికి తార్కాణం హిందీ సినిమా. పుల్వామా ఘాతుకం తర్వాత గట్టిగా అరవాలనిపించింది. గుండెల్లోని బాధ ప్రతీకారాన్ని కోరుతోంది. మనసులోని కోపాన్ని చూపించాలని ఉంది. అందుకే బాలీవుడ్ చూపించిన దేశభక్తిని మీకు చూపిస్తున్నాం. ‘పుల్వామా’ రహదారి మన సైనికుల రక్తంతో ఎర్రబడింది. 40 మంది సైనికులు ఆ దారిన విధులకు వెళుతూ ద్రోహుల కిరాతకానికి అసువులు బాసారు. దేశం కళ్లల్లో అశ్రువులు నింపారు. వారి త్యాగం ఏ బదులుతో సమం చేయగలం? దేశం వారికి జోహార్లు అర్పిస్తోంది. జేజేలు పలుకుతోంది. గుండెల మీద క్యాండిళ్లు వెలిగించి బరువెక్కిన హృదయంతో మౌనం పాటిస్తోంది. ప్రజలతో పాటు బాలీవుడ్ కూడా సందర్భం వచ్చిన ప్రతిసారీ సైనికుడి పట్ల తన గౌరవాన్ని చాటింది. అతడి గొప్పతనాన్ని సినిమాలుగా తీస్తూ వచ్చింది. 1962 చైనా యుద్ధం గురించి ‘హకీకత్’ సినిమా 1971 పాకిస్తాన్ యుద్ధం గురించి ‘బోర్డర్’ సినిమా తీసింది. 1999లో కార్గిల్ యుద్ధం గురించి ‘లక్ష్య’ సినిమా ఎక్కుపెట్టింది. 2016లో పాకిస్తాన్పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించి తాజాగా ‘ఉరి’ సినిమాతో శత్రువునే కాదు సక్సెస్ను కూడా హిట్ చేసింది. అయితే సైనికుడు ఉన్నవి మాత్రమే దేశభక్తి సినిమాలు అనుకోనక్కర్లేదు. దేశ భద్రత కోసం, సమగ్రత కోసం, స్ఫూర్తి కోసం ప్రాణాంతకమైన ఆపరేషన్స్ నిర్వహించిన సినిమాలు కూడా దేశభక్తి సినిమాలు అని భావించాలి. సైనికుడితో తోడు నిలిచి ‘జైహింద్’ అని నినదించిన సినిమాలు ఇవి. సర్ఫరోష్ (1999) దేశంలోకి ఆయుధాలు వస్తుంటాయి. ఎవరో ఆగంతకులో ఉగ్రవాదులో వాటిని ఉపయోగించి తీవ్రమైన ప్రాణనష్టం, ఆస్తినష్టం చేస్తుంటారు. అసలు ఈ ఆయుధాలు ఎక్కణ్ణుంచి వస్తాయి... ఆ దారి ఏమిటి అనే అంశాన్ని తీసుకుని తీసిన సినిమా ‘సర్ఫరోష్’. దేశ సరిహద్దుల నుంచి రాజస్తాన్ ద్వారా లోపల ఉన్న కొందరు దేశద్రోహుల సహాయంతో ఆయుధాలు ఇక్కడకు వస్తున్నాయని ఒక పోలీస్ ఆఫీసర్ కనిపెట్టి ఆ రాకెట్నంతా ధ్వంసం చేయడమే ఈ సినిమా. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయం నమోదు చేసింది. ఇందులో పాకిస్తానీ సింగర్గా నటించిన నసీరుద్దీన్ షా దేశ విభజన సమయంలో నష్టపోయిన తన కుటుంబం గురించి ప్రతీకారంగా భారత్పై ద్వేషం పెంచుకుని ఉగ్రవాదానికి సాయం చేస్తుంటాడు. ఈ సినిమా సోనాలి బింద్రేకు కూడా చాలా పేరు తెచ్చింది. ‘జిందగీ మౌత్ నా బన్జాయే’... అనే పాట సోను నిగమ్ గొంతు ద్వారా పెద్ద హిట్ అయ్యి ఇప్పటికీ ఆగస్టు 15న వినిపిస్తూనే ఉంటుంది. రంగ్ దే బసంతి (2006) సరిహద్దులో సైనికుడు ఉంటాడు సరే, సైనికుడికి మద్దతుగా ఉండాల్సిన పాలనా యంత్రాంగం ఎలా ఉంది? వారి కోసం ఆయుధాలు కొనుగోలు చేయాల్సిన మంత్రులు, అధికారులు నిజాయితీగా ఉన్నారా? నాసిరకం మిగ్ విమానాలు కొనుగోలు చేయడం వల్ల చాలా మంది పైలట్లు ప్రాణాలు విడిచారన్న వాస్తవం మన చరిత్రలో ఉంది. సైనికుడి ప్రాణాలంటే మీకు అంత అలుసా? అని కోపగించుకున్న ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులు ఎలాంటి ఆగ్రహాన్ని ప్రకటించారన్నది ఈ సినిమా. ‘రంగ్ దే బసంతి’ సినిమా చాలా శక్తిమంతంగా లోపలి శత్రువును చూపించింది. సైనికులను అడ్డం పెట్టుకొని బాగుపడుతున్న పెద్ద మనుషులను తెర మీదకు తెచ్చింది. ఆమిర్ఖాన్, సిద్ధార్థ, మాధవన్, సోహా అలీ ఖాన్ తదితరులు నటించిన ఈ సినిమా ఎ.ఆర్. రహెమాన్ సంగీతం వల్ల కూడా హిట్ అయ్యింది. ప్రజలలో కూడా చాలా చైతన్యం తీసుకు వచ్చిన సినిమాగా దీనిని చెప్పుకోవచ్చు. బ్లాక్ ఫ్రైడే (2007) మత కలహాలు అంతర్గత రుగ్మత కావచ్చు. దేశ ప్రజలతో లోపలి శక్తులే ఆడే ఆట కావచ్చు. కాని ఆ వ్యవహారంలో మాఫియా ఎంటర్ అయితే? బయటి నుంచి శక్తులు లోపల మారణకాండ సృష్టిస్తే? 1993లో ముంబైని దద్దరిల్ల చేసి వందలాది మంది మృత్యువుకు కారణమైన సీరియల్ బ్లాసింగ్స్ వెనుక ఉన్న అసలు కారణాలను సవివరంగా చూపించిన సినిమా ‘బ్లాక్ ఫ్రైడే’. పాకిస్తాన్లో ఉన్న దావుద్ ఇబ్రహీం, ముంబైలోని టైగర్ మెమెన్ ఏ కారణం చేత ఈ బ్లాస్ట్కు ప్లాన్ చేశారో అందులో హిందు ముస్లిం తేడా లేకుండా ఎంత మంది అమాయకులు బలయ్యారో ఈ సినిమా పొల్లుపోకుండా చూపిస్తుంది. ఈ దేశానికి ప్రధాన శతృవు పొరుగు దేశం కాదని దేశంలోని అవిద్య, మూర్ఖత్వం కొందరు స్వార్థపరులకు ఎలా ఉపయోగపడుతుందో ఇందులో చూడవచ్చు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమా తీశాడు. గాఢమైన సినిమాలు చూడాలనుకునేవారు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఏ వెన్స్ డే (2008) ఉగ్రవాద చర్యలు అంటే ఏమిటి? సామాన్యులను బలిగొనడమే. నేతలు, పాలకులు ఎప్పుడూ గట్టి రక్షణలో ఉంటారు. ఉగ్రవాద చర్యలకు సులభంగా దొరికిపోయే జీవులు సామాన్యులు. కాని సామాన్యుడు దీనిని సరి చేయలేడా? సామాన్యుడు చోద్యం చూస్తూ ఉండాల్సిందేనా? ఏం కాదు. దేశం కోసం సామాన్యుడు తెగిస్తే ఉగ్రవాదం వంటి విష వలయాలు ఎలా తునాతునకలు అవుతాయో ‘ఏ వెన్స్డే’ సినిమాలో దర్శకుడు నీరజ్ పాండే చూపించాడు. ఇందులో సామాన్యుడైన నసీరుద్దీన్ షా ప్రభుత్వం విచారణలో ఉంచిన ముగ్గురు ఉగ్రవాదులను, వారు తప్పించుకుపోనున్నారని గ్రహించి, చాలా ప్లాన్డ్గా మట్టుపెడతాడు. అతడిని అరెస్టు చేయదగ్గ అవకాశం ఉన్నప్పటికీ పోలీస్ ఆఫీసర్ అనుపమ్ ఖేర్ విడిచిపెడతాడు. దేశం సురక్షితంగా ఉండాలంటే పోలీసు వ్యవస్థ మాత్రమే కాదు ప్రజలు కూడా స్పందించాల్సి ఉంటుంది అని క్రియేటివ్ మీడియమ్ ద్వారా చెప్పిన సినిమా ఇది. డి డే (2013) దేశం కోసం ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏమేం ఆపరేషన్స్ చేస్తుందో సామాన్యులకు తెలిసే అవకాశం లేదు. పాకిస్తాన్లో ఉన్న దావుద్ ఇబ్రహీమ్ను ప్రాణాలతో పట్టుకుని రావాలంటే రా ఏజెంట్స్ ఎన్ని కష్టాలు, ప్రయత్నాలు, సాహసాలు చేయవలసి వస్తుందో ఊహాత్మకంగా అయినా సరే చాలా రియలిస్టిక్గా చూపిన సినిమా డి డే. ఇందులో డి అంటే దావుద్. ఆ పాత్రను ప్రసిద్ధ నటుడు రిషి కపూర్ పోషించాడు. ఆశ్చర్యం ఏమంటే పాకిస్తాన్ వెళ్లి దావుద్ను అరెస్ట్ చేసినా అతను ధైర్యంగా ఉంటాడు. సిస్టమ్లోని లొసుగులను వాడుకుని బయటపడతానని అంటుంటాడు. అందుకే అధికారులు అతణ్ణి మట్టుపెడతారు. ఎందరో గొప్ప అధికారులు మనం సాయం సంధ్యవేళ ఆరామ్గా టీ తాగుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి పని చేస్తుంటారని ఈ సినిమా చూపుతుంది. బేబీ (2015) 2008లో జరిగిన ముంబై దాడులు దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. సముద్రం ద్వారా పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబైలోని తాజ్ హోటల్తో సహా అనేక చోట్ల విచక్షణా రహితంగా మారణకాండ సృష్టించారు. దీని సూత్రధారులను వెతికి పట్టుకోవడానికి దేశ అంతర్గత వ్యవహారాల శాఖ రహస్యంగా ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ టాస్క్ వింగ్ పేరే ‘బేబీ’. ఈ వింగ్ ప్రధానాధికారిగా డానీ, ఏజెంట్లుగా అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, రానా దగ్గుబాటి తదితరులు నటించారు. దుబాయ్లో ఉన్న పాక్ సూత్రధారిని ప్రభుత్వాల ప్రమేయం లేకుండా, అత్యంత రహస్యంగా పట్టుకుని రావడం ఈ మిషన్ లక్ష్యం. రోమాంచితంగా సాగే ఈ సినిమా భార్యాపిల్లలను వదిలిపెట్టి దేశం కోసం పని చేసే అధికారుల గొప్పతనాన్ని చూపిస్తుంది. వారు అనుభవించే టెన్షన్, ప్రాణాంతక క్షణాలకు ఖరీదు కట్టలేమనిపిస్తుంది. రెయిడ్ (2018) సైనికుల ప్రాణాలు తీయడం, విధ్వంసాలు సృష్టించడం ఎంత పెద్ద దేశద్రోహమో ట్యాక్స్ ఎగ్గొట్టి నల్లధనాన్ని దాచుకోవడం కూడా అంతే పెద్ద ద్రోహం. ఆ సంపద రక్షణ కోసం రాజకీయాల్లో దిగి పదవులు పొందడం, అధికారులను తమ దరిదాపులకు కూడా రాకుండా చూసుకోవడం నేటికీ దేశవ్యాప్తంగా సాగుతున్నదే. ఇప్పుడన్నా మీడియా రక్షణ ఉంది. 1980లలో ఏం చేసినా అడిగే నాథుడు లేడు. అలాంటి రోజులలో కాన్పూర్లోని ఒక రాజకీయ నాయకుడి ఇంటిపై దాడి చేసి ఆ రోజులలోనే 100 కోట్ల రూపాయల విలువైన డబ్బు, బంగారం, వెండిని సీజ్ చేసిన అధికారి కథను ‘రెయిడ్’లో చూడొచ్చు. అజయ్ దేవ్గణ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా నటించాడు. ప్రాణాలకు, ఉద్యోగానికి ప్రమాదం అని తెలిసినా దాడి నిర్వహించిన ఆ అధికారి కూడా నిజమైన దేశభక్తుడే కదా. రాజీ (2018) పురుషులే కాదు ఎందరో స్త్రీలు కూడా దేశం కోసం త్యాగాలు చేశారు. 1971 నాటి పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆ దేశ రహస్యాలు కనుగొనేందుకు అక్కడ అధికారి భార్యగా వెళ్లిన ఒక భారతీయ ముస్లిం యువతి ఎటువంటి సవాళ్లను ఎదుర్కొందో చూపిన కథ ‘రాజీ’. భార్యగా ఒకవైపు, భారతీయురాలిగా ఒకవైపు, పాకిస్తాన్ కోడలిగా ఒకవైపు నలిగిపోతూ దేశం కోసం తన ధర్మాన్ని నిర్వర్తించిన యువతిగా ఆలియా భట్ నటించి హర్షధ్వానాలు అందుకుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా వచ్చిన ఒక నవలను ఈ సినిమా కోసం ఉపయోగించుకున్నారు. కరణ్ జొహర్ 35 కోట్లతో నిర్మిస్తే ప్రజలు 195 కోట్లు ఇచ్చారు. -
పాలం ఎయిర్బేస్లో అమర జవాన్లకు నివాళి
-
పాలం ఎయిర్బేస్లో అమర జవాన్లకు నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు అఖిలపక్షం ఘనంగా నివాళులు అర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు అమరులకు ఘనంగా అంజలి ఘటించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల పార్థివదేహాలు శుక్రవారం సాయంత్రం శ్రీనగర్ నుంచి ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరాయి. విమానాశ్రయం ఎయిర్ బేస్లో అమరులకు నివాళులు అర్పించారు. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిని యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండించింది. ఈ దుశ్చర్యను ఖండిస్తూ... కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఇక అమర జవాన్ల అంత్యక్రియాల్లో పాల్గొనాలని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీ నేతలకు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆర్మీ నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ తదితరులు బుద్గాంలో నివాళులు అర్పించారు. ఉగ్రదాడిలో నేలకొరిగిన అమర జవాన్ల భౌతిక కాయాలను అమర్చిన పేటికలను రాజ్నాథ్ సింగ్, జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్లు తమ భుజాలకెత్తుకున్నారు. అనంతరం ఉగ్ర దాడిలో గాయపడి శ్రీనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించిన రాజ్నాథ్ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పుల్వామాలో శుక్రవారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 44 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
అమర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
-
ఆజాద్ నారీ ఫౌజ్
స్త్రీలు యుద్ధంలోకి ఎందుకు? స్త్రీల చేతికి తుపాకులెందుకు? ఏమిటీ ప్రశ్న! స్త్రీల సామర్థ్యంపై సందేహమా? స్త్రీల భద్రతపై సంశయమా? ఇంత భారీ డిఫెన్స్ ఫోర్స్ని పెట్టుకుని కూడా ‘ఫ్రంట్లైన్ వార్’లోకి స్త్రీలను వెళ్లనివ్వడం లేదు మన రక్షణ దళాధిపతులు! మరి.. ఏ బలాలు, దళాలు లేని కాలంలో.. స్వాతంత్య్ర సంగ్రామానికి మహిళల్ని ఏ ధైర్యంతో ఆహ్వానించారు సుభాస్చంద్రబోస్?! ధైర్యంతో కాదు. నమ్మకంతో.. మహిళా శక్తిపై నమ్మకంతో! నేడు చంద్రబోస్ జయంతి. ఈ సందర్భంగా.. డెబ్బై ఆరేళ్ల క్రితమే ఆయన స్థాపించిన ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’ ఆవిర్భావ సందర్భంపై సంక్షిప్త మననం. 1943 జూలై 9, సింగపూర్.. బోస్ మాట్లాడుతున్నాడు.. సుభాస్ చంద్రబోస్! ఎదురుగా భారతీయులు.. అరవై వేల మంది! ఇల్లొదిలి, దేశం వదలి తనెందుకు వచ్చిందీ చెప్పాడు. అయితే అది కాదు అతడు చెప్పబోతున్నదని అక్కడి వారికి అర్థమైపోయింది. ఇంకేదో చెప్పబోతున్నాడు. ఏంటది?‘‘ఆడవాళ్లు కూడా తుపాకులు అందుకోవాలి’’ అన్నాడు బోస్. ఒక్కసారిగా నిశ్శబ్దం! ‘‘వాళ్లొచ్చి ఏం చేస్తారు బోస్.. భారం అవుతారు ఆజాద్ హింద్ ఫౌజ్కి’’.. ఎవరో అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ – ఐఎన్ఎ) .. బోస్ నిర్మించిన సైనిక దళం. గొరిల్లా, ఇన్ఫాంట్రీ, స్పెషల్ ఆపరేషన్స్.. వెరీ డేంజరస్. ఐఎన్ఎ అలికిడి అయితే చాలు.. బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ఏడాదైంది బోస్ ఐఎన్ఎ ని తయారుచేసి. అందులోకే ఇప్పుడు మహిళల్ని రమ్మంటున్నాడు. ‘‘ఒంట్లో సత్తువ ఉన్న ప్రతి ఒక్కరూ.. ఇంట్లో దూరిన శత్రువుని తరిమికొట్టడానికి సైన్యంలోకి రావాలి’’ అన్నాడు బోస్. ‘‘ఏం చేస్తారు బోస్.. ఆడవాళ్లు సైన్యంలోకి వచ్చి?’’ మళ్లీ అదే ప్రశ్న. బోస్ గర్జించాడు. ‘‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా ఖడ్గాన్ని తిప్పిందో అలాగే ఖడ్గాన్ని తిప్పుతారు. తిరుగుబాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను.. మహిళా భాగస్వామ్యం కూడా ఉంటే త్వరగా స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. నేనునమ్ముతున్నాను.. మహిళలూ కదనరంగంలోకి దుమికితే.. భారతదేశం అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్కు అందుతుంది’’బోస్ ప్రసంగం ముగించాడు. ముగిస్తూ, చెయ్యి ముందుకు చాపి.. ప్రమాణం చేస్తున్నట్లుగా అన్నాడు. ‘‘మన మహిళా దళం పేరు.. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’. ఎవరూ చేతుల్లేపలేదు!‘‘ఇక స్వాతంత్య్రం వచ్చినట్లే’’.. ఎవరో అన్నారు. ‘అవునవును’.. ఇంకో గొంతు. మరికొన్ని వంత గొంతుకలు. మూడ్రోజులు గడిచాయి. చప్పుడు లేదు.నాలుగో రోజు సింగపూర్లోనే.. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’ (ఐఐఎల్) మీటింగ్ జరుగుతోంది. ఐఐఎల్ మహిళా విభాగం మీటింగ్ అది. అక్కడికి వెళ్లాడు బోస్. ఇండియా బయట ఉండి, ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్న భారతీయులంతా కలిసి పెట్టుకున్న రాజకీయపార్టీ ఐఐఎల్.‘‘నా పేరు బోస్. మీలాగే భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఒక సైనికుడిని’’ అన్నాడు బోస్. మీటింగ్లోని మహిళలు కొందరు సంభ్రమంగా చూశారు. ‘మీలాగే’ అన్న మాట.. వారిలో ఉత్తేజాన్ని నింపింది. ‘‘మీతో కలిసి బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేయాలనుకుంటున్నాను’’ అన్నాడు బోస్. బోస్తో కలిసి పోరాడాలని అనుకుంటారు ఎవరైనా. కానీ బోసే అంటున్నాడు ‘నేను మీతో కలిసి పోరాడతాను’ అని! ఆశ్చర్యంగా కళ్లింత చేసి చూశారు మహిళలు. సమావేశంలో డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ ఉన్నారు. సింగపూర్లో ఐఐఎల్ మహిళా విభాగంలో ఆమెది కీ రోల్. ఆ సమావేశంలోనే.. బోస్కి మహిళలతో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇప్పించాలన్న నిర్ణయం జరిగింది. సైనిక వందనం!మహిళలైతే ఉన్నారు. మహిళా సైనికులు ఎక్కడ దొరుకుతారు.. ‘గార్డ్ ఆఫ్ ఆనర్’కి. కష్టపడి ఓ ఇరవై మంది సాధారణ మహిళల్ని ఒప్పించగలిగారు. బోస్ ఐఎన్ఎ దళం నుంచి లీ–ఎన్ఫీల్డ్ 303 రైఫిల్స్ తెప్పించారు. వాటిని ఎలా పట్టుకోవాలో, ఎలా వందన సమర్పణ చేయాలో ఆ ఇరవై మందికి అప్పటికప్పుడు నేర్పించారు. యూనిఫారాల్లేవు. చీరల వస్త్రధారణలోనే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. వందన సమర్పణ ముగిసింది. బోస్ ప్రసంగం మొదలైంది. ‘‘స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా మగాళ్లకు దీటుగా మీరూ ముందుకు నడుస్తున్నారు. నాకనిపిస్తున్నది ఏమిటంటే.. ముందుకు నడవడమే కాదు, ముందుకు నడిపించగలరు కూడా మీరు’’.ఆ ఒక్కమాట చాలదా.. తుపాకీని భుజానికెత్తుకోడానికి. ఎత్తుకున్నారు. కానీ, అదంత తేలిగ్గా ఏమీ జరగలేదు. ఆడవాళ్లెందుకు ఆజాద్ హింద్ ఫౌజ్లోకి అనే ప్రశ్న మళ్లీ వచ్చింది. బోస్కి సైనిక వందనం చేసిన మహిళల్లో డాక్టర్ నసీరా కయానీ అనే డాక్టర్ కూడా ఉన్నారు. రైఫిల్ని ఎత్తిపట్టుకున్న ఆ గ్రూపులో ఉన్న నసీరాను చూసి ఆజాద్ హింద్ ఫౌజ్ కు జనరల్గా ఉన్న మొహమ్మద్ జమాన్ కయానీ ఖిన్నుడయ్యాడు. తన భార్యేమిటీ, అకస్మాత్తుగా ఇక్కడ ప్రత్యక్షం అయిందేమిటీ? అని ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్లాక నసీరాను కోప్పడ్డాడు. ‘‘డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ కాలేజ్లో నా క్లాస్మేట్. తను రమ్మంటే వెళ్లాను’ అని భర్తకు చెప్పారు నసీరా. ఆర్జెఆర్ (రాణి ఝాన్సీ రెజిమెంట్) లో చేరదామని వెళ్లి కూడా, భర్త వద్దనడంతో ఆమె ఆగిపోయారు. పైస్థాయిలోనే ఇలా ఉంటే, కింది స్థాయిలో ఇంట్లో మగాళ్లు మహిళల్ని సైన్యంలోకి వెళ్లనిస్తారా? అయినా ఆర్జెఆర్ నిలబడింది. నిలదొక్కుకుంది. కలబడింది. బలపడింది. కదిలివచ్చిన కొద్దిపాటి మహిళలతోనే నేతాజీ మహిళా సైన్యం 1943 అక్టోబర్ నుంచి 1945 మే వరకు ఉరుములా, మెరుపులా వెయ్యి మంది సైనికులతో ఉనికిలో ఉంది. కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ (లక్ష్మీ స్వామినాథనే లక్ష్మీ సెహెగల్) ఈ దళాన్ని నడిపించారు. 1945 అక్టోబర్లో యుద్ధం పూర్తయింది. అంతకు రెండు నెలల ముందే ఆగస్టులో సుభాస్ చంద్రబోస్ అదృశ్యమయ్యారు. ఆ అదృశ్యశక్తి మహిళలోని పోరాట పటిమకు శక్తినిస్తూ ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది. ఆ పటిమను నిరూపించుకోవలసిన అవకాశాన్ని యువతులకు ఇవ్వవలసింది మాత్రం ఇప్పటి మన రక్షణ దళాల అధిపతులే. -
ఇకపై రెండు వారాలకోసారి స్నానం చేయవచ్చు!
సియాచిన్ : సియాచిన్ గ్లేసియర్లో విధులు నిర్వర్తించే సైనికులు స్నానం చేసేందుకు నెలల తరబడి వేచి చూడాల్సిన పనిలేదని ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. ‘సియాచిన్ గ్లేసియర్లో పనిచేసే సైనికులు విధులు నిర్వర్తించే క్రమంలో 90 రోజులపాటు స్నానం చేయకుండా ఉండాల్సివస్తోంది. ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉండబోవు. వీరి కోసం ప్రత్యేకంగా వాటర్లెస్ బాత్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి రానున్నాయి. 20 మిల్లీలీటర్ల జెల్ కలిగి ఉండే ఈ సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా... వారు రెండు వారాలకొకసారి స్నానం చేయవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి(సుమారు 22 వేల అడుగుల ఎత్తు) సియాచిన్లో సుమారు 3వేల మంది సైనికులు విధులు నిర్వర్తిస్తారు. అత్యంత శీతలమైన ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు ఒక్కోసారి మైనస్ 60 డిగ్రీలకు పడిపోతాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ గస్తీ కాసేందుకు ప్రభుత్వం రోజుకు సుమారు ఐదు నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది. ఇక ఇక్కడ పనిచేసే సైనికుల సమస్యలు, అవసరాలు తెలుసుకునే క్రమంలో ఆర్మీ డిజైన్ బ్యూరో(ఏడీబీ) 2016లో రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది సైనికులకు, వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేసే పలు ప్రైవేటు సంస్థలకు మధ్య వారధిలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో సైనికుల పరిశుభ్రత దృష్ట్యా హైజెనిక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. కాగా విధి నిర్వహణలో భాగంగా యుద్ధ ట్యాంకుల పనితీరులో లోపాలు, తాత్కాలిక బ్రిడ్జీల నిర్మాణం, సాంకేతిక అంశాల్లో జాప్యం తదితర సుమారు 130 రకాల సమస్యలను సైనికులు ఏడీబీ దృష్టికి తీసుకురాగా.. అందులో ప్రస్తుతం 25 సమస్యలు పరిష్కారమైనట్లు అధికారులు వెల్లడించారు. -
భారత ఆర్మీ ఆఫీసర్కు తై చీ నేర్పిస్తున్న చైనా సోల్జర్
-
వైరల్ : ఇండియన్ ఆర్మీ ఆఫీసర్కు చైనా సోల్జర్ పాఠాలు..!!
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం ప్రతిష్టంభన భారత్ చైనాల మధ్య సంబంధాలకు విఘాతం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని మోదీ, చైనా అధ్యక్షడు జిన్పింగ్ల మధ్య కొద్ది నెలల క్రితం జరిగిన చర్చలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు దోహదం చేశాయి. కాగా, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. భారత్, చైనా సంబంధాలు మెరుగయ్యాయనే విషయానికి అద్దం పడుతున్నట్టుగా ఆ వీడియో ఉంది. చైనా సోల్జర్ ఒకరు భారత ఆర్మీ ఆఫీసర్కు తై చీ నేర్పిస్తున్న వీడియో అది. కాగా, తై చీ చైనా ప్రాచీన యుద్ధకళ పద్ధతి. ఇది యుద్ధకళ మాత్రమే కాదు. శరీర నియంత్రణకు తోడ్పడే వ్యాయామాల్లో ఒకటి. దీంతో శరీరంపై చక్కని నియంత్రణ వస్తుంది. తై చీ పద్ధతిలో శరీర బరువును నెమ్మదిగా ఒక కాలి మీది నుంచి మరో కాలి మీద పడేలా లయబద్ధంగా కదులుతూ ఉంటారు. ఇది శరీర నియంత్రణకు తోడ్పడుతుందనీ, ఫలితంగా కింద పడిపోయే ముప్పు తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. గతేడాది డోక్లాం ప్రాంతంలో భారత్, చైనా రక్షణ బలగాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. డోక్లాం తమదేనని అటు చైనా, ఇటు భూటాన్ వాదించాయి. భూటాన్ వాదనకు భారత్ మద్దతివ్వడంతో పరిస్థితి మరోలా మారింది. దాంతో భారత్, చైనాల మధ్య సంబంధాలకు విఘాతం కలిగింది. -
అంతా హంబక్, ఓ నటన!
సాక్షి, న్యూఢిల్లీ : 1971లో పాక్, భారత్ మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా ఎం. బవేజా నాయకత్వంలో భారత సైనిక దళం, పాకిస్థాన్ ఆక్రమించుకున్న జమ్మూ కశ్మీర్లోని లడక్ శిబిరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకుంది. ఇందుకుగాను ఆయనకు ‘వీర్ చక్ర’ అవార్డు లభించింది. అయితే ఈ ఆపరేషన్లో ఆయన కాలి వేళ్లను కోల్పోయారు. 2000 సంవత్సరంలో బ్రిగేడియర్గా సైన్యం నుంచి రిటైరైన బవేజాకు ప్రస్తుతం 75 ఏళ్లు. ఆయనకు 1971లో అప్పగించిన మిషన్ను పూర్తి చేయడానికి కనీసం పది రోజులు కూడా పట్టలేదు. అయితే అంగ వైకల్య పింఛను సాధించేందుకు ఆయనకు 10 ఏళ్లు పట్టింది. పింఛను కోసం కాళ్లరిగేలా ఆఫీసులు చుట్టూ తిరిగిన ఆయన కొత్తగా ఏర్పాటయిన సాయుధ దళాల ట్రిబ్యునల్ను 2007లో ఆశ్రయించారు. 2010లో ట్రిబ్యునల్ అంగ వైకల్య పింఛను మంజూరు చేసింది. పింఛను కూడా తీసుకుంటున్నారు. అయితే అంతటితో ఆయన పింఛను కష్టాలు తీరలేదు. 2015లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పింఛను ఆగిపోయింది. 2016లో సుప్రీం కోర్టు ప్రభుత్వం అప్పీల్ కొట్టి వేసింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రిబ్యునల్ ఓకే చేసిన అంగవైకల్య పింఛన్లను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాదాపు 800 అప్పీళ్లను దాఖలు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో సుప్రీం కోర్టు అంతకుముందు ప్రభుత్వం దాఖలు చేసిన వాటితో సహా దాదాపు వెయ్యి అప్పీళ్లను కొట్టి వేసింది. ఇంకా కొన్ని విచారణలో ఉన్నాయి. ద్వంద్వ ప్రమాణాలంటే ఇదే మరి సైనికుల అంగవైకల్య పింఛన్లపై దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను ఉపసంహరించుకోవాలని, కొత్తగా అప్పీళ్లకు వెళ్లరాదంటూ 2014 సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు అప్పటి బీజేపీ ఉపాధ్యక్షులు స్మృతి ఇరానీ యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాయుధ దళాల ట్రిబ్యునల్ సామర్థ్యాన్ని పెంచుతామని, ప్రభుత్వం నుంచి అప్పీళ్లు లేకుండా సాధ్యమైనంత మేరకు ప్రయత్నిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. అందుకు కట్టుబడి ఉండకుండా 2017 వరకు అప్పీళ్లు దాఖలు చేస్తూనే వచ్చింది. 2015లో ఉన్నతస్థాయి కమిటీ సైనిక దళాల సమస్యలు, పింఛను వ్యవహారాల పరిష్కారం కోసం 2015లో అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ రిటైరైన ఉన్నత సైనికాధికారులతో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ 75 సిఫార్సులు చేయగా, అందులో 32 సిఫార్సులను ఆమోదించినట్లు పర్రీకర్ ప్రకటించారు. సైనిక అంగ వైకల్య పింఛన్లపై దాఖలు చేసిన అప్పీళ్లును ఉపసంహరించుకోవడం, కొత్తవి దాఖలు చేయక పోవడం వాటిలో ముఖ్యమైనది. అయినా 2017, జూన్ వరకు అప్పీళ్లు దాఖలవుతూ వచ్చాయి. ఇక అప్పీళ్లను నిలిపి వేస్తున్నట్లు 2017, జూన్ 29వ తేదీతో ‘కేంద్ర సైనిక పింఛనుదారుల సంక్షేమ సంఘం’కు కేంద్ర రక్షణ శాఖ ఓ లేఖ రాసింది. అప్పటి నుంచి కొత్తగా అప్పీళ్లను దాఖలు చేయలేదు. కానీ పెండింగ్లో ఉన్న పిటిషన్లలో ఒక్కదాన్ని కూడా ఉపసంహరించుకోలేదు. వాటిని ఉపసంహరించుకునే ఆలోచన కూడా తమకు లేదని ఈ ఏడాది జనవరి నెలలో ఇప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అప్పీళ్లను కొట్టివేసినా పింఛన్లు హుళక్కే సుప్రీం కోర్టు 2015లో పది అప్పీళ్లను కొట్టివేయగా వాటిలో ఇద్దరు సైనికులకు నేటికి పింఛను అందడం లేదు. వారిలో 53 ఏళ్ల లీలా సింగ్ ఒకరు. పంజాబ్లోని సంగ్రూర్కు చెందిన లీలా సింగ్ 2002లో నాయక్గా రిటైర్ అయ్యారు. ఆయన 1994లో ఊరి నుంచి తిరిగివస్తూ ప్రమాదానికి గురవడంతో ఆయన రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఆయనది పాక్షిక అంగవైకల్యంగా గుర్తించిన సైనిక అధికారులు అయనకు అందుకు తగిన విధులనే అప్పగించారు. రిటైరయిన తర్వాత ఆయన అంగవైకల్య పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా విధుల నిర్వహణలో గాయపడ్డ వారికి మాత్రమే పింఛను వర్తిస్తుందన్న కారణంగా కేంద్రం తిరస్కరించింది. ఆయన 2008లో ట్రిబ్యునల్ను ఆశ్రయించి విజయం సాధించారు. దాన్ని మళ్లీ కేంద్రం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా, 2015లో కొట్టివేసింది. అయినప్పటికీ ఆయనకు ఇప్పటికీ పింఛను రావడం లేదు. 2007లోనే ట్రిబ్యునల్ ఏర్పాటు సైనిక సిబ్బందికి సంబంధించిన కేసుల పరిష్కారం కోసం దిగువ కోర్టుల నుంచి హైకోర్టులు, సుప్రీం కోర్టుల వరకు వెళ్లడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతుందన్న కారణంగా ‘సాయుధ దళాల ట్రిబ్యునల్’ను ఏర్పాటు చేయాలని 1999లో కేంద్రం నిర్ణయించింది. అయితే 2007లో అమల్లోకి వచ్చింది. దేశభక్తి బోగస్... అంతా రాజకీయమే! ‘భారత మాతా కీ జై, జై జవాన్ అంతా హంబక్. జాతీయ గీతం పాడితే నిలబడడం అంతా ఓ నటన. గత ప్రభుత్వాలకు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలకు ఎలాంటి తేడా లేదు. మమ్మల్ని నిజంగా పట్టించుకుంటున్న వారు ఎవరూ లేరు. ప్రస్తుత ప్రభుత్వానిది పూర్తిగా రాజకీయం’ అని ‘మాజీ సైనికుల ఫిర్యాదుల విభాగం అధ్యక్షుడు రిటైర్డ్ లెఫ్ట్నెంట్ కల్నల్ ఎస్ఎస్ సోహి వ్యాఖ్యానించారు. ‘ఈ మోదీ ప్రభుత్వం జాతీయవాదం గురించి ఉద్బోధ చేస్తోంది. అంగవైకల్య సైనికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సాయుధ దళాల వ్యతిరేక వైఖరే కాకుండా జాతీయవాదానికి కూడా వ్యతిరేకం’ అని ‘మాజీ సైనికుల ఐక్య ఫ్రంట్’ ప్రధాన కార్యదర్శి రిటైర్ట్ లెఫ్ట్నెంట్ కల్నల్ దినేశ్ నైన్ విమర్శించారు. -
సైనికులను ఆదుకోవడం కనీస బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ఈ దేశ పౌరులకోసం ప్రాణాలు లెక్క చేయకుండా శత్రుమూకల నుం చి సరిహద్దులను కాపాడుతున్న సైనికులకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారిని ఆదుకునేందుకు పౌరులు ముందుకు రాకపోవడం శోచనీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశ సేవలో వీర మరణం పొందడమో, గాయపడటమో జరిగినప్పుడు ఆ సైనికుల సంక్షేమంకోసం తలా రూ.100 చొప్పున సాయం చేసినా ఆ సైనికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. మన కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వారిని ఆదుకోవడం కనీస సామాజిక బాధ్యతని తెలిపింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్పై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి కుడికన్ను, కుడిచేయి, కుడికాలు పనిచేయని పరిస్థితుల్లో జీవనాన్ని సాగిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ)కి చెందిన సైనికుడు కంగాల శ్రీరాములుకు మెడికల్ బోర్డు నిర్ణయంతో సంబంధం లేకుండా అన్ని రకాలుగా సాయం అందచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంగాల శ్రీరాములు పరిస్థితిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ లేఖ రూపంలో శ్రీరాములు పరిస్థితిని అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఏసీజే ఆ లేఖను పిల్గా పరిగణించి విచారణ ప్రారంభించారు. తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కె.లక్ష్మణ్ స్పందిస్తూ, శ్రీరాములు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు మెడికల్ బోర్డు సమావేశం కానున్నదని తెలిపారు. బోర్డు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అతనికి అందే సాయం ఆధారపడి ఉంటుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారికి దక్కాల్సిన బీమా ప్రయోజనాలను అందచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే ఆ సైనికుల కుటుంబాలు ఎంతో క్షోభను అనుభవిస్తుంటాయని విచారం వ్యక్తం చేసింది. మెడికల్ బోర్డు నిర్ణయంతో సంబంధం లేకుండా శ్రీరాములకు సాయం చేయాలని, ఇందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంటూ విచారణను డిసెంబర్ 4కి వాయిదా వేసింది. -
ఆర్మీ మేజర్ జనరల్కు జీవితఖైదు
న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో 1994లో జరిగిన సంచలన నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఓ ఆర్మీ మేజర్ జనరల్, ఇద్దరు కల్నల్లు సహా ఏడుగురికి జీవిత ఖైదు పడింది. డిబ్రూగఢ్ జిల్లాలోని దిన్జన్లో సైనిక కోర్టు విచారణ అనంతరం ఈ తీర్పు వెలువరించింది. మేజర్ జనరల్ ఏకే లాల్, కల్నల్లు థామస్ మాథ్యూ, ఆర్ఎస్ సిబిరెన్లతోపాటు జూనియర్ కమిషన్డ్, నాన్ కమిషన్డ్ అధికారులుగా ఉన్న దిలీప్ సింగ్, జగ్దేవ్ సింగ్, అల్బీందర్ సింగ్, శివేందర్సింగ్లను ఆర్మీ కోర్టు ఈ కేసులో దోషులుగా తేల్చింది. 1994 ఫిబ్రవరి 23న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్యు) కార్యకర్తలు ప్రవీణ్ సోనోవాల్, ప్రదీప్ దత్తా, దేవాజిత్ విశ్వాస్, అఖిల్ సోనోవాల్, భాబెన్ మోరన్లను దోషులు అపహరించి, నకిలీ ఎన్కౌంటర్ చేసి చంపారు. డంగారి ఫేక్ ఎన్కౌంటర్గా ఈ కేసు పేరుమోసింది. ఈ ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా నాటి ఏఏఎస్యు అధ్యక్షుడు, ప్రస్తుత బీజేపీ నేత జగదీశ్ భుయాన్ ఒక్కరే హైకోర్టులో పోరాడారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. కొద్ది రోజులు సీబీఐ దర్యాప్తు జరిగిన అనంతరం ఈ కేసును తాము మిలిటరీ చట్టం కింద విచారిస్తామంటూ కోర్టు అనుమతిని ఆర్మీ పొందింది. ఇప్పుడు ఏడుగురికి జీవితఖైదు విధించడంపై భుయాన్ స్పందిస్తూ ‘24 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, సైన్యంపై నేను నమ్మకం కోల్పోలేదు. ఆర్మీ తన సొంత సిబ్బందికే గుణపాఠం నేర్పే శిక్ష వేసింది’ అని అన్నారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ తప్పుచేసే సైనికులపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ తీర్పును కోల్కతాలోని తూర్పు ఆర్మీ కమాండ్, ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం ఆమోదించాల్సి ఉంది. ఇందుకు మూడు నెలల సమయం పట్టొచ్చు. దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. దోషుల్లో ఒకరైన ఏకే లాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని సహోద్యోగిని 2007లో ఫిర్యాదు చేయడంతో ఆర్మీ విచారణ అనంతరం 2010లోనే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. -
సైనికుల యూనిఫాం నిధుల్లో కోత
సాక్షి, న్యూఢిల్లీ : సైనికుల యూనిఫాంకు కేటాయించే నిధుల్లో కోత విధించడం పట్ల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మంగళారం బీజేపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియా అంటూ నినాదాలిచ్చే ప్రభుత్వం మన సైనికుల దుస్తులు, షూలను వారే కొనుగోలు చేసేలా చేస్తోందని ఎకనమిక్ టైమ్స్లో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. నిధుల్లో కేంద్రం కోత విధించడంతో భారత సైన్యం ఫ్యాక్టరీల నుంచి సైనికుల దుస్తుల సరఫరాలను గణనీయంగా తగ్గించిందని ఈ కథనం పేర్కొంది. నిధుల కేటాయింపులో కేంద్రం విఫలమవడంతో సైనికులు ప్రస్తుతం తమ యూనిఫాం, ఇతర నిత్యావసరాలను స్ధానిక మార్కెట్లలో తమ సొంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆ కథనం వెల్లడించింది. దీనిపై ఇప్పటివరకూ కేంద్రం, భారత ఆర్మీ స్పందించలేదు. 2014లో నరేంద్ర మోదీ నేతృతంలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరినప్పటి నుంచి మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే క్రమంగా మేకిన్ ఇండియా నిర్వీర్యమవుతోందని విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నక్రమంలో సైన్యం తాజా ఉత్తర్వులు కేంద్రానికి ఇబ్బందికరంగా పరిణమించాయి. -
సరిహద్దుకి ఆవల
సెల్యూట్ చేసిన లాంచ్నాయక్ రాంసింగ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆఫీసర్ కమాండింగ్.‘‘సెర్చింగ్ పార్టీతో నేనూ వెళతాను సార్!’’ వినయంగా అన్నాడు రాంసింగ్.‘‘ఎందుకు?’’ అడిగేడు ఆఫీసర్ కమాండింగ్.‘‘స్వామి నాకు మిత్రుడు సార్!’’ చెప్పాడతను. అప్పటికే ఆఫీసర్ కమాండింగ్ చాలా విసుగ్గా ఉన్నాడు. నిన్న తెల్లవారుజామున పెట్రోలింగ్ పార్టీ ఒకటి మందుపాతరకి బలైంది. అయిదు శవాలు మాత్రం దొరికాయి. ఆయుధాలు, శరీరాల మీదున్న విలువైన వస్తువులు పట్టుకుపోయారు శత్రుసైనికులు. ఇద్దరు భారత సైనికుల శరీరాలు కత్తి పోట్లకు గురయ్యాయి. అంటే మందుపాతర పేలాక ప్రాణాలతో మిగిలిన వారిని అంతమొందించారన్నమాట. పెట్రోలింగ్ పార్టీలోని స్వామి అనే సైనికుని ఆచూకీ లేదు. శత్రుసైనికులు బందీగా పట్టుకుపోవడానికి అవకాశం లేదు. ఏ తుప్పల్లోనో శరీరం పడి ఉంటుందన్న ఆలోచనతో సెర్చింగ్ పార్టీని పంపుతున్నారు. రెండు దేశాల సరిహద్దుకి మధ్య ఎవరికీ చెందని రెండు కిలోమీటర్ల ప్రాంతంలో చిన్న అడవి ఉంది. చొరబాటుదారులు అడవి ప్రాంతంలో పెట్రోలింగ్ పార్టీ కనుమరుగయిన మరుక్షణం సరిహద్దు దాటుతారు. చొరబాటుదారుల్ని వెంటాడే క్రమంలో పెట్రోలింగ్ పార్టీ మందుపాతర పేలుడులో చిక్కుకుంది. ఇది శత్రువు ఎత్తుగడ కావచ్చు.‘‘సరే వెళ్ళు’’ చెప్పాడు ఆఫీసర్ కమాండింగ్, ఆలోచనల నుండి తేరుకుని. రాంసింగ్ సెల్యూట్చేసి ఆక్కడి నుండి కదిలి సెర్చింగ్ పార్టీ ఇన్చార్జి హవల్దార్కి రిపోర్టు చేశాడు. ఆ తరువాత స్టోర్ నుండి ఆయుధాలు తీసుకున్నాడు. సెంట్రీలు చూస్తుండగా సెర్చింగ్ పార్టీ బోర్డరు దాటింది. క్రమంగా సెర్చింగ్ పార్టీలోని నలుగురు సభ్యులు కనుమరుగయ్యారు. అంతా సరళరేఖ మాదిరిగా తమ మధ్య నాలుగు అడుగుల దూరం ఉండేటట్లు చూసుకుని నడుస్తోంది సెర్చింగ్ పార్టీ. కాళ్ళకి మెత్తని జంగిల్ షూస్ ఉండటంతో అడుగుల శబ్దం రావడం లేదు. అందరికంటే ముందున్న వ్యక్తి పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తూ అడుగులేస్తున్నాడు. ఏదైనా ప్రమాదం పసిగడితే తన టీవ్ుని హెచ్చరిస్తాడతను. శత్రువుకి సమీపంగా వెళుతున్నామనే స్పృహ ఉంది అందరికీ. జాగ్రత్తతోపాటు ఆయుధాన్ని దూరం చేసుకోకూడదు. మృత్యువు చెప్పిరాదు. అడవిని సమీపించాక అంతా నేలమీద పడుకున్నారు. టీవ్ు లీడర్ బైనాక్యులర్స్తో అత్యంత జాగ్రత్తగా ముందుకి చూశాడు. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఎక్కడా అనుమానించదగ్గది ఏమీ కనిపించలేదు. క్లియరెన్స్ సిగ్నల్ ఇచ్చి నెమ్మదిగా లేచాడు. అందరూ గన్స్లోడ్ చేసి ఎటాకింగ్ పొజీషన్లో ముందుకి కదిలారు. వారి చూపు ముందున్న ప్రదేశం మీద ఉంది. ముందురోజు అక్కడ మందుపాతర పేలింది. అయిదు శవాలను తీసుకొచ్చారు క్యాంపుకి. దొరకని శరీరం కోసం ఇప్పుడొచ్చారు.లీడర్ చెయ్యి ఎత్తాడు. అందరూ టక్కున ఆగిపోయారు. అడవిలో అస్పష్టంగా ఉన్న కాలి బాటకి అడ్డంగా ల్యాండ్ మైన్ పేలుడుతో ఏర్పడిన గొయ్యి ఉంది. ఆ గొయ్యికి చుట్టూ తిరిగి అవతలికి వెళ్ళాడు లీడర్. కొంత దూరం వెళ్ళాక నెమ్మదిగా అరిచాడు. ‘‘ఇక్కడో ల్యాండ్మైన్ ఉంది.’’నేలమీద రెండడగులు లోతు తవ్వి ఆ గోతిలో భూమికి సమాంతరంగా అమరుస్తారు మందుపాతర. ఒక్క సేఫ్టీపిన్ మాత్రమే పైకి కనిపిస్తుంది. దానిమీద కాలు వేసినా లేదా కాలితో తన్నినా సేఫ్టీపిన్ లోపల ఉన్న కేప్కి తగిలి పేలుతుంది. చుట్టు పక్కల పదడుగుల దూరం వరకూ దాని ప్రభావం ఉంటుంది. యుద్ధభూమిలో అత్యంత వినాశకారి ఆయుధం ల్యాండ్ మైన్.బాటకి ఇరువైపులా కదిలారు నలుగురు. వాళ్ళంతా నేలని పట్టిపట్టి చూశారు. శత్రువు చాలా ప్రమాదకరమైన వాడనే ఆలోచన వాళ్ళ బుర్రలో కదులుతోంది. ఇక ఎలాంటి ప్రమాదం లేదని నిశ్చయించుకున్నాక వాళ్ళు కాస్త స్వేచ్ఛగా కదలసాగారు. ఒకవైపు గాలిస్తూ వెళ్ళిన రాంసింగ్కి చిన్న లోయ ఒకటి ఎదురైంది. అతను తలెత్తి చుట్టూ చూశాడు. ఒక చెట్టు కొమ్మకి యూనిఫాంలోని పీలిక ఒకటి వేలాడుతూ కనిపించింది. వీపుకి అమర్చుకున్న అవర్షాక్ నుండి రోప్ తీశాడు రాంసింగ్. దానికి చివర రాయికట్టి లోయలోకి వదిలాడు. మూడు వంతులు తాడు లోపలికి వెళ్ళాక నేలకి తగిలింది రాయి. ఇన్చార్జికి చెప్పి రెండోకొన చెట్టుకి కట్టి తాడు పట్టుకుని దిగడం ప్రారంభించాడు. పది నిమిషాలకి తాడు లూజయింది. ఇన్చార్జి లోపలికి తొంగి చూశాడు. వెలుగుతున్న టార్చి చుక్కలా కనపించిందంతే. గంట తరువాత లోపల నుండి రాంసింగ్ గొంతు వినిపించింది. ‘‘బాడీ దొరికింది. స్లీపింగ్ బ్యాగ్ లోపలికి పంపండి...’’స్లీపింగ్ బ్యాగ్ మరో తాడుకి కట్టి లోయలోకి పంపేడు ఇన్చార్జ్. అరగంట తర్వాత శవాన్ని పైకిలాగాక రాంసింగ్ పైకి వచ్చాడు. రాంసింగ్ సూచన ప్రకారంఇద్దరు జవాన్లు బాడీతో అక్కడ నుంచి కదిలారు. రాంసింగ్ తన అవర్షాక్ నుంచి చిన్న గునపం బయటకు తీశాడు.‘‘అదెందుకు?’’ ఆశ్చర్యంగా అడిగాడు హవల్దార్.‘‘మనవాళ్ళ చావుకి కారణమైన శత్రువుకి బుద్ధి చెప్పాలి. మీరు లైనింగ్ పొజిషన్లో బైనాక్యులర్స్తో శత్రు సరిహద్దుని గమనించండి. ఎవరైనా ఇటు వస్తుంటే నన్ను హెచ్చరించండి..’’ చెప్పాడు రాంసింగ్.అతను ఏంచేస్తాడో అర్థంకాక పోయినా, నేలమీద పడుకుని బైనాక్యులర్స్ కళ్ళముందు పెట్టుకుని గమనించసాగేడు హవల్దార్. ల్యాండ్ మైన్ పేలుడుతో ఏర్పడిన గొయ్యి అవతల మొత్తం నాలుగు మందుపాతరలు ఉన్నాయి. వాటి మధ్య దూరాన్ని కాలి అడుగులతో కొలిచాడు. ఒక్కొక్క దాని మధ్య పదడుగుల దూరం ఉంది. శత్రు సరిహద్దువైపు ఉన్న చివరి ల్యాండ్మైన్ నుంచి పదడుగులు వెనక్కి నడిచి అక్కడ చిన్న గునపంతో గుండ్రంగా నేలమీద గుర్తు పెట్టాడు. దాని తరువాత ఒకటి, ఆ తరువాత మరొకటి పెట్టాడు. తను చెయ్యబోతున్న పనిని ఒకసారి సమీక్షించుకున్నట్టు కొన్ని క్షణాలు చూశాడు. తను చేస్తున్నది చాలా ప్రమాదకరమైన పని. ఏ మాత్రం తేడావచ్చినా నామరూపాలు లేకుండా పోతాడు. గుర్తులు పెట్టినచోట గోతులు తవ్వడానికి అరగంట పట్టింది. ఆ తరువాత తనకి దగ్గరలోని ల్యాండ్మైన్ దగ్గరకు వెళ్ళాడు. దానికి కాస్త ఎడంగా చుట్టూ అడుగున్నర లోతు తవ్వాడు. ఆపని చేస్తున్నప్పుడు అతని బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. చివరగా మట్టిమీద నిలబడిన ల్యాండ్మైన్ కిందికి రెండు చేతులు పోనిచ్చి ఊపిరిబిగపట్టి నెమ్మదిగా పైకి లేపాడు. అది కదలకుండా తీసుకెళ్ళి తను తీసిన ఓ గొయ్యిలో ఉంచి చుట్టూ మట్టి కప్పాడు.మిగతా రెండింటిని కూడా అలాగే తీసుకెళ్ళి పాతాడు.మూడు మందుపాతరలూ వెనక్కి జరిపాక మిగిలిన దాని దగ్గరకు వచ్చాడు. బరువైన రాయికి రోప్ కట్టి ఆ మందుపాతర మీద ఉంచాడు. రెండో చివర రోప్ని ఓ చెట్టుకి వదులుగా ముడివేసి చేతులు దులుపుకున్నాడు. అంతవరకూ రాంసింగ్ చర్యల్ని గమనించిన హవల్దార్ అన్నాడు – ‘‘చాలా ప్రమాదకరమైన పని. ఏదో ల్యాండ్మైన్ నీ చేతిలో పేలితే?’’.‘‘నిన్న పోయిన ఆరుగురికి మరొకరు జత అయ్యేవాడు... ప్రమాదమని శత్రువుకి బుద్ధి చెప్పకుండా ఊరుకుంటామా...’’ నవ్వేడు రాంసింగ్.డెడ్బాడీతో క్యాంపు చేరుకుంది సెర్చింగ్ పార్టీ.మరునాడు తెల్లవారుజామున రాంసింగ్ని నిద్రలేపాడు సెంట్రీ. అతను బేరక్ నుంచి బయటకొచ్చి చన్నీళ్ళతో ముఖం కడుక్కున్నాడు. చల్లగా ఉంది వాతావరణం. మరికాసేపట్లో అదృశ్యం కావడానికి సమాయత్తమవుతోంది చీకటి. రాంసింగ్ సరిహద్దు దాటి నిశ్శబ్దంగా అడవివైపు నడిచాడు. అడవిలోని కాలిబాటలోకి ప్రవేశించి చెట్టుకి కట్టిన తాడు అందుకుని చేతికి చుట్టుకుని బలంగా లాగాడు.ల్యాండ్మైన్ మీద ఉంచిన రాయి తప్పుకుంది. సేఫ్టీ పిన్ చిన్న చప్పుడుతో పైకి ఎగిరింది. భూమి కంపించేటట్టు పెద్ద చప్పుడు. వెనక్కి తిరిగి క్యాంపు చేరుకుని సెంట్రీపోస్టులో ఇసుక బస్తామీద కూర్చున్నాడు రాంసింగ్. అతని చేతికి పొగలు కక్కుతున్న టీ మగ్ అందించాడు ఒకతను. అది తాగుతూ జరగబోయే పరిణామం కోసం ఎదురుచూడసాగేడు. సరిగ్గా తెలతెలవారుతుండగా అడవి నుంచిరెండు పేలుడులు అక్కడికి వినిపించాయి. పని పూర్తయినట్టు సెంట్రీలవైపు చూసి చిన్నగా నవ్వాడు రాంసింగ్.కుయుక్తితో భారత సైనికుల్ని మట్టుపెట్టి ఆయుధాలు, విలువైన వస్తువులు పట్టుకుపోయిన శత్రువు వలలో చిక్కుకొని అంతమయ్యాడు. ‘‘అటెన్షన్.... మార్చ్.....’’రాంసింగ్ ఎడమకాలు కుడికాలు పక్కకి చేర్చి కదిలాడు. కమాండ్ పాస్ చేసిన హవల్దార్ కూడా అతనితో సమానంగా అడుగులు వెయ్యసాగేడు. అది కంపెనీ హెడ్క్వార్టర్లోని మేజర్ క్యాంప్ ఆఫీస్.లోపల ముగ్గురు కూర్చుని ఉన్నారు. మధ్యలో రివాల్వింగ్ చైర్లో ఉన్నాడు మేజర్. సిబ్బందిలో ఎవరైనా తీవ్ర నేరాలకు పాల్పడితే శిక్ష విధించే కోర్ట్ ఆఫ్ మార్షల్ అది. ముందురోజు బోర్డర్ దగ్గర ఉన్న ప్లటూన్ ఆఫీసర్ కమాండింగ్కి రాంసింగ్ని, హవల్దార్ని హెడ్ క్వార్టర్కి పంపమని ఉత్తర్వులు వచ్చాయి. ఇద్దరూ పది కిలోమీటర్లు నడచి హెడ్ క్వార్టర్ చేరుకున్నారు. ముందు హవల్దార్ని విచారించాక రాంసింగ్ని పిలిచారు.‘‘హాల్ట్...’’ చెప్పాడు హవల్దార్. ఇద్దరూ ఆగాక అన్నాడు – ‘‘సెల్యూట్..’’. ఎదురుగా ఉన్న మేజర్కి సెల్యూట్ చేశాక ‘‘డౌన్’’ అన్నాడు. మేజర్ హవల్దార్ వైపు చూసి తలూపాడు. అతను సెల్యూట్ చేసి ఎబౌట్ టర్న్ తీసుకుని మార్చింగ్లో అక్కడ నుండి బయటకి నడిచాడు.రెండు నిమిషాలు తన ముందున్న పేపర్లు పరిశీలించి ఆ తర్వాత తలెత్తి రాంసింగ్ మీదకి చూపు సారించాడు మేజర్. ఇరవై రెండు సంవత్సరాలు దాటిన యువకుడతను. మీసాలు పూర్తిగా రాలేదు. మూడు సంవత్సరాల ఆరు నెలలు అతని సర్వీస్. మేజర్ కళ్ళలో చిన్నపాటి ఆశ్చర్యం కదలాడింది. ‘‘శత్రువు అమర్చిన ల్యాండ్ మైన్స్ ప్లేస్ మార్చి పదిమంది మరణానికి కారకుడవయ్యావు. ఏ ధైర్యంతో ఆ పని చేశావ్?’’ కంగుమనే గొంతుతో అడిగాడు మేజర్.‘‘ఇది ధైర్యానికి సంబంధించినది కాదు సార్. నాతో పనిచేస్తున్న ఆరుగురిని శత్రువు పొట్టన పెట్టుకున్నాడు. వారి ఆయుధాలను వారిమీదే ప్రయోగించి బదులు తీర్చాను’’ వినయంగా చెప్పాడు రాంసింగ్.‘‘అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం..’’ కఠినంగా అన్నాడు మేజర్.‘‘మీ పర్మిషన్ తీసుకునే సమయం లేదు సార్! యుద్ధభూమిలో దొరికిన శత్రువుని దొరికినట్లే హతమార్చడం భారత సైనికునిగా నా బాధ్యత’’మేజర్ తలపరికించాడు. ‘‘నీకు స్వామితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయా?’’ అడిగేడు మేజర్.‘‘లేవు సార్! అతను నా ప్రాణ స్నేహితుడు.’’ చెప్పాడు రాంసింగ్.‘‘అయితే ఎందుకు చంపావ్ అతన్ని?’’ఊహించని ప్రశ్న కావడంతో నోరు మెదపలేదు రాంసింగ్.‘‘సెర్చింగ్ పార్టీతో వెళతానని ఈనెల తొమ్మిదిన ఆఫీర్ కమాండింగ్ని అడిగావు. అందరితోపాటు స్టోర్స్ నుంచి వెపన్స్ డ్రా చేశావు. తిరిగొచ్చాక వెపన్స్ హేండోవర్ చేసినప్పుడు స్టెన్గన్తూటాల్లో ఒకటి తక్కువైంది.’’మౌనంగా చూస్తూ ఉండిపోయాడతను.‘‘ఆ తూటా ఇదే..’’ పాలిథిన్ కవరులోని తూటా చూపించాడు మేజర్.‘‘పోస్టుమార్టవ్ులో స్వామి ఛాతీకి స్టెన్గన్ బేరల్ ఆనించి కాల్చినట్టు తేలింది. తూటా చేసిన గాయం నుండి కారిన రక్తం షర్టుకి అంటుకుని ఉంది. నిజానికి నువ్వు అతన్ని రక్షించడానికి వెళ్ళావు. కాని కాల్చి చంపావ్. ఇది బాధ్యతతో కూడిన డిసిప్లిన్ ఫోర్సు. ఇక్కడఎవరికి తోచినట్లు వారు ప్రవర్తించడం కుదరదు. నిన్ను ఉద్యోగం నుంచి తొలగించి, అరెస్ట్ చెయ్యవచ్చు’’ గంభీరంగా అన్నాడు మేజర్.గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు రాంసింగ్. లోయలో నేల కాలికి తగిలాక తాడు వదిలిపెట్టాడు రాంసింగ్. టార్చి వెలిగించి చుట్టూ చూశాడు. కొమ్మలు, తీగలు దట్టంగా అల్లుకుని నేల చిత్తడిగా ఉంది. అదోరకమైన వాసన ముక్కుపుటాలను తాకుతోంది. చెట్లు అడ్డదిడ్డంగా పెరిగాయి. కొండరాళ్ళు నాచు రంగులో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ముందుకి కదిలాడు. ఏవో పురుగులు శరీరంమీద పాకసాగాయి. ఒకసారి వాటిని దులుపుకుని అవంత తేలిగ్గా వదలవని గుర్తించాడు. ఆచితూచి అడుగులు వేస్తూ కదలసాగేడు. మందుపాతర పేలుడులో గాయపడిన వ్యక్తి ఆ లోయలో పడితే నామరూపాలు ఉండవని గుర్తించాడు. అతని ఆలోచనలు చెదరగొడుతూ ఓ రాయి పక్కన కనిపించింది స్వామి శరీరం.దగ్గరకు వెళ్ళి వెలుగులో చూసి చప్పున తలతిప్పుకుని రాబోయే వాంతిని ఆపుకున్నాడు. చూడటానికి చాలా భయంకరంగా ఉంది శరీరం. ఒక కాలు తొడ వరకు లేదు. ఓ చెయ్యికి మణికట్టు లేదు. ముఖంలో కుడి భాగం లోతైన గాయంతో దెబ్బతింది. శరీరాన్ని రకరకాల కీటకాలు కమ్మేశాయి. మరింత దగ్గరకు వెళ్ళి ఛాతీమీద చెయ్యేశాడు. గుండె చిన్నగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. అనుమానం తీర్చుకోవడానికి రెండో చెయ్యివేశాడు. ప్రాణం ఉంది.‘‘స్వామీ..’’ పిలిచాడు గద్గదంగా.‘‘స్వామీ...’’ అంటూ భుజం పట్టుకుని కదిపాడు. శరీరంలో ఎలాంటి కదలిక లేదుకాని ఎడమకన్ను సగం తెరుచుంది.‘‘నేనురా... రాంసింగ్ని.’’ చెప్పాడు దుఃఖాన్ని ఆపుకుంటూ.‘‘రాంసింగ్...’’ అస్పష్టంగా ఉచ్చరించాయి స్వామి పెదవులు.‘‘అవును నేనే... నిన్ను వెంటనే ఇక్కడ నుంచి తీసుకువెళతాను’’ చెప్పాడు వణుకుతున్న స్వరంతో.‘‘వద్దురా...’’‘‘పైన మన పార్టీ ఉంది. మరేం భయంలేదు.’’ చెప్పాడు.‘‘నేను బతికే స్థితిలో ఉన్నానా?’’ అడిగాడు స్వామి.‘‘అవేం మాటలురా..’’ రాంసింగ్ గొంతు పూడుకుపోయింది.‘‘ఎక్కువసేపు బతకను... అది నిజం... నా ప్రాణం పోయాక ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. లేదంటే నాకు విముక్తి ప్రసాదించు. ఈ బాధ భరించలేకపోతున్నాను. ఇక్కడ పడిన దగ్గరనుంచి చావు కోసం ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’’రాంసింగ్ మాట్లాడలేదు. ఆ స్థితిలో స్వామిని చూసేసరికి మతిపోయిందతనికి. ఆవేదనతో గుండెలు బరువెక్కాయి. అతను బతకడని, ఒకవేళ బతికినాజీవచ్ఛవమని తెలుస్తూనే ఉంది.‘‘నాకు చెల్లెలు తప్ప ఎవరూ లేరని నీకు తెలుసు. దానిని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇవ్వు...’’రాంసింగ్ కళ్ళు కన్నీళ్ళతో మసకబారాయి. అతను నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టింది.వణుకుతున్న చేత్తో స్టెన్గన్ బయటకు తీశాడు. ‘‘సో ... నేరం చేశావ్?’’ మేజర్ అన్నాడు.తల అడ్డంగా ఊపాడు రాంసింగ్. ‘‘అది నేరమని, నా భవిష్యత్తు నాశనమవుతుందని ఆలోచించలేదు సార్! నా ప్రాణ స్నేహితుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఏ దైవమూ వాడి చావుని ఆపలేదు. చావు ఆలస్యం కావడం వల్ల వాడు మరికాసేపు నరకయాతన అనుభవించడం తప్ప ఉపయోగం లేదు. అందుకే వాడి కోరిక తీర్చాను సార్..’’కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది అక్కడ.‘‘బయట వెయిట్ చెయ్యి, మళ్ళీ పిలుస్తాను..’’ చెప్పాడు మేజర్.రాంసింగ్ సెల్యూట్ చేసి బయటకొచ్చాడు.‘‘ఏమైంది బేటా?’’ బయట ఉన్న హవల్దార్ అడిగేడు.‘‘ఏం కాలేదు’’ రాంసింగ్ జవాబిచ్చాడు.‘‘ఏం కాదు’’ చెప్పాడతను. రాంసింగ్, స్వామి అతని స్క్వాడ్లోనే పనిచేస్తున్నారు. తనకంటే ముందు హవల్దార్ని పిలిచి మేజర్ విచారించాడని తెలుసు రాంసింగ్కి. అయితేలోపల ఏం జరిగిందో మాత్రం తెలియదు.అరగంట తర్వాత తన ముందు నిలబడిన రాంసింగ్ని అడిగేడు మేజర్.‘‘స్వామి చెల్లెలు పరిస్థితి ఏమిటి?’’‘‘ఆమెని మా గ్రామం తీసుకుపోతాను సార్. తల్లి, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నాకు. ఈమెతో నలుగురు అవుతారు. నాకు పెళ్ళిచేసుకునే వయసు రావడానికి ఇంకా రెండున్నర ఏళ్ళు పడుతుంది. అప్పుడు ఆమె ఇష్టపడితే పెళ్ళి చేసుకుంటాను. లేదంటేఆమెకి నచ్చినవాడికిచ్చి పెళ్ళిచేస్తాను సార్!’’మేజర్ కొన్ని క్షణాలు తన ముందున్న కాగితాలు చూసి ఆ తర్వాత తలెత్తాడు. అతని ముఖం భావరహితంగా ఉంది. ‘‘నీకిది మొదటి వార్నింగ్. తక్కువ సర్వీసులో లాంచనాయక్గా ప్రమోషన్ పొందావు. మంచి భవిష్యత్ ఉంది నీకు. ఇక నుంచి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఉద్యోగం చెయ్యి. అనవసరమైన విషయాల జోలికి పోకు... వెళ్ళు.’’ చెప్పాడు గంభీరంగా.స్మార్ట్గా సెల్యూట్ చేసి వెనక్కి తిరిగాడు రాంసింగ్. -
అమరులైన ఇద్దరు సైనికులు
శ్రీనగర్ : నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సోమవారం పాక్ కాల్పులకు తెగబడింది. సుబేదార్ సెక్టార్లో కాల్పుల బారినపడి తీవ్రంగా గాయపడిన ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో అమరులైన రైఫిల్మెన్ వినోద్ సింగ్, జాకీ శర్మలు జమ్మూకశ్మీర్కు చెందినవారు. వినోద్ సింగ్(24) అక్నూర్ జిల్లాకి చెందిన దనాపూర్ వాసి. జాకీ శర్మ(30) హిరానగర్ జిల్లాకి చెందిన సన్హైల్ గ్రామ నివాసి. భారత్ వైపు నుంచి ఎలాంటి కాల్పులు లేకపోయిన పాక్ ఈ అకృత్యానికి దిగిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. -
పాఠశాలల విద్యార్థులకు ‘మిలటరీ’ టూర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. హైదరాబాద్లోని మిలటరీ శిక్షణ కేంద్రాల్లో పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మిలటరీ శిక్షణ, ప్రాధాన్యం, సైన్యం ఎదుర్కొనే సమస్యలు, దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న కృషి తదితర అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే 20 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మిలటరీ టూర్ నిర్వహించగా, మరో 200 పాఠశాలల విద్యార్థులకు టూర్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.