Panchayat Elections in AP
-
యెల్లో బ్యాచ్ ఏడుపే.. వైఎస్సార్సీపీ ఎదుగుదల
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ విజయ పరంపర కొనసాగుతుందని మరోమారు రుజువైంది. ప్రతిపక్షం ఎన్ని కూతలు కూసినా.. యెల్లో మీడియా ఎన్ని విషపు రాతలు రాసినా.. జనాదరణ సంక్షేమ ప్రభుత్వానిదేనని తేలింది. రాష్ట్రంలో ఫ్యాన్ స్పీడ్కు ప్రత్యర్థి పార్టీలు పత్తాలేకుండా పోయాయి. పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. రాష్ట్రంలో మొత్తం 66 గ్రామాల సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏకగ్రీవమైన 30 సర్పంచ్ పదవులు వైఎస్సార్సీపీ మద్దతుదారులకే దక్కాయి. మిగిలిన 34 సర్పంచ్ పదవుల ఎన్నికల్లో 23 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగురవేశారు. 10 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారుకు దక్కింది. మొత్తం 1,062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 243 వార్డుల్లో 149 వైఎస్సార్సీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. తాజా గెలుపుపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని జేసీ బ్రదర్స్ సొంత మండలం పెద్దపప్పురులో వైఎస్సార్సీపీ మద్దతు దారులు గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. రెండు గంటల అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి ఏడు గంటలలోపే విజేతలను ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో మరోసారి ఆ పార్టీకి తీవ్ర భంగపాటు ఎదురైంది. జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఫలితాలు ఇలా.. ► శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు మూడు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒక చోట గెలుపొందారు. ఎన్నికలు జరిగిన 10 వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ సానుభూతిపరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. ► పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. రెండు వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ, టీడీపీ బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని దక్కించుకున్నారు. ► విజయనగరం జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోగా.. వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారు చెరో స్థానంలో గెలుపొందారు. ఎనిమిది వార్డు సభ్యులకు గాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ మద్దతుదారులు రెండుచోట్ల విజయం సాధించారు. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు స్థానాలకుగాను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు రెండు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒకచోట విజయం సాధించారు. ఇక్కడ 14 వార్డు సభ్యులకుగాను 11 మంది వైఎస్సార్సీపీ, ఇద్దరు టీడీపీ మద్దతుదారులు, ఇతరులు ఒకరు గెలుపొందారు. ► అనకాపల్లి జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ, రెండుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► విశాఖ జిల్లాలో ఎన్నిక జరిగిన రెండు వార్డులనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ► కాకినాడ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఆరు వార్డు సభ్యుల స్థానాల్లో వైఎస్సార్సీపీ ఒకటి, టీడీపీ–3, జనసేన మద్దతుదారు ఒకచోట, ఇతరులు ఒక చోట విజయం సాధించారు. ► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. ఆరు వార్డు సభ్యులకు గాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు.. ఇతరులు ఒకచోట గెలుపొందారు. ► తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకుగాను నాలుగింటిని వైఎస్సార్సీపీ, మూడింటిని టీడీపీ, ఒక చోట జనసేన మద్దతుదారులు గెలుపొందారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. 10 వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగింటిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► ఏలూరు జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. ఈ జిల్లాలో 21 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చెరో పది స్థానాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు, ఒకచోట జనసేన సానుభూతిపరుడు విజయం సాధించారు. ► కృష్ణా జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఎనిమిది వార్డు సభ్యుల స్థానాల్లో చెరో నాలుగింటిలో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► ఎన్టీఆర్ జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మూడు వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ సానుభూతిపరుడు దక్కించుకున్నారు. ► గుంటూరు జిల్లాలో ఒక్క సర్పంచ్ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడు గెలుపొందారు. ఇక్కడ ఏడు వార్డు సభ్యులకుగాను రెండుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగుచోట్ల టీడీపీ, ఒకచోట జనసేన బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► పల్నాడులో ఎన్నికలు జరిగిన 14 వార్డుల్లో 8 చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► బాపట్ల జిల్లాలో రెండుచోట్ల సర్పంచ్ ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్సీపీ, జనసేన బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 11 వార్డు స్థానాల్లో ఆరింటిని వైఎస్సార్సీపీ, ఐదింటిని టీడీపీ బలపర్చిన అభ్యర్థులు దక్కించుకున్నారు. ► ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ 15 వార్డు సభ్యుల స్థానాల్లో ఎనిమిదింటిని వైఎస్సార్సీపీ, ఏడుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► నెల్లూరు జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. 11 వార్డు సభ్యులకుగాను 6 చోట్ల వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► తిరుపతిలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. ► చిత్తూరు జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► కర్నూలులో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15 వార్డు సభ్యులకుగాను తొమ్మిది చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► అనంతపురంలో టీడీపీ సానుభూతిపరుడు ఒక సర్పంచ్ స్థానంలో గెలుపొందారు. ఇక్కడ 11 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ మద్దతిచి్చన అభ్యర్థులు విజయం సాధించారు. ► నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి ఒక సర్పంచ్ స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 19 వార్డు సభ్యుల స్థానాలకుగాను 16 చోట్ల వైఎస్సార్సీపీ, మూడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్నిక జరిగిన సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మొత్తం 13 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు, ఏడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► వైఎస్సార్ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో మూడు వార్డు స్థానాల్లో రెండు చోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► అన్నమయ్య జిల్లాలో మూడు వార్డుల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పరాభవం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఐదుగురు వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైఎస్సార్సీపీ మద్దతుదారు గెలుపొందడం విశేషం. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. -
పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులకే పట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెల్చుకున్నారు. 27 సర్పంచ్ పదవుల్ని, 47 వార్డుల్ని కైవసం చేసుకున్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా.. మొత్తం 69 సర్పంచి, 533 వార్డు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేశారు. వాటిలో 30 సర్పంచ్, 380 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు సర్పంచ్ స్థానాలకు, 85 వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 36 సర్పంచ్, 68 వార్డు పదవులకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం వెంటనే ఆ గ్రామంలోనే ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించారు. 8 సర్పంచ్ పదవులు, 14 వార్డులను టీడీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. సీపీఐ మద్దతుదారు ఒక సర్పంచ్ పదవిని గెలుచుకోగా, జనసేన మద్దతుదారులు 7 వార్డులను దక్కించుకున్నారు. జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన సర్పంచ్, వార్డుల స్థానాలు, గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలు -
పరువు కోసం టీడీపీ అడ్డదారులు
సాక్షి, తిరుపతి/అనంతపురం/పెనుకొండ/పలమనేరు (వి.కోట): వరుస ఓటములతో తీవ్ర పరాభవాల్ని మూటగట్టుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు కనీసం కుప్పం మున్సిపాల్టీలోనైనా పరువు నిలుపుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. అలజడులు సృష్టించి.. ప్రలోభాలకు గురిచేసైనా పార్టీని నిలబెట్టుకోవాలని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. ఇక్కడ అల్లర్లు సృష్టించి తద్వారా సానుభూతి ఓట్లు రాబట్టుకోవాలని పథక రచన చేశారు. ఇందులో భాగంగానే.. ప్రచారం ముగిశాక స్థానికేతరులందరూ కుప్పం నుంచి వెళ్లిపోవాలనే నిబంధన ఉన్నా టీడీపీ నేతలు దానిని ఏమాత్రం లెక్కచేయకుండా అక్కడే తిష్టవేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూన రవికుమార్, పలమనేరుకు చెందిన మాజీమంత్రి అమర్నాథరెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, మరో 230 మంది స్థానికేతరులు కుప్పంలోనే మకాం వేశారు. ఓటుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు పంచుతున్నారు. తమ అసలు మొబైల్ ఫోన్లను పోలీసులు ట్రాక్ చేస్తారనే ఉద్దేశంతో తాత్కాలికంగా వేరే నెంబర్లతో తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. వీరందరి కొత్త నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేశారు. దీనికి అడ్మిన్లుగా చంద్రబాబు, లోకేశ్ ఉంటూ ఎప్పటికప్పుడు ఏం చేయాలనే దానిపై వీరికి దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు.. ఓటర్లకు పెద్దమొత్తంలో డబ్బులు పంచేందుకు కూన రవికుమార్ ఆదివారం కుప్పానికి చేరుకున్నట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. పోలీసులను అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నందుకు నానా యాగీ ఇక మాజీమంత్రి అమర్నాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని కుప్పంలోకి వస్తుండగా పీఈఎస్ మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే రోడ్డుపై బైఠాయించి రచ్చరచ్చ చేశారు. టీడీపీ నేతలను కొడుతున్నారంటూ అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించారు. కుప్పం టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని గొడవను మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. మాజీ జెడ్పీటీసీ రాజ్కుమార్ అయితే మరో అడుగు ముందుకేసి వైఎస్సార్సీపీ నేతలు ఇంటికొచ్చి తనపై దాడిచేశారంటూ హడావుడి చేశాడు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు కుప్పానికి వచ్చిన ఉద్యోగులను చంద్రబాబు పీఏ మనోహర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఉద్యోగులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలిస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. పెనుకొండలో బరితెగింపు అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ ఆగడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎలాగైనా ఇక్కడ గెలవాలన్న ధ్యేయంతో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. సోమవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రలోభాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కీలక నేతలు పెనుగొండ చుట్టుపక్కల మకాం వేసి మద్యం, డబ్బు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున మద్యం తెప్పించి రహస్య ప్రాంతాల్లో నిల్వచేశారు. అలాగే, ఇప్పటికే విచ్చలవిడిగా మద్యంతోపాటు ఒక్కో ఓటుకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పంచారు. అయినా.. చాలాచోట్ల కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నామని గ్రహించిన ఆ పార్టీ నేతలు రెండోసారి డబ్బు పంపిణీకి పూనుకున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా నగదును బదిలీ చేస్తున్నారు. ఇక ప్రతీ ఇంటికీ ముక్కు పుడకలు కూడా అందించినట్లు తెలిసింది. ఆదివారం మరింత ఎక్కువగా ఈ ప్రలోభాలను కొనసాగించారు. ఇలా నిబంధనలను ఉల్లంఘించిన పార్టీ నేతలు బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల శ్రీరామ్ మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప చెప్పారు. మరికొందరు నేతలపైనా ఇలాగే కేసులు నమోదు చేశామని.. ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు.. చిలమత్తూరు జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సోమఘట్ట గ్రామంలో వలంటీర్లను బెదిరించారు. అలాగే, వైఎస్సార్సీపీ నేత నసనకోట ముత్యాలును ‘నువ్వెందుకురా ఇక్కడికొచ్చావ్.. చంపుతా’ అంటూ కాలర్ పట్టుకుని బెదిరించారు. -
కాసేపట్లో కౌంటింగ్..
-
ఏపీలో ప్రారంభమైన పంచాయతీ ఎలక్షన్స్
-
AP: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
ఎన్నికల ఫలితాలు Live Updates: ► సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. మరికొంత మంది గెలుపు బాటలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా: ► ఆలమూరు గ్రామ పంచాయతీ 8వ వార్డుకి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఎలుగు బంట్ల సత్యనారాయణ బూరయ్య 93 ఓట్లు మెజారిటీతో గెలుపు శ్రీకాకుళం జిల్లా: ►రేగిడి ఆమదాలవలస మండలం తోకల వలస పంచాయతీలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి సివ్వాల సూర్యకుమారి గెలుపు. విజయనగరం జిల్లా: ► భోగాపురం మండలం లింగాల వలస సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి బుగత లలిత 42 ఓట్ల మెజార్టీతో విజయం. ► లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ 7 వ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి లెంక శ్రీను 45 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ► నెల్లిమర్ల మండలం, ఏటి అగ్రహారం సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు మీసాల సూర్యకాంత 44 ఓట్లు మెజారిటీ తో గెలుపొందారు. ప్రకాశం జిల్లా : ► కంభం మండలం కందులాపురం 6వార్డు అభ్యర్థి బండారు వరలక్ష్మి 63 ఓట్లతో విజయం. ► మద్దిపాడు 5 వార్డు అభ్యర్థి నూనె శ్రీనివాసులు వైఎస్సార్సీపీ మద్దతుతో 99 ఓట్లతో ఘన విజయం. ► కొత్తపట్నంలో 7వ వార్డులో వైసీపీ అభ్యర్ధి పూరిణి సరోజిని 95 ఓట్లుతో విజయం. ► తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2 వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ పై టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి 30 ఓట్ల తేడతో విజయం. ► ఇంకోల్లుమండలంపూసపాడులో 5 వ వార్డులో టిడిపి అభ్యర్ది గోరంట్ల లక్ష్మీ తులసీ 101 ఓట్ల మోజార్టీ తో గెలుపు. ► కొండపి నియోజక వర్గం నిడమానూరు 12 వార్డు టీడీపీ అభ్యర్దీ కాకుమాను సుబ్బారావు 46 ఓట్లతో విజయం.. ► కందుకూరు మండలం నరిశెట్టి వారి పాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ముప్పాళ్ళ శ్రీనివాసరావు విజయం గుంటూరు జిల్లా: ► అచ్చంపేట మండలం అంబడిపూడి సర్పంచ్ గా కొమ్మవరపు స్వరాజ్యలక్ష్మి 159 ఓట్లతో గెలుపు. ► సత్తెనపల్లి మండలం పాకాలపాడు సర్పంచ్ గా తిప్పి రెడ్డి సుజాత వెంకట రెడ్డి 427 ఓట్లతో గెలుపు. ► వినుకొండ మండలం శివపురం సర్పంచ్గా కమతం సుబ్బమ్మ 452 మెజార్టీతో గెలుపు (వైఎస్సార్సీపీ) ► బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సర్పంచ్ గా బ్రహ్మం నాయక్ 153 ఓట్లతో గెలుపు(వైఎస్సార్సీపీ) విశాఖ జిల్లా ► అమలాపురం గ్రామంలో ఐదో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మేడపురెడ్డి నూకల తల్లి గెలుపు. ► పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయితీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన సాగేని చిన్నతల్లమ 155 ఓట్లు మెజారిటీతో గెలుపు. ► ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉపఎన్నికలో వైసీపీ బలపర్చిన మైకం భాగ్యవతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► భీమిలి రేఖవానిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీకి చెందిన సమ్మిడి శ్రీనివాసరావు గెలుపు చిత్తూరు జిల్లా ► గంగవరం మండలం తాళ్లపల్లిలో సర్పంచ్ ఉప ఎన్నికలలో 97 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ బలపరిచిన అభ్యర్థి శంకరమ్మ గెలుపు. కర్నూలు జిల్లా ► సిరివేళ్ళ గ్రామ పంచాయతీ లోని 18 వ వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున బి.పెదరాజు 253 ఓట్లతో గెలుపు. నంద్యాల మండలం భీమవరం గ్రామంలోని నాలగో వార్డు మెంబెర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టిడిపి మద్దత్తుదారుడు శాలి పెల జనార్దన్ రెడ్డి. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►సి బెళగల్ మండలం,యనగండ్ల గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దత్తు దారుడు ఇమ్మానియల్ 39 ఓట్లతో గెలుపు. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా టీడీపీ మద్దుతుదారు మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో గెలుపు. కృష్ణాజిల్లా ► కృష్ణా జిల్లాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ► సర్పంచ్ స్థానాలు వైసిపి -2 , టీడీపీ -2 గెలుపు ► వార్డు మెంబర్లు వైసిపి -8 ,టీడీపీ-1 , టిడిపి&జనసేన -2 గెలుపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ► కలిదిండి (మం) కలిదిండి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధిని మసిముక్కు మారుతీ ప్రసన్న 249 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం)ములకలపల్లి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నువ్వుల కోటేశ్వరరావు 57 ఓట్లతో గెలుపు ► నందివాడ (మం) పోలుకొండ సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్లతో గెలుపు ► ఘంటసాల (మం)మల్లంపల్లి సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధి బెల్లంకొండ అమలేశ్వరరావు 143 ఓట్లతో గెలుపు వార్డు ఎన్నికల ఫలితాలు ► తోట్లవల్లూరు (మం) రొయ్యూరులో 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజారిటీతో గెలుపు ► నూజివీడు (మం) బూరవంచ పంచాయతీ 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సయ్యద్ ఖిజర్ పాషా ఖాద్రి 28ఓట్లతో గెలుపు ► ఆగిరిపల్లి (మం) చినఆగిరిపల్లి పంచాయతీ 1వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి చన్ను సావిత్రి 21 ఓట్ల విజయం ► కలిదిండి (మం) కోరుకొల్లు12వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్థి యాళ్ళ పద్మ 146 ఓట్ల మెజార్టీతో గెలుపు ► ఘంటసాల (మం) దాలిపర్రు 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి దాసరి నాగరాజు 26 ఓట్ల మెజారిటీ తో విజయం ► చల్లపల్లి (మం) ఆముదార్లంకలో 2 వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నాగిడి శివ పార్వతి 23 ఓట్లతో విజయం ► పెడన (మం) నేలకొండపల్లి పంచాయితీ 6వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సమ్మెట నరేంద్ర కుమార్ 11 ఓట్ల మెజార్టీతో విజయం ► బంటుమిల్లి (మం) అర్తమూరు పంచాయతీ 8వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి మాకాళ్ళు వాసుదేవరావు 54 ఓట్ల మెజార్టీతో విజయం ► కోడూరు (మం) విశ్వనాధపల్లి 1వ వార్డు మెంబర్ గా టీడీపీ, జనసేన బలపరిచిన కొండవీటి విజయలక్ష్మి 10 ఓట్లతో గెలుపు ► మోపిదేవి (మం) కోసూరువారిపాలెం 4 వార్డు మెంబర్ గా జనసేన, టీడీపీ బలపరచిన అభ్యర్థిని చందన పద్మజ 69 ఓట్లతో విజయం ► ఆగిరిపల్లి (మం) ఆగిరిపల్లి పంచాయతీ 4వ వార్డు మెంబర్ గా టీడీపీ అభ్యర్ధి మల్లవల్లి స్పందన15 ఓట్ల మెజారిటీతో విజయం నెల్లూరు జిల్లా ► మనుబోలు మండలం, వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉపఎన్నికలలో వైఎస్సార్సీపీ బలపరిచిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో విజయం. అనంతపురం జిల్లా ► సోమందేపల్లి మండలం గుడిపల్లి నాలుగో వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో 5వ వార్డ్ మెంబర్గా వైఎస్సార్సీపీ అభ్యర్థి రామలక్ష్మి 8 ఓట్లతో విజయం. ► శెట్టూరు మండలం కైరేవు గ్రామ సర్పంచ్గా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి లక్మిదేవి 198 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం. ► కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం కైరేవు సర్పంచ్గా వైఎస్సార్సీపీ మద్దతుదారు లక్ష్మిదేవి విజయం. ► రాయదుర్గం మండలం 74- ఉడేగోళం 5వ వార్డు ఎన్నికలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రామలక్ష్మి విజయం. ► సోమందేపల్లి మండలం గుడిపల్లి 4వ వార్డు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రొద్దం మండలం చిన్నమంతూరు సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు సుబ్బమ్మ విజయం. ► పుట్లూరు మండలం కందికాపుల గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కురువ శివరామయ్య 157 ఓట్లతో ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లా ► తాడేపల్లిగూడెం మండలం పుల్లయ్యగూడెం వైఎస్సార్సీపీ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ► ఉండి మండలం చినపుల్లేరు 5వవార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన కందుల సుభాషిణి 30 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది. ► పోలవరం మండలం గూటాల గ్రామపంచాయతీ ఒకటో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఇందిరా ప్రియదర్శిని 60 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► పెదవేగి మండలం రాయన్నపాలెం ఐదవ వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధి అవిరినేని రమేష్ 23 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► కొవ్వూరు మండలం కాపవరం తొమ్మిదో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గొతం మేరీ ఝాన్సీ బాయి ఆరు ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామ పంచాయతీ 8 వార్దు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి కాపా సాంబశివరావు 67ఓట్ల మెజార్టీ తో విజయం. ► జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని వామిశెట్టి 892ఓట్ల మెజారిటీతో పావని విజయం. ► పోడూరుమండలం కొమ్ముచిక్కాల గ్రామ పంచాయతీ 9 వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సిపి బలపరిచిన అభ్యర్థి పాతపాటి కొండరాజు 61 ఓట్లు మెజార్టీతో విజయం. ► ఆచంట మండలం పెదమల్లం గ్రామం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దిరిశాల విజయలక్ష్మి 156 ఓట్ల తో మెజారిటీ గెలుపు. మధ్యాహ్నం రెండు గంటలకు పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జిల్లాలో పోలింగ్ పూర్తయ్యే సమయానికి 78.48 శాతం నమోదు.14027 మంది ఓటర్లకుగానూ 11,008 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలుకొండ (సర్పంచ్)74 శాతం కలిదిండి (సర్పంచ్) 76.79 శాతం ములకలపల్లి (సర్పంచ్) 88.59 శాతం మల్లంపల్లి (సర్పంచ్ ) 86.34 జిల్లాలోని మిగిలిపోయిన వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లి లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్. 88 శాతం నమోదైన పోలింగ్. 1429 కు గాను 1261 ఓట్లు పోల్ అయినట్లు ప్రకటించిన అధికారులు. విశాఖపట్నం విశాఖ జిల్లా పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 72.5 శాతం పోలింగ్. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 69.83% శాతం పోలింగ్ నమోదు. తూర్పు గోదావరి పెద్దాపురం మండలం జి.రాగంపేట లో ముగిసిన వార్డు మెంబర్ ఉప ఎన్నికలు. 301 ఓట్లకు గాను 243 ఓట్లు పోల్ అయ్యాయి. పశ్చిమగోదావరి - ఆచంట మండలం పెదమల్లం గ్రామ సర్పంచ్ పోలింగ్ పర్సంటేజ్ 73.40% - జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సర్పంచ్ పొలింగ్ 59.67 % - తాడేపల్లి గుడెం మండలం పుల్లాయి గుడెం సర్పంచ్ పోలింగ్ 86.81 % - పోడూరు మండలం కొమ్ముచిక్కాల తొమ్మిదవ వార్డు పోలింగ్ 81.20% - ఉండి మండలం చినపుల్లేరు ఐదవ వార్డు పోలింగ్ పర్సంటేజ్ 92.76% - పోలవరం మండలం గూటాల ఒకటో వార్డు కు ముగిసిన పోలింగ్. 85% పోలింగ్ నమోదు. - కొవ్వూరు మండలం కాపవరం 9 వార్డు కు ముగిసిన పోలింగ్. 91% పోలింగ్ నమోదు ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. మిగిలిపోయిన 36 సర్పంచ్లు, 68 వార్డులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ జరపనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. ►అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆర్కే ►గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 సర్పంచ్ స్థానాలకు 9 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీస్థాయిలో ఓటర్లు తరలివస్తున్నారు. పెదకాకానిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►రాష్ట్రంలో మిగిలిపోయిన పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనుంది. మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులకుగానూ 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్అయ్యాయి. ఇక ఆదివారం (నేటి నుంచి) మొదలు వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి. ఇప్పుడు అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇవికాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్ కొనసాగనుంది. ఇక ఆదివారం జరిగే ఎన్నికల్లో మొత్తం 1,00,032 మంది.. మున్సిపల్ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో ఉంటాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు. కోవిడ్ జాగ్రత్తలో అన్ని ఏర్పాట్లు : ఎస్ఈసీ స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా నగర కమిషనర్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను తెలుసుకుని సంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్ కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా, శుక్రవారం రాత్రికే ఆయా పొలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించినట్లు నీలం సాహ్ని వివరించారు. -
పల్లె గూటికి పండగొచ్చింది
సాక్షి, అమరావతి: కొత్త సర్పంచ్లు కొలువుదీరడంతో పల్లె గూటికి పండగొచ్చింది. రెండున్నరేళ్ల తరువాత పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో గ్రామాల్లో శనివారం నుంచి ప్రజా పాలన తిరిగి మొదలైంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్.. వార్డు సభ్యులుగా గెలుపొందిన వారంతా శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,099 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు సభ్యులుగా గెలిచిన 1.33 లక్షల మంది బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయా గ్రామాల్లో నిర్వహించిన తొలి పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ప్రజాప్రతినిధుల పాలన మొదలైంది. టీడీపీ హయాంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 2018 ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో కొత్త పాలకులు బాధ్యతలు చేపట్టారు. పల్లెకు కొత్త రూపు తెస్తా గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అని గాంధీ చెప్పిన మాటలు నిజం చేసేలా పల్లెకు కొత్త రూపు తీసుకువస్తా. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సమర్థంగా వినియోగించడంతో పాటు మరిన్ని పనులు చేపట్టేలా ప్రణాళిక తయారు చేసుకుంటున్నా. పచ్చదనం, తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుదల దిశగా మొదటి అడుగులేస్తున్నాం. – బీరం ఉమా, సర్పంచ్, తిమ్మారెడ్డిపల్లె, వైఎస్సార్ జిల్లా ప్రజావసరాలపై ప్రత్యేక దృష్టి 23 ఏళ్ల వయసులో నాకు గ్రామ సర్పంచ్గా అవకాశం వచ్చింది. ఇంటింటికీ తాగునీరు అందించడం నా ముందున్న ప్రధాన లక్ష్యం. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతా. గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటు ప్రభుత్వ వైద్యుడి నియామకం జరిగేలా కృషి చేస్తా. – ఎల్ల రాముడు, సర్పంచ్, గోవర్ధనగిరి, కర్నూలు జిల్లా జగనన్న అడుగుజాడల్లో నడుస్తా మొదటిసారి సర్పంచ్గా ఎన్నికయ్యా. పాలనలో మహిళలకు అధిక రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటా. ముఖ్యమంత్రి అడుగు జాడల్లో నడిచి.. ఆయన ఆశయం మేరకు సంక్షేమ పాలనను కొనసాగిస్తాను. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. – బోయ శృతి, సర్పంచ్,కెంచానపల్లి, అనంతపురం జిల్లా -
రెండుచోట్ల గెలవడం కొంప ముంచింది
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులతో పోటీపడి రెండు చోట్ల గెలిచాడు. ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాడు. కానీ.. చివరకు ఏ పదవీ ఆయనకు దక్కలేదు. అత్యంత అరుదైన, ఆసక్తికరమైన ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రులో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన చింతపర్రు సర్పంచ్ పదవితో పాటు గ్రామంలోని వార్డు పదవులకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అదే గ్రామానికి చెందిన పెనుమత్స వెంకట రామకృష్ణంరాజు 4, 5 వార్డుల్లో పోటీ చేశారు. రెండుచోట్లా ప్రత్యర్థుల్ని చిత్తు చేసి మరీ గెలిచారు. 4వ వార్డులో 243 మంది ఓటర్లు ఉండగా.. 212 ఓట్లు పోలయ్యాయి. మొత్తం నలుగురు అభ్యర్థులు రంగంలో ఉండగా రామకృష్ణంరాజు 44 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 5వ వార్డులోనూ 243 మంది ఓటర్లు ఉండగా.. 214 పోలయ్యాయి. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా.. 38 ఓట్ల మెజార్టీతో రామకృష్ణంరాజే గెలిచారు. ఆ తర్వాత వార్డు సభ్యుల ద్వారా పరోక్ష పద్ధతిన జరిగే ఉప సర్పంచ్ ఎన్నికల్లోనూ రామకృష్ణంరాజు పోటీపడి ఉప సర్పంచ్గానూ గెలుపొందారు. కానీ.. చివరకు వార్డు పదవితోపాటు ఉప సర్పంచ్ పదవికి సైతం ఆయన దూరం కావాల్సి వచ్చింది. ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో.. పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానానికి మించి పోటీ చేయకూడదు. కానీ.. రామకృష్ణంరాజు మాత్రం రెండు వార్డుల్లో పోటీ చేయడమే కాకుండా రెండుచోట్లా గెలిచారు. నిబంధనల కారణంగా.. ఆయన రెండు వార్డు పదవులతో పాటు ఉప సర్పంచ్ పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నికల నిబంధనావళి రూల్ నంబర్ 8(3) ప్రకారం.. ఒక అభ్యర్థి ఒకచోట కంటే ఎక్కువ చోట్ల నామినేషన్లు దాఖలు చేసిన పక్షంలో నామినేషన్ల ఉపసంహరణ తేదీ నాటికి అందులో ఏదో ఒకచోట తప్ప మిగిలిన చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్లన్నీ రద్దవుతాయి. ఈ నిబంధన విషయంలో పోటీ చేసిన అభ్యర్థితోపాటు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఉద్యోగికి సైతం అవగాహన లేకపోవడంతో రామకృష్ణంరాజుకు రెండుచోట్లా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రామకృష్ణంరాజు నిబంధనల్ని ఉల్లంఘించి ఎన్నికల్లో గెలిచారంటూ అయనపై పోటీ చేసిన ప్రత్యర్ధులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపించిన ఎన్నికల కమిషన్ ఆ రెండు వార్డుల ఎన్నికలతో పాటు ఉప సర్పంచ్ ఎన్నికనూ రద్దు చేసింది. దీంతో ఆయన అన్ని పదవులనూ కోల్పోవాల్సి వచ్చింది. రిటర్నింగ్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల ఈ పరిస్థితి ఎదురైనట్టు గుర్తించిన కలెక్టర్ స్టేజ్–1 రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కె.శ్రీరామమూర్తిని సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాచారం ఇచ్చారని తెలిసింది. ఆ రెండు వార్డుల ఎన్నికకు ప్రత్యేక నోటిఫికేషన్ చింతపర్రు గ్రామ పంచాయతీలో 4, 5 రెండు వార్డులతోపాటు ఉప సర్పంచ్ పదవికి తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు వార్డు పదవులకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికను కూడా చేపడతారు. ఇలావుండగా, రామకృష్ణంరాజు రెండు వార్డుల్లోనూ తిరిగి నామినేషన్ వేశారు. ఏ వార్డు అనుకూలమో నిర్ణయించుకుని రెండోచోట నామినేషన్ ఉపసంహరించుకుంటానని ఆయన తెలిపారు. -
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని హత్యాయత్నం
పుట్లూరు: పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయలేదని అనంతపురం జిల్లా తక్కళ్లపల్లిలో ఒక వ్యక్తిపై టీడీపీ కార్యకర్త బుధవారం హత్యాయత్నం చేశాడు. గత నెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తక్కళ్లపల్లి పంచాయతీలో టీడీపీ మద్దతుదారైన వార్డు అభ్యర్థికి ఓటు వేయలేదనే అక్కసుతో గురవయ్యపై ఆ పార్టీ కార్యకర్త సుధాకర్ రాళ్లతో దాడిచేశాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో గురవయ్యను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తాడిపత్రి రూరల్ సీఐ మల్లికార్జునగుప్తా పరిశీలించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
12 పంచాయతీలు, 725 వార్డులకు కొత్త నోటిఫికేషన్
సాక్షి, అమరావతి : ఎన్నికలు జరగని పంచాయతీలు, వార్డులకు కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సాంకేతిక కారణాలు, నామినేషన్లు దాఖలు కాని 12 పంచాయతీలు, 725 వార్డులకు బుధవారం ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసింది. వార్డులు, గ్రామాల వారీగా ఈనెల 4వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రదర్శన జరగనుంది. 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు.. 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.. 8వ తేదీ సా.5 గంటల వరకు నామినేషన్లపై ఫిర్యాదుల స్వీకరణ.. 9వ తేదీ నామినేషన్లపై వచ్చిన అప్పీల్ పరిశీలన.. 10 వ తేదీ మ.3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం 4 గంటలకి అభ్యర్ధుల తుది జాబితా విడుదల కానుంది. 13వ తేదీ రాత్రి 7.30 గంటలతో అభ్యర్ధుల ప్రచారం ముగియనుంది. 15వ తేదీ ఉ.6.30 నుంచి మ.3.30 గంటల వరకు పోలింగ్.. సాయంత్ర 4 గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. -
పంచాయతీ రీ కౌంటింగ్పై ఈసీ మరో కీలక ఉత్తర్వు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపులో ఎక్కడెక్కడ రీ కౌంటింగ్ జరిగింది? ఎందుకు నిర్వహించారు? తదితర అంశాలపై తనకు పూర్తి వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్నికలు జరిగిన ప్రతి చోట కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి వివరాలతో పంచాయతీలవారీగా నివేదికలు అందజేయాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 5లోగా నివేదిక ఇవ్వాలి ఓట్ల లెక్కింపు ఎన్ని గంటలకు మొదలైంది..? లెక్కింపు సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందా? కరెంటు సరఫరా ఎందుకు నిలిచిపోయింది? కౌంటింగ్ పూర్తయ్యాక ఓడిపోయిన అభ్యర్ధి ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకున్నారా? తదితర వివరాలు పంచాయతీల వారీగా స్పష్టంగా ఉండాలని పేర్కొంటూ నిర్ణీత ఫార్మాట్ను నిమ్మగడ్డ తాజాగా పంచాయతీరాజ్ శాఖకు పంపారు. ప్రతి పంచాయతీకి సంబంధించిన నివేదికలను ఈనెల 5లోగా పంపాలని పేర్కొన్నారు. ఎలా సాధ్యం? పంచాయతీల వారీగా రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు పంపే నివేదికలపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వేర్వేరుగా తమ అభిప్రాయాలను జోడించి ఎన్నికల కమిషన్కు పంపాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలు కాకుండా 10,890 పంచాయతీల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగిందని, భారీగా ఉన్న పంచాయతీలపై కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఏ ప్రాతిపదికన విడివిడిగా అభిప్రాయాలు వెల్లడించాలనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా మూడు రోజుల వ్యవధిలోనే ఒక్కో పంచాయతీలో రిటర్నింగ్ అధికారి నుంచి ఎంపీడీవోకు, అక్కడ నుంచి డీపీవో, జిల్లా కలెక్టర్లకు నివేదికలు అందడం, పరిశీలన జరిపి అభిప్రాయాలు తెలియచేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు అధికారుల్లో ఉత్పన్నమవుతున్నాయి. వివాదాలన్నీ ట్రిబ్యునల్లోనే.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పది రోజుల క్రితమే ముగిసింది. గెలిచిన సర్పంచి అభ్యర్ధులు, వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ గెలుపు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ఎలాంటి వివాదాలున్నా ఎన్నికల ట్రిబ్యునల్లోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, ముగిసిన ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉండదని పేర్కొంటున్నారు. ఇదంతా గందరగోళానికి గురి చేసేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
టీడీపీలో నైరాశ్యం
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం, మహారాణిపేట: పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నుంచి కోలుకోక ముందే మున్సిపల్ ఎన్నికల భయం టీడీపీని వణికిస్తోంది. సొంత జిల్లాలో సైతం పార్టీ కోలుకోలేని దెబ్బ తినడంతో తీవ్రంగా డీలా పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే కుప్పంలో పర్యటిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా టీడీపీ శ్రేణుల్లో నిస్పృహ ఆవరించింది. వరుస ఓటములతో ముఖ్య నాయకులు స్తబ్దుగా ఉండిపోవడం, కేడర్ నిస్తేజంగా మారడంతో ఈసారి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని స్పష్టమవుతోంది. ఎలాగూ ఓడిపోతామని తెలియడంతో చాలాచోట్ల టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. ఒకవైపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్నా ఇప్పటికీ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసుకోలేకపోవడం టీడీపీ దుస్థితికి అద్దం పడుతోంది. ఇక విశాఖలో సైకిల్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకపక్క పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువవడం మరోపక్కఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఓటు ఎలా అడగాలో అంతుబట్టక టీడీపీ నేతలు సతమతమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ ఇన్చార్జిలు లేకపోవడం, ఉన్నవారు ఎలాగూ గెలిచే పరిస్థితి లేదని అంటీముట్టనట్లు ఉండటంతో పోటీ చేసే అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. అనేక చోట్ల ముఖ్య నాయకులే చేతులెత్తేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల బాధ్యతలు భుజాన వేసుకోలేమని తప్పుకుంటున్నారు. దీంతో చంద్రబాబు జారిపోతున్న నాయకులు, కేడర్ను కాపాడుకోలేక నిత్యం ఏదో ఒక హడావుడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బెజవాడలో సిగపట్లు.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంపీ కేశినేని నాని అంతా తానే అనే రీతిలో వ్యవహరిస్తుండడం మిగిలిన నాయకులకు మింగుడు పడడంలేదు. నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గానికి సీట్లు ఇవ్వకపోవడంతో ఎన్నికల వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరులో దయనీయం.. గుంటూరు కార్పొరేషన్లో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మద్దాల గిరి టీడీపీని వీడడంతో పార్టీ కేడర్ చాలావరకూ ఆయన వెంటే నడిచింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్రను మేయర్ అభ్యర్థిగా ప్రకటించినా నగరంపై ఆయనకు పట్టు లేకపోవడంతో ఈ ఎన్నికల్లో పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విజిటింగ్ ప్రొఫెసర్లా పర్యటించినా ప్రయోజనం లేదని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేతులెత్తేసిన నేతలు.. తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసిన సుగుణమ్మ మౌనంగా ఉండటం, ఆమెపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉండడంతో తిరుపతి కార్పొరేషన్లో టీడీపీని నడిపించే వారు లేరు. కడప, కర్నూలు, ఒంగోలు, ఏలూరు, మచిలీపట్నం తదితర కార్పొరేషన్లలోనూ ఎన్నికల బాధ్యతను స్వీకరించే నాయకులు ఎవరూ టీడీపీలో కానరావడం లేదు. విశాఖలో సైకిల్ అస్తవ్యస్తం.. విశాఖపట్నం కార్పొరేషన్లో పురపోరుకు ముందే సైకిల్కు పంక్చరైంది. రెండు చోట్ల టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాకపోవడంతో వామపక్షాలకు సీట్లు కేటాయించాల్సిన దుస్థితి నెలకొంది. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సైతం ఎన్నికలకు ముందే పార్టీకి గుడ్బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ తరఫున అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో 72వ వార్డు సీపీఐకి, 78వ వార్డుని సీపీఎంకు కేటాయించారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగుస్తున్నా మంగళవారం రాత్రికి కూడా అన్ని వార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేయలేని దుస్థితి టీడీపీలో నెలకొంది. జీవీఎంసీ 8, 33 వార్డుల్లో స్థానికేతరులకు బీ ఫారాలు ఇచ్చారని నగర పార్టీ ఆందోళనకు కార్యకర్తలు దిగారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలోనే బాహాబాహీకి దిగడంతో వారిని వారించలేక ఆయన మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. కాగా ఎమ్మెల్యే గంటా ముఖ్య అనుచరుడు, పార్టీ సీనియర్ నేత కాశీ విశ్వనా«థ్ టీడీపీని వీడి బుధవారం రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్నారు. -
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి
తాడికొండ: పంచాయతీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న చంద్రబాబు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పన్నుతున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 153వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా చంద్రబాబు పర్యటన పేరిట అనుమతులు లేకుండా వెళ్లడమేగాక రాజకీయ లబ్ధి కోసం ఎయిర్పోర్టుల్లో నిరసనల పేరిట ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందే కుట్ర చేస్తున్నాడన్నారు. బహుజనుల హక్కులను హరించేలా బాబు కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే భవిష్యత్తులో బహుజనులు టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. -
జగన్ దెబ్బకు కుప్పానికి పరుగు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కొట్టిన దెబ్బకు చంద్రబాబు కుప్పం వీధులకు పరుగులు పెట్టాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్ దమ్మున్న నాయకుడని కుప్పంలో టీడీపీ శ్రేణులే కీర్తించడం విశేషమన్నారు. జగన్ భయానికి కుప్పం బాట పట్టిన చంద్రబాబు... ఓడిపోయింది తనా? ప్రజాస్వామ్యమా? ఇప్పుడు చెప్పాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. హామీలిచ్చి మోసం చేసే చంద్రబాబు మరోసారి అదే పనిచేస్తున్నాడని, టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం ఓ డ్రామా అని ధ్వజమెత్తారు. పులివెందులకు నీళ్లిచ్చానని, కుప్పానికి ఎందుకివ్వరని చంద్రబాబు ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కనీసం సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆయనే ఒప్పుకోవడం గమనించాలన్నారు. పులివెందులను వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి చేస్తే చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం అర్థరహితమన్నారు. ‘‘చంద్రబాబూ.. నువ్వు కుప్పాన్నే కాదు.. రాష్ట్రాన్నీ ఎక్కడా అభివృద్ధి చేయలేదు. అందుకే ప్రజలు నిన్ను తరిమికొట్టారు. మళ్లీ అధికారంలోకొస్తాననే పగటి కలలు మానుకో. పుంగనూరులో పోటీ చేస్తానంటున్నావంటే.. కుప్పాన్ని వదిలేసినట్టేగా?’’ అంటూ అంబటి చురకలేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ బొమ్మే దిక్కా? నామినేషన్ రోజు కూడా కుప్పం రాని చంద్రబాబు ఇప్పుడు నాలుగు రోజులపాటు మకాం వేస్తున్నాడు. అక్కడ 89 పంచాయతీల్లో 74 వైఎస్సార్సీపీ మద్దతుదారులే గెలుచుకున్నారు. కేవలం 14 మాత్రమే దక్కడంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. అక్కడే కాదు.. రాష్ట్రమంతటా జగన్ ప్రభంజనం ఆయనకు దడ పుట్టిస్తోంది. కుప్పంలో ఊరేగింపులు... అంతర్గత సమావేశాలు.. ఏం చేసినా జనం మాత్రం చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఆఖరుకు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టుకుని వెళ్లాల్సిన దయనీయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి దెబ్బకు భయపడ్డ చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారానికి వాడుకున్నారు. ఎన్నికలవ్వగానే అదే వ్యక్తి సినిమాలు కూడా చూడొద్దంటూ అంతర్గత ఆదేశాలిచ్చారు. లోకేష్లో ఏదో తేడా! సీఎం జగన్పై నారా లోకేష్ అసభ్య పదజాలంతో, పిచ్చిపిచ్చిగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. బహుశా ఆయనలో ఏదో తేడా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఆయన కుటుంబసభ్యులు మంచి డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం మేలు. లోకేష్.. నువ్వొచ్చాకే టీడీపీ పతనమైందని గుర్తుంచుకో. సైకిల్ తునాతునకలైంది నువ్వు అడుగుపెట్టాకే. నీ స్థాయేంటో తెలుసుకో. జగన్ గన్లో బుల్లెట్ లేకపోతేనే నువ్వు మంగళగిరిలో శంకరగిరిమాన్యాలు పట్టావా? కుప్పంలో టీడీపీ దిక్కులేని స్థితికెళ్ళిందా? లోకేష్.. సమాధానం చెప్పు. దొడ్డిదారిన మంత్రివయ్యావుగానీ.. సీఎం అయ్యే అర్హత నీకీ జన్మలో లేదు. జనసేన కూడా వైఎస్సార్సీపీని ప్రశ్నించడం విడ్డూరమే. ముందు ఎవరికో సేవ చేయడం ఆపేసి.. జనం వైపు వెళ్తే మంచిది. -
అంత్యక్రియలను అడ్డుకున్న ‘పంచాయతీ’
బుచ్చినాయుడుకండ్రిగ (చిత్తూరు జిల్లా): ‘పంచాయతీ’ ఎన్నికల సంగ్రామం ముగిసినప్పటికీ.. ఇంకా గ్రామాల్లో ఆ నిప్పుల కుంపటి చల్లారలేదు. ఎన్నికల సందర్భంగా తనకిచ్చిన మాట తప్పారనే కారణంతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను అడ్డుకుంది ఓ మహిళ. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని కొత్తపాళెం గ్రామంలో శ్మశానం పంట పొలాల మధ్యలో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా పొలాల్లో నుంచే మృతదేహాలను శ్మశానానికి తీసుకెళుతున్నారు. బుధవారం ముత్యాలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. బంధువులు ఆమె మృతదేహాన్ని తీసుకుని శ్మశానానికి బయలు దేరారు. అయితే పొలాల దారి మొదట్లో కాపురం ఉంటున్న బుజ్జమ్మ తన పొలం దారి నుంచి శవాన్ని తీసుకెళ్లవద్దంటూ దారికి అడ్డంగా కంచెను ఏర్పాటు చేసింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఏకగ్రీవంగా తమను ఎన్నుకుంటా మని, గ్రామానికి రూ.10 లక్షలు ఇవ్వాలని గ్రామ పెద్దలు తీర్మానం చేసి..అనంతరం మాట తప్పి పోటీ పెట్టి మోసం చేశారని, కాబట్టి తన భూముల నుంచి శవాన్ని తీసుకుపోయేందుకు వీల్లేదని బుజ్జ మ్మ అడ్డుకుంది. దీంతో వృద్ధురాలి శవంతో మూడు గంటల పాటు ఎండలో రోడ్డుపైనే బంధువులు నిరీ క్షించాల్సి వచ్చింది. విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడం తో ఆయన ఆదేశాల మేరకు తహసీల్దారు గణేష్, ఎస్ఐ ధర్మారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని బుజ్జ మ్మకు నచ్చజెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. -
తాజా నోటిఫికేషన్ అక్కర్లేదు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) హైకోర్టుకు నివేదించింది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్కు కొనసాగింపుగా ఈ నెల 18న ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ తెలిపారు. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకా మనుగడలో ఉండగా, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. ఇప్పటికే ఇదే అంశంపై వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ఈ వ్యాజ్యాన్ని కూడా వాటితో పాటు కలిపి విచారించాలని కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన కోర్టు ఈ వ్యాజ్యాన్ని కూడా ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులిచ్చారు. గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని, ఈ నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఈ దృష్ట్యా గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ పథకాన్ని అడ్డుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్పై తదుపరి విచారణ అవసరమో లేదో ఎన్నికల కమిషనర్తో మాట్లాడి చెబుతామన్నారు. ఇందుకు అంగీకరిం చిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ఎ.కె. గోస్వామి, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘చంద్రగిరి’లో 84% ఓట్లు వైఎస్సార్సీపీ అభిమానికే
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా ఎన్నికైన వైఎస్సార్సీపీ అభిమాని రికార్డుస్థాయిలో ఓట్లు సాధించారు. మొత్తం చెల్లిన ఓట్లలో దాదాపు 84 శాతం ఆమెకే వచ్చాయి. ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో సర్పంచిగా వైఎస్సార్సీపీ అభిమాని ముద్దికుప్పం రూప.. టీడీపీ మద్దతుదారుగా పోటీచేసిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బాపనపట్టు అమ్ములుపై 5,751 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పంచాయతీలో మొత్తం 8,987 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 198 ఓట్లు చెల్లలేదు. 116 ఓట్లు నోటాకు పడ్డాయి. మిగిలిన 8,673 ఓట్లలో రూపకు 7,212 ఓట్లు (దాదాపు 84 శాతం) వచ్చాయి. మొత్తం 18 వార్డుల్లోను వైఎస్సార్సీపీ అభిమానులే గెలిచారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చంద్రగిరి అభివృద్ధికి చేపట్టిన పనులతో వైఎస్సార్సీపీకి ప్రజలు మద్దతుగా నిలిచారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. -
ఏమీ సేతుర లింగా..
‘సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఎంతసేపు ప్రచారం కోసమే పాకులాడారు. దీనివల్లే తుదకు అభాసుపాలయ్యారు. ఇప్పుడు నిత్యం సమీక్షల మీద సమీక్షలు చేస్తూ లేని బలాన్ని ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదని చెప్పిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుప్పం పర్యటన అంటే చంద్రబాబు ఎంతగా భయపడి బెంబేలెత్తిపోతున్నారో ఇంతకంటే నిదర్శనం అవసరమా? అధినేతే ఇంతగా భయపడితే మా గతి ఏమిటి?’ అని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. సాక్షి, అమరావతి: మొన్నటి దాకా తనకు కంచుకోటలా ఉన్న కుప్పం నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో కూలిపోవడంతో చంద్ర బాబు తీవ్ర అంతర్మథనానికి లోనవుతున్నారు. 1989 నుంచి జరిగిన ఏ ఎన్నికల్లో అయినా గెలుస్తూ వస్తున్న చోట తొలిసారి ఓటమి ఎదురవ్వడంతో ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. 74 పంచాయతీల్లో తాను నిలబెట్టిన అభ్యర్థులు ఓడిపోవడం సామాన్య విషయం కాదని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీని ప్రభావం ఉంటుందనే ఆందోళన ఆయనతోపాటు ముఖ్య నాయకుల్లో వ్యక్తమవుతోంది. కుప్పం ఓటమి ప్రభావం రాష్ట్రం అంతటా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. తామే గెలిచామని చేసే ప్రచారం ప్రజలను నమ్మించేందుకే తప్ప, క్షేత్ర స్థాయిల్లో వాస్తవ పరిస్థితులు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయనే విషయం పార్టీలోని అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులకూ తెలుసని చెబుతున్నారు. పైకి వ్యక్తం చేయకపోయినా చంద్రబాబు కూడా ఇదే భయంతో ఆందోళన చెందుతున్నట్లు ఆ పార్టీ ప్రముఖుడు ఒకరు తెలిపారు. కానీ తన భయాన్ని బయట పెట్టకుండా తన ఓటమికి అధికార పార్టీయే కారణమని ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబుపై కుప్పం కార్యకర్తల ఆగ్రహం కుప్పం కార్యకర్తలు తిరుగుబాటు చేయడం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మంగళవారం జరిగిన కుప్పం నియోజకవర్గ సమావేశంలో.. పోటీ చేసిన అభ్యర్థులు ఒక్కసారిగా స్థానిక నేతలపై విరుచుకు పడడం అక్కడి పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. తమను బలవంతంగా పోటీ చేయించారని, నామినేషన్ వేశాక పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోయారు. కనీసం ప్రచారానికి సైతం నియోజకవర్గ, మండల నాయకులు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తమను వాడుకుని వదిలేశారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే చేస్తున్నారని నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్సీ గౌరువాని శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్చార్జ్ మునిరత్నం, పీఏ మనోహర్పై విరుచుకుపడ్డారు. దీంతో వాళ్లు ముగ్గురూ రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు, గ్రామాల్లో కీలక నాయకులు వారిని పట్టించుకోకుండా సమావేశం నుంచి వెళ్లిపోయారు. సర్దుబాటు సాధ్యమవుతుందా? ఈ నేపథ్యంలో చంద్రబాబు హుటాహుటిన శుక్రవారం కుప్పం వెళుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో దారుణ పరాజయం స్పష్ట మైన రోజే కుప్పంలో తనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గమనించిన ఆయన వైఎస్సార్ సీపీ దౌర్జన్యం వల్లే ఓడిపోయామనే పల్లవి అందుకున్నారు. కానీ కుప్పం నేతల సమావేశం తెలుగుదేశం పార్టీ పరిస్థితిని తేటతెల్లం చేయడం తో అందరికీ వాస్తవం అవగతమవుతోంది. కుప్పం పర్యటనలో పంచాయతీల వారీగా సమీక్షలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయిం చారు. ఈ సమీక్షల ద్వారా నాయకుల్లో భరోసా నింపాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ వీటివల్ల ప్రయోజనం లేదని, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇలా గే రోజూ సమీక్షలు చేసి, కొంప ముంచారని నాయకులు వాపోతున్నారు. అభ్యర్థులు, నాయ కులకు సరైన అండదండలు ఇవ్వకుండా, టెలీకాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లతో కాల క్షేపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేతల దాడి
కేవీబీపురం (చిత్తూరు జిల్లా): తమ పార్టీకి ఓటు వేయలేదన్న దుగ్ధతో వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేతలు దాడి చేసిన ఘటన మంగళవారం చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంజూరుకు చెందిన కె.శివయ్య వైఎస్సార్సీపీకి మద్దతుగా పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ నేత సి.శివయ్య అతడిపై తప్పుడు ప్రచారం చేస్తూ దూషణకు పాల్పడ్డాడు. కె.శివయ్య నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు సి.శివయ్య, వెంకటేశులు, చంద్రశేఖర్, ప్రకాశ్లు ఇంట్లో నిద్రిస్తున్న కె.శివయ్యపై దాడికి పాల్పడి ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కె.శివయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యం, భార్య ద్రాక్షాయణికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన నలుగురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. శివయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
సంక్షేమమే శ్వాసగా..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఇది ప్రతిబింబించిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే పురపాలక, పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షించారు. శాశ్వత విజయానికి ప్రజల విశ్వాసం పొందడమే నేటితరం రాజకీయమని సూచించారు. ఆ దిశగా ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పునాదులు పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ వివరాలివీ.. ప్రజలే మనకు శ్రీరామరక్ష.. పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం విజయంతో వైఎస్సార్సీపీకి జనం మద్దతివ్వడానికి సుపరిపాలనే కారణమని పలువురు మంత్రులు ప్రస్తావించారు. ఏడాదిన్నరగా అమలవుతున్న పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. విశ్వసనీయతే కొలమానంగా సరికొత్త రాజకీయాలు తెచ్చామని, ప్రజలను ఓటుబ్యాంకుగా భావించే వారెవరూ ప్రజా మద్దతు కూడగట్టలేరన్న భావనను సీఎం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వాన్ని ఎంతకైనా తెగించి కాపాడుకునేందుకు సిద్ధమవుతారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతాన్ని అన్ని వేళలా గుర్తించాలని సూచించారు. విష ప్రచారాన్నే నమ్ముకున్న విపక్షం ఏ ఎన్నికల్లోనైనా ప్రజల్లోకి వెళ్లేందుకు సంక్షేమ పథకాలే వైఎస్సార్సీపీ బ్రహ్మాస్త్రాలుగా మంత్రివర్గం భావించింది. పథకాల అమలులో లోపాలను గుర్తించే సత్తాలేని టీడీపీ విష ప్రచారాన్ని నెత్తికెత్తుకున్న తీరుపై సమావేశంలో చర్చ జరిగింది. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని సీఎం గుర్తు చేశారు. ఈ దిశగా అన్ని వ్యవస్థలను వాడుకునేందుకు ఏమాత్రం వెనుకాడబోదని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడం, మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలను ముందుకు తేవడం లాంటి కుట్రలు జరిగాయన్నారు. సున్నితమైన అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటూ టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. విపక్షం విమర్శలను తిప్పికొట్టడం ఎంత ముఖ్యమో ప్రజలకు సంక్షేమ ఫలాలను నిబద్ధతతో అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదన్న బలమైన సంకేతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తే తప్పుడు ప్రచారం చేసే విపక్షం వైఖరిని ప్రజలే అర్థం చేసుకుంటారని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేంద్రంపై తెస్తున్న ఒత్తిడిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ పోరాటానికైనా సిద్ధమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చిందని, టీడీపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని చెప్పారు. పథకాలే ఊపిరి.. పేదలు, బడుగు వర్గాల స్థితిగతులను మార్చే దిశగా తెస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పథకాల రూపకల్పనతోనే సరిపోదని క్షేత్రస్థాయిలో అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఇంటి వద్దకే చేరవేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, గత ప్రభుత్వాలకు భిన్నంగా సాగుతున్న పారదర్శక పాలనను స్వాగతిస్తున్నారని తెలిపారు. దీన్ని దెబ్బతీసేందుకు విపక్షం చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు మరింత కృషి చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేసే ప్రయత్నంలో ఎక్కడైనా సమస్యలొస్తే తక్షణం పరిష్కరించాలన్నారు. సంక్షేమమే ఊపిరిగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని సీఎం ప్రస్తావించారు. హామీలు నిలబెట్టుకోవడంలో వైఎస్సార్సీïపీ ప్రభుత్వ విశ్వసనీయతను ప్రజలే ప్రశంసిస్తున్న కారణంగా విపక్షం వేలెత్తి చూపలేక పోతోందన్నారు. -
టీడీపీ మద్దతుదారులకు ఆరు చోట్ల ‘0’
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మరోసారి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. 175 నియోజకవర్గాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఆరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఖాతా కూడా తెరవలేకపోయారు. పుంగనూరు, మాచర్ల, పులివెందుల, జమ్మలమడుగు, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో విపక్షం మద్దతుదారులు ఒక్కటంటే ఒక్క పంచాయతీలో కూడా గెలవలేదు. మరో 39 నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ పంచాయతీలకే పరిమితమయ్యారు. అందులో చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరితోపాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కూడా ఉండడం విశేషం. నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏ జిల్లాలోనూ టీడీపీ మద్దతుదారులు ప్రభావం చూపలేకపోయారు. 13,081 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం 2,100 పంచాయతీలకే ఆ పార్టీ మద్దతుదారులు పరిమితమయ్యారు. అంటే 16 శాతం సీట్లనే గెలుచుకోగలిగారు. కానీ ఓటమిని ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురుదాడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 41 శాతం పంచాయతీల్లో తాము గెలిచినట్లు ప్రకటించిన చంద్రబాబు 4,230 పంచాయతీలు తమ ఖాతాలో పడినట్లు చెప్పారు. ఈ లెక్క ఏమిటో టీడీపీ నాయకులకే అంతుబట్టని విధంగా మారింది. ఆయన చెప్పిన శాతానికి, గెలిచిన పంచాయతీలకు ఏమాత్రం పొంతన లేకపోవడం విశేషం. ఆయన చెప్పినట్లు గెలిచిన పంచాయతీలను బట్టి చూస్తే అది 32 శాతమే. కానీ 41 శాతం ఏమిటనే దానికి సమాధానం లేదు. పోనీ గెలిచిన పంచాయతీలు ఏవో చూపించమన్నా సరైన స్పందన లేదు. చాలా చోట్ల తామే గెలిచినా అధికారులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచినట్లు ప్రకటించారని, కరెంటు కట్ చేసి దౌర్జన్యం చేశారని ఎదురుదాడికి దిగారు. వాస్తవానికి చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నాయకులు సొంత నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోలేకపోయారు. ‘అనంత’లో నామమాత్రం.. అనంతపురం జిల్లాలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ కుదేలైంది. అక్కడ కేవలం 8 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. ఈ నియోజకవర్గంలో మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి పట్టున్న కిరికెర, లేపాక్షి, చిలమత్తూరు, కోడూరు పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు నెగ్గారు. హిందూపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి సొంత గ్రామం రొద్దంలో వైఎస్సార్సీపీ గెలుపొందింది. ఆయన నివసిస్తున్న వార్డులో కూడా టీడీపీ ఓడిపోవడం విశేషం. చంద్రగిరిలో రెండు చోట్ల మాత్రమే.. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో 89 పంచాయతీలకు గానూ కేవలం 14 చోట్లే టీడీపీ మద్దతుదారులు గెలిచిన విషయం తెలిసిందే. ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీ మద్దతుదారులు రెండు పంచాయతీల్లో గెలుపొందారు. ఈ నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలో ఒక్క పంచాయతీని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గమైన శ్రీకాళహస్తిలో 121 పంచాయతీలకు టీడీపీ ఒకే ఒక పంచాయతీలో గెలిచింది. మదనపల్లి నియోజకవర్గంలో అతి తక్కువగా ఆరు పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు. కడప, కర్నూలులో విపక్షం కకావికలం.. ► వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీని కూడా టీడీపీ దక్కించుకోలేకపోయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ ఖాతా తెరవలేకపోయింది. ► కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్తోనే సరిపెట్టుకుంది. ఆదోని–5, ఎమ్మిగనూరు–6, నంద్యాల–2, శ్రీశైలంలో 7 పంచాయతీలను మాత్రమే ఆ పార్టీ మద్ధతుదారులు గెలుచుకున్నారు. ► నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు ఒక్క పంచాయతీని కూడా గెలుచుకోలేకపోయారు. కావలి నియోజకవర్గంలోనూ నాలుగు పంచాయతీలకే పరిమితమయ్యారు. మాచర్లలో అధికార పార్టీ క్లీన్ స్వీప్.. ► గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. ఇక్కడ వైఎస్సార్సీపీ మద్దతుదారులు క్లీన్స్వీప్ చేశారు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజవర్గంలో కేవలం 9 పంచాయతీలను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. రాజధాని గ్రామాలకు ఆనుకుని ఉన్న చోట్ల కూడా టీడీపీ ఓడిపోయింది. రాజధాని పక్కనే ఉన్న తాడికొండ, అమరావతి మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. గురజాల నియోజకవర్గంలో మూడు, నర్సరావుపేట–1, తెనాలిలో 7 పంచాయతీలను మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. కృష్ణాలో సైకిల్ బోల్తా ►కృష్ణా జిల్లాల్లో టీడీపీ పరిస్థితి దిగజారింది. మచిలీపట్నం 4, పెనమలూరు 6, మైలవరం 7, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 8 పంచాయతీలు మాత్రమే ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు. ► పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో మూడు, కొవ్వూరులో 7, తణుకులో 8 పంచాయతీల్లో మాత్రమే గెలిచింది. దెందులూరు నియోజకవర్గం పరిధిలోని ఏలూరు రూరల్ మండలంలో కొల్లేటి లంకల్లో ఒకే ఒక గ్రామాన్ని టీడీపీ గెలుచుకోవడం విశేషం. గతంలో ఈ గ్రామాలన్నీ టీడీపీకి కంచుకోటలుగా ఉండగా ఇప్పుడు అవి కూలిపోయాయి. ‘తూర్పు’న సింగిల్ డిజిట్... ► తూర్పుగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్ పంచాయతీలనే గెలుచుకుంది. కాకినాడ రూరల్ 1, పిఠాపురం 5, ముమ్మిడివరం 8, పెద్దాపురం 6, రామచంద్రాపురం 2, అనపర్తి 7, తుని 3, మండపేటలో 6 పంచాయతీలను మాత్రమే ఆ పార్టీ మద్దతుదారులు గెలవగలిగారు. భీమిలీలో నిల్... ► విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో తొమ్మిది పంచాయతీలనే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. భీమిలి నియోజకవర్గంలో భీమిలి మండలంలో ఒక్క పంచాయతీని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. నాలుగో విడతలో 117 పంచాయతీలకు ఎన్నికలు జరిగి™తే కేవలం 24 పంచాయతీలకు పరిమితమైంది. నేతల సొంత గ్రామాల్లోనూ టీడీపీ కుదేలు.. ► శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో 5 పంచాయతీలను మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావుకు పట్టున్నట్టు చెప్పుకునే రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఆ పార్టీ నామమాత్రంగానే పంచాయతీలను గెలుచుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ సొంత నియోజకవర్గంలో టీడీపీ చతికిలపడింది. టీడీపీ ముఖ్య నాయకులు గౌతు శ్యాంసుందర్ శివాజీ, కూన రవికుమార్, బెందాళం అశోక్, కలమట వెంకటరమణ, ప్రతిభా భారతి, కొండ్రు మురళీమోహన్ సొంత గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఓడిపోయారు. ► విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో 7 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. నాలుగో విడతలో ఇక్కడ 239 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 50 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. 40 ఏళ్ల పాటు ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి విముక్తి లభించింది. ఎన్నో ఏళ్లుగా టీడీపీ చేతుల్లో ఉన్న ఆ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయఢంకా మోగించారు. గ్రామస్తులంతా సోమవారం ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. -
నీకు కుప్పంలోనే దిక్కు లేదు: మంత్రి అనిల్
సాక్షి, తాడేపల్లి: భారతదేశ చరిత్రలోనే ఓడిపోతే సంబరాలు చేసుకునేది ఒక్క టీడీపీ మాత్రమేనని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. 81 శాతం స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తే కేవలం 16 శాతం సాధించిన టీడీపీ సంబరాలు జరుపుకోవడం ఏంటని విమర్శించారు. పైగా ప్రతి విడతలో టీడీపీ పుంజుకుంది అని బాబు చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన వల్ల రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు తమకు విజయాన్ని అందించారన్నారు. టీడీపీకి వచ్చిన 16 శాతం కూడా వైఎస్సార్సీపీ రెబల్స్ వల్ల వచ్చిందని, లేదంటే సింగిల్ డిజిట్కే పరిమితమయ్యేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 41 శాతం స్థానాలు గెలిచామని బాబు అభూత కల్పన చేస్తున్నారని, దమ్ముంటే ఏ జిల్లాలోనైనా మీ వాళ్లకు కండువా వేసి చూపించగలవా? అని సూటిగా ప్రశ్నించారు. క్షుద్రపూజలు చేయించింది నువ్వు.. "చంద్రగిరిలో 104 వైఎస్సార్సీపీ గెలిస్తే, 4 టీడీపీ గెలిచింది. నారావారిపల్లెలో కేవలం 8 వార్డులు గెలిచి సంబరాలు చేసుకున్నారు. నీ సొంత ఇలాకాలోనే 20 శాతం సాధించలేని నువ్వు 41 శాతం గెలిచావా..? సర్పంచ్ ఎన్నికలకు 25 ప్రెస్ మీట్లు పెట్టిన ఘనుడు చంద్రబాబు. వైఎస్సార్సీపీ పతనం అయ్యిందా...? ఎక్కడో చూపించు. కుప్పంలోనే దిక్కు లేదు, అలాంటిది మరో 10శాతం అదనంగా వచ్చేవి అనడానికి సిగ్గులేదా? రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి. టీడీపీ అంపశయ్యపై నుంచి చితిలో పడిపోయింది. ఏ దిక్కు లేక స్వరూపానందపై పడ్డాడు...క్షుద్రపూజలు అంటాడు. క్షుద్రపూజలపై పేటెంట్ ఒక్క చంద్రబాబుకే ఉంది. దుర్గగుడి, కాళహస్తిలో నీ కొడుకు కోసం క్షుద్రపూజలు చేయించింది నువ్వు. కేపిటల్ జోన్ అంటున్న తాటికొండలో కూడా మేము 70 శాతం గెలుచుకున్నాం. ప్రజలు 81 శాతం సీట్లు ఇచ్చి సీఎం జగన్పై నమ్మకాన్ని ఉంచారు. అందుకు ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఇక బూతుల్లో గెలిచి సంబరాలు చేసుకునే స్థాయికి టీడీపీ దిగజారుతుంది. ఈ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్రకు కూడా పనికిరాడని ప్రజలు తీర్పిచ్చారు." చంద్రబాబుకు ఆ అర్హత లేదు "మేము అధికారంలో ఉండటానికి అర్హత లేదని చెప్పే అర్హత చంద్రబాబుకు అసలే లేదు. ఓ పక్క నువ్వు పెట్టిన నిమ్మగడ్డ అంతా బాగా జరిగిందని అంటే నువ్వేమో రావణకాష్టం అంటావు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. అయినా ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ఉంది చంద్రబాబు తీరు. వాళ్ళు గెలిచిన 16 శాతం చోట్లలో ఎన్నికలు బాగా జరిగినట్లా? 81శాతం గెలిచిన చోట ఎన్నికలు బాగా జరగలేదా? కౌంటింగ్ కేంద్రాల వద్ద కరెంట్ తీయడం కాదు, వాళ్ల కరెంట్ కట్ అయ్యింది ఇంకా చంద్రబాబు ఆలాంటి గొప్ప వారసుడిని పెట్టుకుని అధికారంలోకి వస్తాను అనడం పగటికల. 2024లో కూడా మా ముఖ్యమంత్రి కూల్గా ఆ సీట్లో కూర్చుంటారు" అని మంత్రి అనిల్ కుమార్ కరాఖండిగా చెప్పారు. చదవండి: ‘మా నాయకుడు కుప్పంలో చుక్కలు చూపించారు’ నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..! -
పంచాయతీ ఎన్నికలు; ‘అనంత’లో రికార్డ్ మెజారిటీ
సాక్షి, గోరంట్ల: తుది విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లాలో భారీ మెజారిటీ నమోదైంది. గోరంట్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీచేసిన సరోజ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీ పరిధిలో గోరంట్ల, సింగిరెడ్డిపల్లి, గుమ్మయ్యగారిపల్లి, కసిరెడ్డిపల్లి, తిరగంవాండ్లపల్లి గ్రామాలు, 20 వార్డులు న్నాయి. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. వైఎస్సార్సీపీ మద్దతుతో సరోజ బరిలో నిలవగా.. టీడీపీ మద్దతుతో రంగమ్మ పోటీపడ్డారు. ఇక్కడ మొత్తం 19,616 మంది ఓటర్లుండగా.. 13,565 మంది (69.03 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. సరోజ 5,599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెళ్లి పీటల నుంచి పోలింగ్ కేంద్రానికి.. మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని చందకచెర్లు ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో నూతన వధూవరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరువపల్లి గ్రామానికి చెందిన కోటానాయక్, కొత్తలం తండాకు చెందిన లావణ్యబాయికి ఆదివారం పావగడలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని నవ దంపతులు చెప్పారు. అలాగే అనంతపురం జిల్లా పరిగికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు వినయ్రెడ్డి, శ్రావణిల వివాహం ఆదివారం జరిగింది. మాంగల్యధారణ తర్వాత నూతన వధూవరులు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం -
తుదిదశ పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ దాష్టీకం
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయం.. నాలుగో విడత ఎన్నికల్లోనూ ఓటమి తప్ప దని తెలియడం.. వెరసి పల్లెపోరు తుదిదశలోను ఆదివారం టీడీపీ మద్దతుదారులు చెలరేగిపోయారు. కుట్రలకు తెరతీసి వీరంగం వేశారు. ఓవైపు పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించడంతో పాటు మరోవైపు శాంతిభద్రతల సమస్యలు తలె త్తేలా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబ డ్డారు. తమకు ఓటు వేయకపోతే అంతుచూస్తా మంటూ ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బెదిరించడంతోపాటు దాడులు చేశారు. మొదటి మూడు విడతల పోలింగ్లో ఓటమికి ప్రతిగా దాడులు కొనసాగి స్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తను హత్యచేశారు. గుంటూరు జిల్లాలో దళితులపై దాడిచేశారు. ప్రకాశం జిల్లాలో మహిళ మీద దాడిచేసి ఇంట్లో సామగ్రి ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండిళ్లపై దాడిచేసి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లపైనా దాడి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం ఐదో వార్డు ఏజెంట్ అన్నవరపు బాబురావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావును ఆస్పత్రికి తరలించారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బాబురావు కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధుడు నడవలేకపోవడంతో వైఎస్సార్సీపీ అభిమాన అభ్యర్థి తరఫున ఏజెంట్గా ఉన్న ఫకీరయ్య సాయం చేశారు. దీన్ని తప్పుబట్టిన టీడీపీ మద్దతుదార్ల ఏజెంట్లు ఫకీరయ్యతో వాగ్వాదానికి దిగడమేగాక కుర్చీతో ఆయనపై దాడిచేశారు. దీంతో ఫకీరయ్య వర్గీయులు ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాల మధ్య జరిగిన కుర్చీల దాడిలో ఫకీరయ్య గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఫకీరయ్యను ఆస్పత్రికి తరలించారు. దొంగ ఓట్లను.. ప్రశ్నించినందుకు.. సత్తెనపల్లి మండలం ఫణిదంలో టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం అందడంతో వైఎస్సార్సీపీ అభిమానులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారితో టీడీపీ వారు వాగ్వాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరగడంతో పోలీసులు లాఠీలు ఉపయోగించి చెదరగొట్టారు. లక్కరాజు గార్లపాడులో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లలోపు నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ అభిమానులతో వాగ్వాదానికి దిగారు. పెదకూరపాడు మండలం కంభంపాడు ఎస్సీ కాలనీకి చెందిన దివ్యాంగుడైన ప్రభాకర్తో ఆయన బంధువు సురేశ్ ఓటు వేయించి తీసుకెళుతుండగా పోలింగ్ కేంద్రం బయట ఉన్న టీడీపీ వర్గీయులు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. దీంతో సురేశ్ పెదకూరపాడు పోలీస్స్టేషన్లో టీడీపీ వర్గీయులపై ఫిర్యాదు చేశారు. ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో రెండువర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విశాఖ జిల్లా భీమిలి మండలం తాటిచూరు గ్రామంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎస్ఐ ఒక గ్రామస్తుడిని కొట్టడంతో ఆగ్రహి ంచిన గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అమ రావతి మండలం ఉంగుటూరు పోలింగ్ కేంద్రం లోకి టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశిస్తుండగా వైఎస్సార్సీపీ అభిమానులు అడ్డు కున్నారు. రెండువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉంగుటూరు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 15 మంది చావపాడులో ఓటు వేయడానికి రావడంతో వైఎస్సార్సీపీ అభిమానులు అడ్డుకున్నారు. నాలుగు కుటుంబాలపై దాడి సత్తెనపల్లి: దళితులు మా చెప్పుచేతల్లో ఉండాలి.. మాకే ఎదురు నిలబడతారా.. ఏమనుకుంటున్నారు.. అంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో నాలుగు దళిత కుటుంబాలపై టీడీపీ వర్గీయులు ఆదివారం రాత్రి దాడిచేశారు. లక్ష్మీపురం పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాని ఆచంట సుబ్బారావు, టీడీపీ మద్దతుదారు వల్లెపల్లి శ్రీనివాసరావు సర్పంచి పదవికి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసరావు గెలవడంతో టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రెండు ట్రాక్టర్లతో విజయోత్సవం నిర్వహిస్తూ బాణసంచా కాల్చారు. దళితుల గృహాల వద్దకు రాగానే ‘మాకే ఎదురు నిలబడతారురా.., కులం తక్కువోళ్లు మేము చెప్పినట్టు చేయాలి..’ అంటూ కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఎస్సీ కాలనీకి చెందిన నందం వెంకటేశ్వరరావు, నందం సాంబశివరావు, పి.బెంజిమన్, తారా జయమ్మ, కె.సామ్రాజ్యం గాయపడ్డారు. టీడీపీకి చెందిన మేడూరి కన్న, మేడూరి రవి, బొద్దులూరి చంద్రశేఖర్, పంచుమర్తి శ్రీనివాసరావు, బొద్దులూరి శేఖర్, బొత్తులూరి శ్రీను, కొర్లకుంట నరేంద్ర, బొద్దులూరి అశోక్, కనగాల సందీప్, గోగినేని రామకృష్ణ, అల్లంనేని ప్రసాద్, జి.రమేష్, కె.నరేంద్ర, బి.శ్రీను, మరో పదిమంది కర్రలు, రాళ్లతో దాడిచేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓడిపోయామని దాడి.. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఆదివారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమాని తిప్పిరెడ్డి వెంకటరెడ్డి.. టీడీపీ మద్దతుదారుడు కె.సాంబయ్యపై 353 ఓట్ల మెజార్టీతో సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం వైఎస్సార్సీపీ అభిమానులు గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేస్తుండగా.. ఓటమి పాలైన సాంబయ్య తాలూకు కొందరు రాళ్లు రువ్వి ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ అభిమాని కె.నర్సిరెడ్డి గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వచ్చిన సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య ఎన్నికల్లో రాజీచేస్తావా.. అంటూ చంపేసిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్ జిల్లాలో దారుణం బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండ లం ముడుమాల గ్రామంలో టీడీపీ వర్గీయులు ఆదివారం వైఎస్సార్సీపీ కార్యకర్త ముడుమాల భాస్కర్రెడ్డి (52)ని దారుణంగా హత్యచేశారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల కథనం మేరకు.. ముడుమాల, పలుగురాళ్లపల్లె పంచా యతీల సర్పంచులుగా వైఎస్సార్సీపీ అభిమా నులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని జీర్ణించుకో లేని పలు గురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు మీసాల దుగ్గిరెడ్డి, ఆయన అనుచరులు ఆదివారం ముడుమాల, జౌకుపల్లె గ్రామాల మధ్యలో భాస్కర్రెడ్డితో ఘర్షణకు దిగారు. ‘నువ్వు రాజీచేస్తావా..’ అం టూ ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టారు. భాస్క ర్రెడ్డి కుప్పకూలిపోవడంతో వారు పారిపో యారు. ఈ విషయం తెలిసి భాస్కర్రెడ్డి కుటుం బసభ్యులు అక్కడికి చేరుకుని 108 వాహనంలో అతడిని బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బ్రహ్మంగారిమఠం పోలీసులు.. హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకుగురైన భాస్కర్రెడ్డి గుడిసెకు నిప్పు.. మొక్కజొన్న తోట ధ్వంసం కుప్పంరూరల్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలో పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీవారు దారుణంగా ఓడిపోవడంతో తట్టుకోలేని టీడీపీ వారు వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తు న్నారు. కుప్పం మండలం గుడ్లనాయనపల్లి పం చాయతీ ఊరునాయునిపల్లెలో శనివారం రెండు ఇళ్ల మీద దాడిచేయడమేగాక గుడిసెకు నిప్పం టించారు. మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. ఈ పంచాయతీ సర్పంచిగా వైఎస్సార్ï Üపీ అభిమాని ఝాన్సీరాణి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్ర శేఖర్, పవన్కల్యాణ్, చంద్రబాబు, మురుగేష్, లక్ష్మీపతి, కదిరప్ప, మరో ఇద్దరు టీడీపీ వ్యక్తులు వైఎస్సార్సీపీ అభిమానులైన బాలాజీ, కృష్ణమూర్తి ఇళ్ల మీద దాడిచేశారు. కృష్ణమూర్తి పొలంలోని గుడిసెకు నిప్పుపెట్టి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. భయాందోళనలకు గురైన కృష్ణమూర్తి, బాలాజీ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ఆహుతైన కృష్ణమూర్తి గుడిసె, ధ్వంసమైన మొక్కజొన్న తోట మహిళపై దాడి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం పొన్నలూరు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని తిమ్మపాలెంలో ఆదివారం తాను చెప్పిన వారికి ఓటు వేయలేదని ఓ మహిళపై గ్రామ టీడీపీ నాయకుడు దాడిచేశాడు. ఈ విషయమై బాధితురాలు బోడా మధుబాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. ఈనెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఈ పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాన అభ్యర్థి విజయం సాధించారు. ఇది జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ వ్యక్తులు రెండు రోజులుగా గ్రామంలో చిన్నచిన్న గొడవలకు దిగారు. ఈ క్రమంలో ఆదివారం బోడా శ్రీను.. వైఎస్సార్సీపీ మద్దతదారుడికి ఓటేశావంటు మధుబాలపై దాడిచేశాడు. దుర్భాషలాడుతూ ఆమె ఇంటి ముందు ఉన్న పందిరిని కూలదోసి, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశాడు. శ్రీను నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇంటిపై దాడిచేసి కూలదోసిన పందిరి -
పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమానుల గెలుపు సంపూర్ణమైంది. నాలుగో విడతలోనూ జైత్ర యాత్ర కొనసాగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు పల్లె ప్రజలు నాలుగు విడతల్లోనూ జైకొట్టారు. పాలనలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పల్లె ముంగిటకు తెచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆలోచనకు గ్రామీణ ప్రజానీకం మొత్తం సానుకూలంగా స్పందించి బ్రహ్మరథం పట్టారు. కుయుక్తులతో రాజకీయాలను నడపాలని ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీకి ప్రజలు ఓటుతో చావు దెబ్బ కొట్టారు. తెలుగుదేశం కంచుకోటలుగా జబ్బలు చరుచుకున్న ఆ పార్టీ నేతలకు దిమ్మ తిరిగే తీర్పును ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం గమనార్హం. కుప్పంలో వైఎస్సార్సీపీ అభిమానులు భారీ విజయం నమోదు చేయడం.. టీడీపీ పతనానికి ప్రత్యక్ష సాక్ష్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 13,097 గ్రామాల్లో ఎన్నికలు జరిగితే... మొత్తం నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా, నాలుగు విడతల్లో కలిపి 13,097 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో మొత్తంగా 10 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. ఒకటి, రెండు, మూడవ విడతల్లో ఎన్నికలు జరిగిన వాటిలో 7,869 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులను వైఎస్సార్సీపీ అభిమానులు చేజిక్కించుకున్నారు. నాలుగో విడతలోనూ ఆదివారం రాత్రి 12.30 గంటలకు అందిన సమాచారం మేరకు 80 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ తీర్పు ముఖ్యమంత్రి ప్రజా రంజక పాలనకు నిదర్శనం అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ఓటర్లు ఒక్క మాటగా అనుకొని ఓటు వేశారా.. అన్నట్టు 13 జిల్లాల్లోనూ, నాలుగు విడతల్లో ఒకే రకమైన ఫలితాలు రావడం ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందని వారు పేర్కొన్నారు. ఈ తరహా ఫలితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటి సారని చెబుతున్నారు. గ్రామాల వారీగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు.. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఏమాత్రం తీసిపోవని అభివర్ణిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద అభిమానులు, కళాకారుల సంబరాలు 2,743 సర్పంచ్ స్థానాలకు పోలింగ్.. చివరి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 2,743 సర్పంచ్ పదవులకు ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 3,299 గ్రామ పంచాయతీల్లో ఈ విడతలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్లు జారీ కాగా, అందులో 554 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో రెండు చోట్ల అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,743 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆయా పంచాయతీల్లో పోలింగ్ ముగిసిన వెంటనే నాలుగు గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 82.85 శాతం పోలింగ్.. మిగిలిన మూడు విడతల కంటే నాలుగో విడత ఓటింగ్ శాతం కాస్త ఎక్కువగా నమోదైంది. తొలి మూడు విడతల్లో 80 – 82 శాతం మధ్య ఓటింగ్ శాతం నమోదు కాగా, నాలుగో విడతలో 82.85 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 87.09 శాతం, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 76 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 81.79 శాతం పోలింగ్ నమోదైనట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో వర్షం వల్ల పోలింగ్కు స్వల్ప ఆటంకం.. నెల్లూరు జిల్లా కోవూరు, కొడవలూరు, పొదలకూరు మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో ఆదివారం ఉదయం వర్షం కురిసిన కారణంగా పోలింగ్కు స్వల్ప అంతరాయం ఏర్పడినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం గణపర్రు గ్రామ పంచాయతీలో దివ్యాంగ మహిళలకు సంబంధించిన ఓటు పోలింగ్ అధికారి ఆమె చెప్పిన గుర్తుకు కాకుండా మరో గుర్తుకు వేశాడన్న వివాదంతో ఓటింగ్ ప్రక్రియకు కొంత అంతరాయం ఏర్పడింది. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామ పంచాయతీలో బీసీ–బి మహిళకు రిజర్వు చేసిన వార్డులో బీసీ–బి పురుష అభ్యర్థి పోటీలో ఉండడంతో అక్కడ ఎన్నికను నిలిపివేసినట్టు మండల అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో వర్షం కురవడం వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా అధికారులు ఆయా ప్రాంతాల్లో జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా విద్యుత్ సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలను చేపట్టారు. గుంటూరు జిల్లా కంబంపాడులో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఆనందోత్సాహం చదవండి: (పులివెందుల ‘పంచ్’ అదిరింది) (మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం) -
పులివెందుల ‘పంచ్’ అదిరింది
సాక్షి, కడప: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అభిమానులకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో అగ్రాసనం దక్కింది. ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం సర్పంచ్ స్థానాలను అధికార పార్టీ అభిమానులు దక్కించుకుని విజయకేతనం ఎగుర వేశారు. ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు ఈ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా దక్కించుకోలేకపోయారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి సొంత పంచాయతీ కసనూరులో సైతం టీడీపీ మద్దతుదారుడు అధికార పార్టీ అభిమానికి పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పరాజయం పాలయ్యాడు. నియోజకవర్గంలో ఎక్కడా ప్రతిపక్ష పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ పెట్టలేని పరిస్థితికి చేరుకుంది. పులివెందుల నియోజకవర్గంలో 108 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 16వ తేదీ ఉపసంహరణ గడువు నాటికి ఏకంగా 90 పంచాయతీలను అధికార పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. 5 మండలాల్లోని 18 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా అన్నింటిలోనూ వైఎస్సార్సీపీ అభిమానులే విజయదుందుభి మోగించారు. కేవలం 8 గ్రామ పంచాయతీల్లో మాత్రమే టీడీపీ మద్దతుదారులు పోటీలో నిలిచినా, ఏ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. నంద్యాలంపల్లి, పైడిపాలెం, దుగ్గనగారిపల్లె పంచాయతీలలో మొత్తంగా కేవలం 6 వార్డులే ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులకు దక్కడం గమనార్హం. సంక్షేమ పథకాల ఫలితమిది.. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సొంత నియోజకవర్గం పులివెందులలోనూ సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతోపాటు రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సీఎంతో చర్చించి అభివృద్ధి పనులకు నిధులు తెప్పించడంలో ముందుంటున్నారు. దీంతో స్థానిక ప్రజలు అధికార పార్టీకి బ్రహ్మరథం పట్టినట్లు స్పష్టమవుతోంది. 14 ఏళ్లు సీఎం.. 14 పంచాయతీలకు పరిమితం సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో 100 శాతం పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుప్పం నియోజకవర్గంలో 93 పంచాయతీలు ఉండగా 89 పంచాయతీలకు మూడవ విడతలో ఎన్నికలు జరిగాయి. అందులో 75 పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించగా, టీడీపీ మద్దతుదారులు కేవలం 14 పంచాయతీల్లో గెలిచారు. ఓట్ల పరంగా చూస్తే అధికార పార్టీ మద్దతుదారులకు ఏకంగా 31 వేల ఓట్లకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. కుప్పంలో అభివృద్ధి చేశానంటూ బూటకపు మాటలు చెప్పే చంద్రబాబుకు ఆ నియోజకవర్గ ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న సంక్షేమం, అభివృద్ధి పట్ల కుప్పం ప్రజలు మొగ్గు చూపారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గంలో కేవలం 14 పంచాయతీలకు మాత్రమే పరిమితమయ్యారు. -
మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం
సాక్షి, విశాఖపట్నం: మరో టీడీపీ నాయకుడికి ‘కుప్పం’ అనుభవం ఎదురైంది. విశాఖ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తికి సొంత గ్రామంలోనే తీవ్ర పరాభవం ఎదురైంది. పరవాడ మండలం వెన్నెలపాలెంలో గతంలో రెండు దఫాలు సర్పంచ్గా పనిచేసిన తన భార్య మాధవీలతను ఈసారి కూడా పోటీకి నిలిపారు. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు వెన్నెల అప్పారావు.. ఆమెపై 464 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గ్రామంలోని మొత్తం 10 వార్డులనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులే గెలవడం మరో విశేషం. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ పెందుర్తి నియోజకవర్గంలో యువకుడైన అన్నంరెడ్డి అదీప్రాజ్ (వైఎస్సార్సీపీ) చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మరోవైపు వైఎస్సార్సీపీ మద్దతుతో పెందుర్తి మండలంలోని రాంపురం గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఎమ్మెల్యే అదీప్రాజ్ సతీమణి శిరీష ఘన విజయం సాధించారు -
లైవ్: తుది విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..
సాక్షి, అమరావతి : నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఆఖరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,743 పంచాయతీలు, 22,423 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పంచాయతీల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,291 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 417 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 61, ఇతరులు 75 చోట్ల గెలుపొందారు. జిల్లాల వారీగా నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి.. పార్టీ మద్దతుదారుల వారీగా విజయాలు జిల్లా వైఎస్సార్సీపీ టీడీపీ బీజేపీ ఇతరులు శ్రీకాకుళం 149 24 2 5 విజయనగరం 202 32 2 1 విశాఖ 68 18 1 1 తూర్పు గోదావరి 96 29 21 28 పశ్చిమ గోదావరి 152 41 5 4 కృష్ణా 162 39 1 5 గుంటూరు 153 59 5 4 ప్రకాశం 164 26 0 6 నెల్లూరు 158 14 2 1 చిత్తూరు 324 44 0 8 కర్నూలు 271 49 0 11 అనంతపురం 139 24 0 2 వైఎస్సార్ జిల్లా 203 0 19 2 -
కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
ఏపీ నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
ముగిసిన తుది విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్
మధ్యాహ్నం 3:30 నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఓటింగ్ ముగిసే సమయానికి శ్రీకాకుళం 78.81, విజయనగరం 85.60, విశాఖ 84.07, తూ.గో. 74.99, ప.గో. 79.03, కృష్ణా 79.29, గుంటూరు 76.74, ప్రకాశం 78.77, నెల్లూరు 73.20, చిత్తూరు 75.68, కర్నూలు 76.52, అనంతపురం 82.26, వైఎస్ఆర్ జిల్లాలో 80.68 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం. 1.30 నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12:30 వరకు 66.60 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.. ► శ్రీకాకుళం- 62.07 శాతం ► విజయనగరం- 77.2 శాతం ► విశాఖపట్నం- 73.3 శాతం ► తూర్పు గోదావరి-64.04 శాతం ► పశ్చిమ గోదావరి- 63.29 శాతం ► కృష్ణా- 62.82 శాతం ► గుంటూరు- 62.87 శాతం ► ప్రకాశం- 61.79 శాతం ► నెల్లూరు- 61.62 శాతం ► చిత్తూరు- 66.62 శాతం ► కర్నూలు- 68.62 శాతం ► అనంతపురం- 71.65 శాతం ► వైఎస్ఆర్ - 69.93 శాతం మధ్యాహ్నం. 1.00 వార్డు ఏజెంట్పై టీడీపీ నేతల దాడి గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. వట్టిచెరుకూరు మండలంలోని ముట్లూరులో ఐదవ వార్డు ఏజెంట్ అన్నవరపు బాబురావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో ఏజెంట్ బాబురావుకు తీవ్రగాయాలు కాగా ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బాబు రావు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మధ్యాహ్నం. 12.00 పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. కొత్తవలస ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పోలీసుల తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ► కృష్ణా: గన్నవరం బాలుర హైస్కూల్లోని 9వ వార్డులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుత ఓటింగ్ సరళిని బట్టి మూడు విడతల ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతుందని అంచనా వేశారు. ఉదయం. 11. 30 తూర్పు గోదావరి: అల్లవరం మండలం మొగలుమూరులో ఎంపీ చింతా అనురాధ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా: గన్నవరం బాలుర పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకుడు సుబ్రహ్మణ్యం పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. గత మూడు విడతల్లో 86 శాతం ఓట్లు పోలైనట్లు పేర్కొన్నారు. నాలుగో విడతలో కూడా అదే రీతిలో నమోదు అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఉదయం 6.30 నుండి పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు ఓటు వేసేందుకు వస్తున్నారని చెప్పారు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఉదయం. 11.00 తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతం ఉదయం 10:30 వరకు 41.55 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.. ► శ్రీకాకుళం- 36.84 శాతం ► విజయనగరం- 54.57 శాతం ► విశాఖపట్నం- 48.94 శాతం ► తూర్పుగోదావరి- 35.85 శాతం ► పశ్చిమ గోదావరి- 34.62 శాతం ► కృష్ణా- 36.47 శాతం ► గుంటూరు- 41.25 శాతం ► ప్రకాశం- 40.5 శాతం ► నెల్లూరు- 33.94 శాతం ► చిత్తూరు- 43.58 శాతం ► కర్నూలు- 15.42 శాతం ► అనంతపురం- 46.36 శాతం ► వైఎస్ఆర్ - 40.69 శాతం ఉదయం. 10.20 నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏపీలో కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ► శ్రీకాకుళం: ఎచ్చెర్ల రణస్థలం మండలం పాతర్లపల్లిలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► కృష్ణా: గన్నవరం మండలంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సీపీ శ్రీనివాసులు పర్యటించారు. గన్నవరం హైస్కూల్లోని పోలింగ్ బూత్ను పరిశీలించారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. ఉదయం 9.30 రాష్ట్రవ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8.30 గంటల వరకు 13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు.. ► శ్రీకాకుళం- 12.5 శాతం ► విజయనగరం- 22.5 శాతం ► విశాఖపట్నం- 18.48 శాతం ► తూర్పుగోదావరి- 8.58 శాతం ► పశ్చిమగోదావరి- 14.12 శాతం ► కృష్ణా- 8.53 శాతం ► గుంటూరు-13.94 శాతం ► ప్రకాశం-9.13 శాతం ► నెల్లూరు-8.44 శాతం ► చిత్తూరు-12.4 శాతం ► వైఎస్ఆర్ కడప-9.35 శాతం ► కర్నూలు-15.4 శాతం ► అనంతపురం-15.40 శాతం ఉదయం. 9.10 ►నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాలుగో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ భారీ వర్షం కారణంగా మందకొడిగా సాగుతోంది. ►విశాఖపట్నం: పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంలో టీడీపీ, వైస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఉదయం. 8.30 ► పంచాయతీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతోంది. అధిక సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో ఓటు వేయడానికి బారులు తీరారు. ►అనంతపురం: పెనుకొండ రెవెన్యూ డివిజన్లో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు హైఅలర్ట్ ప్రకటించారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్ధులకు పోలీసుల సాయం అందేలా ఆదేశాలు ఇచ్చారు. మండలానికో డీఎస్పీతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు. టీడీపీకి ఎదురుదెబ్బ కృష్ణా: గంపలగూడెం మండలంలోని పెనుగొలను గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధిష్టానం తీరుపై మద్దతుదారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల్లో ఆర్థిక సాయం చేస్తామని తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వైఖరిని నిరసిస్తూ గ్రామ పార్టీ అధ్యక్షుడు కోటా హరిబాబు రాజీనామా చేశారు. ఉదయం. 7.30 ► పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ గ్రామాల్లో దాదాపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఫ్యాక్షన్, పాత కక్షల చరిత్ర ఉన్న గ్రామాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఎన్నికల బందోబస్తులో దాదాపు 48 వేల మంది పోలీసులు పాల్గొన్నారు. ► శ్రీకాకుళం: నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగం గ్రామంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాన్ తొలి ఓటు వేశారు. ► విశాఖపట్నం: రాంపురం పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలోని పెద్ద కాకాని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మొదటి ఓటు వేశారు. ఇదే పోలింగ్ కేంద్రంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నయ్య ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం. 7.00 ► పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలోని రాయన్నపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బాయ చౌదరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం. 6.30 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్లు ధరిస్తేనే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. ఉదయం. 6.25 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 6.30 పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదయం. 6.20 7,475 మంది పోటీ: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆదివారం 161 మండలాల పరిధిలో 2,743 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా మొత్తం 7,475 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఆఖరి విడతలో 33,435 వార్డులకుగానూ 10,921 చోట్ల ఏకగ్రీవంగా ముగిశాయి. మరో 91 చోట్ల వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 22,423 వార్డులకు నేడు పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి అంకంలోకి చేరుకున్నాయి. ఆఖరి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. తుది విడతలో 161 మండలాల పరిధిలో 2,743 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 7,475 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతల్లో నిర్వహించేలా నోటిఫికేషన్లు జారీ కావడం తెలిసిందే. ఆఖరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో రెండు చోట్ల సర్పంచి పదవికి ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆదివారం 2,743 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి విడతలో 33,435 వార్డులకుగానూ 10,921 చోట్ల ఏకగ్రీవంగా ముగిశాయి. మరో 91 చోట్ల వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 22,423 వార్డులకు నేడు పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. 67.75 లక్షల మంది ఓటర్లు.. ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలు 28,995 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా సుమారు 67.75 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 6,047 సమస్యాత్మక, 4,967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలలో ఓటింగ్ను ఎస్ఈసీ, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ విధులకు 88,091 మంది సిబ్బందిని నియమించగా శనివారం సాయంత్రమే సామగ్రితో ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. పర్యవేక్షణ అధికారులుగా 4,570 మందిని నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 70,829 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 283 గ్రామాల్లో నిలిచిపోయిన ఎన్నికలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతున్నప్పటికీ 283 పంచాయతీల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించడం లేదు. కోర్టు కేసులు, ఇతర సమస్యల కారణంగా 274 పంచాయతీలలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్లే జారీ చేయలేదు. మరో 9 చోట్ల సర్పంచి, వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. పల్లె పోరుకు పటిష్ట బందోబస్తు.. పంచాయతీలకు చివరి దశ ఎన్నికలను సజావుగా పూర్తి చేసేందుకు పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. 16 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 161 మండలాల్లో నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ గ్రామాల్లో దాదాపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఫ్యాక్షన్ , పాత కక్షల చరిత్ర ఉన్న గ్రామాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. పోలీస్ బృందాలు శనివారం ఉదయం నుంచే రంగంలోకి దిగి సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో కవాతు నిర్వహించాయి. తుది విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 48 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. -
ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తూ పట్టుబడ్డ టీడీపీ నాయకులు
-
సర్పంచ్ బరిలో యువ డాక్టర్
సాక్షి, శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి పంచాయతీ సర్పంచ్ పదవికి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసిన డాక్టర్ నర్రా భార్గవి పోటీచేస్తున్నారు. ప్రజాసేవ చేయడానికి మంచి అవకాశంగా భావించి వైఎస్సార్సీపీ అభిమానిగా సర్పంచ్ పదవికి పోటీచేస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ పంచాయతీ పరిధిలో అనేక చిన్న, పెద్దతరహా పరిశ్రమలున్నాయని, దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు జీవిస్తున్నారని చెప్పారు. వారందరికీ సేవ చేయాలనే తపనతో ఉన్నట్లు పేర్కొన్నారు. -
నామినేషన్ వేశారని దాడులు చేస్తున్నారు
సాక్షి, అమరావతి: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పోలీసు అధికారులను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని, పెదకూరపాడు నియోజకవర్గంలోని లింగాపురం పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ వేశారనే కోపంతో వైఎస్సార్సీపీ నేతలు దళితులపై దాడిచేశారని ఆరోపించారు. ఈ దాడి సీఎం జగన్ ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనమని ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీచేసే హక్కు ఉందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. దళితులు రాజకీయాల్లోకి రాకూడదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేతల దాడి ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చ అని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నా ప్రజామద్దతు ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కులం పేరుతో దూషించి, రాళ్లతో దాడిచేసిన వైఎస్సార్సీపీ నేతలపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేయాలని అర్ధరాత్రి నుంచి స్టేషన్ బయటే పడిగాపులు కాస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. చదవండి: (కోనసీమలో పల్లెపోరు) -
కోనసీమలో పల్లెపోరు
సాక్షి, అమలాపురం: రాజకీయంగా చైతన్యవంతమైన తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ (అమలాపురం డివిజన్)కు ఒక గుర్తింపు ఉంది. ఒకవైపు సముద్రం, మూడు వైపులా గోదావరి నదీపాయల మధ్య ఉండే ఈ ప్రాంతానికి రాజకీయంగా ప్రత్యేక స్థానముంది. పూర్తి వ్యవసాయ ఆధారితమైన ఈ ప్రాంతం కొబ్బరి సాగులో దేశంలోనే గుర్తింపు పొందింది. స్వతంత్ర ఉద్యమం నాటినుంచి ఇక్కడ రాజకీయ చైతన్యం అధికం. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంతోమంది దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నాలుగో దశలో జరుగుతున్నాయి. ఈనెల 21న ఎన్నికలు జరగనున్న ఐదు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 273 పంచాయతీలున్నాయి. వీటిలో 14 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 259 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 711 మంది తలపడుతున్నారు. జాతీయస్థాయిలో రాణింపు కోనసీమకు చెందిన పలువురు నాయకులు జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉన్నత పదవులు పొందారు. దివంగత కళా వెంకట్రావు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రెవెన్యూ, ఆంధ్రాలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత జీఎంసీ బాలయోగి దేశంలోనే అత్యుత్తమైన పదవుల్లో ఒకటైన లోక్సభ స్పీకర్గా పనిచేశారు. మాజీమంత్రి పరమట వీరరాఘవులు పంచాయతీ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తరువాత అల్లవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. దివంగత మాజీమంత్రి మోకా విష్ణుప్రసాద్ తొలుత సర్పంచ్గా తరువాత అల్లవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మార్కెటింగ్, గిడ్డంగులశాఖ మంత్రిగా పనిచేశారు. సాధారణ గృహిణిగా ఉన్న చిల్లా జగదీశ్వరి సైతం తొలుత సర్పంచ్గా, తరువాత అల్లవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పోరు ఏకపక్షమే కోనసీమలో పంచాయతీ పోరు ఏకపక్షమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వలంటీర్ల వ్యవస్థతో పల్లె కేంద్రంగా సాగుతున్న పాలనతో గ్రామాలు అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పల్లెల్లోనే ఉపాధి అవకాశాలు పెరగడంతో యువతలో ఉద్యోగ భరోసా ఏర్పడింది. రైతుభరోసా ద్వారా పెట్టుబడి సహాయం, కనీస మద్దతు ధరలు అందేలా తీసుకుంటున్న చర్యలు, రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం వంటివి రైతులకు ఎంతో లబ్ధి కలిగిస్తున్నాయి. గత ఏడాది కరోనా లాక్డౌన్ సమయంలో వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, వరదలు, వర్షాల వల్ల మూడుసార్లు ఆయా ప్రాంతాల్లో పంట దెబ్బతిన్న రైతులకు రెండు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ముఖ్యంగా కొబ్బరికాయ ధర రూ.6కు పడిపోయిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయించింది. అప్పటినుంచి కొబ్బరి ధర రూ.10కి తగ్గలేదు. ఈ చర్యలన్నీ రైతులకు ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత పెంచాయి. దీంతో కోనసీమ గ్రామాలు వైఎస్సార్సీపీ అభిమానులకే పట్టంకట్టే పరిస్థితి కనిపిస్తోంది. తొలి మూడు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకి ఏకపక్షంగా ఉండటంతో ప్రతిపక్ష పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన వారిలో గెలుపు నమ్మకం సడలిపోయింది. -
ఏకగ్రీవాలను రద్దు చేసే అధికారం కోర్టుకు కూడా లేదు
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలతో మొదలైన ఏకగ్రీవాల పరంపర జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగేలా ఉంది. కోవిడ్ కారణంగా 2020 మార్చి 15న వాయిదా పడ్డ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల కమిషన్ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో పలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. త్వరలోనే ఎస్ఈసీ ఈ ఎన్నికలు నిర్వహించాaని భావిస్తుండగా.. గతంలోని ఏకగ్రీవాలను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై హైకోర్టు న్యాయవాది జనార్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఫారం 10లో.. ఎన్నికల్లో గెలిచినవారికి ఫారం 23లో ధ్రువీకరణ ఇస్తారు. ఏకగ్రీవమైనా.. ఎన్నికల్లో గెలిచినా.. ఒకసారి ధృవీకరణ పత్రం ఇచ్చాక రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. ఎస్ఈసీ, కోర్టులకు కూడా దీన్ని రద్దు చేసే అధికారం లేదు. కేవలం ఓడిపోయిన వ్యక్తి మాత్రమే ఆర్టికల్ 329 ప్రకారం జిల్లా కోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. విచారణ తర్వాతే కోర్టు తీర్పు ఇస్తుంది’’ అని తెలిపారు. -
కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది: చంద్రబాబు
సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం టీడీపీ మద్దతుదారులే గెలుపొందారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఓడిందన్నారు. విశ్వసనీయత, శాంతి, నీతి, నిజాయితీలకు కుప్పం మారు పేరు అని.. అలాంటి ప్రాంతాన్ని ఉన్మాదంతో కలుషితం చేస్తారా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందన్నారు. పోలీసులే రౌడీల్లా తయారయ్యారని దూషించారు. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి బెదిరిస్తున్నారని.. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు కూడా సహకరించలేదని చెప్పారు. సాయంత్రం వరకు టీడీపీ మద్దతుదారులకు అత్యధిక స్థానాలొచ్చాయని.. రాత్రి ఏడున్నర నుంచి పరిస్థితి మొత్తం మారిపోయిందన్నారు. అర్ధరాత్రి తర్వాత ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. పోలీసులు కౌంటింగ్ బూత్లలోకి వెళ్లారని.. పవర్ కట్ చేసి ఫలితాలు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై ఎస్ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజాదరణ ఉన్నవాళ్లే ఎన్నికల్లో గెలుస్తారు కానీ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నదేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ గళం ఎత్తడం వల్లే ప్రజలు ఓటింగ్ వరకు వచ్చారన్నారు. మొదటి విడతలో 38 శాతం, రెండో విడతలో 39 శాతం, మూడో విడతలో 40 శాతం స్థానాల్లో టీడీపీ గెలుపొందిందని చెప్పారు. చదవండి: కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ -
డబ్బు రాజకీయం సృష్టికర్త చంద్రబాబే: వల్లభనేని వంశీ
కృష్ణాజిల్లా: చంద్రబాబు తీరు చూస్తుంటే ఏడవలేక మద్దెల దరువు అన్న చందంగా ఉందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో 80% పంచాయితీలు వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలవడంతో చంద్రబాబు అయిపోయిందని తెలిపారు. కుప్పం నియోజకవర్గవాసులు ఎప్పుడూ టీడీపీనే గెలిపించేవారని, కానీ చంద్రబాబును కదాని వివరణ ఇచ్చారు. కృష్ణాజిల్లాలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మాటలతూటాలు విసిరారు. తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయినట్టేనని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. గెలిస్తే తన గొప్పతనం అని చెప్పుకునే చంద్రబాబు ఓడిపోయాడు కనక దొంగే దొంగ అని అరిసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. గెలిచిన పంచాయితీలు పుచ్చలపల్లి సుందరయ్య మార్గంలో ఏమైనా గెలిచారా అని ప్రశ్నించారు. ఎదుటివారు గెలిస్తే డబ్బు ఖర్చు చేసి గెలిచారు అంటున్నారు.. అసలు డబ్బు రాజకీయం మొదలు పెట్టిందే చంద్రబాబేనని చెప్పారు. ఆ సంస్కృతిని కృష్ణ జిల్లా ఉయ్యూరులో మొదలుపెట్టింది చంద్రబాబేనని వంశీ తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకొంటూ ప్రజలు నవ్వుతారన్న సిగ్గు కూడా లేకుండా వంకలు చెప్పటం నేర్చుకున్నాడని వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు. ఓటు వేసినందుకు జనాలని దొంగలు అనటం సరి కాదు చేతనైతే టీడీపీ పార్టీని మెరుగుపరచుకో అని సలహా ఇచ్చారు. కొంగల మల్లయ్య కథలు.. నేను లెగిస్తే మగోడిని కాదు అని లెగలేనోడు చెప్పే కథలు చెప్పొద్దు అని వల్లభనేని వంశీ హితవు పలికారు. -
టీడీపీ సంబరాల్లో సచివాలయ ఉద్యోగి
సాక్షి, కళ్యాణదుర్గం: టీడీపీ విజయోత్సవ ర్యాలీలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని పాలవెంకటాపురం సచివాలయ సర్వేయర్ బాలరాజు హల్చల్ చేశారు. ఆ దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సర్పంచ్ ఫలితాలు వెలువడటంతో 13వ తేదీ సాయంత్రం టీడీపీ నాయకులు నాగిరెడ్డిపల్లిలో సంబరాలు చేసుకున్నారు. బాల రాజు స్వగ్రామం నాగిరెడ్డిపల్లి. సర్పంచ్గా గెలుపొందిన టీడీపీ మద్దతుదారు కురుబ సందీప్ను బాలరాజు స్వయంగా సన్మానిం చారు. విజయోత్సవ ర్యాలీలో ఈలలు వేస్తూ హడావుడి చేశారు. ప్రభుత్వ పథకాలను పార్టీల కతీతంగా పేదలకు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్న సమయంలో ఓ ఉద్యోగి ఇలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: (టీడీపీకి ఓటేయలేదని చెల్లెల్ని ఇంట్లోంచి గెంటేసిన అన్న) -
కుమార్తె ఎమ్మెల్యే.. తల్లి సర్పంచ్..
సాక్షి, అడ్డతీగల: కుమార్తె ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె తల్లి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లా వేదికైంది. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తల్లి నాగులపల్లి రాఘవ. అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ పదవికి వైఎస్సార్సీపీ అభిమానిగా పోటీచేసిన రాఘవ 273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె 2001–06, 2013–18 వరకు రెండుసార్లు సర్పంచ్గా పనిచేశారు. ఎమ్మెల్యే స్వగ్రామం రాజుంపాలెం.. గొండోలు పంచాయతీలో ఉంది. ఇక్కడ 1,070 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 717 పోలయ్యాయి. మొత్తం ఎనిమిది వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులే గెలుపొందారు. చదవండి: (కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ) (తండ్రి ఎమ్మెల్సీ.. తనయుడు సర్పంచ్..) -
తండ్రి ఎమ్మెల్సీ.. తనయుడు సర్పంచ్..
సాక్షి, దాచేపల్లి: తండ్రి సర్పంచ్గా, ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన తనయు డు ఇప్పుడు సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇందుకు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాల పాడు పంచాయతీ వేదికైంది. తాజా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రెండో కుమారుడు జంగా సురేష్ గామాలపాడు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీలకు రిజర్వ్ అయిన ఈ సర్పంచ్ పదవికి గ్రామస్తులంతా కలిసి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనయుడు సురేష్ను సర్పంచ్ బరిలో నిలిపారు. బీటెక్ పూర్తిచేసిన సురేష్ ఢిల్లీలో సివిల్స్కు శిక్షణ తీసుకుంటున్నారు. సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ, జనసేన మద్దతుదారులు ఉపసంహరించుకున్నా రు. దీంతో సురేష్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణమూర్తి పెద్ద కుమారుడు వెంకట కోటయ్య పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చదవండి: (కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ) -
కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ
సాక్షి, అమరావతి: ఏపీలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుకు భారీ షాక్ తగిలింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన కుప్పంలో ఆ పార్టీ కుప్పకూలిపోయింది. వైఎస్సార్సీపీ అభిమానులు విజయభేరి మోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో ప్రభంజనం కొనసాగుతోంది. తొలి రెండు విడతల్లో మాదిరే బుధవారం మూడో విడతలోనూ పల్లె ప్రజలు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పాలనకు బ్రహ్మరథం పట్టారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీ కంచుకోటలను ప్రజలు తమ ఓటుతో బద్దలు కొట్టారు. ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజల తీర్పు ఒక్కటే అన్నట్టుగా మూడో విడతలోనూ 80 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ అభిమానులు గెలుచుకున్నారు. మూడో విడత మొత్తం 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్లు జారీ కాగా, అందులో 579 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో చోట సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ మూడు స్థానాలో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 2,639 సర్పంచి స్థానాలకు బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగింది. కందుకూరు నియోజకవర్గం కొండికందు కూరులో వైఎస్సార్సీపీ సంబరాలు ఆ నియోజకవర్గాల్లో రికార్డు విజయం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ పడింది. మూడో విడతలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 74 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీల్లో, ఇతరులు ఒక పంచాయతీలో గెలుపొందారు. గుంటూరు జిల్లాలో మూడవ విడతలో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో 78 పంచాయతీలకు గాను 75 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. మిగిలిన మూడు స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. లెక్కింపు అనంతరం ఈ మూడు స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ అభిమానులు విజయదుందుభి మోగించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 85 గ్రామ పంచాయతీలకు గాను 85లో వైఎస్సార్సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయనగరంలో అత్యధికంగా 87.09% పోలింగ్కు 3.30 గంటల వరకు అవకాశం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం ఒంటిగంట లోపే దాదాపు ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు విజయనగరం జిల్లాలో ఎన్నికల పర్యవేక్షణ అధికారులు తెలిపారు. మూడో విడతలో మొత్తం 80.71 శాతం ఓటింగ్ పోలవగా, మధ్యాహ్నం 12.30 గంటలకే 67% నమోదు అయింది. ఆఖరి గంటలో కేవలం 4% మందే ఓటు వేశారు. ఇప్పటి వరకు మూడు విడతల పాటు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా ఈ విడతలో విజయనగరం జిల్లాలో 87.09 శాతం పోలింగ్ నమోదైంది. ఈ జిల్లాలో ఈ విడత 207 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఆయా గ్రామాల్లో మొత్తం 3,60,181 మంది ఓటర్లకు గాను 3,13,679 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేగంగా కౌంటింగ్ పూర్తయ్యేలా చర్యలు ఈ విడతలో ఎన్నికలు జరిగిన వాటిలో 448 గ్రామ పంచాయతీలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో పోలింగ్ మధ్యాహ్నం 1.30 గంటలకే ముగియడంతో అక్కడ కౌంటింగ్ రెండు గంటలకే మొదలైందని అధికారులు వెల్లడించారు. మిగిలిన చోట్ల పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టారు. కాగా, గత రెండు విడతల ఎన్నికల్లో మరుసటి రోజు తెల్లవారు జాము వరకు ఓట్ల లెక్కింపు కొనసాగడంతో ఈసారి వేగంగా కౌంటింగ్ పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు 5 వేలకు పైబడి ఓటర్లు ఉండే గ్రామ పంచాయతీల్లో పర్యవేక్షణకు పలు చోట్ల ఇద్దరు చొప్పున తహసీల్దార్ స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన వార్డులన్నింటికీ ఒకే సారి లెక్కింపు పూర్తి చేసేలా రెండు టేబుళ్ల ద్వారా ప్రత్యేక ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపును వీడియో రికార్డింగ్ చేయించారు. అర్ధరాత్రి 12 గంటల లోపే దాదాపు అన్ని చోట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యేలా తగిన చర్యలు చేపట్టారు. కుప్పం నియోజక వర్గం దాసిమానుపల్లిలో వైఎస్సార్సీపీ అభిమానుల విజయోత్సాహం తూర్పుగోదావరి జిల్లాలో ఏపీవో మృతి తూర్పు గోదావరి జిల్లా చింటూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో అసిస్టెంట్ పోలింగ్ అధికారిణి దేవకృపావతి విధి నిర్వహణలో మృతి చెందినట్టు ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెకు గుండె పోటు రాగా, వెంటనే వైద్య చిక్సిత కోసం ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామ పంచాయతీలో మూడో వార్డులో నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థి పేరును సైతం చేర్చి, అధికారులు బ్యాలెట్ పేపర్ను సిద్ధం చేయడంతో ఆ వార్డు ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగల గ్రామంలో రెండు వార్డుల బ్యాలెట్ పేపరులో గుర్తు ముద్రణలో తప్పులు దొర్లడంతో ఆ రెండు వార్డులలోనూ ఎన్నికను నిలిపివేశారు. చెదురుమదురు ఘటనలు కూడా లేవు : ఎస్ఈసీ నిమ్మగడ్డ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల సంఘం వర్గీకరించిందని తెలిపారు. అందుకనుగుణంగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశామని, దీని వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, ఎక్కడా చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బంధీగా పోలింగ్ నిర్వహించామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ‘చంద్రబాబును కుప్పం ప్రజలు ఛీకొట్టారు’ వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): వెన్నుపోటు, కుళ్లు కుతంత్రాలతో ఇన్నాళ్లూ మోసం చేస్తున్న చంద్ర బాబు నిజస్వరూపాన్ని గుర్తించిన కుప్పం ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛీకొట్టారని ఉపముఖ్య మంత్రి నారాయణస్వామి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో 90% టీడీపీని వ్యతిరేకించి వైఎస్సార్సీపీ మద్దతుదారులకు పట్టం కట్టారని ఇ ది విశ్వాసం, నమ్మకానికి సంకేతమని స్పష్టం చేశా రు. బినామీ ఓట్లతో చక్రం తిప్పుతున్న బాబుకు ఈ ఫలితాలతో ప్రజలు షాక్ ఇచ్చినట్లు చెప్పారు. -
చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్
సాక్షి, తిరుపతి/కుప్పం: కుప్పంలో వైఎస్సార్సీపీ అభిమానులు విజయభేరి మోగించారు. టీడీపీకి భారీ షాక్ తగిలింది. మూడో విడతలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 74 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీలకు పరిమితమయ్యారు. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కులమతాలు, పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన ప్రభావం కుప్పంలోనూ పడింది. ‘కుప్పం పేరు చెబితే టీడీపీ’ అన్న మాటకు బ్రేక్పడింది. వైఎస్సార్సీపీ మద్దతుదారులు అత్యధిక మెజార్టీతో విజయం సాధించి చరిత్ర తిరగరాశారు. చాలా పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. పతనం దిశలో టీడీపీ కుప్పంలో టీడీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలు తార్కాణంగా నిలిచాయి. 1985 నుంచి టీడీపీ ఎమ్మెల్యేలే ఇక్కడినుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1989లో చంద్రబాబు తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా కుప్పం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా ఏడు పర్యాయాలు ఇక్కడ గెలిచారు. మూడుసార్లు సీఎంగా పదవి చేపట్టారు. కుప్పంలో తనకు తిరుగులేదని ఇంతకాలం నిరూపించుకున్నారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర తిరగబడింది. 89 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే 74 పంచాయతీలు వైఎస్సార్సీపీపరమయ్యాయి. గుడిపల్లె, అడవిబూదగూరు, ఊర్లోఓబనపల్లె లాంటి మేజర్ పంచాయితీలు సైతం వైఎస్సార్సీపీ ఖాతాలో చేరిపోయాయి. గుండ్లసాగరంలో టీడీపీ మద్దతుదారు 140 ఓట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. దాసిమానుపల్లెలో కేవలం 98 ఓట్లే టీడీపీ మద్దతుదారుడికి దక్కాయి. 978 ఓట్లు వైఎస్సార్సీపీ మద్దతుదారుకు లభించాయి. రామకుప్పం మండలం కెంచనబల్లలో వైఎస్సార్సీపీ మద్దతుదారు సుబ్రమణ్యం 2003 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారునికి కేవలం 285 ఓట్లు వచ్చాయి. తన హయాంలో ప్రజలను మభ్యపెట్టడం తప్ప నియోజకవర్గాన్ని నిర్దిష్టంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు విఫలమవడం ఫలితంగానే ఈ దుస్థితి తలెత్తిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కుప్పంలో వైఎస్సార్సీపీ శ్రేణుల సంబరాలు టీడీపీ కంచుకోట అయిన కుప్పం నియోజకవర్గంలోని పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు ఘన విజయం సాధించడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. పార్టీ శ్రేణులు, అభ్యర్థుల్లో ఆనందానికి అంతులేకుండా పోయింది. బాణసంచా పేలుళ్లు, పలక వాయిద్యాలు, బ్యాండు సన్నాయి, డ్యాన్సులతో సంబరాలు జరుపుకున్నారు. జగనన్న పథకాలే గెలిపించాయి జగనన్న ప్రవేశపెట్టిన పథకాలే మా పంచాయతీ సర్పంచ్ను గెలిపించింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇంటికే వచ్చి పెన్షన్ ఇవ్వడం, అందులోనూ 1వ తేదీన సూర్యుడు ఉదయించకముందే ఇవ్వడం ప్రజల్లో మార్పును తీసుకొచ్చింది. పెన్షన్, రేషన్, ఆరోగ్య కార్డులు తీసుకునే సందర్భంలోనూ జనం జగనన్నను తలచుకుంటున్నారు. – నరసింహులు, ఊరునాయునికొత్తూరు, కుప్పం మండలం పథకాల పంపిణీలో పారదర్శకతే నన్ను గెలిపించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాల పంపిణీలో చూపుతున్న పారదర్శకతే చందం సర్పంచ్గా నన్ను గెలిపించింది. గత 20 ఏళ్లుగా చందంలో టీడీపీ అభ్యర్థులే గెలుపొందుతున్నారు. అయితే మభ్యపెడుతూ ఎంతోకాలం మనుగడ సాధ్యం కాదు. టీడీపీ పతనానికి కారణమదే. – కుమారస్వామి, చందం సర్పంచ్ ప్లాంట్పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్ ఉన్నత జీవన ప్రమాణాలు అందివ్వడమే లక్ష్యం -
లైవ్: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..
సాక్షి, అమరావతి : బుధవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. 13 జిల్లాల్లోని 20 డివిజన్లు 160 మండలాల్లో మొత్తం 3221 పంచాయతీలు ఉండగా.. 579 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,639 సర్పంచ్,19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. పంచాయతీల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,291 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 263 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 13, ఇతరులు 96 చోట్ల గెలుపొందారు. జిల్లాల వారీగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి.. జిల్లా పార్టీ మద్దతుదారులు వైఎస్సార్సీపీ టీడీపీ బీజేపీ ఇతరులు శ్రీకాకుళం 195 37 0 0 విజయనగరం 196 9 0 1 విశాఖ 153 45 5 26 తూర్పు గోదావరి 123 15 1 23 పశ్చిమ గోదావరి 100 19 1 10 కృష్ణా 138 8 4 4 గుంటూరు 130 3 1 0 ప్రకాశం 152 23 0 0 నెల్లూరు 276 12 0 0 చిత్తూరు 193 18 0 0 కర్నూలు 191 25 1 12 అనంతపురం 188 25 0 10 వైఎస్సార్ జిల్లా 156 24 0 4 -
ఆ ఇంట్లో ముగ్గురూ సర్పంచ్లే
ఒక ఇంట్లో ఒకరు సర్పంచ్ కావడం సాధారణంగా చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఒక ఇంట్లో ముగ్గురు సర్పంచ్లుగా పనిచేయడం విశేషమే. తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లె పంచాయతీ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షి, తంబళ్లపల్లె: మండలంలోని మర్రిమాకులపల్లె పంచాయతీలో నాటి నుంచి నేటి వరకూ కేతిరెడ్డి కుటుంబ హవా నడుస్తోంది. ఈ పంచాయతీ ఏర్పడినప్పుడు మొదటి సర్పంచ్గా కేతిరెడ్డి తిమ్మారెడ్డి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు పదవిలో కొనసాగారు. అనంతరం ఆయన కుమారుడు కె.వెంకటరమణారెడ్డి సర్పంచ్గా ఎన్నికై ఆయన మూడుసార్లు సర్పంచ్గా పని చేశారు. వెంకటరమణారెడ్డి కోడలు కె.జ్యోతి గతంలో సర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో రెండోసారి గ్రామస్తుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఈ పంచాయతీలో సుమారు 618 మంది ఓటర్లు ఉన్నారు. కేతిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజా సమస్యలపై స్పందించడం, పంచాయతీ అభివృద్ధికి కృషి చేయడమే ఇందుకు కారణం. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేయడంతో ఆ కుటుంబంపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. చదవండి: ఏమ్మా.. ఎలా చదువుతున్నారు! బర్త్డే: తప్పతాగి యువకుడి మృతి? -
ఏపీలో మూడో దశ పంచాయతీ పోలింగ్ ప్రారంభం
-
పాలుపోస్తే.. ఓటర్లు పదవి ఇచ్చారు
అన్నవరం: ఉపసర్పంచ్ వెంకన్నగారు.. పాలు పలుచగా ఉన్నాయండీ.. అని ప్రజలు అడుగుతుంటే.. ఉపసర్పంచ్కి పాలకి సంబంధం ఏంటని కొత్త వారు ఆశ్చర్యపోతుంటారు. పాల వ్యాపారం చేసే వెంకన్న ఉపసర్పంచ్గా ఎన్నికైనా యథావిధిగా సైకిల్ మీద ఖాతాదారులకు పాలు విక్రయిస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పంచాయతీ ఉప సర్పంచ్ సంగతి. స్థానిక వెలంపేటలో ఉండే బొబ్బిలి వెంకన్నబాబు 35 సంవత్సరాలుగా పాల వ్యాపారం చేస్తున్నారు. పాల వెంకన్నగా పేరు పొందారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఎంతో అభిమానం. 2013లో తొమ్మిదో వార్డు పదవికి పోటీచేసి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అదే తొమ్మిదో వార్డు నుంచి వైఎస్సార్సీపీ అభిమానిగా పోటీచేసి 182 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీ వార్డు సభ్యుల్లో ఇదే అత్యధిక మెజార్టీ. అన్నవరం పంచాయతీ సర్పంచ్ పదవితోపాటు 16 వార్డులకుగాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభిమానులే విజయం సాధించారు. దీంతో ఉపసర్పంచ్ పదవికి తీవ్రపోటీ ఏర్పడింది. దీర్ఘకాలంగా పార్టీ విధేయుడిగా ఉండడం, బీసీ వర్గానికి చెంది అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం, అన్నింటికి మించి వివాద రహితుడనే పేరుండడంతో బొబ్బిలి వెంకన్నబాబును ఉపసర్పంచ్ పదవికి ప్రత్తిపాడు శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్రప్రసాద్ ప్రతిపాదించారు. సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్రాజా దీన్ని బలపర్చగా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో వెంకన్న ఉపసర్పంచ్ అయ్యారు. ఆ మరుసటి రోజు నుంచే ఆయన తన మోటారు సైకిల్ మీద ఖాతాదారులకు పాలు విక్రయిస్తున్నారు. ఉదయం ఆరుగంటల నుంచి పదిగంటల వరకు, సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి పదిగంటల వరకు పాల వ్యాపారం చేస్తానని, ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఉపసర్పంచ్గా గ్రామానికి సేవచేస్తానని వెంకన్నబాబు తెలిపారు. -
తుది విడత పంచాయతీ పోరులో 549 మంది సర్పంచ్లు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో 549 మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నాలుగు దశల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ల సంఖ్య 2,192కు చేరింది. తుది దశ ఎన్నికల కోసం ఈనెల 10న నోటిఫికేషన్ జారీచేసి 12వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 2,750 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఈ నెల 21న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తారు. వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించిన అనంతరం వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. -
కౌంటింగ్ వీడియో తీయండి
సాక్షి, అమరావతి: సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వెబ్కాస్టింగ్ లేదా సీసీ కెమెరా లేదా వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి కన్నబాబు కలెక్టర్లతో పాటు డీపీవోలు, ఎస్పీలకు లేఖలు రాశారు. మొత్తం నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే రెండు దశలు పూర్తవగా.. మూడు, నాలుగో దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ► కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో కరెంటు సరఫరాకు అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలి. అదే సమయంలో జనరేటర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ► కౌంటింగ్ అనంతరం పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల మధ్య అతి స్వల్పంగా ఒక అంకె (సింగిల్ డిజిట్) ఓట్ల తేడా ఉన్నప్పుడు మాత్రమే నిబంధనల ప్రకారం ఒక్కసారి రీ కౌంటింగ్కు అనుమతించాలి. రెండు అంకెల (డబుల్ డిజిట్) ఓట్ల తేడా ఉంటే అనుమతించవద్దు. ► కౌంటింగ్ కేంద్రాలలోకి ముందుగా అనుమతి పొందిన వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ఇతరులను రానీయకూడదు. ► సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, పెద్ద గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. -
మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం తథ్యం
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగిందని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారని తెలిపారు. పట్టణాల్లో పారిశుధ్య, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేశామని చెప్పారు. రాబోయే కాలంలో పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వంతో సమన్వయం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందన్నారు. సీఎం జగన్ ముందుచూపు వల్ల విశాఖపట్నాన్ని దేశంలోనే ఉన్నతస్థాయిలో నిలిపామని చెప్పారు. వరుస ఎన్నికల్లో చావుదెబ్బ తింటున్న టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ అస్థిత్వం కోసం పోరాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలను కూడా రాష్ట్రంపై నెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెబుతున్నప్పటికీ చంద్రబాబు తన వ్యవహార శైలిని ఏమాత్రం మార్చుకోవడం లేదన్నారు. వైజాగ్ స్టీల్ప్లాంట్పై ఆయన వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్ర ప్రజల నుంచి విమర్శల్ని ఎదుర్కొంటున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు సీఎం జగన్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారని, మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ఏం చేయాలో అన్నీ చేయటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు మాత్రం ఎవరెవరికో లేఖలు రాస్తున్నారని, రాయాల్సిన వారికి మాత్రం రాయటం లేదన్నారు. ప్రజలంతా వైఎస్సార్సీపీ పక్షమే రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లా డుతూ.. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో ఆగిన దగ్గర నుంచి ప్రక్రియ తిరిగి ప్రారంభమైందని చెప్పారు. ప్రజలు వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారని, అన్ని మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, రెబల్స్ ఎవరూ ఉండరని చెప్పారు. రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు తథ్యమన్నారు. -
ప్రారంభమైన మూడో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
మధ్యాహ్నం 4.00 మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2,639 సర్పంచ్, 19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. మధ్యాహ్నం 3.30 మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ముగిసే సమయానికి శ్రీకాకుళం 75.70, విజయనగరం 84.6, వెస్ట్ గోదావరి 79.31, కృష్ణా 79.60, గుంటూరు 81.9, ప్రకాశం 79.31, నెల్లూరు 79.63, చిత్తూరు 77.31, కడప 68.42, కర్నూలు 79.90, అనంతపురం 78.32 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3:00 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన జమిగూడ, బొంగరం, లింగేటి తదితర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 2:30 పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముంచంగిపుట్టు మండలం వుబ్బంగి నుంచి లక్ష్మీపురం వెళ్తున్న జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ఓటర్లకు గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అరకులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ మాధవి కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే ఫాల్గుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2:00 రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటలకే పోలింగ్ ముగిసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పరిధిలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం. 1.30 రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. పలు గ్రామాల్లో ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం. 1.00 మధ్యాహ్నం 12.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ 66.48 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ► శ్రీకాకుళం- 64.14 శాతం ►విజయనగరం- 78.5శాతం ►విశాఖపట్నం- 63.23శాతం ►తూర్పు గోదావరి- 67.14శాతం ►పశ్చిమ గోదావరి- 53.51శాతం ►కృష్ణా- 65.88 శాతం ►గుంటూరు- 71.67 శాతం ►ప్రకాశం- 69.95శాతం ►నెల్లూరు- 69.82 శాతం ►చిత్తూరు- 64.82 శాతం ►కడప- 57.34 శాతం ►ర్నూలు- 71 .96 శాతం ►అనంతపురం- 70.23 శాతం మధ్యాహ్నం 12.30 విశాఖపట్నం: జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజి పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నం 12.00 ►అనంతపురం డివిజన్లోని 19మండలాల్లో మూడవ విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల వరకు 61.25 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ►తూర్పుగోదావరి: రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం పుల్లంగి, బొడ్లంక పంచాయతీ గ్రామాల్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఉదయం. 11.30 పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఓటు వేయడానికి పలు గ్రామాల్లో ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం 11.00 ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్లో పాల్గొంటున్నారు. ఉదయం 10:30 వరకు 40.29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ►శ్రీకాకుళం- 42.65 శాతం ►విజయనగరం- 50.7 శాతం ►విశాఖపట్నం- 43.35 శాతం ►తూర్పు గోదావరి- 33.52 శాతం ►పశ్చిమ గోదావరి- 32 శాతం ►కృష్ణా- 38.35 శాతం ►గుంటూరు 45.90 శాతం ►ప్రకాశం 35.90 శాతం ►నెల్లూరు 42.16 శాతం ►చిత్తూరు 30.59 శాతం ►వైఎస్ఆర్ కడప 31.73 శాతం ►కర్నూలు 48.72 శాతం0 ►అనంతపురం 48.15 శాతం ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉదయం. 10.30 ►గుంటూరు: గురజాల మండలం మాడుగులలో పోలింగ్ను అధికారులు నిలిపివేశారు. అభ్యర్థుల గుర్తులు తారుమారు కావటంతో 12, 13 వార్డుల్లో పోలింగ్ నిలిపివేసినట్లు వెల్లడించారు. ఈనెల 21న రెండు వార్డులకూ ఎలక్షన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ►అనంతపురం: ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలంలోని తోపుదుర్తి గ్రామంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►పోలింగ్ కేంద్రాల వద్ద మానవతా దృక్పథంతో వ్యవహరించేలా ఆదేశాలు ఇచ్చామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు దగ్గరుండి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మూడో విడతలో 168 కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించామని, పోలింగ్ తర్వాత ఎవరైనా కక్ష సాధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉదయం 10.00 ►విశాఖపట్నం: పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్లో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెన్నలపాలంలో అరకు వైస్సార్సీపీ ఎంపీ గొట్టేటి మాధవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►అనంతపురం: ఉరవకొండ మండలం రాకెట్లలో వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా జిల్లాలో ఉదయం 9.30 గంటల వరకు 32.21 శాతం పోలింగ్నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఉదయం. 9.30 పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8:30 గంటల వరకు జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ►శ్రీకాకుళం- 12.87 శాతం ►విజయనగరం- 15.3 శాతం ►విశాఖపట్నం- 13.75 శాతం ►తూర్పు గోదావరి- 12.6 శాతం ►పశ్చిమ గోదావరి- 11.72 శాతం ►కృష్ణా - 8.14 శాతం ►గుంటూరు 18.83 శాతం ►ప్రకాశం 8.04 శాతం ►నెల్లూరు 9.1 శాతం ►చిత్తూరు 9.34 శాతం ►వైఎస్ఆర్ కడప 7.5 శాతం ►కర్నూలు 15.39 శాతం ►అనంతపురం 9.9 శాతం ఉదయం. 9.00 ►రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోల్ శాతం 8.30 గంటల వరకు 11.74 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ►రాష్ట్రంలోని పలు పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలైన్లలో ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోని పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి గ్రామంలో 50 ఏళ్ల తర్వాత పోలింగ్ బూత్లకు వెళ్లి గ్రామ ప్రజలు ఓటు వేశారు. ఇన్ని సంవత్సరాలు తర్వాత ఓటు వేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం. 8.30 ►వైఎస్సార్ కడపలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో 7.57 పోలింగ్ శాతం నమోదనట్లు అధికారులు పేర్కొన్నారు. ►విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొంటున్నారు. ఉదయం 7.30 గంటల వరకు 8.7 పోలింగ్ శాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియను ఆయన కంట్రోల్ రూమ్ నుంచి ఆరా తీస్తున్నారు. ఉదయం.8.00 రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతగా సాగుతోంది. మచిలీపట్నం నియజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఆర్డీవో ఖాజావలి పోలింగ్ పక్రియను పరిశీలిస్తున్నారు. అదే విధంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని సమస్యాత్మకమైన పోలింగ్ బూతులను జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు పరిశీలిస్తున్నారు. ఉదయం. 7.30 పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అదే విధంగా 3,127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ 7,245 కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం. 7.02 పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 6.30 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్లు ధరిచేస్తే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం. 6.25 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్ కేంద్రాలలో మూడో విడత పోలింగ్ ఉదయం 6.30 గంటలకు మొదలు కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. 7,757 మంది పోటీ: 2,639 సర్పంచ్ పదవులకు మరి కాసేపట్లో ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ స్థానాలకు 7,757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది పోటీలో ఉన్నారు. సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుంది. పోటీలో ఉన్న 51,369 మంది అభ్యర్థుల భవితవ్యం అదేరోజు తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 6.30 గంటలకు పోలింగ్ మొదలు కానుండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. మూడో విడతలో 3,221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ జారీ కాగా, అందులో 579 సర్పంచ్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఇక విశాఖ జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్డీ పేట, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నర్రిశెట్టివారి పాలెం గ్రామ పంచాయతీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ మూడు చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మిగిలిన 2,639 సర్పంచ్ పదవులకు బుధవారం ఎన్నిక జరగనుంది. ఈ స్థానాలకు 7,757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది పోటీలో ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1,977 పోలింగ్ కేంద్రాలు మూడో విడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 1,977 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 3,127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆ 7,245 కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ ప్రక్రియలో 76,019 మంది సిబ్బంది పాల్గొంటుండగా, 4,780 మంది పోలింగ్ పర్యవేక్షణ విధులలో పాల్గొననున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఓటర్లను పోలింగ్ ప్రక్రియ ముగిసే చివరి గంటలో ఓటింగ్కు అనుమతించనున్నట్టు ద్వివేది తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో 63,270 మంది పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోనే కేవలం అరగంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. మొదట ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరిగిన వార్డుల ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత సర్పంచ్ పదవి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో 63,270 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. -
మూడో విడత పంచాయితీకి సర్వంసిద్ధం
అమరావతి: పంచాయతీ సమరం తుది ఘట్టానికి చేరింది. రేపటితో పంచాయతీ పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. మూడో విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే విశాఖపట్టణం, తూర్పు గోదావరి ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ జరపనున్నారు. 13 జిల్లాల్లోని 20 డివిజన్లు 160 మండలాల్లో 2,640 పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. అయితే మూడో విడతలో మొత్తం పంచాయతీలు 3,221 ఉండగా వాటిలో 579 ఏకగ్రీవం అయ్యాయి. రేపు ఎన్నికలు జరిగే పంచాయతీలు 2,640 ఉన్నాయి. అయితే మూడు పంచాయితీల్లో నామినేషన్లు నమోదు కాలేదు. పోటీలో సర్పంచ్ అభ్యర్థులు మొత్తం 7,757 మంది ఎన్నికలు జరిగే వార్డులు 19,553 ఉండగా పోటీలో 43,162 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటర్ల సంఖ్య : 55,75,004 మొత్తం వార్డులు 31,516 ఉండగా 11,753 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 210 వార్డుల్లో నామినేషన్స్ రాలేదు. 60 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామగ్రిని సరఫరా చేశారు. రాత్రికి ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లనుంది. మూడో విడతలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 26,851 ఏర్పాటుచేశారు. వీటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 4,118 గుర్తించారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 3,127 ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 1,977. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టనున్నారు. ఎస్ఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్, కౌంటింగ్ ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. -
మంత్రి కొడాలి పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మంత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్ను, కమిషనర్ను కించపరిచేలా మాట్లాడారంటూ వీడియో క్లిప్పింగులను ఎన్నికల కమిషన్ సోమవారం హైకోర్టు ముందుంచింది. వీటిని కోర్టు హాలులోనే వీక్షించిన హైకోర్టు ఇరుపక్షాల నుంచి మరింత స్పష్టతను ఆశిస్తూ విచారణను వాయిదా వేసింది. మీడియాతో మాట్లాడకుండా ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వారం రోజుల్లో మూడు వ్యాజ్యాలు వచ్చాయని, భావ ప్రకటన స్వేచ్ఛ, పరిమితులపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాంను అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు)గా నియమిస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి తరఫున న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ పార్క్ హయత్లో కొందరు రాజకీయ నాయకులను నిమ్మగడ్డ కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. జోగి రమేశ్ వ్యాజ్యం పరిష్కారం.. మీడియాతో మాట్లాడేందుకు, పార్టీ విధానాలు, విజయాలు, కార్యక్రమాల గురించి తెలియజేసేందుకు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్కు అనుమతినిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల 21 వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఆ ఉత్తర్వులను జోగి రమేశ్ ఉల్లంఘించలేదని తెలుపుతూ జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆ రెండు గాడిదల నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నారు
సాక్షి,అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను జీర్ణించుకోలేక చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాడిదలు కాస్తున్నారా’ అన్న లోకేశ్ ప్రశ్నకు స్పందిస్తూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి రాష్ట్రంలో బరితెగించి తిరుగుతున్న రెండు పెద్ద అడ్డ గాడిదలను కాస్తున్నారని చెప్పారు. వాటిలో ఒకటి చంద్రబాబు కాగా.. రెండోది లోకేశ్ అని ఎద్దేవా చేశారు. వాటి బారినుంచి రాష్ట్రాన్ని జగన్ కాపాడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఈవీఎంల వల్ల మోసం జరిగిందని మాట్లాడిన చంద్రబాబుకు బ్యాలెట్ పేపర్లతోనూ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ‘చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ విశాఖలో మాట్లాడిన మాటలు వింటే నవ్వొస్తోంది. ఇలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడని కొంత బాధ కూడా కలుగుతోంది. ప్రపంచంలోనే పేరొందిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నానని చెప్పుకునే లోకేశ్, అక్కడ చదివి నేర్చుకున్న సంస్కారం ఇదేనా’ అని ప్రశ్నించారు. దుష్ప్రచారం, అవాస్తవాలు, అబద్ధాలు, కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, లోకేశ్ లాంటి రెండు గాడిదల నుంచి ప్రజలను రక్షించేందుకు తమ ప్రభుత్వం కాపలా కాస్తోందన్నారు. ‘విశాఖ ఉక్కు.. రాష్ట్ర ప్రజలందరి హక్కు’ విశాఖ ఉక్కు.. మన హక్కు అని, దానిని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఎప్పుడు బీజం పడిందో ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. ఫ్యాక్టరీలో పెట్టుబడులు ఉపసంహరిస్తూ 2017లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేశారని, 2017లో చంద్రబాబు భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే ఇలా చేస్తే కనీసం ఒక్క ఉత్తరమైనా కేంద్రానికి ఎందుకు రాయలేదని చంద్రబాబును నిలదీశారు. అప్పట్లో ఆశోక్ గజపతిరాజు కేంద్రంలో మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. పోస్కో ప్రతినిధులను చంద్రబాబు కలిసింది నిజం కాదా పోస్కో సంస్థ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిస్తే దాన్ని వక్రీకరిస్తున్నారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. 2017 డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణ కొరియా వెళ్లి.. పోస్కో ప్రతినిధులను కలిశారని గుర్తు చేశారు. అప్పట్లో పోస్కో సంస్థతో చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు టీడీపీ పిలుపునివ్వడం వల్ల ప్రయోజనం లేదని.. ఈ ఆందోళనల కన్నా బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉన్న లోకేశ్ ఆమరణ దీక్ష చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ కొన్ని సూచనలు కూడా చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. -
ఓటెయ్యనన్నందుకు టీడీపీ వర్గీయుల దాడి
లక్కవరపుకోట (శృంగవరపుకోట): ఓటెయ్యలేమని చెప్పినవారిపై టీడీపీ నాయకులు దాడిచేసిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి లక్కవరపుకోట ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపిన మేరకు.. టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ కొల్లు రమణమూర్తి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం రాత్రి చందులూరు గ్రామానికి చెందిన వాడబోని అప్పలరాజును ఓట్లకోసం అభ్యర్థించారు. తాను వైఎస్సార్ అభిమానులకు ఓటేస్తానని మాటిచ్చానని, వారికే ఓటు వేస్తానని అప్పలరాజు చెప్పారు. దీంతో రమణమూర్తి మరో ముగ్గురితో కలిసి అప్పలరాజుపై దాడిచేశారు. అప్పలరాజు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించి శృంగవరపుకోట ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యంకోసం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి తమ్ముడు అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దానికి ప్రతిగా అప్పలరాజు మద్యం తాగి తనను తిట్టాడని, ఇదేమని ప్రశ్నించినందుకు ఆదివారం రాత్రి మరికొందరితో కలసి తనపై దాడిచేశారని రమణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పలరాజు మరో ఇద్దరిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రమణమూర్తి కుటుంబం నుంచి, టీడీపీ నాయకులనుంచి తమకు రక్షణ కల్పించాలని చందులూరు గ్రామానికి చెందిన యాత సామాజికవర్గీయులు సోమవారం పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. -
టీడీపీ కార్యకర్తల అరాచకం
కేవీపల్లె/అమరావతి/బ్రహ్మసముద్రం: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని తెలుగుదేశం కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం తిమ్మాపురం పంచాయతీ వడ్డిపల్లె, గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు గ్రామాల్లో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని నంజాపురం గ్రామంలో రోడ్లమీద జేసీబీతో గుంతలు తవ్వారు. తాగునీటి పైపులైన్లు, కుళాయిలు ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా వడ్డిపల్లెలో టీడీపీ వారి దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. పంచాయతీ ఎన్నికల్లో తిమ్మాపురం సర్పంచ్గా టీడీపీ మద్దతుదారు అడ్డదారిలో గెలుపొందారని ఆదివారం వైఎస్సార్సీపీ కార్యకర్తలు బత్తుల బాబు, వెంకటరమణ ఆరోపించారు. దీంతో తిమ్మాపురానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు చంద్రారెడ్డి తదితరులు వాగ్వాదానికి దిగారు. తిరిగి సోమవారం ఉదయం టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని వడ్డిపల్లెలోని వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్లు విసిరారు. అడ్డుకోబోయిన వారిపై కర్రలతో దాడిచేశారు. రెండు ద్విచక్రవాహనాలు, ఒక ట్రాక్టర్ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ చలపతి, ముద్దుకృష్ణ, చిలకమ్మ, లలితలను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి వడ్డిపల్లెను సందర్శించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారపాకుల భాస్కర్నాయుడు, పార్టీ నాయకుడు ప్రదీప్రెడ్డి బాధితులను పరామర్శించారు. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. గాయపడ్డ చలపతి, ముద్దుకృష్ణ, లలిత, శివనాగిరెడ్డి వైఎస్సార్ సీపీ యువజన నేతపై దాడి గుంటూరు జిల్లా దిడుగు గ్రామంలో టీడీపీ వర్గీయులు ఆదివారం రాత్రి దాడిచేయడంతో వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ అభిమాని అభ్యర్థి వింతా శ్రీలక్ష్మి తరఫున జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వింతా శివనాగిరెడ్డి, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఎస్టీ కాలనీ దగ్గర వారిపై టీడీపీకి చెందిన పేరిశెట్టి శ్రీనివాసరావు, మంచినేని రాజా, బొబ్బల నరే‹Ù, తోట సాంబయ్య, పేరిశెట్టి శంకర్, నూలు శ్రీనివాసరావు, రామిశెట్టి కాశయ్య, కడియాల రామాంజనేయులు మరికొందరు కలిసి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శివనాగిరెడ్డి, కుంజుల భాస్కరరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. సోమవారం శివనాగిరెడ్డి ఫిర్యాదు మేరకు అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇవి మా బాబు రోడ్లు.. మీరు తిరగొద్దు.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని నంజాపురం గ్రామంలో టీడీపీ నాయకులు తమ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వేసిన సిమెంటు రోడ్లపై వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన వారు తిరగకూడదంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.అటువైపుగా గ్రామస్తులు బయటకు వెళ్లకుండా జేసీబీతో రోడ్డు మీద గుంతలు తీశారు. గ్రామంలో తాగునీటి పైపులైన్, æకుళాయిలను సైతం ధ్వంసం చేశారు. గ్రామస్తుల దాహార్తి తీర్చే శ్రీరామరెడ్డి నీటిపథకం కొళాయిలను కూడా నేలమట్టం చేశారు. ఇదేమిటని ప్రశి్నంచిన గ్రామస్తులను బూతులు తిడుతున్నారు. ఈ తిట్లు వినలేక అనేకమంది ఇంట్లోంచి బయటకు రావడంలేదు. పలువురు గ్రామస్తులు తమ ఆవేదనను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
మూడో విడత పోలింగ్ రేపు
సాక్షి, అమరావతి: మూడో విడతలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 2,640 సర్పంచి పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్శాఖ జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు చేశాయి. మూడో విడతలో 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అందులో 579 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్క చోట సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 2,640 సర్పంచి పదవులకు బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగే చోట మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ కొనసాగనుంది. ఆయా పంచాయతీల పరిధిలో 19,607 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో ఎన్నికలు జరిగే 3,221 గ్రామ పంచాయతీల పరిధిలో 31,516 వార్డులున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 11,732 వార్డులకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 177 వార్డులకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 19,607 వార్డుల్లో ఎన్నికలు జరగుతున్నాయి. ఈ వార్డులకు 43,282 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బుధవారమే ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. చివరి విడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేడు చివరి విడతలో ఈనెల 21న ఎన్నికలు జరగనున్న 3,229 గ్రామ పంచాయతీల్లో మంగళవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత 3,229 గ్రామ సర్పంచి పదవులకు 18,016 మంది, 33,429 వార్డులకు 86,064 మంది పోటీలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది మార్చి 9న నోటిఫికేషన్.. 15న నిలిపివేత రాష్ట్రంలోని 16 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 12 కార్పొరేషన్లలో, 104 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా 75 చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు 2020 మార్చి 9వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలు, పరిశీలన ప్రక్రియ ముగిశాక కరోనా పేరుతో అదే నెల 15న ఆ ఎన్నికలను అర్ధంతరంగా నిమ్మగడ్డ నిలిపివేశారు. కాగా ఆగిపోయిన చోట నుంచే ఆ ఎన్నికల ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు, వచ్చే నెల 2 నుంచి 3వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తున్నట్లు తాజా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. -
కొడాలి నాని పిటిషన్పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజైన ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడకుండా ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని వేసిన పిటిషన్పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. ఎన్నికలు ముగిసేవరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమైనవని ప్రకటించి, వాటిని కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో శనివారం హౌస్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు మీడియాతో మాట్లాడకుండా ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని అభ్యర్థించారు. కాగా ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. చదవండి : (మరో మంత్రిపై నిమ్మగడ్డ ఆంక్షలు) (నిన్న ఆంక్షలు.. నేడు కేసులు) -
టీడీపీ కంచుకోటల్లో వైఎస్సార్సీపీ పాగా
సాక్షి, అమరావతి: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. టీడీపీ మద్దతుదారులు ఉనికి కోసం పాట్లు పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి నియోజకవర్గంలో పది పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం ఒకే ఒక పంచాయతీతోనే టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజకీయాల్లో తాను ఘనాపాటి అని చెప్పుకునే బుచ్చయ్య.. పంచాయతీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. జనసేనతో పొత్తు పెట్టుకుని కూడా ఆయన టీడీపీ మద్దతుదారులను గెలిపించుకోలేకపోయారు. టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్న మండపేట నియోజకవర్గంలో 43 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఆరుచోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుపొందడం విశేషం. చేతులెత్తేసిన హేమాహేమీలు ► శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వగ్రామం కంతేటిలో వైఎస్సార్సీపీ అభిమాని గెలుపొందారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని తన సొంత గ్రామం కృష్ణపల్లిలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టీడీపీ మద్దతుదారుడిని గెలిపించలేకపోయారు. ► మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్వగ్రామం చినమేరంగిలోనూ టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి పరాజయం పాలయ్యారు. ► విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నేత అయ్యన్నపాత్రుడు పార్టీ మద్దతుదారులను గెలిపించుకోలేక చేతులెత్తేశారు. ప్రతిరోజూ మీడియా ముందుకు వచ్చి హడావుడి చేయడం తప్ప నియోజకవర్గంలో ఆయనకు పట్టులేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. ► 40 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ అభిమాని గెలుపొందారు. ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీకి అండగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి, పల్లెపాడు, నిడదవోలు నియోజకవర్గంలోని కోరుమామిడి, పెండ్యాల, మోర్త, పసలపూడి, అన్నవరప్పాడు, కాపవరం గ్రామాల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. ► టీడీపీకి అండగా ఉండే కృష్ణా జిల్లాలోని కొల్లేటి లంక గ్రామాలు ఈసారి మూకుమ్మడిగా వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించాయి. గుడివాడ నియోజకవర్గంలోని టీడీపీకి పెట్టనికోటగా ఉండే చౌటపల్లిలో ఈసారి ఆ పార్టీ అభిమాని ఓటమిపాలయ్యారు. మోటూరులోనూ అదే పరిస్థితి. ఇనుమొల్లులో ఆంజనేయులుకు చుక్కెదురు ► గుంటూరు జిల్లా నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ నియోజకవర్గంలోని తన సొంత గ్రామం ఇనుమొల్లులో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. ఇక్కడ 12 వార్డులకుగాను పది వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు ఓటమి పాలవడం గమనార్హం. ► అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జి ఉమామహేశ్వరనాయుడు సొంత గ్రామం అంకంపల్లిలో టీడీపీ మద్దతుదారు ఓటమిపాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ తనకు కంచుకోటల్లాంటి గ్రామాల్లో బోల్తా పడింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలున్న చోట్ల కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోవడం విశేషం. ► ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా, పార్టీ రహిత ఎన్నికలు కావడంతో దాన్ని ఆసరాగా తీసుకుని తామే గెలిచినట్లు చంద్రబాబు చెప్పుకోవడం చూసి ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. ప్రజా క్షేత్రంలో టీడీపీ నేతలు మొహాలు చాటేస్తున్నారు. -
ప్రజా తీర్పును వక్రీకరిస్తావా?
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వక్రీకరిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్పీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మీడియా ముందుకు వచ్చి, వాస్తవాలు వెలికి తీయాలని కోరారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు తమ్ముళ్లను భ్రమల్లో పెట్టేందుకే చంద్రబాబు చిందులేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మరో 30 ఏళ్లు వైఎస్ జగన్ పాలనే ఉండాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నట్టుగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా రెండేళ్లుగా ఆయన అందించిన పాలనకు తగ్గట్టుగానే పంచాయతీ ఫలితాలొచ్చాయని చెప్పారు. ‘మొత్తం 3,325 పంచాయతీలకు ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్సీపీ అభిమానులు 2,613 స్థానాల్లో గెలిస్తే.. రెబల్స్ 36మంది గెలిచారు. మొత్తం 2,649 మంది సర్పంచ్లుగా గెలిచారు. టీడీపీ 538, బీజేపీ 5, జనసేన 35.. ఇతరులు 98 గెలుచుకున్నారు. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ మద్దతుదారులను చిత్తుచిత్తుగా ఓడించారు’ అన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. శ్రుతి మించిన టీడీపీ బరితెగింపు ► టీడీపీకే 38 శాతం పంచాయతీలొచ్చాయని చంద్రబాబు మళ్లీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆఖరుకు ఎన్నికల ఫలితాల కోసం వైఎస్సార్సీపీ పెట్టిన వెబ్సైట్కు నకిలీ వెబ్సైట్ సృష్టించారు. వైఎస్సార్సీపీ అభిమానుల గెలుపును తక్కువ చేసి చూపేందుకు దీన్ని వాడుకున్నారు. ► పైగా ఇందులో వెకిలిగా కామెంట్స్ పెట్టారు. ఇంత నీతిమాలిన, అసహ్యకర, బరితెగింపునకు టీడీపీ పాల్పడుతుందని అనుకోలేదు. నకిలీ వెబ్సైట్ సృష్టించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిజాలేంటో మీడియా నిగ్గు తేల్చాలి ► చంద్రబాబు ఫలితాల వక్రీకరణకు రెండు పత్రికలు, చానళ్లు వంత పాడుతున్నాయి. వాళ్లు చెప్పే అసత్యాలు, మేం చెప్పే నిజాలు.. రెండూ మీడియాలోకి వెళ్తున్నాయి. ప్రజలు గందరగోళ పడే ప్రమాదం ఉంది. అందుకే మీడియాను, జర్నలిస్టు నాయకులను కోరుతున్నాం. దయచేసి వాస్తవాలేంటో, ఎన్నికల ఫలితాల నిజాలేంటో మీరే విచారించి చెప్పండి. ఇది మీడియా బాధ్యత కూడా. ఇంత ప్రశాంతంగా ఎప్పుడైనా జరిగాయా? ► పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల కమిషనరే చెప్పారు. అయినా ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చంద్రబాబు అనడం విడ్డూరం. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ దుకాణం బంద్ అయింది. ► అయినా చంద్రబాబు ఇంకా భ్రమలు కల్పిస్తున్నారు. కేడర్ను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే పంచాయతీల్లో 38శాతం గెలుపు మాదే అని చెప్పుకుంటున్నాడు. తలకిందులైనా అది ఆసనమేనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బాబూ ఇక పప్పులుడకవ్ ► గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైఎస్ జగన్ ప్రజా రంజక పాలన అందిస్తున్నాడని టీడీపీ క్యాడరే చెబుతోంది. ఆ పార్టీ తరఫున పోటీ చేయలేమని చెబుతున్నారు. అందుకే ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయి. ► రెండు చానల్స్, పత్రికలు టీడీపీని జాకీలు పెట్టి పైకి లేపాలని శ్రమిస్తున్నాయి. మంత్రి కొడాలి నాని ఊర్లోనే పార్టీ అభిమాని ఓడిపోయినట్టు వార్తలు సృష్టించారు. అసలా గ్రామమే తనది కానప్పటికీ అలా చేశారు. ► జరగబోయే పంచాయతీల ఫలితాలు ఇంతకన్నా ఎక్కువగా వైఎస్సార్సీపీ అభిమానుల వైపే ఉంటాయి. పార్టీ గుర్తుతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అసలు రంగేంటో బయట పడుతుంది. ► విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర నిర్ణయాన్ని ఆపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఈ విషయంలో లోకేశ్ అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాడు. రాధాకృష్ణది డైవర్షన్ రాజకీయం పంచాయతీ ఎన్నికల్లో చతికిల పడిన టీడీపీ.. ప్రజల్లో మరింత చులకన అవకుండా దృష్టి మళ్లించడానికే ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్క రోజు అయినా గడవకముందే అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు అంటూ అడ్డగోలు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలపై చర్చను పక్కదారి పట్టించడమే వారి లక్ష్యమని, ఈ కుటిల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ రాతలపై, కథనాలపై లీగల్గా ముందుకు వెళ్తామని చెప్పారు. సీఎం జగన్, షర్మిల.. ఒకరిపై ఒకరికి అపరిమితమైన ప్రేమ ఉందని తెలిపారు. మహానేత వైఎస్సార్ కుటుంబం చాలా పెద్దదని, ఆ కుటుంబంలో అందరూ విశాలమైన భావాలు కలవారని వివరించారు. ఇప్పటికైనా రాధాకృష్ణ చౌకబారు ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. ఇలాంటి రాతలు, కథనాల ద్వారా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మేలు చేద్దామని, సీఎం జగన్ ఇమేజ్ను తగ్గిద్దామని రాధాకృష్ణ భావిస్తే, అది అవివేకమే అవుతుందని స్పష్టం చేశారు. ఈ రాతల ద్వారా రాధాకృష్ణ నీచమైన, కుచ్చితమైన బుద్ధి బయట పడుతోందన్నారు. ‘అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలు మాత్రమే. విభేదాలు ఎంత మాత్రం కావు’ అని గతంలో కూడా చెప్పామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్.. తెలంగాణలో పార్టీ విస్తరణ కోరుకోవడం లేదని ఇంతకు ముందే చెప్పామని గుర్తు చేశారు. -
రెండో విడత స్థానిక ఎన్నికలూ ప్రశాంతం
సాక్షి, అమరావతి: చెదురుమదురు ఘటనలు మినహా రెండో విడత ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలోనే జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఇప్పటి వరకు దాదాపు సగం పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయినట్టు తెలిపారు. సాధారణ ఎన్నికల స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. మూడో విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన చోట గట్టి నిఘా ఉంటుందని తెలిపారు. మూడో విడతలోనూ అవాంతరాల్లేకుండా ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిమ్మగడ్డ సూచించారు. -
తిరుగులేని 'విక్టరీ'
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల సానుకూల ఫలితాలతో వైఎస్సార్సీపీలో జోష్ రెట్టింపు అయింది. ఇక ఇదే ఊపుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకూ రెడీ అంటోంది ఆ పార్టీ. వైరి పక్షాన్ని మట్టి కరిపించడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో ఊహించినట్టే ఆ పార్టీ అభిమానులకు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు. ఊరు, వాడ, జిల్లా, ప్రాంతం తేడా లేకుండా విజయ దుందుభి మోగించారు. 81% పంచాయతీలు వైఎస్సార్సీపీ అభిమానుల వశమయ్యాయి. విపక్ష టీడీపీ 16 శాతం పంచాయతీలు మాత్రమే దక్కించుకుంది. వైఎస్సార్సీపీకి ఇది అసాధారణ విజయం అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలను మించి పంచాయతీ ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వచ్చాయి. గత చరిత్రను చూస్తే అధికార పార్టీ అభిమానులు 60 శాతానికి మించి గెలిచిన సందర్భాల్లేవు. ఇప్పుడు ఏకంగా 80 శాతానికిపైగా పల్లె జనం ప్రభుత్వానికే జై కొట్టారు. మొదటి దశలో 3,249 పంచాయతీలకు గాను వైఎస్సార్సీపీ అభిమానులు గెలిచినవి 2,640. టీడీపీ మాత్రం 509 పంచాయతీలతో సరి పెట్టుకుంది. రెండో దశలో 3,328 పంచాయతీలకు గాను (ఇందులో శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కో పంచాయతీ చొప్పున మూడింటికి నామినేషన్ దాఖలు కానందున ఎన్నికలు జరగలేదు) 2,649 (ఏకగ్రీవాలతో సహా) అధికార పార్టీ అభిమానులకే దక్కడం విశేషం. పెరిగిన నమ్మకం గ్రామీణ ప్రజలు మొదట్నుంచీ వైఎస్ జగన్ను విశ్వసిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా వాళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు అభిమానంతో అక్కున చేర్చుకున్నారు. అప్పటి అరాచక టీడీపీ పాలనను ఎదుర్కొనే నేత జగన్ అని నమ్మారు. ఊరూవాడా ఆయనకు తమ గోడు చెప్పుకున్నారు. ప్రతి సభలోనూ జగన్ స్థానిక సంస్థల గురించి ప్రస్తావించారు. తాను అధికారంలోకొస్తే చేయబోయే పనులేంటో స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు పల్లె జనానికి తానిచ్చిన హామీలపైనే దృష్టి పెట్టారు. గెలిచిన మొదటి సంవత్సరంలోనే 90 శాతం హామీలను అమలు చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఊళ్లోనే వెలసిన గ్రామ సచివాలయం ప్రజల అవసరాలను తీర్చడంలో ముఖ్య పాత్ర పోషించింది. దీన్నో పెద్ద మార్పుగా ప్రజలు భావించారు. రైతు భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చే విధానం.. అవినీతి, రాజకీయాలకు తావు లేని వ్యవస్థ.. గ్రామీణ జనంలోకి జగన్ను మరింత చొచ్చుకుపోయేలా చేసింది. ఈ దృష్ట్యా ప్రజలు అధికార పార్టీ అభిమానులనే గెలిపించుకోవాలనే నిర్ణయానికొచ్చారు. అందుకే ప్రతి చోట ఫలితం దాదాపు ఏక పక్షంగా కనిపిస్తోంది. దాష్టీకానికి చరమగీతం దశాబ్దాలుగా టీడీపీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న పంచాయతీల్లో ఎన్నికల శంఖం పూరిస్తూ జనం ముందుకొచ్చారు. స్వేచ్ఛాయుత ఓటింగ్లో పాల్గొన్నారు. అందుకే టీడీపీ నేత ఆధిపత్యం చెలాయించే టెక్కలి నియోజకవర్గంలో 12 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కోట బొమ్మాళిపై వైఎస్సార్సీపీ అభిమాని జెండా ఎగుర వేశారు. నిమ్మాడలోనూ అచ్చెన్న అధిపత్యానికి చెక్ పడింది. యనమల రామకృష్ణుడు సొంత పంచాయతీలో కూడా ప్రజలు టీడీపీని చీత్కరించారు. ఆయన సొంత మనుషులనే జనం ఓడించారు. తుని నియోజకవర్గంలో మెజారిటీ పంచాయతీలు వైఎస్సార్సీపీ అభిమానులు క్లీన్ స్వీప్ చేశారు. బీజేపీతో కలిసి ముందుకెళ్లిన జనసేనకూ చుక్కెదురైంది. వాళ్లు నిలబెట్టిన అభ్యర్థులు ఏక సంఖ్యకు పరిమితం కావడమే ఎక్కువగా కనిపించింది. టీడీపీ నేత దేవినేని ఉమ సొంత ప్రాంతంలోనూ జనం వైఎస్సార్సీపీ అభిమానులకు పట్టం కట్టారు. చంద్రబాబు తనయుడు ఇన్చార్జ్గా ఉన్న మంగళగిరిలో కూడా టీడీపీకి పరువు దక్కలేదు. ఇలా ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు ప్రజల్లోకి దూసుకుపోయారు. విపక్షానిది మేకపోతు గాంభీర్యమే! రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్సార్సీపీ బలం ప్రస్తుతం మరింత పెరిగిందని తెలుగుదేశం పార్టీకీ తెలుసు. గ్రామాల్లో వైఎస్ జగన్ ప్రభంజనం కొనసాగుతోందనే నిజం చంద్రబాబుకూ తెలియని విషయం కాదు. పంచాయతీ ఎన్నికలు జరిగితే అధికార పార్టీ వాళ్లే ఎక్కువగా పోటీ పడతారని, అప్పుడు గ్రూపులు ఏర్పడతాయనేది టీడీపీ వ్యూహం. దీనికి తగ్గట్టుగానే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సహకరించారనేది చాలా మంది ఆరోపణ. అయితే ఈ ఎత్తుగడ తారుమారైంది. పలు పంచాయతీల్లో టీడీపీ అభిమానిగా పోటీ చేస్తామని ముందుకొచ్చే వారి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొనడం గమనార్హం. సంక్షేమ పథకాలు సంతృప్తికర స్థాయిలో ప్రజలకు అందుతున్నాయని టీడీపీ కేడరే ఒప్పుకుంటోంది. దీంతో ఇప్పుడు పోటీ చేయడం సరికాదని, వాళ్లే వైఎస్సార్సీపీ అభిమానులను అనేక చోట్ల నిలబెట్టారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేని ఎదురు దెబ్బలు. ఈ పరిస్థితుల్లో మిగతా స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి కష్టంగానే ఉంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే వైఎస్సార్సీపీపై టీడీపీ ఎదురుదాడి మొదలు పెట్టింది. వైఎస్సార్సీపీ విజయాన్ని దౌర్జన్యంతో ముడిపెట్టే దుస్సాహసం చేస్తోంది. ఈ సరికొత్త ప్రయోగం మిగతా రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులకే లాభిస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
పల్లెల్లో వైఎస్సార్సీపీ ప్రభంజ
-
టీడీపీకి 38% పంచాయతీలా? వివరాలు వెల్లడించాలి
కాకినాడ రూరల్: రాష్ట్రంలో సిగ్గులేని రాజకీయ నాయ కుల లిస్టు తీస్తే పై వరుసలో చంద్రబాబు ఉంటారని, గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో పెద్ద ఎత్తున గెలిచి నట్టు ఆయన ప్రచారం చేసుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో శనివారం ఆయన మీడియా తో మాట్లాడారు. తొలిదశ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరులు 85 శాతం వరకు విజయం సాధించారని, ఒక్క కాకినాడ రూరల్లోనే 95 శాతం విజయం సాధించారన్నారు. చంద్రబాబు టీడీపీకి 38 శాతం పంచాయతీలు వచ్చాయని ప్రచారం చేసుకుంటున్నారని, వాటి వివరాలు వెల్ల డించాలన్నారు. ఇప్పుడు కొత్తగా ఎస్ఈసీ ఏకపక్షం గా పనిచేస్తున్నారని, సక్రమంగా పని చేయలేదని ప్రచారాన్ని చంద్రబాబు మొదలు పెట్టారని దీని వెనక నిగూఢ రహస్యం అందరికీ తెలుసన్నారు. ఎస్ఈసీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ప్రచారం చేస్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఎన్నికలకు భయపడే ప్రభుత్వం తమది కాదన్నారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా ప్రజలు మాత్రం ఏకపక్షంగానే తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. -
ఏపీ పంచాయతీ ఎన్నికలు; మూడో విడత ఏకగ్రీవాల జోరు
సాక్షి, అమరావతి: మూడో విడత ఎన్నికలలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. 579 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం అధికారికంగా ప్రకటించింది. మూడో విడత 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ కాగా, ఆయా గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 13 జిల్లాల నుంచి సమాచారం అందాక, ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం శనివారం అధికారికంగా విడుదల చేసింది. 579 సర్పంచ్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మూడో విడత 2,640 సర్పంచ్ స్థానాలకు (రెండు స్థానాల్లో నామినేషన్ దాఖలు కాలేదు) ఎన్నికలు జరగనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం పేర్కొంది. 7,756 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరుగుతుందని తెలిపింది. కాగా, మూడో విడతలో ఎన్నికలు జరిగే 3,221 గ్రామ పంచాయతీల పరిధిలో 31,516 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత 11,732 వార్డులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. 19,607 వార్డులలో 43,282 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు తెలిపింది. కాగా, 177 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. నాలుగో విడత సర్పంచ్ పదవులకు 20,156 నామినేషన్లు నాలుగో విడతలో 3,228 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవులకు 20,156 నామి నేషన్లు, వార్డు పదవులకు 88,285 నామి నేషన్లు దాఖలు అయ్యాయి. ఈ గ్రామ పంచా యతీల్లో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగియనుంది. -
ఇంటివద్దకే సంక్షేమ ఫలాలు
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో గ్రామసీమల రూపు రేఖలు మారుతున్నాయి. ఒకనాడు పల్లెల్లో అంతం త మాత్రంగా జీవనం సాగిస్తున్న ప్రజల జీవనశైలి లో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో అధునాతన వసతులు సమకూరడం, ఆరోగ్యానికి అభయం లభించడంతో పల్లెలు నవజీవనంతో వెలిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఎక్కడికక్కడ ప్రాజెక్టులు, చెరు వుల్లో నీరు నిండడంతో పల్లె సీమలు పచ్చని పంట లతో కళకళలాడుతున్నాయి. పల్లెల్లో పరిస్థితి చూస్తే ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కళ్లెదుటే కనిపి స్తోంది. మనం పరు గెత్తే పరిస్థితి నుంచి అధికారులే ఇంటి వద్దకు వచ్చి సంక్షేమ ఫలాలు అందించే పరిస్థితి వచ్చింది. పెన్షన్, బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, అవసరమైన సర్టిఫికెట్లు.. ఇలా అవసరమైనవన్నీ ఊళ్లోని సచివాలయంలోనే ఇస్తున్నారు. సచివాలయానికి వెళ్లలేనివారికి వలంటీరే ఇంటివద్దకు వచ్చి అందజేస్తున్నారు. రూ.400 కోట్లకు పైగా నిధులతో గ్రామాల్లో పనులు వైఎస్సార్ జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లెసీమల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. పల్లెలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పాడా) ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గంలోను, పంచాయతీ రాజ్శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగాను విస్తృతంగా అభివృద్ధి పనులు జరిగాయి. సిమెంటు రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం రూ.400 కోట్లకుపైగా ఖర్చుచేశారు. వైద్యానికి భరోసా జిల్లాలో 74 పీహెచ్సీలు, 17 పట్టణ ఆరోగ్య కేం ద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చెంతకే వైద్యం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్లను ప్రారంభించింది. దీన్లో భాగంగా జిల్లాలో రూ.87.50 కోట్లతో 500 హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటిలో 10 భవనాలు పూర్త య్యాయి. 450 భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మార్చి నాటికి వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నారు. కమలాపురంలో ఇటీవల ప్రారంభించిన రైతు భరోసా కేంద్రం ఆధునిక టెక్నాలజీ జిల్లాలో పెండింగ్లో ఉన్న 2012–13 పంటల బీమా మొదలు అన్నింటినీ ప్రభుత్వం ఒక్కొక్కటి అన్నదాతలకు అందిస్తూ వస్తోంది. ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంతో కూడిన రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వీటి ద్వారా సత్వరం అందిస్తున్నారు. జిల్లాలో 621 ఆర్బీకేల నిర్మాణానికి ప్రభుత్వం రూ.135.38 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.21.77 కోట్లు వెచ్చించి 14 భవనాలను పూర్తిచేశారు. ప్రజలకు సత్వరసేవలు గ్రామాల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందిం చడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగు తోంది. జిల్లాలో 631 సచివాలయాలున్నాయి. వీటి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.233 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.88.65 కోట్లు ఖర్చుచేసి 142 భవనాలను పూర్తిచేశారు. మరో 430 భవనాల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నా యి. 59 భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో విద్య శిథిలావస్థకు చేరిన భవనాలు, ఫర్నిచర్ లేని తరగతి గదులు, మరుగుదొడ్ల కొరత.. వంటి సమస్యలతో కునారిల్లుతున్న పాఠశాలలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. జిల్లాలో తొలివిడతలో 1,040 పాఠశాలలను నాడు–నేడులో భాగంగా తీర్చిదిద్దేందుకు రూ.185 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే దాదాపు అన్ని పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించారు. 300 పాఠశాలలకు సంబంధించి పెయింటింగ్ పనులు మిగిలి ఉన్నాయి. మార్చి చివరి నాటికి పనులన్నీ పూర్తిచేసేలా కసరత్తు చేస్తున్నారు. రెండో విడత కూడా మరో 1000కి పైగా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఏప్రిల్ నుంచి పనులు చేపట్టాలని భావిస్తున్నారు. చదువుకునేందుకు మంచి వాతావరణం నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో వసతులు కల్పించడంతో చదువుకునేందుకు మంచి వాతావరణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్దపీట వేయడంతో ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి దాదాపు 20 వేలమందికి పైగా విద్యార్థులు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇప్పటికే నాడు–నేడు పనుల్లో భాగంగా పాఠశాలలకు తుది మెరుగులు దిద్దుతున్నాం. – డాక్టర్ అంబవరం ప్రభాకర్రెడ్డి, సమగ్రశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి, కడప వేగవంతంగా పనులు చేయిస్తున్నాం జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగవంతంగా నడిపిస్తున్నాం. జిల్లాలో రైతుభరోసా కేంద్రాలతోపాటు సచివాలయాల నిర్మాణం, హెల్త్ క్లినిక్ల పనులు కూడా చేయిస్తున్నాం. మార్చి చివరి నాటికి వీలైనన్ని ఎక్కువ భవన నిర్మాణాలు పూర్తిచేసి అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నాం. – వెంకటసుబ్బారెడ్డి, ఎస్ఈ, పంచాయతీరాజ్శాఖ, కడప -
టెక్కలిలో అచ్చెన్న దౌర్జన్యాలెన్నెన్నో..
సాక్షి, అమరావతి: టెక్కలి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా తీవ్రమైన నేరాలు, ఘోరాలకు పాల్పడుతూ ప్రజల, ప్రభుత్వ ఆస్తులను అచ్చెన్నాయుడు లూటీ చేశారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రౌడీ, గూండా, క్రిమినల్ అయిన తెలుగు దొంగలపార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతిలో కూర్చుని తాము నిజాయితీపరులమని, ప్రజాస్వామ్యవాదులమని నీతులు చెబుతుంటారని, ఆయన బతుకేంటో టెక్కలి, శ్రీకాకుళం జిల్లా ప్రజలనడిగితే చెబుతారన్నారు. అచ్చెన్నాయుడు రెండెకరాల నుంచి ఈరోజు వేల కోట్లకు పడగలెత్తారని, ఇవన్నీ ఎక్కడినుంచి సంపాదించారో చెప్పాలన్నారు. అచ్చెన్నాయుడు దౌర్జన్యాలు, అక్రమాలపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేసి న్యాయవిచారణ జరిపించాలన్నారు. అలా జరిపిస్తే.. సాక్ష్యాధారాలతోసహా తాను నిరూపిస్తానన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అచ్చెన్నాయుడి తండ్రి హయాంనుంచే హత్యా రాజకీయాలు మొదలుపెట్టారన్నారు. రిగ్గింగ్లు, రౌడీయిజంతో కింజరాపు బ్రదర్స్ ఇంతకాలం టెక్కలి ప్రాంతంలో ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారన్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో, ఆయన బంధువు కింజరాపు అప్పన్న నామినేషన్ వేయాలనుకుంటే చంపేస్తామని బెదిరించడాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జిగా తానక్కడికి వెళితే 500 మంది రౌడీలు కత్తులు, కర్రలు, బరిసెలతో దాడి చేశారని, తనను, అప్పన్నను చంపాలని చూశారని వివరించారు. అచ్చెన్న దౌర్జన్యాలకు కాలం చెల్లిందని, మొదటిదశ ఎన్నికల్లో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 135 పంచాయతీలకు 113 స్థానాలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలిచారని, టీడీపీవారు 22 స్థానాల్లోనే నెగ్గారన్నారు. రిగ్గింగ్కు అవకాశం లేకుండా చూడడంతో ప్రజలంతా స్వేచ్ఛగా ఓట్లు వేశారన్నారు. టెక్కలి ప్రజలు తిరగబడి తరిమికొట్టినా అచ్చెన్నాయుడుకు సిగ్గురాలేదన్నారు. వేల కోట్లకు పడగలెత్తారు.. కింజరాపు బ్రదర్స్ అక్రమాస్తులు వేల కోట్లకు చేరాయని దువ్వాడ ఆరోపించారు. ‘‘నిమ్మాడలో ప్రభుత్వ భూముల్లో ఎఫ్సీఐ గోడౌన్స్ నిర్మించి.. వారి కుటుంబసభ్యులు భాగస్వాములుగా ఉన్నారు. ప్రజల భూముల్నిసైతం ఆక్రమించుకున్నారు. భవానీ గ్రానైట్స్ ఫ్యాక్టరీలో 2014–19 మధ్య క్వారీల్లో రాళ్లను పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలించి కట్ చేశారు. ఇలా రూ.39 కోట్ల రాయిని అక్రమంగా తరలించారు. టెక్కలిలో కాంట్రాక్టుల పేరుతో కోట్లు మింగేశారు. సారా కాంట్రాక్టర్గా అచ్చెన్నాయుడు 75 షాపులు బినామీగా పెట్టుకుని మద్యం అక్రమ వ్యాపారాన్ని నడిపారు. రైస్ మిల్లర్లు, మద్యం షాపులవద్ద నెలవారీ మామూళ్లు వసూలు చేశారు. పీఏసీఎస్ అధ్యక్షునిగా ఉన్న అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్ దాన్నడ్డుపెట్టుకుని బినామీల ఆస్తులపై రుణాలు తీసుకుని రూ.18 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడ్డారు. సింగపూర్లో హోటళ్లు, షిప్లు కూడా ఉన్నాయి’’ అని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ న్యాయస్థానాల్లో సాక్ష్యాలతోసహా నిరూపిస్తామని దువ్వాడ చెప్పారు. -
కొండలు, గుట్టలు దాటి.. 8 కిలోమీటర్లు నడిచి..
సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలో మావోయిస్టు ప్రభావిత గ్రామంగా గుర్తించిన సాలూరు మండలం ఒడిశా సరిహద్దు సంపంగిపాడు పంచాయతీ ఎన్నికల పోలింగ్లో గిరిశిఖర గ్రామాల ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పంచాయతీలోని దిగువరూడ, కాగరూడ, గాడివలస, కొంకమామిడి, గాలిపాడు గిరిశిఖర గ్రామాల ప్రజలు కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ సుమారు 8 కిలోమీటర్లు నడిచి దళాయివలసలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంతో శ్రమపడి ఓటుహక్కు వినియోగించుకున్న గిరిశిఖర గ్రామాల వారు ఆదర్శంగా నిలిచారు. ఈ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు 485 ఓట్లకుగాను 297 (61 శాతం) పోలయ్యాయి. సంపంగిపాడు గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. వైఎస్సార్సీపీ అభిమాని బుడియా చంద్రయ్య సర్పంచ్గా ఎన్నికయ్యారు. -
టీడీపీ కంచుకోటలు బద్దలు
సాక్షి, అమరావతి: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మొదటి విడత హవాను కొనసాగిస్తూ టీడీపీ ముఖ్యనాయకుల స్వగ్రామాల్లో కూడా వైఎస్సార్ సీపీ జెండా ఎగిరింది. వివరాల్లోకెళ్తే.. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్వగ్రామం చినమేరంగిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అల్లు రవణమ్మ 122 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ♦ ఇదే జిల్లాలో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి స్వగ్రామం కవిరిపల్లిలో వైఎస్సార్సీపీ అభిమాని 408 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ♦ కర్నూలు జిల్లాలో ఇల్లూరి కొత్తపేటలో వైఎస్సార్సీపీ అభిమాని గోరంట్ల వెంకటరమణ గెలిచి టీడీపీ కంచుకోటను బద్దలుగొట్టారు. ♦ కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జి ఉమామహేశ్వరనాయుడు స్వగ్రామం అంకంపల్లిలో వైఎస్సార్సీపీ అభిమాని రుద్ర విజయం సాధించారు. ♦మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ నియోజకవర్గం రాప్తాడు 58 పంచాయతీలుండగా.. వైఎస్సార్సీపీ అభిమానులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. ♦ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సొంత పంచాయతీ సంగాలలో వైఎస్సార్సీపీ అభిమాని విజయం సాధించారు. ♦ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 130 పంచాయతీలకు గాను 117 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు విజయదుందుభి మోగించారు. ♦ విశాఖ జిల్లా కొత్తకోటలో వైఎస్సార్సీపీ అభిమాని కోన లోవరాజు 1,839 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ♦ విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం సాలిక మల్లవరంలో వైఎస్సార్సీపీ అభిమాని పెదిరెడ్ల నూకరత్నం ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. ♦ గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గొట్టిపాడులో వైఎస్సార్సీపీ మద్దతుదారు దండా రోశమ్మ ఒక్క ఓటుతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ♦ ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. లాటరీలో వైఎస్సార్సీపీ అభిమాని గెలుపొందారు. -
మలివిడతలోనూ ‘దేశం’ దౌర్జన్యకాండ
సాక్షి, అమరావతి: ఏకగ్రీవాల సంఖ్య పెరగడం, తొలివిడతలో ప్రజాతీర్పు అధికార పార్టీకి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా శనివారం పలుచోట్ల దౌర్జన్యానికి పాల్పడ్డాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 18 రెవెన్యూ డివిజన్లలో 167 మండలాలకు చెందిన గ్రామాలు, వార్డుల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి దాడులకు దిగడడంతో పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు. మలివిడత పోలింగ్లో దాదాపు 9 వేలకు పైగా అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్లతోపాటు వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించి కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. మలి విడతలోను టీడీపీ దౌర్జన్యపర్వం విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్ధిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు దౌర్జన్యానికి దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. కృష్ణా జిల్లా కొత్త నిమ్మకూరులో ఓ వృద్ధురాలితో కలసి పోలింగ్ బూత్ లోపలికి ప్రవేశించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు అభ్యంతరం తెలపడంతో దాడికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం పెరిసేపల్లిలో పోలింగ్ బూత్లో ఏజెంట్గా ఉన్న దాసి ప్రవీణ్కుమార్ను మాస్క్ ధరించలేదనే నెపంతో టీడీపీ నేతలు దాడి చేశారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో దొంగ ఓట్లు వ్యవహారం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ప్రకాశం జిల్లా కొనకనమిట్ట మండలం బోడపాడులో టీడీపీ అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ మద్దతుదారైన అభ్యర్థి కమలాకర్ పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలులో బ్యాలెట్ పెట్టెల తరలింపు ఉద్రిక్తతకు దారితీసింది. తమ గ్రామంలోనే కౌంటింగ్ జరపాలంటూ పోలింగ్ బూత్కు తాళాలు వేసి గ్రామస్తులు అందోళనకు దిగారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పామర్రు ఎమ్మెల్యే అనిల్పై డీఐజీ అసహనం కృష్ణా జిల్లా పామర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వస్తున్న ఎమ్మెల్యే అనిల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులపై టీడీపీ శ్రేణుల దౌర్జన్యకాండను డీఐజీ మోహనరావుకు వివరించే ప్రయత్నం చేయగా డీఐజీ పట్టించుకోలేదు. వెళ్లవయ్యా.. వెళ్లు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా తాను చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మనస్తాపం చెందిన ఎమ్మెల్యే అనిల్ డీఐజీ కారు వద్ద నిరసన తెలిపారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్కు, డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. డీఐజీ తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి. దీంతో తాను ఎమ్మెల్యేను గుర్తుపట్టలేదంటూ డీఐజీ నిష్క్రమించారు. టీడీపీ నేతల బరితెగింపు తాడిపత్రి రూరల్: ఓటర్లకు డబ్బు పంచుతున్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇస్తారేమోననే భయంతో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడిన ఘటన అనంతపురం జిల్లా ఆలూరులో శనివారం జరిగింది. తాడిపత్రి మండలం ఆలూరులో టీడీపీ మద్దతుదారైన అగ్రహారం శంకర్.. టీడీపీ నేత తిరుపాల్రెడ్డి, కార్యకర్తలతో కలిసి ప్రచారం ముసుగులో ఓటర్లకు డబ్బులు పంచడంలో నిమగ్నమయ్యాడు. దీనిని వైఎస్సార్సీపీ కార్యకర్త రవిచంద్రారెడ్డి గమనించడంతో పోలీసులకు సమాచారం ఇస్తాడేమోననే ఉద్దేశంతో తిరుపాల్రెడ్డి, శంకర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటనారాయణ, రమేష్, వెంకటప్రసాద్, సర్పంచ్ అభ్యర్థి శంకర్, నాగరంగయ్య అలియాస్ బుజ్జి, అగ్రహారం ప్రసాద్, శివ, రంగనాయకులు, వేణుగోపాల్, గురుస్వామి మరికొందరు అతనిపై రాళ్లు, కట్టెలతో దాడికి తెగబడ్డారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ అభిమానులు అతడిని కాపాడేందుకు అక్కడికి పరుగెత్తుకు రాగా.. వారిపైనా దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రవిచంద్రారెడ్డి, ప్రవీణ్కుమార్, తలారి బయన్న, వంశీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్సకు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించకుండా పోలీసులు గంటకు పైగా పోలీసుస్టేషన్లోనే ఉంచడం విమర్శలకు తావిస్తోంది. ఓటమిని జీర్ణించుకోలేక రాళ్ల దాడి కొలిమిగుండ్ల: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంకమ్మవారిపల్లెలో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు శనివారం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. సర్పంచ్ పదవికి వైఎస్సార్సీపీ అభిమాని తమ్మినేని కొండయ్య, టీడీపీ తరఫున రాందాస్చౌదరి పోటీపడగా.. తమ్మినేని కొండయ్య 123 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. రాముడు, గురుచంద్ర, వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. -
ఎస్ఈసీ ఉత్తర్వులు నిలిపేయండి
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజైన ఈనెల 21 వరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమైనవని ప్రకటించి, వాటిని కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో శనివారం హౌస్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు మీడియాతో మాట్లాడకుండా ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని అభ్యర్థించారు. ఇందులో ఎన్నికల కమిషన్ కార్యదర్శి, కృష్ణాజిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, కృష్ణాజిల్లా ఎస్పీ (గ్రామీణ)లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ఆదివారం విచారించే అవకాశం ఉంది. పిటిషన్లో కొడాలి నాని ఏం పేర్కొన్నారంటే.. ఆధారాలు చూపకుండా నోటీసు ‘ఎన్నికల కమిషనర్ను కించపరిచేలా, కమిషన్ స్థాయిని తగ్గించేలా మాట్లాడానని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి నాకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. కమిషన్కు సంతృప్తి కలిగించేలా బహిరంగంగా వివరణ ఇవ్వాలన్నారు. వేటి ఆధారంగా నాకు షోకాజ్ నోటీసు ఇచ్చారో ఆ ఆధారాలను నాకు ఇవ్వలేదు. అయినా.. నాకిచ్చిన తక్కువ సమయంలోనే నేను వివరణ ఇచ్చాను. ఎన్నికల కమిషన్ స్థాయిని తగ్గించేలా నేను వ్యాఖ్యలు చేయలేదని.. రాజ్యాంగ వ్యవస్థలపట్ల నాకు గౌరవం ఉందన్న విషయాన్ని తెలియజేశాను. కానీ, నా వివరణను పరిగణనలోకి తీసుకోకుండా విస్మయకరంగా ఈ నెల 21 వరకు నన్ను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. సభలు, సమావేశాల్లో కూడా మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. దీంతో రాజ్యాంగం నాకిచ్చిన భావప్రకటన స్వేచ్ఛను హరించినట్లయింది. అంతేకాక.. నాపై కేసు పెట్టాలని ఎస్పీని ఆదేశించారు. కానీ, ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పునరుద్ఘాటిస్తున్నా’.. అని మంత్రి వివరించారు. -
నిన్న ఆంక్షలు.. నేడు కేసులు
సాక్షి, అమరావతి: మంత్రి కొడాలి నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొడాలి నాని పంచాయతీ ఎన్నికలు ముగిసే 21వతేదీ వరకు మీడియాతో మాట్లాడకూడదని, సభలు, సమావేశాల్లో ప్రసంగించరాదని ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మంత్రి నాని అదే రోజు వెంటనే వివరణ ఇచ్చినా సంతృప్తికరంగా లేదంటూ ఎస్ఈసీ చర్యలకు ఉపక్రమించారు. ఈ పరిణామాలన్నీ ఒకే రోజు 10 గంటల వ్యవధిలోనే చోటు చేసుకున్నాయి. అయితే ఆ తరువాత మంత్రి నాని ఎలాంటి సమావేశాలు నిర్వహించకున్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా ఆయనపై కేసు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, కమిషనర్పై కొడాలి నాని విమర్శలు, ఆరోపణలు చేసినందుకు కేసు నమోదు చేయాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలు 1, 4 క్లాజ్లను అనుసరించి మంత్రి కొడాలి నానిపై ఐపీసీ సెక్షన్లు 504, 505 (1)(సీ), 506 కింద కేసు నమోదు చేయాలంటూ నిమ్మగడ్డ కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
తిరుగులేని విజయం.. ప్రత్యర్థికి 9 ఓట్లు
సాక్షి, నరసరావుపేట రూరల్: ఆ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. వైఎస్సార్సీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి పూర్తి ఏకపక్షంగా విజయబావుటా ఎగురవేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెం సర్పంచ్గా షేక్ ఆరిఫ్బాషా తన సమీప ప్రత్యర్థిపై 607 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. శనివారం జరిగిన పోలింగ్లో మొత్తం 639 ఓట్లు పోలవగా, వాటిలో ఆరిఫ్బాషాకు 616 ఓట్లొచ్చాయి. మిగిలిన నలుగురు అభ్యర్థుల్లో అత్యధికంగా ఓట్లు పొందిన అభ్యర్థి(సమీప ప్రత్యర్థి)కి వచ్చిన ఓట్లు 9. మొత్తం 8 వార్డుల్లో ఐదు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు వార్డులకు జరిగిన పోలింగ్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. చదవండి: (పల్లెల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం) -
పల్లెల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
సాక్షి, అమరావతి: పాలనను పల్లెకు చేర్చిన విప్లవాత్మక మార్పునకు ప్రజలు ఓటేశారు. సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్న విధానానికి పల్లె ప్రజలు జై కొట్టారు. పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత కూడా వైఎస్సార్సీపీ అభిమానులు విజయబావుటా ఎగుర వేశారు. భారీ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఎన్నికల ఫలితాల సరళి పూర్తిగా ఏకపక్షంగానే సాగింది. దాదాపు 80.4 శాతం గ్రామాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. గ్రామ సచివాలయాల ద్వారా 524 రకాల ప్రభుత్వ సేవలను మారుమూల పల్లెల్లో సైతం అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలను అందించిన వైఎస్ జగన్ పాలన తీరుకు పూర్తి మద్దతు తెలుపుతున్నారన్నట్టు ప్రజా తీర్పు వెలువడింది. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 539 చోట్ల సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు చోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఏ ఒక్కరూ నామినేషన్లు దాఖలు చేయనందున అక్కడ ఎన్నికలు జరగలేదు. మిగిలిన 2,786 సర్పంచ్ స్థానాలకు శనివారం పోలింగ్, కౌంటింగ్ జరిగింది. వైఎస్సార్సీపీ అభిమానులు విజయపథాన దూసుకెళుతున్న సరళి విస్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల వద్ద ఇదే వాతావరణం నెలకొంది. 81.61 శాతం పోలింగ్ రెండో విడత ఎన్నికల్లోనూ ఓటర్లు పోటెత్తారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.61 శాతం ఓటర్లు ఓటు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం ఉదయం 6.30 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగింది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావం ఉంటుందని భావించిన దాదాపు 200 గ్రామాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ జరిగింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.60 శాతం దాకా ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధిక గ్రామాల్లో ఉదయమే ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరగగా.. ఆఖరి గంట 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు కేవలం ఐదు శాతం ఓట్లు నమోదు కావడం గమనార్హం. చాలా పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఓటు వేసిన వారు చాలా కొద్ది మందేనని పోలింగ్ పర్యవేక్షణ అధికారులు వెల్లడించారు. పోలింగ్ దాదాపు ప్రశాంతం గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఒకట్రెండు స్వల్ప సంఘటనలు మినహా 13 జిల్లాల పరిధిలో పోలింగ్ ప్రక్రియ పూర్తి ప్రశాంతంగా జరిగినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో పోలింగ్కు ముందు కొందరు వ్యక్తులు బ్యాలెట్ పేపర్లును అపహరించుకుపోయారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు అదనంగా బ్యాలెట్ పేపర్లను ముద్రించి.. తెప్పించడంతో అక్కడ ఎన్నిక సజావుగా కొనసాగింది. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామం ఇనిమెళ్లలో కొందరు రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించగా, అధికారులు సమర్థవంతంగా అడ్డుకొని ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం క్రిష్టాపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు పొలింగ్ బూత్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా, అధికారులు అడ్డుకొని ఎన్నికను సజావుగా నిర్వహించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన 9,661 చోట్ల పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి గిరిజాశంకర్ తదితర అధికారులు పోలింగ్ జరుగుతున్న తీరును వెబ్ కెమెరాల ద్వారా నిరంతరం పరిశీలించారు. పోలింగ్ ముగిసిన రెండున్నర గంటల లోపే ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. ఒట్ల లెక్కింపులో మొత్తం 48,929 మంది సిబ్బందిని వినియోగించినట్టు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలకు ఆదేశం ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా రికార్డు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో అప్పటికే పొలింగ్ జరుగుతుండడం, కౌంటింగ్కు కూడా కేవలం రెండు మూడు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆ ఆదేశాలు జారీ చేశారు. పలు చోట్ల రిటర్నింగ్ అధికారులు హడావుడి పడుతూ ఆ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు సాగించారు. -
పంచాయతీ ఎన్నిక: వైఎస్సార్ సీపీ ప్రభంజనం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలలోనూ వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు 1299 పైగా స్ధానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. జిల్లా విజయం సాధించిన స్థానాలు శ్రీకాకుళం 144 విజయనగరం 91 విశాఖ 99 తూర్పు గోదావరి 58 పశ్చిమ గోదావరి 57 కృష్ణా 67 గుంటూరు 119 ప్రకాశం 120 నెల్లూరు 95 చిత్తూరు 101 కర్నూలు 177 అనంతపురం 96 వైఎస్సార్ జిల్లా 75 -
పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి..
శ్రీకాకుళం: జిల్లాలో కొత్తగా పెళ్లైన జంటలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పలాస మండలం బొడ్డపాడులో ఓ జంట ఓటు వేయడానికి రాగా, వజ్రపుకొత్తూరు మండలం చిన్నవంక గ్రామపంచాయతీ పరిధిలోని గుల్లలపాడు గ్రామానికి చెందిన మరొక జంట కూడా తమ ఓటు వేయడానికి పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చింది. బొడ్డపాడులో రమేష్, సింధూల వివాహం జరిగిన వెంటనే ఓటు హక్కును వినియోగించుకోగా, మరొక జంట గౌతమీ-యోగేశ్వరరావులు తమ ఓటును వేశారు. వివాహం జరిగిన అనంతరం తన భర్తతో కలసి చిన్నవంక పోలింగ్ బూత్ కి చేరుకొని గౌతమీ.. ఓటు వినియోగించుకున్న అనంతరం మురిపింటివాని పేట చేరుకొని అక్కడ వరుడు యోగేశ్వరరావు ఓటును వినియోగించుకున్నారు. నూతన దంపతులు ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ జె నివాస్ అభినందించారు. వీరు యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని ప్రశంసించారు. కాగా, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం గం. 3.30వరకూ పోలింగ్ జరగ్గా, నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. -
ఏపీలో రెండోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
ఏపీ పంచాయతీ ఎన్నికలు: ఫలితాలపై ఉత్కంఠ
-
ఏపీ: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇలా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కోక్కటిగా వెలువడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం గం. 3.30వరకూ పోలింగ్ జరగ్గా, నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇప్పటివరకూ ఓవరాల్గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,477 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 500 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 14, ఇతరులు 38 చోట్ల గెలుపొందారు. రెండో విడతలో మొత్తంగా 3,328 పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా.. జిల్లా పార్టీ మద్దతుదారులు వైఎస్సార్సీపీ టీడీపీ బీజేపీ ఇతరులు శ్రీకాకుళం 243 28 0 1 విజయనగరం 284 63 1 12 విశాఖ 189 58 1 2 తూర్పు గోదావరి 153 24 7 2 పశ్చిమ గోదావరి 128 23 3 2 కృష్ణా 144 35 1 4 గుంటూరు 177 42 0 3 ప్రకాశం 228 36 0 0 నెల్లూరు 166 22 0 2 చిత్తూరు 232 38 1 4 కర్నూలు 184 40 0 3 అనంతపురం 226 51 0 0 వైఎస్సార్ జిల్లా 150 19 0 3 -
ఏపీ పంచాయతీ రెండో విడత ఎన్నికలు
-
ఏపీ: రాష్ట్ర వ్యాప్తంగా 81.67 శాతం పోలింగ్
సాక్షి, అమరావతి : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81.67 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం 72.87, విజయనగరం 82, విశాఖ 84.94,తూ.గో. 82.86, ప.గో.81.75, కృష్ణా 84.14, గుంటూరు 85.51, ప్రకాశం 86.93, నెల్లూరు 78.04, చిత్తూరు 77.20, వైఎస్ఆర్ జిల్లా 80.47, కర్నూలు 80.76, అనంతపురం 84.65 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం: 4.00 ప్రారంభమైన రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. 2,786 పంచాయతీలు, 20,817 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటికే 539 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం: 3.30 ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం దక్కనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ పక్రియ మొదలవ్వనుంది. మధ్యాహ్నం: 2.48 పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వైఎస్సార్ జిల్లా: కమలాపురం నియోజకవర్గంలో వల్లూరు పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ హరి కిరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యూ లైన్లో ఓటర్ల వద్ద ఓటర్ స్లిప్లను పరిశీలించారు. కౌంటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన కేంద్రాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చెన్నూరు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను జిల్లా అడిషనల్ ఎస్పీ ఖాసీం సాహెబ్ పరిశీలించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం: 1.59 కృష్ణా జిల్లా: గుడివాడ పురపాలక సంఘ కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా రెండో విడత పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలిస్తున్నారు. ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తున్నారు. ఉదయం.. గుడ్లవల్లేరు, ముదినేపల్లి, గుడివాడ మండలాల్లో కలెక్టర్ విస్తృతంగా ప్యటించారు. మధ్యాహ్నం 1.12 క్రమేపీ పెరుగుతున్న పోలింగ్ శాతం.. పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతం క్రమేసీ పెరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్ నమోదయిందన్నారు. 9 వేల పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో స్వల్ప సమస్యలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు. మధ్యాహ్నం 12.58 మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్.. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారిగా ఓటింగ్ శాతం ♦శ్రీకాకుళం జిల్లా- 51.30 శాతం ♦విజయనగరం జిల్లా- 71.5 శాతం ♦విశాఖ జిల్లా- 64.28 శాతం ♦తూర్పుగోదావరి- 60.90 శాతం ♦పశ్చిమగోదావరి- 63.54 శాతం ♦కృష్ణా జిల్లా- 66.64 శాతం ♦గుంటూరు జిల్లా- 69.08 శాతం ♦ప్రకాశం జిల్లా- 65.15 శాతం ♦నెల్లూరు జిల్లా- 59.92 శాతం ♦చిత్తూరు జిల్లా-67.20 శాతం ♦వైఎస్సార్ జిల్లా- 64.28 శాతం ♦కర్నూలు జిల్లా- 69.61 శాతం ♦అనంతపురం జిల్లా- 70.32 శాతం మధ్యాహ్నం 12.40 పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ.. అనంతపురం: బెలుగుప్ప మండలం కాలువపల్లి పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. చేసిన ఓటు హక్కు సద్వినియొగం చేసుకోవాలని ఓటర్లను సుచించారు. ఎలాంటి సమస్యలను తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు... మధ్యాహ్నం 12.21 ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన స్వగ్రామం దేవనల్తాడలో మంత్రి అప్పలరాజు దంపతులు ఓటు వేశారు. మధ్యాహ్నం 12.05 ఓటర్లకు పోలీసు సేవలు వైఎస్సార్ జిల్లా: ఓటు వేసేందుకు వచ్చిన వికలాంగులు, వృద్ధులకు మానవతా దృక్పథంతో పోలీసులు సాయం అందిస్తున్నారు. లక్కిరెడ్డిపల్లె ఎస్ఐ చిన్నపెద్దయ్య మానవత్వం చాటుకున్నారు. లక్కిరెడ్డిపల్లె మండలంలోని అప్పకొండయ్యగారిపల్లె పోలింగ్ బూత్ వద్ద నడవలేని వృద్ధురాలిని ఓటు వేయడానికి మోసుకుని తీసుకెళ్లారు. ఉదయం 11.39 ‘తూర్పు’లో ప్రశాంతంగా పోలింగ్.. తూర్పు గోదావరి: జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రామచంద్రాపురం, మండపేట మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అబ్జర్వర్ అరుణ్కుమార్ పరిశీలించారు. ప్రారంభంలో మందకొడిగా ఉన్నా, పదిన్నర గంటలకు 35 శాతం వరకు పోలింగ్ నమోదైంది. తొలి విడత కన్నా.. అధిక శాతం పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉంది. ఉదయం 11.28 ఇరు వర్గాల బాహాబాహీ.. నెల్లూరు జిల్లా: ఎస్పేట మండలం చిరుమన పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. అప్రమత్తమయిన పోలీసులు రంగంలోకి దిగారు. గొడవలు పడుతున్నవారిపై లాఠీఛార్జ్ జరిపారు. ఉదయం 11.12 ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్.. ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్ నమోదైంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్న్నారు. ♦శ్రీకాకుళం-26.81 శాతం ♦విజయనగరం-48.08 శాతం ♦విశాఖ జిల్లా-40.94 శాతం ♦తూర్పుగోదావరి- 34.51 శాతం ♦పశ్చిమగోదావరి- 31.6 శాతం ♦కృష్ణా జిల్లా- 35.81 శాతం ♦గుంటూరు జిల్లా- 45 శాతం ♦ప్రకాశం జిల్లా- 34.14 శాతం ♦నెల్లూరు జిల్లా- 36.3 శాతం ♦చిత్తూరు జిల్లా- 33.50 శాతం ♦కర్నూలు జిల్లా- 46.96 శాతం ♦అనంతపురం జిల్లా- 41.29 శాతం ♦వైఎస్సార్ జిల్లా- 35.17 శాతం ఉదయం 11.01 నిలిచిన పోలింగ్.. ప్రకాశం జిల్లా: సంతమాగులూరు మండలం ఏల్చూరులో 14వ వార్డులో పోలింగ్ నిలిచిపోయింది. ఓటర్ల జాబితాలో తప్పుల పై ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు పోలింగ్ను నిలిపివేశారు. ఉదయం 10.57 పార్వతీపురం మండలంలో టీడీపీ దౌర్జన్యం.. విజయనగరం: పార్వతీపురం మండలంలో టీడీపీ దౌర్జన్యాలకు దిగింది. కృష్ణపల్లి కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఉదయం 10.30 ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రకాశం జిల్లా: పొదిలి మండలం దాసల్లపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అప్రమత్తమయిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఉదయం 10.24 పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ.. వైఎస్సార్ జిల్లా: చెన్నూరు మండలంలోని ఉప్పర పల్లి గ్రామంలో పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు ఉదయం 10.00 విజయనగరం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ను కలెక్టర్ హరి జవహర్లాల్ పరిశీలిస్తున్నారు. ఉదయం 9.30 కొత్త నిమ్మకూరులో టీడీపీ నేత దౌర్జన్యం కృష్ణా జిల్లా కొత్త నిమ్మకూరులో టీడీపీ నేత దౌర్జన్యానికి పాల్పడ్డారు. వృద్ధురాలితో బూత్లోకి వెళ్లి ఓటు వేసే ప్రయత్నం చేయగా, టీడీపీ నేతను వైఎస్సార్సీపీ మద్దతుదారులు అడ్డకున్నారు. ఇర్గువర్గాల మధ్య తోపులాట జరగడంతో.. పోలీసులు చెదరగొట్టారు. ఉదయం. 9. 00 తొలి రెండు గంటల్లో పోలింగ్ 10.28 శాతం ఏపీ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో పోలింగ్ 10.28 శాతం నమోదైంది. క్యూలైన్లలో ఓటర్లు ఓటు వేయడానికి వేచి ఉన్నారు. 9 వేలకుపైగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్న్నారు. చిత్తూరు జిల్లాలోని కొర్లకుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి పేరం మేనక భర్త ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి మద్దిరాల భాను ప్రకాష్రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి గాలివీడు పోలీస్ స్టేషన్కి తరలించారు. లక్కిరెడ్డిపల్లె మండలంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం. 8.30 వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మద్దతుదారులు దాడి పామర్రు పెరిసేపల్లి పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీసీ మద్దతు ఏజెంట్పై టీడీపీ మద్దతుదారులు దాడికి తెగపడ్డారు. సదరు ఏజెంట్ మాస్క్ పెట్టుకోలేదనే నెపంతో దాడి చేశారు. టీడీపీ మద్దతుదారులపై ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ మద్దతుదారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఏస్పీ ఆదేశించారు. ఉదయం. 8.00 పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా సాగుతోంది. ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లో నిల్చుంటున్నారు. పోలీంగ్ సరళి పరిశీలనకు 2,606 మందిని అధికారులు నియమించారు. వెబ్కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఉదయం. 7.30 పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఒక డీఎస్పీని నియమించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అతి సమస్యాత్మక గ్రామాల్లో ఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్స్ను అధికారులు నియమించారు. ఉదయం. 7.05 పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం.6.30 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ శనివారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్లు ధరిచేస్తే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం. 6.25 సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు రెండో విడత పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో దశలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దీంతో 2,786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్ జరగనుంది. 7,507 మంది పోటీ సర్పంచి స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత గ్రామాల్లో 33,570 వార్డులుండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్ జరగనుంది. వార్డులకు 44,876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. -
బాబుకు జగన్ ఫోబియా
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు సీఎం జగన్ ఫోబియా పట్టుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జగన్ చరిష్మాను, ఆయన ప్రజాబలాన్ని చూసి టీడీపీ అధినేతకు రోజురోజుకు మతిచలించిపోతోందని, దీంతో బలవంతపు ఏకగ్రీవాలంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ తొలిదశ ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారని, కుప్పంలోనూ టీడీపీ మద్దతుదారుల ఓటమితో పూర్తిగా మతిభ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అన్నట్టుగా తాను పోటుగాడినేగానీ ఆయనలా వెన్నుపోటుదారుడిని కాదన్నారు. చిత్తూరు జిల్లాలో బాబుకన్నా ఎక్కువగా ప్రజాబలం తనకుందని, అది చూసి ఓర్చుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం సహకరిస్తున్నందునే ప్రశాంతం పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నందునే ప్రశాంతంగా జరుగుతున్నాయని పెద్దిరెడ్డి అన్నారు. రౌడీలు, దుర్మార్గాలు, బలవంతపు ఏకగ్రీవాలంటూ చంద్రబాబు మాట్లాడటం విడ్డూరమన్నారు. టెక్కలిలో అచ్చెన్నాయుడు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర చేసిందేంటని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపాలంటూ చంద్రబాబు కోరడాన్ని తప్పుపట్టారు. బాబు పదవిలో ఉన్నప్పుడు కేంద్ర బలగాలు, విదేశాల నుంచి సిబ్బందిని తెప్పించారా? అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని చిత్తూరు జిల్లాలో స్థానికంగా టీడీపీ నేతలు చెబుతున్నారన్నారు. జగన్ సంక్షేమ పాలనకు జనం నీరాజనం పలుకుతున్నారని చెప్పారు. తప్పుడు ఆరోపణలు సరికాదు.. పోస్కో అనేది అంతర్జాతీయ సంస్థ అని, ఆ సంస్థ ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశారని పెద్దిరెడ్డి చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయాలంటే పోస్కో ప్రతినిధులు సీఎంను కలవాల్సిన అవసరం ఉండదన్నారు. అందుకోసం ప్రధానిని లేదా కేంద్ర మంత్రులను కలిసేవారన్నారు. సీఎం కుట్ర చేశారని, స్టీల్ ఫ్యాక్టరీని అమ్ముతున్నారంటూ చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. గతంలో విశాఖ ఉద్యమం జరిగినప్పుడు ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలకంగా వ్యవహరించారని, ఆయన కేంద్రంతో చెప్పి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరింపజేస్తే బాగుంటుందని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. -
పూటకో మాట... రోజుకో వేషం
సాక్షి, అమరావతి: పూటకో మాట, రోజుకో వేషం చంద్రబాబు నైజంగా మారిందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ గాలి వీస్తోందని చెప్పిన 24 గంటల్లోనే మాట మార్చి ఎన్నికలే బూటకమనడంలో అర్థమేంటని ప్రశ్నిం చారు. అడుగులకు మడుగులొత్తిన ఎన్నికల కమిషన్ వేస్ట్ అనడంపై విస్మయం వ్యక్తం చేశారు. అంపశయ్యపై ఉన్న టీడీపీని కాపాడుకునేందుకు ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సజ్జల ఏమన్నారంటే.. అందుకే ప్లేటు ఫిరాయించారు ‘మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 38.74 శాతం ఓట్లు టీడీపీ గెలిచినట్టు తండ్రీ కొడుకులు చెప్పుకున్నారు. ఆ లెక్కే తప్పని చెబితే బుకాయించారు. దాంతో నిజాలు బయటపెట్టాం. ఎన్నికలు జరిగిన 3,245 పంచాయతీల్లో.. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు 2,616 మంది, రెబల్స్ 26 మంది, టీడీపీ మద్దతుదారులు 510 మంది గెలిచారని చెప్పాం. విజేతలైన మా మద్దతుదారుల వివరాలు ఫోటోలతో సహా బయటపెట్టాం. టీడీపీ వాళ్ళు గెలిచినట్టు చెప్పుకున్న 1,055 పంచాయతీలు లెక్కలు చెప్పమని సవాల్ చేశాం. ఇది చెప్పాల్సి వస్తుందని 24 గంటల్లో ప్లేటు ఫిరాయించారు. చంద్రబాబు చెప్పేదాంట్లో ఏది నిజం? ఇప్పుడు అసలు ఎన్నికలే బూటకమంటాడు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందా? అంటాడు. ఉన్నా వృ«థా అంట. దాని గొంతు నొక్కేశామట. కేంద్ర బల గాలను, పరిశీలకులనూ పంపాలంటాడు. ఐక్య రాజ్య సమితి దళాలనూ అడిగితే బాగుండేదేమో! కేంద్రానికి రాసిన లేఖలో గవర్నర్నూ విమర్శించారు. ఇంతకీ చంద్రబాబు చెప్పేదాంట్లో ఏది నిజం? 1,055 పంచాయతీలు గెలిచింది, 38% ఓట్లు వచ్చింది నిజమా? అలా అయితే లెక్క చూపించాలి..’ అని సజ్జల సవాల్ చేశారు. ఎప్పట్నుంచో చెబుతున్నాం.. ‘రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలను విస్మరిం చిందని ప్రజలు, మేమూ చెబుతూనే ఉన్నాం. ఆయన తెలుగుదేశం చెప్పినట్టల్లా ఆడటం తెలిసిందే. అధికారులను వేధించడంతో పాటు, మాపై ఆంక్షలు పెట్టినా వైఎస్సార్సీపీకే జనం పట్టం కట్టారు. టీడీపీ వెంటిలేటర్పై ఉందని పంచాయతీ ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. రానురాను వైఎస్సార్సీపీ బలం పెరుగుతోంది. వైఎస్ జగన్ను ప్రజలు అక్కున చేర్చుకోవడమే దీనికి కారణం’ అని సజ్జల స్పష్టం చేశారు. వెబ్సైట్లో విజేతల వివరాలు పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్సీపీ అభిమానుల వివరాలన్నీ ‘వైఎస్సార్సీపీపోల్స్ డాట్ ఇన్’ అనే వెబ్సైట్లో పొందుపరిచినట్టు సజ్జల తెలిపారు. ‘అది మీడియా, ప్రజలకు, అందరికీ అందుబాటులో ఉంటుంది. నియోజకవర్గాలు, మండలాల వారీగా గెలిచిన వాళ్ళ ఫోటోలతో సహా వెబ్సైట్లో ఉంచాం. రెబల్స్ వివరాలూ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి తప్పున్నా ఛాలెంజ్ చెయ్యొచ్చు. చంద్రబాబు ఇలా పారదర్శకంగా గెలిచిన టీడీపీ మద్దతుదారుల పేర్లు పెట్టగలరా?’ అని సజ్జల సవాల్ విసిరారు. -
కేంద్రానికి బాబు లేఖ ఓ డ్రామా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా కేంద్రానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడం ఓ డ్రామా అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) విమర్శించారు. నిమ్మగడ్డ, చంద్రబాబు ఒకే కోవలోని వ్యక్తులన్నారు. వీళ్లిద్దరూ కలసి ఎన్ని కుట్రలు పన్నినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరన్నారు. పేదల ముంగిటకే రేషన్ తీసుకెళ్తుంటే అడ్డుపడ్డ వ్యక్తులే అడ్డగోలుగా విమర్శలు చేయడం నీతిమాలిన రాజకీయమని ఆయన ధ్వజమెత్తారు. నాని శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘మొదటి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయంతో చంద్రబాబుకు మతిపోయింది. నిన్నటిదాకా నిమ్మగడ్డను వెనకేసుకొచ్చి, ఇవ్వాళ వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాయడం ఓ డ్రామా. కేంద్రానికేంటి ఐక్యరాజ్యసమితికీ లేఖ రాస్తాడు. ఆయన మానసిక స్థితి అలాగుంది. ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతుంటే జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ ఎన్నికల తర్వాత ఆయన్ను, ఆయన కొడుకుని టీడీపీ క్యాడర్ తరిమికొట్టడం ఖాయం’’ అని దుయ్యబట్టారు. వక్రీకరించి వార్తలు రాయడం దారుణం.. పేదల ఇంటివద్దకే నిత్యావసరాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే 9,260 వాహనాలను తీసుకున్నామని, వీటి ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఇచ్చామన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి మొదలవ్వాల్సిన పథకాన్ని.. ఎన్నికల కోడ్ సాకుగా చూపి చంద్రబాబు, నిమ్మగడ్డ నిలిపివేశారన్నారు. దీంతో 7,200 వాహనాలు తిరగట్లేదన్నారు. మిగతావి పట్టణ ప్రాంతాల్లో రేషన్ అందిస్తున్నట్టు తెలిపారు. వాస్తవమిదైతే ఎల్లో మీడియా ‘ఆగిన బండి’ అంటూ వక్రీకరించి వార్తలు రాయడం దారుణమన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు. దీన్ని గుర్తించకుండా జనసేన, తెలుగుదేశం ఇష్టానుసారం మాట్లాడటం రాజకీయ లబ్ధి కోసమేనన్నారు. ‘‘బీరాలు పలికే పవనూ.. మా ఎంపీలంతా మీతో ఢిల్లీ వస్తారు. ఉక్కు పరిశ్రమ దక్కించే ప్రయత్నం చేస్తావా? ప్రజలను పక్కదారి పట్టించే కుయుక్తులను చంద్రబాబు, పవన్కల్యాణ్ మానుకుంటే మేలు’’ అని హితవు పలికారు. -
మరో మంత్రిపై నిమ్మగడ్డ ఆంక్షలు
సాక్షి, అమరావతి: ఈసారి మరో మంత్రిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారి శుక్రవారం ఉదయం షోకాజ్ నోటీసులు జారీ చేయగా, మంత్రి వివరణ సంతృప్తికరంగా లేదంటూ గంటల వ్యవధిలోనే సాయంత్రానికి ఎస్ఈసీ చర్యలకు ఉపక్రమించారు. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు విధిస్తూ నిమ్మగడ్డ శుక్రవారం రాత్రి ఆదేశాలిచ్చారు. నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఈ నెల 21వ తేదీ వరకు మంత్రి మీడియాతో మాట్లాడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటివరకు ఎటువంటి సభలు, సమావేశాల్లోనూ మాట్లాడకూడదన్నారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకొస్తాయని, ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్లు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధంతో పాటు మీడియాతోనూ మాట్లాడకుండా ఆంక్షలు విధిస్తూ నిమ్మగడ్డ ఇటీవల జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. అరగంటలోనే నోటీసులు.. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడగా అరగంటలోనే 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ జాయింట్ సెక్రటరీ ఎస్.రవీంద్రబాబు షోకాజ్ నోటీసులిచ్చారు. మంత్రి నాని విలేకరుల సమావేశంలో కమిషనర్ను మరికొంత మందితో కలగలిపి కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, మంత్రి వీడియో కాన్ఫరెన్స్ వీడియో ఫుటేజీని పరిశీలించి ఆయన మాట్లాడిన మాటలు అవమానకరమైనవి, హానికరమైనవిగా ఎన్నికల కమిషన్ నిర్ధారణకు వచ్చినట్లు నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అత్యవసరంగా మంత్రి వివరణ కోరుతోందని, కమిషన్కు సంతృప్తి కలిగిం చేలా బహిరంగంగా తగిన వివరణ ఇవ్వాలని సూచించారు. లేకుంటే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కమిషన్ భావిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా లేదా సహాయకుడి ద్వారా వివరణ పంపాలని సూచించారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ను, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ప్రత్యేకంగా పేర్కొంటూ అవమానించేలా, కించపరిచేలా, దురుద్దేశంతో తాను విలేకరుల సమావేశంలో ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని మంత్రి కొడాలి నాని షోకాజ్ నోటీసుకు బదులిచ్చారు. తన లాయర్ తానికొండ చిరంజీవి ద్వారా ఆయన జవాబు పంపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొనగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో వివరణ కాపీని కమిషన్ కార్యాలయ సెక్రటరీ కన్నబాబుకు మంత్రి ప్రతినిధి అందజేశారు. గతంలో ఎప్పుడూ లేదే.. ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ జాయింట్ సెక్రటరీ ఎన్నికల కోడ్ పేరుతో ఒక మంత్రికి షోకాజ్ నోటీసులివ్వడంపై రాజకీయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంప్రదాయాల్లేవని కమిషన్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. నిబంధన ప్రకారం కోడ్కు సంబంధించిన ఆదేశాలు, షోకాజ్ నోటీసులు లాంటివి ఎన్నికల కమిషనరే స్వయంగా జారీచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. -
సర్పంచ్.. మలి పంచ్ నేడే
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు రెండో విడత జరిగే గ్రామాల్లో శనివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగు తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ కాగా 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 2,786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్ జరగనుంది. సర్పంచి స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత గ్రామాల్లో 33,570 వార్డులుండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్ జరగనుంది. వార్డులకు 44,876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 29,304 కేంద్రాల్లో పోలింగ్.. రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం 29,304 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర సామగ్రితో పోలింగ్ సిబ్బంది శుక్రవారం రాత్రికే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. 4,181 కేంద్రాలను అత్యంత సమస్యాత్మ కంగా, 5,480 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. బ్యాలెట్ పేపరుతో ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 18,387 పెద్దవి, 8,351 మధ్యస్థం, 24,034 చిన్న సైజు బ్యాలెట్ బాక్స్లను వినియోగిస్తున్నారు. పోలింగ్ విధుల్లో 81,327 మంది సిబ్బంది పాల్గొంటుండగా 4,385 మంది జోనల్ అధికారులు, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా వ్యవహరిం చనున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్ సమయంగా నిర్ణయించారు. కోవిడ్ పాజిటివ్ బాధితులకు పోలింగ్ చివరిలో గంట పాటు కరోనా జాగ్రత్తలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని కమిషన్ అధికారులు తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 9,661 కేంద్రాలలో ప్రత్యేక వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తమ కార్యాలయాల నుంచి పర్యవేక్షించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్.. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు శనివారం సాయంత్రమే మొదలు కానుంది. నాలుగు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాలెట్ బాక్స్లను నిర్దేశిత ప్రాంతానికి తరలించి తొలుత వార్డులకు తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. వేర్వేరు గదుల్లో ఏర్పాట్లు.. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు వెంటనే చేపడుతున్న నేపథ్యంలో రెండు వేర్వేరు గదుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, ఇతరులు బ్యాలెట్ పేపర్లు తాకకుండా బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. రెండో విడత ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, జిల్లా ఇన్చార్జ్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రాత్రి కూడా నిర్వహించే పక్షంలో తగినన్ని లైట్లు, సిబ్బందికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. కంట్రోల్ రూం ద్వారా వెబ్ కాస్టింగ్ను నిరంతరం పర్యవేక్షించాలని, డేటాను భద్రంగా ఉంచాలని సూచించారు. ఐదు వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో అదనంగా ఒక అధికారిని నియమించాలని, పెద్ద పంచాయతీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్వోకి సహాయంగా గెజిటెడ్ అధికారిని నియమించుకోవాలని సూచించారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం 13 జిల్లాలకు ఇప్పటికే రూ.80 కోట్లు విడుదల చేశామని, రెండో విడత కోసం రూ.116 కోట్లు విడుదలయ్యాయని, నిధులను పొదుపుగా వినియోగించాలని పేర్కొన్నారు. -
కవిటం గ్రామం: 24 ఏళ్లకే సర్పంచ్..
పోడూరు (పశ్చిమగోదావరి జిల్లా): కవిటం గ్రామంలో అతిచిన్న వయస్సులో సర్పంచ్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు చుట్టుగుళ్ల పూర్ణిమ. ఆమె వయసు 24 ఏళ్లు. పూర్ణిమ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, మంగ వ్యవసాయ కూలీలు. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామపెద్దలు వైఎస్సార్ సీపీ అభిమాని నాగేశ్వరరావు కుమార్తె పూర్ణిమతో నామినేషన్ వేయించారు. ఏకగ్రీవం కోసం యత్నించారు. ఎన్నిక అనివార్యమైంది. పూర్ణిమ ప్రత్యర్థి ఉండ్రాజవరపు రత్నకుమారిపై 1,891 ఓట్ల భారీమెజార్టీతో గెలుపొందారు. పూర్ణిమ ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. చదవండి: వీరికి లక్కుంది..! టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన -
ఏపీ పంచాయతీ ఎన్నికలు: వీరికి లక్కుంది..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వీరికి లక్కుంది.. వారికి అదే దక్కింది.. అన్న చందంగా జిల్లాలో ఈ నెల 9న జరిగిన తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 9 మంది అదృష్టవంతులు అతి తక్కువ మెజారిటీలతో సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. గెలిచిన అభ్యర్థులు తమ అదృష్టమంటూ ఆనందపడుతుంటే ఓడిన అభ్యర్థులు తమ ఖర్మంటూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి. తొలిదశ పంచాయతీ ఎన్నికలు అనేక గ్రామ పంచాయతీల్లో నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను సొంత ఖర్చులతో గ్రామాలకు పిలిపించి ఓట్లు వేయించినప్పటికీ ఉత్కంఠ పోరులో సింగిల్ డిజిట్ తేడాతో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తక్కువ మెజారిటీతో చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపొందిన సర్పంచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ►చీమకుర్తి మండలం నిప్పట్లపాడు పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. గెలుపు నీదా నాదా అన్నట్లుగా మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన లెక్కింపు ప్రక్రియలో ఇరువురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు ఇరువురు అభ్యర్థుల ఆమోదంతో టాస్ వేశారు. ఇందులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో పోటీ చేసిన రావులపల్లి కోటేశ్వరరావు విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. ►ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో బరిలో ఉన్న చెన్నుపాటి రాజ్యలక్ష్మి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. ►పర్చూరు మండలం తూర్పుపెద్దివారిపాలెం పంచాయతీలో సైతం చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేసిన రావి సంధ్యారాణి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. ►ఒంగోలు మండలంలోని యర్రజర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీలో ఉన్న తమ్మిశెట్టి రాములమ్మ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఇరువర్గాలకు చెరి 5 వార్డులు సమానంగా గెలుపొందడం విశేషం. ►చీమకుర్తి మండలం జీఎల్ పురం గ్రామ పంచాయతీ ఎన్నికల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీలో ఉన్న మన్నం వెంకటరావు చివరకు 4 ఓట్ల స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ►ఇంకొల్లు మండలం, సూదివారిపాలెం గ్రామంలో సైతం ఉత్కంఠభరితంగా పోటీ సాగింది. ఈ పోటీలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో బరిలో నిలిచిన గోరంట్ల జయలక్ష్మి 4 ఓట్ల స్వల్ప తేడాతో సర్పంచ్గా విజయం సాధించారు. ►ఒంగోలు మండలం బొద్దులూరివారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో పోటీలో నిలిచిన కాట్రగడ్డ కవిత 7 ఓట్ల స్వల్ప తేడాతో విజయంఢంకా మోగించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో మొట్టమొదటి సారి వైఎస్ఆర్ సీపీ పాగా వేసింది. ►ఒంగోలు మండలంలో టీడీపీకి బలమైన గ్రామంగా ఉన్న దేవరంపాడులో సైతం పంచాయతీ పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్న నన్నపనేని వెంకటేశ్వరరావు 9 ఓట్ల స్వల్ప మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరులో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు 9 ఓట్ల లోపు మెజారిటీలతో గెలుపొంది అదృష్టవంతులు అనిపించుకోగా, వీరిపై పోటీ చేసి ఓడిపోయిన 9 మందికి దురదృష్టవశాత్తు ఓటమే దక్కిందని అంతా సానుభూతి చూపుతున్నారు. ఇంకొంచెం కష్టపడి ఒక్క ఓటు తెచ్చుకున్నా గెలిచేవాళ్లమంటూ వీరిలో కొందరు తమ దురదృష్టానికి తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి. మొత్తానికి తొలిదశ ఎన్నికల్లో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో తక్కువ మెజారిటీలతో గెలుపొందిన సర్పంచ్లకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. -
జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు
కాకినాడ రూరల్: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఎన్ని కుయుక్తులు చేసినా.. చంద్రబాబు ఎన్ని రకాలుగా అడ్డుతగిలినా పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనాన్ని ఆపలేరని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేటలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి విజయ పరంపర కొనసాగిందని, ఎస్ఈసీ రమేష్కుమార్ స్వగ్రామంలోనూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులు విజయం సాధించారన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికలకు భయపడే పార్టీ కాదని, ఈవేళ వాతావరణం అనుకూలంగా లేదని, ఆరోగ్య పరిస్థితులు కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు. కాకినాడ రూరల్ సొంత నియోజకవర్గంలో 35 పంచాయతీలకు 33లో వైఎస్సార్సీపీ సానుభూతి పరులు విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకార గ్రామం సూర్యారావుపేట సర్పంచ్ సూరాడ చిన్ని, గ్రామస్తులు కోణం, పండుగప్ప చేపలను విజయ సూచకంగా తీసుకురావడంతో వాటిని మంత్రి కన్నబాబు పట్టుకుని చూపారు. -
ఏపీ పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో సర్పంచ్ పదవి
సాక్షి, అమరావతి బ్యూరో: అది కృష్ణా జిల్లాలోనే బుల్లి పంచాయతీ.. 1975లో కుందేరు నుంచి వేరుపడి పంచాయతీగా ఏర్పాటైంది. 350 మంది జనాభా, 232 మంది ఓటర్లున్న ఆ ఊరి పేరు కందలంపాడు. కంకిపాడు మండలంలో ఉంది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు గతంలో నిర్మల్ గ్రామ పురస్కారాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది.. ఈ పంచాయతీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అవడంతో ఇద్దరు బరిలో నిలిచారు. మంగళవారం నాటి ఓటింగ్లో 232 ఓట్లకు గాను 211 పోలయ్యాయి. ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇందులో బాయిరెడ్డి నాగరాజు (వైఎస్సార్సీపీ మద్దతుదారు)కు 103, మొవ్వ శివనాగ సుబ్రహ్మణ్యానికి 102 ఓట్లు వచ్చాయి. దీంతో ఒకే ఒక్క ఓటు ఆధిక్యంతో నాగరాజు సర్పంచ్ అయ్యారు. ఇక ఆ ఊరిలోని నాలుగు వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం అయింది. మిగిలిన మూడు వార్డుల్లో వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థులే గెలుపొందారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్కు ఉప సర్పంచ్ పదవిని కట్టబెట్టారు. దిబ్బపాలెంలోనూ అంతే.. మాడుగుల రూరల్: విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందారు. దిబ్బపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. గ్రామానికి చెందిన నందారపు కాసులమ్మ, తుంపాల నిరంజని పోటీ పడ్డారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో నిరంజని కేవలం ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. కాసులమ్మకు 742 ఓట్లు రాగా, తుంపాల నిరంజనికి 743 ఓట్లు వచ్చాయి. కాపవరం పంచాయతీలోనూ.. సామర్లకోట: ఒక్క ఓటు.. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయనను విజయం వరించింది. తూర్పుగోదావరి జిల్లా కాపవరం పంచాయతీలో 8 వార్డులున్నాయి. అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో కుంచం మాధవరావు గెలుపొందారు. అధికారులు తిరిగి ఓట్లు లెక్కించడంతో అదే ఒక్క ఓటు తేడాతో మాధవరావు గెలుపొందారు. లాటరీతో వరించిన పదవి గోనేడ సర్పంచ్గా గంగరాజు ప్రత్తిపాడు : ఇద్దరు అభ్యర్థులకూ ఓట్లు సమంగా వచ్చాయి.. దీంతో అధికారులు లాటరీ తీసి అభ్యర్థిని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో అల్లు విజయకుమార్, పలివెల గంగరాజులకు 1,207 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ తీయగా విజయ్కుమార్ను అదృష్టం వరించడంతో సర్పంచ్ అయ్యారు. -
గెలవలేక టీడీపీ నేతల అరాచకాలు
సాక్షి, అమరావతి: మొదటి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసిందని, దీన్ని చూసి తట్టుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలపై బుధవారం ఎస్ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా, కడియపుసావరంలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారన్నారు. బుచ్చయ్యచౌదరిని ఎన్నికల ప్రచారం చేయకుండా నిరోధించాలని కోరారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనంతపురం జిల్లా బొమ్మనహళ్లో టీడీపీ జెండాలతో, వందలాది మందితో కలిసి ప్రచారం చేస్తున్నారన్నారు. వారు బలపరిచిన, పోటీలో ఉన్న సర్పంచి అభ్యర్థిని, వార్డు మెంబర్లను అనర్హులుగా ప్రకటించాలన్నారు. ఉరవకొండలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శీనప్ప నామినేషన్ వేసిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కౌకుంట్ల పంచాయతీలోని మైలారంపల్లి, వై.రామాపురం గ్రామాల్లోని వార్డు సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి నామినేషన్లు విత్డ్రా చేసుకోకుంటే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు సిద్ధారెడ్డి, మల్లకేష్, భీమలింగ, మహేశ్, ఖాశీం తదితరులకు తగిన రక్షణ కల్పించాలన్నారు. -
పంచాయతీ ఫలితాలు మాకే అనుకూలం
సాక్షి, అమరావతి: తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వచ్చాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. 38.74 శాతం పంచాయతీలను తమ పార్టీ గెలుచుకున్నట్టు తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ పతనానికి నాంది అని, రాబోయే రోజుల్లో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పారు. దుర్మార్గాలను ఎదుర్కొని ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికించారని, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రాణాలు పణంగా పెట్టి దుర్మార్గాలను అడ్డుకున్నారని, ఇది టీడీపీ సత్తా అని చెప్పారు. 2,723 గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ 1,023 గెలుచుకుందని, ఇతరుల మద్దతుతో మరో 32 పంచాయతీలలో గెలిచామని, మొత్తంగా 38.74 శాతం స్థానాలలో తాము బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. ఒక మంత్రి 94 శాతం పంచాయతీలను గెలిచినట్టు గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. షర్మిల రాజన్న రాజ్యం తెస్తానంటున్నారు ఒకవైపు షర్మిల పార్టీ పెడుతున్నామని తిరిగి రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెబుతుంటే.. ఏ2 మాత్రం ఆమె అలా ఎక్కడ మాట్లాడిందని గాలి మాటలు చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ జగన్ చెల్లెలికి కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. సీఎం జగన్ సాక్షాత్తు బాబాయిని చంపేసి నాటకాలాడుతున్నాడని విమర్శించారు. పుంగనూరు నియోజకవర్గంలో 85 పంచాయతీల్లో 82 పంచాయతీలను బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన ప్రతిఒక్కరిని కోర్టులకు లాగుతామని, రాత్రి ఒంటిగంట వరకు వందల పంచాయతీల్లో టీడీపీ గెలిస్తే అధికారులు వాటన్నింటిని వైఎస్సార్సీపీకి డిక్లేర్ చేశారని ఆరోపించారు. -
రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రెండో విడతలో 2,789 గ్రామ సర్పంచ్ పదవులకు ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత కింద మొత్తం 3,328 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా.. అందులో 539 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,789 సర్పంచ్ పదవులకు గాను 7,510 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో మొత్తం 33,570 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. అందులో 12,605 ఏకగ్రీవమవగా, మిగతా 20,965 వార్డు పదవులకు 13న పోలింగ్ జరగనుంది. వార్డు పదవులకు 44,879 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారానికి గడువు గురువారం రాత్రి 7:30 గంటలతో ముగుస్తుంది. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కిస్తారు. -
టీడీపీ కంచు కోటలకు తూట్లు
సాక్షి, అమరావతి: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో.. తమకు కంచుకోటలుగా భావించే గ్రామాల్లో సైతం టీడీపీ మద్దతుదారులు ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో సైతం గెలిచిన నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ ఇప్పుడు మట్టికరిచింది. యనమల చతికిల టీడీపీ అపర మేధావిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు తమ్ముడు ఇన్ఛార్జిగా ఉన్న తుని నియోజకవర్గం తొండంగి మండలం ఏవీ నగరంలో స్వయాన యనమల అన్న కొడుకు యనమల శ్రీను టీడీపీ మద్దతుదారుగా పోటీ చేసి ఓడిపోయారు. తుని నియోజకవర్గంలో 58 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. 54 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు గెలుపొందారు. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీ చేతిలో ఉన్న కోదాడ, పెరుమాళ్లపురం పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందడం గమనార్హం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో 135 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 112 పంచాయతీలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. 40 ఏళ్ల నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న కోటబొమ్మాళి మేజర్ పంచాయతీలో ఈసారి వైఎస్సార్సీపీ అభిమాని పాగా వేశారు. అలాగే 37 సంవత్సరాలుగా టీడీపీ చేతిలో ఉన్న సంతబొమ్మాళి పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాని కళింగపట్నం లక్ష్మి గెలవడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 41 పంచాయతీలకు 34 పంచాయతీలను వైఎస్సార్సీపీ అభిమానులు గెలుచుకోగా కేవలం ఐదు చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు అతికష్టం మీద గెలవగలిగారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పెట్టని కోటలుగా ఉన్న జె తిమ్మాపురం, కట్టమూరు, వేట్లపాలెం, మేడపాడు, ఆర్వీపట్నం, ఆర్వి కొత్తూరు మేజర్ పంచాయతీలను ఈసారి వైఎస్సార్సీపీ అభిమానులు గెలుచుకున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గంలో 52 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఏడు పంచాయతీలకే టీడీపీ మద్దతుదారులు పరిమితమయ్యారు. 39 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలిచారు. గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గంలో 44 పంచాయతీల్లో 39 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలవగా, జనసేన మద్దతుదారులు కేవలం మూడు పంచాయతీల్లో టీడీపీ మద్దతుతో అతి కష్టం మీద గెలిచారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్న మైలవరం నియోజకవర్గంలో 48 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఖాతాలోకే వెళ్లాయి. కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. టీడీపీకి పట్టుకొమ్మగా ఉన్న మైలవరం మేజర్ పంచాయతీని తొలిసారిగా వైఎస్సార్సీపీ మద్దతుదారు చేజిక్కించుకున్నారు. లోకేష్కు మళ్లీ భంగపాటు ఏ ప్రత్యక్ష ఎన్నికలోనూ గెలవలేక కేవలం ట్వీట్లతో కాలక్షేపం చేసే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేష్ తాను ఇన్ఛార్జిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి కూడా భంగపాటుకు గురయ్యారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆ నియోజకవర్గంలోని 18 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 14 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయం సాధించారు. టీడీపీ మరో ముఖ్య నేత ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ ఎమ్మెల్యేలు రామరాజు, బాలవీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావులు కూడా తమ నియోజకవర్గాల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న విజయవాడ రూరల్ మండలంలో 9 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలిచారు. ఇక్కడ టీడీపీ తరఫున వల్లభనేని వంశీ గెలుపొంది ఆ తర్వాత ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. -
ఎస్ఈసీ ఉత్తర్వులు సరి కాదు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలయ్యేంత వరకు మీడియా, ప్రెస్తో మాట్లాడకూడదని పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. మీడియా, ప్రెస్తో మాట్లాడేందుకు మంత్రికి అనుమతినిచ్చింది. అయితే ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడరాదని ఆయన్ను ఆదేశించింది. అలాగే ఎన్నికల కమిషనర్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడబోనంటూ పెద్దిరెడ్డి ఇచ్చిన హామీని గుర్తుంచుకోవాలని సూచించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మీడియా, ప్రెస్తో మాట్లాడకుండా ఉత్తర్వులివ్వడం సరైన చర్య కాదంది. అయితే ఎన్నికల పవిత్రతను, నిష్పాక్షికతను కాపాడాల్సిన అవసరం ఉందంది. ఎన్నికల కమిషనర్ చర్యలపై అభ్యంతరాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్లతో కూడిన బుధవారం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేస్తూ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు ఆయన్ను మీడియా, ప్రెస్తో మాట్లాడకుండా నియంత్రిస్తూ ఎన్నికల కమిషనర్ ఇటీవల ఆదేశాలివ్వడం తెలిసిందే. ఈ ఉత్తర్వులను పెద్దిరెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్జడ్జి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంత్రిని ఇంటికే పరిమితం చేస్తూ ఇచ్చిన నిర్బంధ ఉత్తర్వులను రద్దు చేశారు. అయితే మీడియా, ప్రెస్తో మాట్లాడవద్దన్న ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను సమర్థించారు. దీనిపై పెద్దిరెడ్డి ధర్మాసనం ముందు అప్పీలు చేశారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం బుధవారం ఉదయం ఉత్తర్వులు వెలువరించింది. పెద్దిరెడ్డి తన అప్పీలులో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారని, ఆయన వాదనలు వినకుండా ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించడం సబబు కాదంది. దీంతో నిమ్మగడ్డను ప్రతివాదిగా తొలగిస్తూ మెమో దాఖలు చేస్తామని పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది సీవీ మోహన్రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం నిమ్మగడ్డ పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగించింది. అనంతరం పెద్దిరెడ్డి అప్పీలును పరిష్కరిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
జిల్లాల వారీగా గ్రామపంచాయతీ ఫలితాలివే..
సాక్షి, అమరావతి: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో వైఎస్సార్సీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పల్లెల్లో పార్టీ అభిమానుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఇదే ఊపుతో రెండు, మూడు, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలిదశలో 12 జిల్లాల పరిధిలోని 3,249 గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా 525 చోట్ల సర్పంచులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇందులో 90 శాతం వైఎస్సార్సీపీ అభిమానులే ఉండడం గమనార్హం. ఏకగ్రీవాల అనంతరం 2,724 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 2,721 చోట్ల మంగళవారం పోలింగ్ జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఓ పంచాయతీలో ఎవరూ నామినేషన్ వేయనందున, నెల్లూరు జిల్లాలో ఒక గ్రామంలో ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంవల్ల పోలింగ్ జరగలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక సర్పంచి అభ్యర్థి బ్యాలెట్ బాక్సు ఎత్తుకుపోవడంవల్ల పోలింగ్ నిలిచిపోయింది. ఈ మూడు పంచాయతీల్లో ఎన్నికలు/రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఏకగ్రీవాలతో కలిపి మిగిలిన 3,246 పంచాయతీల ఫలితాలు బుధవారం తెల్లవారుజాముకు వెల్లడయ్యాయి. ఇందులో ఏకగ్రీవాలతో కలిపి 2,640 మంది వైఎస్సార్సీపీ అభిమానులు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. 81.25 శాతం పంచాయతీల పాలనాధికారాలను ప్రజలు అధికారపార్టీ అభిమానులకు అప్పగించారు. 510 గ్రామాల్లో మాత్రమే టీడీపీ అభిమానులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. అనగా 15.66 శాతం పంచాయతీలకే వారు పరిమితమయ్యారు. తొలివిడత ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో టీడీపీ అభిమానుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఇక ఇతరులకు 96 పంచాయతీలు దక్కాయి. -
82 శాతం విజయం వైఎస్సార్సీపీదే: బొత్స
అమరావతి: తొలిదశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 82 శాతానికిపైగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తొలిదశలో జరిగిన ఎన్నికల్లో 2,637 పంచాయతీల్లో తమ పార్టీ మద్దతుదారులు గెలుపొందారని వివరించారు. తమ మద్దతుదారులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బుధవారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు నోరు విప్పితే అబద్ధాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పింది అంకెల గారడీనేనని పేర్కొన్నారు. కిందపడినా.. పైనే ఉన్నట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. కొన్ని దుష్టశక్తులు వాలంటీర్ వ్యవస్థకు తూట్లు పొడవాలని చూస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సేవా దృక్పథంతో పనిచేసే వారికి రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తామని ముందే చెప్పామని గుర్తుచేశారు. ప్రతి ఇంటికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినట్లు తెలిపారు. సమాజంలో వాలంటీర్లకు మంచి గౌరవం ఉందని దాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. ఎవరో చెప్పిన మాటల్ని విని.. పక్కదారి పట్టొద్దని వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. -
‘పంచాయతీ’లో నాకు నువ్వు, నీకు నేను..
సాక్షి, అమలాపురం : ‘‘నా వార్డులో మీ వాళ్ల ఓట్లు ఉన్నాయి. నేను వేరే వార్డులో పోటీ చేస్తున్నాను. ఆ వార్డులో మీ వాళ్ల ఓట్లు ఉన్నాయి. అక్కడ నువ్వు నాకు ఓట్లు వేయించు...ఇక్కడ నేను నీకు ఓట్లు వేయిస్తా. నీకూ ఇబ్బంది లేకుండా.. నాకూ ఇబ్బంది లేకుండా రెండు వార్డుల్లో పరస్పరం సహకరించుకుందాం. పార్టీలతో మనకెందుకు గొడవ.. మనిద్దరం సర్దుబాట్లతో ఎవరి ఓట్లు వారు వేయించుకుని సహకరించుకుందాం..’’ ఇదీ జిల్లాలో పలు పంచాయతీల్లో వార్డులకు పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థుల ఒప్పంద రాజకీయాలు. తమ గెలుపునకు ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పంచాయతీల్లో వార్డులకు వచ్చేసరికి ఏ వార్డులో ఓటు ఉంటే ఆ వార్డులోనే పోటీ చేయాలన్న నిబంధనలేమీ లేదు. పంచాయతీలో ఓటరై ఉంటే ఆ పంచాయతీలో గెలుపునకు అవకాశం ఉన్న ఏ వార్డులోనైనా పోటీ చేయవచ్చు. దీంతో తమకు అనువుగా ఉన్న వార్డులను ఎంపిక చేసుకుని బరిలోకీ దిగుతున్నా.. తన సొంత వార్డులో ఉన్న తన వాళ్లు.. తన కుటుంబాల వారు ఉంటే తాను పోటీ చేసే వేరే వార్డు అభ్యరి్థతో ఒప్పందం చేసుకుంటున్నారు. నా వార్డులో నీకు మా వాళ్ల చేత ఓట్లన్నీ వేయిస్తాను. నీ వార్డులో మీ వాళ్లతో నాకు ఓట్లు వేయించి గెలిపించు అంటూ పరస్పర అవగాహనతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అదే సర్పంచి అభ్యరి్థత్వానికి వచ్చే సరికి ఈ ఒప్పందాలు, సర్దుబాట్లు ఉండవు. సర్పంచ్ అభ్యర్థులు తమ గ్రామంలో ఉన్న అన్ని వార్డుల నుంచి తమ తరపున వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టి ఓ ప్యానల్ తయారు చేసుకుంటారు. అయితే ఈ ప్యానల్లో ఉన్నట్టే ఉండి లోపాయికారీ ఒప్పందాలతో కొందరు వార్డు అభ్యర్థులు పరస్పర అవగాహనతో నాకు నువ్వు....నీకు నేను అన్నట్లుగా చాప కింద నీరులా వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారు. తన వార్డులో తనకు అనుకూలమైన ఓట్లు ఉన్నా, ఎప్పటి నుంచో ఓ నాయకుడు కరీ్చఫ్ వేసినట్టుగా అదే వార్డులో పోటీ చేయడంతో తమకు అనుకూలమైన పక్క వార్డును ఎంచుకుని కొందరు పోటీకి సై అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒప్పంద రాజకీయాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు మేజర్ పంచాయతీ అంబాజీపేట (మాచవరం)లో నాలుగైదు వార్డుల్లో ఈ తరహా ఒప్పందాలు జరిగాయి. పి.గన్నవరం, మలికిపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం రూరల్, ముమ్మిడివరం మండలాల్లోని పలు పంచాయతీల వార్డుల్లో ఈ పరస్పర అవగాహనలు జరుగుతున్నాయి. చదవండి: ‘పవర్’ ఫుల్ ఏపీ ..‘రియల్ టైమ్’ హీరో చిత్తూరు జిల్లాలో టీడీపీ అడ్డదారులు -
పెద్దిరెడ్డి అప్పీలుపై నేడు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే మీడియాతో మాట్లాడవద్దంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని సవాలు చేస్తూ పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన అప్పీలుపై బుధవారం ఉత్తర్వులిస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. మంగళవారం కోర్టు సమయం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట పెద్దిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషన్ ప్రతిష్టను ఎవరూ దిగజార్చట్లేదని, ప్రస్తుత ఎన్నికల కమిషనరే స్వయంగా కమిషన్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని నివేదించారు. నిబంధనలకు విరుద్ధంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపేయాలంటూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులిచ్చారని, ఈ ఆదేశాల్ని మంత్రి తప్పుపట్టారని, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని రిటర్నింగ్ అధికారులకు చెప్పారని, ఇది ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. మంత్రిగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం రాజ్యాంగమిచ్చిన హక్కని, దీన్ని అడ్డుకునేలా సింగిల్ జడ్జి ఉత్తర్వులున్నాయని తెలిపారు. ఎన్నికల కమిషనర్ గురించి వ్యక్తిగతం మాట్లాడబోమని స్పష్టంగా చెప్పినా సింగిల్జడ్జి మీడియా, ప్రెస్తో మాట్లాడకుండా ఉత్తర్వులిచ్చారన్నారు. ఎన్నికల కమిషన్ తరఫున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న మంత్రి రాజ్యాంగ విధులను నిర్వర్తిస్తున్న రిటర్నింగ్ అధికారులను బెదిరించడం ఎంతవరకు సబబన్నారు. రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలపై నివేదిక ఇచ్చాక ప్రకటించవచ్చని కమిషనర్ చెప్పారే తప్ప, ఏకగ్రీవాలను ఆపేయాలని చెప్పలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కోర్టు సమయం ముగియడంతో బుధవారం తగిన ఉత్తర్వులిస్తామని పేర్కొంది. -
ఆంధ్రా–ఒడిశా మధ్య.. 'పంచాయతీ' చిచ్చు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మన రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయవద్దని ఒడిశా ప్రభుత్వం ఓటర్లను బెదిరిస్తోంది. ఈ విషయం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు, పగులుచెన్నేరు, కురుకూటి, గంజాయిభద్ర, సారిక పంచాయతీల్లో 23 గిరిశిఖర గ్రామాలున్నాయి. వీటినే కొటియా పల్లెలుగా పిలుస్తున్నారు. ఇక్కడి ప్రజల దుర్భర జీవన స్థితిగతులను మూడేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ఏపీకి చెందిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, ఇతర ముఖ్య అధికారులు ఈ గ్రామాల్లో పర్యటించి ప్రాథమికంగా పలు సంక్షేమ ఫలాలు అందించి వచ్చారు. ఈ పరిణామంతో ఒడిశా కూడా అభివృద్ధి మంత్రంతో గిరిజనులకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపు రూ.180 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పనులను చేపట్టింది. వాటిపై అంత ప్రేమ ఎందుకంటే.. కొటియా పల్లెలు అపార ఖనిజ సంపదకు నిలయాలు. అక్కడి కొండల్లో అధికంగా మాంగనీస్, ఇనుప ఖనిజం, రంగురాళ్లు వంటి విలువైన నిక్షేపాలున్నాయి. వీటి విలువ కొన్ని లక్షల కోట్లల్లో ఉంటుంది. వీటిని దక్కించుకుంటే ఆ రాష్ట్రం ఆరి్థకంగా ఉన్నతస్థాయికి చేరుకుంటుందన్న ప్రచారం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన వివాదాన్ని పార్లమెంటు కమిటీ అధ్యయనం చేస్తోంది. అధిక శాతం ప్రజల అభీష్టం మేరకే వారిని ఏ రాష్ట్రానికి ఇవ్వాలనే దానిపై పార్లమెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అక్కడ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యేవి. అందువల్ల అక్కడి గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపేవారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా విస్మరించింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కొటియా ప్రజలకు కొత్త జీవితం మొదలైంది. సంక్షేమ పథకాలు వారికి చేరువవుతున్నాయి. దీంతో వారు మళ్లీ ఆంధ్రాపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలతో రాజుకుంటున్న వివాదం కొటియా గ్రూప్లోని గంజాయిభద్రలో 13 గ్రామాలున్నాయి. పట్టుచెన్నేరులో నాలుగు, పగులుచెన్నేరులోని మూడు, సారికలో ఒకటి, కురుకూటిలో రెండు పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఇప్పుడు ఒడిశా సర్కారు పోలీసులను ఈ గ్రామాల్లో దించింది. ఆంధ్రా ఎన్నికలకు వెళ్లొద్దని బెదిరిస్తోంది. సాలూరు తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ పార్వతి పోలీసు బలగాలతో అక్కడకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని అక్కడివారిని కోరారు. సుప్రీంకోర్టుకు వెళ్తా కొటియా గ్రామాల్లో ఓటర్లపై ఒడిశా అధికారులు దురుసుగా ప్రవర్తించి ఓటు వేయకుండా అడ్డుకోవాలని చూస్తే సుప్రీంకోర్టుకు వెళ్లడానికైనా వెనుకాడను. మా ప్రాంతానికి వచి్చనపుడు గవర్నర్ బిశ్వభూషణ్ దృష్టికి ఈ వివాదాన్ని తీసుకువెళ్లాను. తాజా పరిస్థితిని సీఎం జగన్ దృష్టికీ తీసుకెళ్తా. – పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే చూస్తూ ఊరుకోం కొటియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చేస్తున్నాం. గిరిజనులకు మంచి జరుగుతుందనే కారణంతో ఒడిశా కార్యక్రమాలను అడ్డుకోలేదు. అంతమాత్రాన ఓటు వేయనీయకపోతే చూస్తూ ఊరుకోం. మన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం. – డాక్టర్ ఎం.హరిజవహర్లాల్, జిల్లా కలెక్టర్ ప్రశాంత ఎన్నికలకు చర్యలు కొటియా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. మేం అక్కడి ప్రజలకు అవగాహన కలి్పస్తున్నాం. త్వరలోనే వారందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందించడానికి ఏర్పాట్లుచేశాం. ఒడిశా చర్యలు సరైనవి కావు. – ఆర్. కూర్మనాథ్, పార్వతీపురం ఐటీడీఏ పీఓ -
‘వెనక్కి తగ్గొద్దు.. దూకుడుగా వెళ్లండి’
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో జగన్కు చెక్ పెట్టాలన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని, ఎవరూ వెనక్కి తగ్గకుండా మరింత దూకుడుగా వెళ్లాలని సూచించారు. ఇప్పటికే కేసులు పెట్టినా, జైలుకు వెళ్లినా వెనక్కి తగ్గకుండా టీడీపీ నేతలు పోరాడుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎవరూ విశ్రమించవద్దన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్, జిల్లాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి పార్టీ నేతలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో విశాఖ ఉక్కు అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని, అందరూ పోరాడి విశాఖ ఉక్కుని సాధించారని తెలిపారు. చదవండి: (తొలిదశలో టీడీపీకి షాక్) నిమ్మగడ్డకు ఫిర్యాదు.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రచురించలేదంటూ చంద్రబాబు ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు పెట్టడాన్ని చంద్రబాబు ఖండించారు. -
చిత్తూరు జిల్లాలో టీడీపీ అడ్డదారులు
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన మొదటి విడత పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు అడ్డదారులు తొక్కారు. ఎక్కడికక్కడ స్థానికులు అడ్డుకోవడంతో ఎక్కడా వారి ఆటలు సాగలేదు. చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, నగరి నియోజకవర్గాలతోపాటు రామచంద్రాపురం, నారాయణవనం మండలాల్లోని 342 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మోహరించినా టీడీపీ నేతలు శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు తెగబడ్డారు. పక్క గ్రామాల నుంచి మనుషులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన పోలీసులు, స్థానికులపై దౌర్జన్యాలకు దిగారు. ► శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లెమిట్టలో టీడీపీ మద్దతు అభ్యర్థి రమేష్ బ్యాలెట్ బాక్సులో నీళ్లు పోసేందుకు యత్నించాడు. ► పూతలపట్టు మండలం ఒడ్డేపల్లె పోలింగ్ కేంద్రంలో టీడీపీ మద్దతు అభ్యర్థి దొరస్వామినాయుడు అనుచరులు దొంగ ఓట్లు వేసేందుకు రావడంతో ఏజెంట్లు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగి పోలింగ్కు అంతరాయం కలిగించారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో జారుకున్నారు. ► ఇక పూతలపట్టు పోలింగ్ కేంద్రంలో టీడీపీ మద్దతుదారులు పచ్చచొక్కాలు ధరించి హల్చల్ చేశారు. ► తవణంపల్లె మండలం తెల్లగుండ్లపల్లె పంచాయతీలో మరణించిన వారి ఓట్లను వేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. సకాలంలో గ్రామస్తులు పసిగట్టి వారిని తరిమికొట్టారు. ఇదేవిధంగా ఎస్ఆర్పురం, చిత్తూరు రూరల్, వెదురుకుప్పం మండలాల్లోని పలు పంచాయతీల్లో కూడా టీడీపీ శ్రేణులు మరణించిన వారి పేర్లతో ఓటేయడానికి ప్రయత్నించి పట్టుబడ్డారు. సెల్ఫోన్లో వీడియోల చిత్రీకరణ ఇదిలా ఉంటే.. టీడీపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో అనుమతి లేకుండా పోలింగ్ బూత్ల వద్ద వీడియోలు చిత్రీకరించారు. వెదురుకుప్పం మండలం ఆర్కేఎంపురం పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా స్థానికులు ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి పారిపోయాడు. ఇదే తరహాలో అనేక పోలింగ్ కేంద్రాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. నారాయణవనం మండలం నార్త్ పాలమంగళం, అరణ్యం కండ్రిగ పంచాయతీల్లో రిగ్గింగ్ జరుగుతోందంటూ టీడీపీ శ్రేణులు వివాదం రేపేందుకు కంట్రోల్ రూంకి ఫోన్చేశారు. ఎస్ఈబీ ఏఎస్పీ రిషాంత్రెడ్డి పోలింగ్ కేంద్రానికి చేరుకుని విచారించి దొంగ కాల్గా నిర్ధారించారు. -
పోలింగ్ రోజునా టీడీపీ ప్రలోభాలు
సాక్షి, అమరావతి/సాలూరు: పార్టీ రహితంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను తొలి నుంచి వివాదాస్పదం చేస్తున్న ప్రతిపక్ష నేత,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. మొదటి విడత పోలింగ్ రోజైన మంగళవారం కూడా అందుకు తగ్గట్లే వ్యవహరించారు. చంద్రబాబు ఆదేశాలతో ఆ పార్టీ శ్రేణులు మరింత రెచ్చిపోయి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. కానీ, కొన్నిచోట్ల వీరి ఆటలు సాగలేదు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఉదాహరణకు.. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కూర్మరాజుపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆముదాల పరమేశు తనకు అనుకూలమైన వ్యక్తిని సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిపాడు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చీరలు, పంచెలు, తువ్వాళ్లను కొని సాలూరు పట్టణం బంగారమ్మ కాలనీలో తన బంధువైన కరణం రామగిరి ఇంట్లో భద్రపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంట్లో ఉన్న 200 చీరలు, 50 తువ్వాళ్లు, 190 లుంగీలను గుర్తించారు. వాటి బిల్లులు చూపకపోవడంతో పాటు వాటిని పంచేందుకు సిద్ధం చేసినట్లు ఇంటి యజమాని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ప్రకాశం జిల్లా ఇంకొల్లు, సూదివారిపాలెంలోను ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.32,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ కార్యకర్తలు పోలీసులకు దొరికిపోయారు. జిల్లాల్లో ఘర్షణలు.. పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకుని తూర్పు గోదావరి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ► తూర్పుగోదావరి జిల్లా ఉప్పలపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీయడంతో కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టారు. ► కృష్ణా జిల్లా నిడమానూరులో సర్పంచ్ అభ్యర్థి గుర్తుపై అధికారులు నోటా స్టిక్కర్ అతికించడంతో వివాదం రేగింది. అధికారులు దాన్ని గుర్తించి మార్పుచేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇదే జిల్లా వీరులపాడు మండలం జూలూరుపాడులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి తోపులాటకు దారితీసింది. స్థానికులు వివాదాన్ని సర్దుబాటు చేశారు. ► ఇక ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లెలో చిన్నపాటి ఘర్షణ జరిగింది. ► చిత్తూరు జిల్లా కమ్మకండ్రికలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ► అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పోతుకుంట గ్రామంలో ఒకరి ఓటు మరొకరు వేశారంటూ ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. కర్నూలు జిల్లా ముత్తలూరులోను ఘర్షణ జరిగింది. ► నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపాలెం పంచాయతీ శంభునిపాలెంలో ఓటు వేసేందుకు నిరాకరించిన ప్రజలకు అధికారులు నచ్చజెప్పినా వారు మాట వినలేదు. -
తుదివిడత పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, అమరావతి: తుది విడతలో ఈనెల 21న ఎన్నికలు జరగాల్సిన గ్రామ పంచాయతీల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 13 జిల్లాల పరిధిలో 162 మండలాల్లోని 3,299 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవులతో 34,112 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతాయి. బుధవారం ఉ.10.30 నుంచి 12వ తేదీ సా.5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మూడో విడత సర్పంచి బరిలో 17,664 మంది మూడో విడతగా ఈనెల 17న ఎన్నికలు జరగనున్న 3,323 పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. సర్పంచి పదవులకు 17,664 మంది బరిలో ఉన్నారు. 31,516 వార్డు సభ్యుల పదవులకు 77,447 మంది పోటీలో ఉన్నారు. 2వ విడతలో 539 సర్పంచ్లు ఏకగ్రీవం రెండో విడతగా ఈనెల 13న ఎన్నికలు జరిగే 3,328 గ్రామ పంచాయతీల పరిధిలో 539 సర్పంచి పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఆయా పంచాయతీల పరిధిలోని 33,570 వార్డు పదవుల్లో 12,605 వార్డు పదవులకు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు అధికారులు తెలిపారు. -
పంచాయతీ ఎన్నికలు; తొలిదశలో టీడీపీకి షాక్
సాక్షి, అమరావతి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏపీ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేక చతికిలపడ్డారు. పది శాతం పంచాయతీల్లో కూడా ఆ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలవలేకపోయారు. ఎన్నికలు జరిగిన 12 జిల్లాలోనూ వైఎస్సార్సీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఏకపక్షంగా గెలుపొందడంతో టీడీపీ నాయకులు నిస్తేజంలో మునిగిపోయారు. పార్టీ రహిత ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసి కాలుదువ్విన చంద్రబాబు చివరికి పరువు కూడా దక్కించుకోలేక అభాసుపాలయ్యారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేసి, దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని ఆరోపించి నానా హడావుడి చేసినా ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందనే ప్రచారంతో ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ ప్రజలను ఏమార్చాలని చూసినా సాధారణ ఎన్నికల ఫలితాలే ఇక్కడా కనిపించడంతో ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు. ఒక్కసారిగా నేతలు సైలెంట్ తమ పార్టీ నేతలను వైఎస్సార్సీపీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అదే పనిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అక్కడక్కడా స్థానికంగా జరిగే చిన్నపాటి వివాదాలను పెద్దవిగా చేసి హడావుడి చేశారు. అయినా, రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపు మొదలయ్యాక వైఎస్సార్సీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఏకపక్ష విజయంతో దూసుకెళ్తున్నట్లు వార్తలు వస్తుండడంతో టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. అవాస్తవాలను హోరెత్తించే ఆ పార్టీ సోషల్ మీడియా ఖాతాలూ మూగబోయాయి. పోలింగ్ ముగిసేవరకూ ఫిర్యాదులతో హడావుడి చేసిన చంద్రబాబు ఫలితాలు రావడం మొదలయ్యాక మిన్నకుండిపోయారు. ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా మీడియాకు దొరక్కుండా వెళ్లిపోయారు. తామే గెలిచామని మీడియాకు లీకులు టీడీపీ మద్దతు ఇచ్చిన వారు ఘోర పరాజయం పాలవడంతో రాత్రి 10 గంటలకు తమ పార్టీ 300 పంచాయతీ ఎన్నికల్లో గెలిచినట్లు మీడియాకు లీక్ చేశారు. కొద్దిసేపటికి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా, అశోక్బాబు తదితరులు బాణాసంచా కాల్చి తాము ఎక్కువ స్థానాల్లో గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారు. నిజానికి టీడీపీ అన్ని పంచాయతీల్లో గెలవలేదని క్షేత్రస్థాయి సమాచారం. మిగిలిన మూడు దశల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని.. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లోనూ భంగపాటు తప్పదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు భారీ షాక్ తగిలింది. చాలా మండలాల్లో టీడీపీ పత్తా లేకుండాపోయింది. జిల్లాలో మంగళవారం జరిగిన తొలి విడత పోలింగ్లో 83.47 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఉదయాన్నే ఓటు వేసేందుకు బారులుతీరారు. జిల్లాలో తొలివిడతలో 454 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ జారీచేశారు. అందులో 112 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 106 మంది వైఎస్సార్సీపీ అభిమానులు కాగా, కేవలం ఆరుగురు మాత్రమే టీడీపీ మద్దతుదారులు. -
తొలివిడతపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సంతృప్తి
సాక్షి, అమరావతి: తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్ఈసీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంతో పోల్చితే.. ఈసారి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందన్నారు. ఇందుకు కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిశీలకులు చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. చదవండి: (టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడే) (మళ్లీ అదే తీర్పు.. 2,319 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ..) -
టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతలో వైఎస్సార్సీపీ అభిమానులను గెలిపించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ పాలనను ప్రజలు ఆశీర్వదించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు అవుతుందన్నారు. టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడ మాత్రమేనని చెప్పారు. ఎన్నికలు పెడితే ఏదో తేల్చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడేం చెబుతారని నిలదీశారు. చదవండి: (మళ్లీ అదే తీర్పు.. 2,319 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ..) -
మళ్లీ అదే తీర్పు.. 2,319 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ..
సాక్షి, అమరావతి: పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయదుందుభి మోగించారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పూర్తి ఏకపక్షంగా వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ఆమోదముద్ర వేస్తూ గ్రామీణ ప్రజలు విస్పష్ట తీర్పు చెప్పారు. సీఎం జగన్ పాలన సాగిస్తున్న తీరు, అమలు చేస్తున్న సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలకు జనామోదం ఉందని భారీగా నమోదైన పోలింగ్ శాతం స్పష్టం చేస్తోంది. పార్టీ రహితంగా ఈ ఎన్నికలు జరుగుతుండగా.. పోలింగ్ ముగిసిన వెంటనే జరిగిన ఓట్ల లెక్కింపులో గ్రామాల్లో అధికార వైఎస్సార్ సీపీ అభిమానులు దాదాపు 82 శాతం స్థానాల్లో విజయం సాధించారు. ఆది నుంచీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటలు మాదిరిగా ఉండే గ్రామాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు గెలుపొందారు. టీడీపీ ఈ ఎన్నికల్లో చావుదెబ్బతింది. టీడీపీ నేత యనమల స్వగ్రామం ఏవీ నగరంలో సర్పంచ్గా విజయం సాధించిన వైఎస్సార్సీపీ మద్దతుదారు కొయ్యా జగదీశ్వరి ఆనందం పార్టీ రహిత ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం మొదలు.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారితో అంటకాగి అంతులేని సహకారం పొందినా, ఎన్నికల్లో నెగ్గుకురాలేక చతికిల పడింది. కుయుక్తులతో గ్రామాల్లో కక్షల కుంపటి వెలిగించాలని టీడీపీ విశ్వప్రయత్నం చేయడాన్ని గమనించిన ప్రజలు.. ఓటుతో గట్టిగా కర్రుకాల్చి వాతపెట్టినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు ఆయా గ్రామాల్లోని 32,502 వార్డు పదవులకు జనవరి 23వ తేదీ గ్రామ పంచాయతీల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయగా.. ఏకగ్రీవాలుగా ముగిసినవి పోను మంగళవారం 2,723 సర్పంచ్ స్థానాలకు, 20,157 వార్డు పదవులకు పొలింగ్ జరిగింది. ఓట్లలెక్కింపు మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా సర్పంచ్ ఫలితం ఖరారు కాగానే, ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్ను ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద డప్పులు కొడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, రత్నాకర్, పద్మజ తదితరులు ఓటర్లకు కరోనా జాగ్రత్తల కోసమే రూ.30 కోట్లు పోలింగ్ ప్రక్రియలో పంచాయతీరాజ్ శాఖ పూర్తి స్థాయి కరోనా నియంత్రణ చర్యలు చేపట్టింది. ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా ఓటర్లు వచ్చి ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికలు జరిగే అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో కరోనా జాగ్రత్తలు చేపట్టారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ముందుగా పోలింగ్ కేంద్రం వద్ద థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షించిన అనంతరమే క్యూలైన్లోకి అనుమతించారు. జ్వరం వంటి లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన వారిని ఆఖరి గంటలో వచ్చి ఓటు వేసేయాల్సిందిగా విజ్ఞపి చేశారు. అందుకు అనుగుణంగా స్థానిక పోలింగ్ సిబ్బంది ఓటర్లను చైతన్యం చేసి, ఓటింగ్లో పాల్గొనేలా చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వారికి ప్రత్యేకంగా పీపీఈ కిట్లు అందజేసి ఆఖరి గంటలో ఓటు వేసేందుకు అనుమతించారు. జర్వం లక్షణాలతో బాధపడే వారికి గ్లౌజులు వంటివి అందజేసి ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు కరోనా నియంత్రణ జాగ్రత్తలలో భాగంగా మాస్క్లు, శానిటైజర్లు, గ్లౌజుల కొనుగోలుకు గాను నాలుగు విడతల ఎన్నికలకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.30 కోట్ల నిధులు కేటాయించినట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఓటింగ్ శాతం పెరగడానికి దోహద పడ్డాయని అధికారులు చెప్పారు. గంట వ్యవధిలోపే ఓట్ల లెక్కింపు.. గ్రామాల్లో పోలింగ్ ముగిసిన గంట వ్యవధి లోపే అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30 గంటలకు పోలింగ్ ముగియగా, ఆ వెంటనే గ్రామ పంచాయతీల వారీగా వాటి పరిధిలో ఉండే పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్లను నిర్ణీత కౌంటింగ్ కేంద్రం వద్దకు తరలించి ఓట్ల లెక్కింపు చేపట్టారు. చిన్న గ్రామ పంచాయతీల్లోని కొన్నింటిలో సాయంత్రం ఐదు గంటలకు ఫలితాలు వెల్లడయ్యాయి. 7,052 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ మంగళవారం 29,732 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగగా.. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన వాటిలో అధికారులు వెబ్ కాస్టింట్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూం నుంచి కమిషనర్ గిరిజా శంకర్ ఆయా కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్, కౌంటింగ్ తీరును నిరంతరం పర్యవేక్షించారు. జిల్లాల నుంచి కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారుల నుంచి వ్యక్తమయ్యే సందేహాలను నివృత్తి చేశారు. జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎప్పటికప్పుడు వాకబు చేశారు. ఏకగ్రీవాల నుంచే ఏకపక్షం తొలి విడత ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవాలు మొదలు పోలింగ్ జరిగిన చోట ఫలితాల్లోనూ 82 శాతం మేర స్థానాలు వైఎస్సార్సీపీ అభిమానులే గెలుచుకున్నారు. తొలి విడత 3,249 గ్రామాల్లో ఎన్నికలు జరిగితే, 525 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అందులో 98 శాతం మేర అంటే 518 సర్పంచ్ పదవులు వైఎస్సార్సీపీ అభిమానులు గెలిచినవే కావడం విశేషం. 2,723 గ్రామ సర్పించి పదవులకు ఎన్నికలు జరిగితే అందులో 90 శాతం మేర వైఎస్సార్సీపీ అభిమానులే విజయం సాధించారు. (నెల్లూరు జిల్లా వెలిచర్లలో సర్పం చ్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు). 81.41 శాతం పోలింగ్.. ప్రస్తుతం కరోనా భయం మధ్య కూడా తొలి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో 81.41 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు సమయం ఉన్నప్పటికీ, 700–1500 మధ్య ఓట్లు ఉండే గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటలకే ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉండే గ్రామాల్లో 1.30 గంటల కంతా పూర్తయిందని జిల్లాలో పోలింగ్ పర్యవేక్షణ అధికారులు వెల్లడించారు. మొత్తంగా.. మధ్యాహ్నం 12.30 గంటలకు 62 శాతం మేర ఓటింగ్ నమోదైంది. దాదాపు 29,732 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతుండగా, చాలా చోట్ల మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఓటు వేసేందుకు ఒకరిద్దరికి మించి రాలేదని తెలిసింది. వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలోని కొన్ని వార్డుల్లో మాత్రం నిర్ణీత 3.30 గంటల సమయంలో కూడా కొందరు ఓటర్ల లైన్లో ఉండడంతో వారందరూ ఓటు వేసేంత వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. -
ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తల పని చేశారు: సజ్జల
సాక్షి, విజయవాడ: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామాకృష్ణా రెడ్డి. చంద్రబాబు, నిమ్మగడ్డ కుయుక్తులను ప్రజలు గమనించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా టీడీపీ కార్యకర్తలా పనిచేశారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి ప్రవర్తించడం అందరూ చూశారు. ఎస్ఈసీ అధికార దుర్వినియోగంపై చర్చ జరగాలి అన్నారు సజ్జల. -
నామినేషన్లు రద్దు చేసుకోండి.. లేదంటే చంపేస్తాం
సాక్షి, కోనేరు సెంటర్(మచిలీపట్నం) : ‘నామినేషన్లు రద్దుచేసుకోమని మీ ఇంట్లో మగాళ్లకు చెప్పండి.. లేదంటే ప్రాణాలు తీస్తాం’.. అంటూ తెలుగుదేశం మాజీమంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు బెదిరింపులకు తెగబడ్డారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించడంటూ సోమవారం కృష్ణాజిల్లా బందరు రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలివీ.. బందరు మండలం పొట్లపాలెం గ్రామానికి చెందిన గాజుల నాగరాజు (మాజీ సర్పంచ్) ఈ నెల 7న వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఈ పంచాయతీ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ, తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఆ పార్టీ నేతలు కుంచే దుర్గాప్రసాద్ (నాని), వాలిశెట్టి విమినేష్లు పొట్లపాలెం టీడీపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు మూడ్రోజులుగా యతి్నస్తున్నారు. కానీ, ఎవరూ ముందుకు రావటంలేదు. సోమవారం వారు మరోసారి గ్రామంలోకి వెళ్లి చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో అతని అనుచరులు నాగరాజు ఇంటి ముందు నిలబడి దుర్భాలాషలాడటం మొదలుపెట్టారు. దుర్గాప్రసాద్, విమినేష్లు నాగరాజు ఇంట్లోకి చొరబడి దౌర్జన్యానికి దిగారు. ఒంటరిగా ఉన్న నాగరాజు భార్యతో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు. నామినేషన్ ఉపసంహరించుకోకుంటే అతనితో పాటు కుటుంబసభ్యులను చంపుతామంటూ బెదిరించారు. నాగరాజు భార్య భయంతో కేకలు పెట్టటంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఇదిచూసి కొల్లు రవీంద్ర అతని అనుచరులు అక్కడి నుంచి కారుల్లో వెళ్లిపోయారు. కాగా, నాగరాజు ఫిర్యాదు మేరకు కొల్లు రవీంద్ర, దుర్గాప్రసాద్, విమినేష్లపై 448, 506, 188, 171 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మూర్తి తెలిపారు. చదవండి: చంపేస్తామంటూ.. విత్డ్రా చేయిస్తున్న టీడీపీ నేతలు పంచాయతీ ఎన్నికలు: మీ ఓటు ఇలా వేయండి -
పంచాయతీ ఎన్నికలు: మీ ఓటు ఇలా వేయండి
సాక్షి, కాకినాడ : తొలి విడత ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనుంది. ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థమైన నాయకుడుకి ఓటు వేయాలి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ► ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పు తప్పనిసరి. ► ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఫొటోలతో ఉన్న ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. ► ఒక వేళ ఎవరికైనా ఓటరు స్లిప్పు అందకపోతే వారు పోలింగ్ కేంద్రం వద్ద పంచాయతీ కార్యాలయ సిబ్బంది అక్కడే ఓటరు స్లిప్పులు అందిస్తారు. ► ఓటరు స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ► ఓటరు కార్డు, ఆధార్, రేషన్, బ్యాంకు పాస్పుస్తకం, పాస్పోర్టు ఇలా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. ► కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిలబడాలి. ► తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ఉండాలి. ► క్యూలో నిల్చున్న వారికి ఎన్నికల సిబ్బంది రెండు బ్యాలెట్లు ఇస్తారు. ► సర్పంచ్ బ్యాలెట్, వార్డు సభ్యుడి బ్యాలెట్ ఇస్తారు. వాటితోపాటు స్వస్తిక్ గుర్తు సిరాలో ముంచి ఇస్తారు. ► బ్యాలెట్పై తనకు నచ్చిన వ్యక్తి గుర్తుపై స్వస్తిక్ గుర్తు వేయాలి. ► పోలింగ్ సిబ్బంది చెప్పిన ప్రకారం బ్యాలెట్ను మడత పెట్టాలి. ► లేకుంటే మనం ఓటు వేసి సిరా వేరే గుర్తుపై పడే అవకాశం ఉంది. ► ఇలా జరిగితే ఆ బ్యాలెట్ చెల్లదు. ► ఓటు వేయలేని వృద్ధులు, వికలాంగులు సహాయకుల సహాయంతో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం ఉంది. ► దీనికి ముందుగా సంబంధింత పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి అనుమతి తీసుకోవాలి. ► వికలాంగులు, వృద్ధులు వారికి నచ్చిన వ్యక్తులను సహాయకులు ఎంచుకోవచ్చు. ► కరోనా సోకిన వ్యక్తి ఓటు వేయడానికి అవకాశం కలి్పంచారు. ► ఆఖరి గంటలో స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బంది సహాయంతో తగు భద్రతా ప్రమాణాలు పాటించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ► ఓటు వేసి సెల్ఫీ తీసుకుంటే సంబంధిత ఓటును రద్దు చేసే అధికారం పోలింగ్ అధికారికి ఉంది. ఒక ఓటరు.. రెండు ఓట్లు రాయవరం: గత పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల మాదిరిగానే ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఓటరు ఓటింగ్ యంత్రాలపై ఓటు వేయగా, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఓటరు బ్యాలెట్ పేపరుపై ఓటు వేయాల్సి ఉంటుంది. ఒక ఓటు సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థికి, మరో ఓటు బరిలో నిలిచిన వార్డు అభ్యరి్థకి వేయాల్సి ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ, వార్డు అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపరును ఓటర్లకు అందజేస్తారు. సర్పంచ్ అభ్యర్థి పోటీలో ఉండి, వార్డు పదవి ఏకగ్రీవమైతే ఓటరు ఒక ఓటు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సర్పంచ్ పదవి ఏకగ్రీవమై, వార్డు పదవికి పోటీ జరిగితే అప్పుడు కూడా ఓటరుకు ఒక ఓటు మాత్రమే ఇస్తారు. చదవండి: ఏపీ: ఒకరి ఓటు మరొకరు వేస్తే ఏమవుతుంది? పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే.. -
పంచాయతీ ఎన్నికలు: ఒడిశా మహిళ నామినేషన్
సాక్షి, పర్లాకిమిడి: ఆంధ్రా–ఒడిశా బోర్డురు(ఏఓబీ)లోని గజపతి జిల్లా, గంగాబడ పంచాయతీ గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయేందుకు మొగ్గుచూపుతుండడంతో అక్కడి ఒడిశా అధికారులకు తలనొప్పులు మొదలయ్యాయి. ప్రధానంగా అటు గజపతి జిల్లా కేంద్రానికి గంగాబడ పంచాయతీ 60 కిలోమీటర్ల దూరంలో ఉండగా, శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం, సాబకోట పంచాయతీకి గంగాబడ పంచాయతీ.. 2 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఆ పంచాయతీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ పరిధి ప్రాంతంలో ఉండిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఏపీ(ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్లు స్వీకరిస్తుండగా, సాబకోట పంచాయతీలో వార్డు మెంబరుగా పోటీ చేసేందుకు గంగాబడ పంచాయతీకి చెందిన ఒడిశా మహిళ లక్ష్మీ సబర శనివారం నామినేషన్ వేశారు. దీంతో అప్రమత్తమైన గజపతి జిల్లా అధికార యంత్రాంగం హుటాహుటిన గంగాబడ పంచాయతీ పరిధిలోని ఏపీలోని మందస మండలం, సాబకోట పంచాయతీకి దగ్గరలో ఉన్న మాణిక్ పాట్నా, అక్కుడ, మధికోల్, చంపాపూర్, బురిసింగి, అమారింగి, గురికుడి గిరిజన గ్రామాల్లో సబ్కలెక్టరు కేసరి పండా, అక్కడి రెవెన్యూ అధికారులతో పర్యటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారంతా జిల్లా(గజపతి) కేంద్రానికి దూరంగా ఉండడంతో ఒడిశా ప్రభుత్వ పథకాలు తమకు సరిగా అందడం లేదని, ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉండడంతోనే ఏపీ పథకాలే తమకు అందుతున్నాయని వివరించారు. తమ పిల్లల విద్యాభ్యాసం కూడా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోనే జరుగుతోందని తెలిపారు. దీనిపై స్పందించిన సదరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందేలా చర్యలు చేపడతామని, ఒడిశాలోనే ఉండాలని కోరగా వారంతా సుముఖత వ్యక్తం చేశారు. నామినేషన్ ఉపసంహరణ.. అనంతరం వార్డు మెంబరుగా పోటీకి దిగిన లక్ష్మీ సబరని కలిసిన గజపతి జిల్లా అధికారులు ఆమెతో మాట్లాడి ఆమె వేసిన నామినేషన్ని ఉపసంహరించుకోమని కోరారు. 60 ఏళ్ల నుంచి ఒడిశా ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తున్న కారణంగానే విసుగుచెంది ఆంధ్రప్రదేశ్లో ఉండిపోవాలనుకుంటున్నట్లు లక్ష్మీ సబర భర్త మాణిక్ తెలిపాడు. అయితే ఆఖరికి అధికారుల హామీతో తమ నామినేషన్ ఉపసంహరణకు భార్యాభర్తలిద్దరూ ఒప్పుకుని, నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎన్నికలు రద్దు చేయాలి.. జయపురం: ఏఓబీలోని వివాదాస్పద ప్రాంతంగా గుర్తింపు పొందిన కొఠియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని ఉత్కళ సమ్మిళినీ కొరాపుట్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ విషయమై ఆ శాఖ సభ్యులంతా ఉత్కళ సమ్మిళినీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బినోద్ పాత్రో నేతృత్వంలో కలెక్టరు మహ్మద్ అబ్దుల్ని కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు.. కొరాపుట్ జిల్లాలోని పొట్టంగి సమితి, కొఠియా గ్రామపంచాయతీలో ఉన్న 3 గ్రామాల పేర్లను మార్చి, అక్కడ ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఫిర్యాదు చేశారు. ఇక్కడి సరిహద్దు గ్రామాల విషయంలో ఎప్పటినుంచో వివాదం కొనసాగుతోందని, అది పరిష్కారం కాకుండా ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని, ఆ గ్రామాల్లో జరిగే ఏపీ పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని కోరారు. -
పంచాయతీ పోరు: అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే?
సాక్షి, శ్రీకాళహస్తి : సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు సమయంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే మాత్రం లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. స్టేజ్–2 అధికారి సమక్షంలో లాటరీ తీస్తారు. ముందుగా ఆ ఇద్దరు అభ్యర్థుల పేర్లు (ఒక్కొక్క అభ్యర్థి పేరు ఐదు) చీటిల్లో రాస్తారు. అవి ఒకే రంగు, ఒకే సైజు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. చీటిల్లో పేర్లు కూడా కనిపించకుండా మొత్తం పది చీటిలను బాగా చుట్టి ఒక డబ్బాలో వేస్తారు. ఆ డబ్బాను అటు ఇటు బాగా తిప్పిన తర్వాత అధికారి ఒక చీటిని బయటకు తీస్తారు. అందులో ఎవరు పేరు వస్తుందో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఒకరి ఓటు మరొకరు వేస్తే.. చిత్తూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఒకరి ఓటు మరొకరు వేస్తే, ఓటు కోల్పోయిన వ్యక్తికి ఇచ్చే ఓటును టెండర్ ఓటు అంటారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు ఓటు వేయడానికి వచ్చే ముందు ఎవరైనా వేరే వ్యక్తి తన ఓటును వేసి ఉంటే, అసలు ఓటరు∙గుర్తింపు నిజమైతే అతనికిచ్చే ఓటును టెండర్ ఓటు అంటారు. అలాంటి పరి స్థితి ఎక్కడైనా తలెత్తితే పీఓ ఫారం –24 పూరించి, ఆ వ్యక్తి దగ్గర సంతకం, వేలిముద్ర తీసుకోవాలి. టెండర్ ఓటు కలి్పంచే వారికి బ్యాలెట్ పేపర్లో చి వరి నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. చివరి బ్యాలెట్ పేపర్లో కౌంటర్ ఫైల్, బ్యాలెట్ పేపర్లో టెండర్ బ్యాలెట్ పేపర్ అని వెనుక వైపు పీఓ రాయాల్సి ఉంటుంది. మార్క్ కాపీలో నోట్ చేయకూడదు. ఆ ఓటును బ్యాలెట్ బాక్సులో వేయకుండా ప్రత్యేకమై న కవర్లో ఉంచి రిటరి్నంగ్ అధికారికి అందజేయాలి. టెండర్ ఓట్లు 2 శాతం మించితే ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. చదవండి: పంచాయతీ బరిలో స్పీకర్ సతీమణి పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే.. -
పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే..
సాక్షి, చిత్తూరు : ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్లు సెల్ఫీ దిగితే ఓటును రద్దు చేస్తారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగడం ఫ్యాషన్ అయిపోయింది. ఇదే అలవాటు తో పొరపాటుగా మంగళవారం జరిగే పోలింగ్లో ఓటర్లు సెల్ఫీ దిగితే, ఆ వ్యక్తి వేసిన ఓటు చెల్లకుండా పోతుంది. ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 49 (ఎం) ప్రకారం ఓటు రహస్యాన్ని బహిర్గతం చేయకూడదు. దీన్ని అతిక్రమించి ఓటు వేస్తూ సెల్ఫీ దిగి, ఇతరులకు షేర్ చేస్తే ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 17 (ఏ) ప్రకారం ఆ ఓటును రద్దు చేస్తారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్ -
పంచాయతీ ఎన్నికలు: ముగిసిన కౌంటింగ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 2,723 పంచాయతీల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఫలితాలు వచ్చిన వెంటనే ఉపసర్పంచ్లను ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తి కాని చోట మరుసటి రోజున ఆ ప్రక్రియ ఉటుంది. కాగా తొలి దశలో ఇప్పటివరకు 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా .. ఇందులో వైఎస్సార్సీపీ నుంచి 518, ఇతరులు ఏడుగురు ఉన్నారు. కాగా 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది. ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం కేంద్రంలో ఓటు వేసేందుకు వృద్ధురాలిని భుజాలపై ఎత్తుకెళ్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ హరిప్రసాద్. సుమారు 7 వేల కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా గిరిజా శంకర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా పాజిటివ్ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ లైవ్ అప్డేట్స్: బ్యాలెట్ బాక్స్లో నీళ్లు పోసిన సర్పంచ్ అభ్యర్థి చిత్తూరు: ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లి సర్పంచ్ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాలెట్ బాక్స్లో టీడీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్ధి రమేష్ నీళ్లు పోయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. మధ్యాహ్నం 12:30 వరకు 62 శాతం పోలింగ్ నమోదు శ్రీకాకుళం జిల్లా-54.5 శాతం విశాఖ జిల్లా-65 శాతం తూర్పుగోదావరి -62.14 శాతం పశ్చిమ గోదావరి-54.09 శాతం కృష్ణా జిల్లా-67 శాతం గుంటూరు జిల్లా-62 శాతం ప్రకాశం జిల్లా-57 శాతం నెల్లూరు జిల్లా-61 శాతం చిత్తూరు జిల్లా 66.3 శాతం వైఎస్ఆర్ జిల్లా 61.19 శాతం కర్నూలు జిల్లా 70.06 శాతం అనంతపురం జిల్లా 63 శాతం మందకొడిగా పోలింగ్.. ఉదయం 10:30 వరకు జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు ♦తూర్పుగోదావరి-29 శాతం ♦పశ్చిమగోదావరి-24 శాతం ♦కృష్ణా జిల్లా-36 శాతం ♦గుంటూరు జిల్లా-30 శాతం ♦వైఎస్సాఆర్ జిల్లా- 29.21 శాతం ♦అనంతపురం-27 శాతం ♦ప్రకాశం జిల్లా- 28.65 శాతం ♦నెల్లూరు జిల్లా- 26.72 శాతం ♦చిత్తూరు జిల్లా-36.38 శాతం ♦కర్నూలు జిల్లా-49 శాతం ♦విశాఖ జిల్లా 40.78 శాతం ♦శ్రీకాకుళం జిల్లా- 29.15 శాతం గుండెపోటుతో పోలింగ్ ఏజెంట్ మృతి గుంటూరు జిల్లా: కాకుమాను మండలం గరికపాడులో గుండెనొప్పితో ఏజెంట్ నూర్ బాషా మృతి చెందాడు. గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతిచెందారు. సిబ్బంది ఓవరాక్షన్ చిత్తూరు జిల్లా: రామచంద్రాపురం మండలంలో పోలింగ్ సిబ్బంది ఓవరాక్షన్ చేశారు. కమ్మకండ్రిగలో వృద్ధులు చెప్పిన దానికి భిన్నంగా సిబ్బంది ఓటు వేశారు గుర్తించిన ఏజెంట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ రాజశేఖర్రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మహిళలకు ముక్కుపుడకలు: పట్టుబడిన టీడీపీ నేతలు.. వైఎస్సార్ జిల్లా: దువ్వూరు మండలంలో ఓటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు పట్టుకున్నారు. వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఉదయం 8:30 వరకు 18 శాతం పోలింగ్ నమోదు ►శ్రీకాకుళం జిల్లాలో 8.5 శాతం పోలింగ్ నమోదు ►విశాఖ జిల్లాలో 17 శాతం పోలింగ్ నమోదు ►తూ.గో.జిల్లాలో 8.42 శాతం పోలింగ్ నమోదు ►ప.గో.జిల్లాలో 11 శాతం పోలింగ్ నమోదు ►కృష్ణా జిల్లాలో 9 శాతం పోలింగ్ నమోదు ►గుంటూరు జిల్లాలో 15 శాతం పోలింగ్ నమోదు ►ప్రకాశం జిల్లాలో 11 శాతం పోలింగ్ నమోదు ►నెల్లూరు జిల్లాలో 14 శాతం పోలింగ్ నమోదు ►చిత్తూరు జిల్లాలో 15.51 శాతం పోలింగ్ నమోదు ►వైఎస్సార్ జిల్లాలో 6.62 శాతం పోలింగ్ నమోదు ►కర్నూలు జిల్లాలో 10 శాతం పోలింగ్ నమోదు ►అనంతపురం జిల్లాలో 7.25 శాతం పోలింగ్ నమోదు శ్రీకాకుళం: నిమ్మాడలో 23 శాతం పోలింగ్ నమోదయ్యింది. నిమ్మాడలో పోలింగ్ను ఎన్నికల పరిశీలకులు శ్రీధర్ పరిశీలించారు. తూర్పుగోదావరి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ ప్రలోభాలు.. ప్రకాశం: ఇంకొల్లు మండలం సూదివారిపాలెంలో టీడీపీ ప్రలోభాలకు పాల్పడ్డారు. ఓటర్లకు డబ్బు పంచుతూ టీడీపీ నేతలు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు: వరికుంటపాడులో ఓటర్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియను బహిరంగంగా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ టీడీపీ సానుభూతి పరుడు, సర్పంచ్ అభ్యర్థి జుత్తిక శ్రీనివాస్ పోలీసులకు పట్టుబడ్డారు. ఓటు హక్కు వినియోగించుకున్న మాడుగుల ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,723 చోట్ల సర్పంచి, 20160 వార్డులకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ పర్యవేక్షణకి విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థికి పింక్ బ్యాలెట్, వార్డు అభ్యర్థికి తెల్ల బ్యాలెట్ను కేటాయించారు. సా.4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. చదవండి: నేడే తొలి సం'గ్రామం' 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ.. తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కావలి, చిత్తూరు, కదిరి, నంద్యాల, కర్నూలు తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు: కడప, జమ్మలమడుగు, రాజంపేట ► శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు ► ఎల్ఎన్ పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం.. ► కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ విశాఖ: అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ► అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు.. ► కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి.. ►బుచ్చయ్యపేట, చోడవరం మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ తూర్పు గోదావరి: ►కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు ►గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు.. ► యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు.. ► పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం.. ►తొండంగి, తుని, ఏలేశ్వరంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పశ్చిమ గోదావరి: ►నర్సాపురం డివిజన్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు ►ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు.. ►నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు.. ►ఉండి, వీరవాసరం, యలమంచిలిలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు కృష్ణా: విజయవాడ రెవిన్యూ డివిజన్లో తొలి దశ ఎన్నికలు చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల.. కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు.. వత్సవాయి, వీర్లపాడు, విజయవాడలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు గుంటూరు: తెనాలి డివిజన్లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల.. కాకుమాను, కర్లపాలెం, కొల్లిపర, కొల్లూరు, నగరం, నిజాంపట్నం.. పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు లో ఎన్నికలు ప్రకాశం: ఒంగోలు డివిజన్లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు.. జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు.. ఎస్.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్.మాగులూరు, ఎస్.ఎన్.పాడు, వేటపాలెం.. టంగుటూరు, యద్దనపూడిలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు నెల్లూరు: కావలి రెవెన్యూ డివిజన్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి.. కొండాపురం, వరికుంటపాడు లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లో తొలిదశ ఎన్నికలు ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ.. గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది.. ఆత్మకూరు, వెలుగోడులో తొలిదశ పంచాయతీ ఎన్నికలు అనంతపురం: కదిరి రెవెన్యూ డివిజన్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్.పి కుంట.. నల్లచెరువు, నల్లమాడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి.. తలుపుల, తనకల్లులో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ వైఎస్ఆర్ జిల్లా: కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్లో ఎన్నికలు చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు.. అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్.ఎ.కె.ఎన్.. కలసపాడు, బి.మఠంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చిత్తూరు రెవిన్యూ డివిజన్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం.. నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు.. పుత్తూరు, ఆర్.సి.పురం, ఎస్.ఆర్ పురం, తవనంపల్లి, వడమాలపేట.. వెదురుకుప్పం, విజయపురం, యాదమర్రిలో తొలిదశ ఎన్నికల పోలింగ్ చిత్తూరు రెవిన్యూ డివిజన్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు 342 పంచాయతీలు, 1507 వార్డులకు పోలింగ్ సర్పంచ్ అభ్యర్థులకు 925 మంది, వార్డు సభ్యులకు 2928 మంది పోటీ -
పంచాయతీ బరిలో స్పీకర్ సతీమణి
ఆమదాలవలస రూరల్: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని తొగరాం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణిశ్రీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం తనయుడు తమ్మినేని చిరంజీవినాగ్, మద్దతుదారులతో కలసి వెళ్లి అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమెతో పాటు 10 మంది వార్డు మెంబర్లు సైతం నామినేషన్లు వేశారు. -
నిమ్మగడ్డ తీరుపై కన్నెర్ర చేసిన పల్లె!
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార తీరుపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ పల్లె కన్నెర్ర చేసింది. ఈ ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో మా ఊళ్లో ఎన్నికలే జరగనివ్వబోమంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా ప్రకటించారు. నామినేషన్లన్నింటినీ సోమవారం ఉపసంహరించుకున్నారు. పళళంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే ఆ మండల అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఏకగ్రీవాలను రద్దు చేస్తామన్న ప్రకటనలపై ఆ గ్రామస్తులు తమ నిరసనను ఈ రూపంలో వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం కంపసముద్రం పంచాయతీ ప్రజలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార తీరును నిరసిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసుకున్నారు. 2,500 మందికి పైగా జనాభా ఉన్న ఈ పంచాయతీలో 1,780 మంది ఓటర్లున్నారు. ఈ గ్రామంలో విద్యావంతులు అధికంగా ఉన్నారు. రాజకీయ పరిణితి ఎక్కువ. చాలామంది ఉన్నత చదువులు చదివి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారరీత్యా స్థిరపడ్డారు. ఈ గ్రామం మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఆ గ్రామంపై ఉన్న మక్కువతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ప్రత్యేత దృష్టి సారించి తానే స్వయంగా దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించి ఆ గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. 28 మంది నామినేషన్ల ఉపసంహరణ ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ పదవి బీసీ జనరల్కు కేటాయించారు. ఈనెల 13న ఎన్నికలు జరగాల్సి ఉంది. సర్పంచ్ పదవి కోసం 8 మంది, పది వార్డులకు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని గ్రామాభివృద్ధికి ఐక్యంగా నడవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఎన్నిక ఏకగ్రీవమైతే ఆ ప్రాంత అధికారులపై చర్యలతోపాటు ఏకగ్రీవాలను రద్దుచేస్తామంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చేసిన ప్రకటన వారిని ఆవేదనకు, ఆగ్రహానికి గురిచేసింది. ఊరంతా ఓకే మాట, ఒకే బాటగా ఉండి ఏకగ్రీవమైనా ఎన్నికను రద్దుచేస్తే తమ మాటకు విలువ ఉండదని భావించారు. దీంతో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉన్నంతకాలం స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానం చేసుకున్నారు. సర్పంచ్, వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన 28 మంది ఉపసంహరించుకున్నారు. గతంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారు. మల్లు రామిరెడ్డి, నారపరెడ్డి ఓబుల్రెడ్డి, పుట్టం సీతారామయ్య ఏకగ్రీవంగా సర్పంచ్లుగా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషిచేశారు. అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం గ్రామమంతా ఏకమై ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రతిపక్ష పారీ్టకి తొత్తులా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకగ్రీవాలను రద్దుచేస్తామనటం మాకు ఆగ్రహం తెప్పించింది. అందుకే నిమ్మగడ్డ ఉన్నంతకాలం ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. – మల్లు సుధాకర్రెడ్డి, కంపసముద్రం ఊరి మాటకు కట్టుబడి.. ఎస్ఈసీ నిమ్మగడ్డ చేసిన ప్రకటనపై ఊరంతా కలిసి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. గ్రామస్తులందరూ కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయంతో వేసిన నామినేషన్ విత్డ్రా చేసుకున్నాం. సర్పంచ్ పదవి బీసీలకు కేటాయించారు. 8 మందిమి నామినేషన్లు వేశాం. అందరం కలిసి విత్డ్రా చేసుకున్నాం. – చెవుల రమేష్, కంపసముద్రం ఒకే మాట.. బాట ఊరంతా ఒకే మాట, బాటగా ఉన్నాం. ఏకగ్రీవాలైతే రద్దుచేస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ చేసిన ప్రకటన మాకు ఆగ్రహం కలిగించింది. ఊరంతా కలిసి తీసుకునే నిర్ణయానికి విలువ లేనప్పుడు ఎన్నికలు ఎందుకు జరుపుకోవాలి? అందుకే నిమ్మగడ్డ పదవిలో ఉన్నంతకాలం మేము ఎన్నికలకు దూరంగా ఉంటాం. – సన్నిబోయిన బాలకృష్ణ, కంపసముద్రం -
వివరాలు లేకుండా పిల్ ఎలా వేస్తారు?
సాక్షి, అమరావతి: కనీస వివరాల్లేకుండా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంపై హైకోర్టు సోమవారం పిటిషనర్ను నిలదీసింది. ప్రాథమిక సమాచారం లేకుండా పిల్ దాఖలు చేయడమే కాక, వివరాలు కోరితే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామని ఎలా చెబుతారని ప్రశ్నించింది. తగిన సమాచారం లేకుండా ఇలాంటి పిల్లతో కోర్టు సమయాన్ని వృథా చేయడం తగదని న్యాయస్థానం హెచ్చరించింది. అనంతరం.. వివరాలు సమర్పించేందుకు పిటిషనర్ గడువు కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అమ్మఒడి పథకానికి రూ.24.24 కోట్ల నిధుల విడుదలకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్కు పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయవాది చింతా ఉమామహేశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరామని, ఆ వివరాలు రావాల్సి ఉందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఎన్నికల కమిషనర్ ప్రొసీడింగ్స్పై.. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ గత ఏడాది నవంబర్లో జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై విచారణను మార్చి 1కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్కు రాజ్యాంగంలోని అధికరణ 243(కే) కింద ఉన్న అధికారాలను సవరిస్తూ పార్లమెంట్లో పెట్టిన బిల్లు, తదనంతర పరిణామాలను తమ ముందుంచాలని పిటిషనర్ను ఆదేశించింది. ఆ వివరాలు తెలియకుండా ఈ వ్యాజ్యంపై విచారణ జరపడం సాధ్యం కాదని పేర్కొంది. సీజే జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఎస్ఈసీ గత ఏడాది నవంబర్లో జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ న్యాయవాది ఆర్.మహంతి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నవంబర్ 17న జారీ చేసిన ఉత్తర్వులను ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు సవాల్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపింది. 243కేను సవరించారా? బిల్లు తరువాత పరిణామాలు తెలియకుండా వ్యాజ్యాన్ని ఎలా విచారించగలమని ప్రశ్నించింది. బిల్లు, తరువాతి పరిణామాలన్నింటినీ తమ ముందుంచాలని పిటిషనర్ను ఆదేశించింది. -
సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోండి
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మీడియా, ప్రెస్తో మాట్లాడవద్దంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ గురించి పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. అత్యవసర విచారణకు అభ్యర్ధించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. అంతకుముందు.. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితంచేస్తూ నిర్బంధ ఉత్తర్వులు జారీచేయడంతో పాటు ఆయనను మీడియా, ప్రెస్తో మాట్లాడకుండా నియంత్రిస్తూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం చేస్తూ ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేశారు. మీడియా, ప్రెస్తో మాట్లాడవద్దన్న ఉత్తర్వులను మాత్రం సమర్థిస్తూ ఆదివారం ఆదేశాలిచ్చిన సంగతీ తెలిసిందే. వీటిని సవాలు చేస్తూ పెద్దిరెడ్డి తాజాగా అప్పీల్ దాఖలు చేశారు. చట్ట నిబంధనలను పాటించాలనడం తప్పా? ‘మీడియా, ప్రెస్తో మాట్లాడవద్దన్న ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను సింగిల్ జడ్జి సమర్థించడం ద్వారా రాజ్యాంగం నాకు ప్రసాదించిన భావ ప్రకటన హక్కును అడ్డుకున్నట్లయింది. ఎన్నికల కమిషనర్ విధించిన ఆంక్షలు ఏ మాత్రం సహేతుకమైనవి కావు. చట్ట నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మాత్రమే నేను చెప్పాను. పంచాయతీరాజ్ చట్ట నిబంధనల ప్రకారం ఒకే నామినేషన్ దాఖలైన చోట, ఆ అభ్యర్థి గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి తక్షణమే ప్రకటన చేయాల్సి ఉంటుంది. అయితే, నిమ్మగడ్డ రమేశ్, ఏకగ్రీవాల ఫలితాలను ప్రకటించవద్దని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను ఆదేశించారు. ఇది పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధం. అంతేకాక.. ఎన్నో ఏళ్ల నుంచి ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రభుత్వ విధానాలకు కూడా విరుద్ధం. నేను ఈ నిబంధనను తూచా తప్పకుండా పాటించాలని మాత్రమే అధికారులను కోరాను. చట్ట విరుద్ధమైన ప్రకటనలు చేసిన ఎన్నికల కమిషనర్ తీరును తప్పుపట్టాను. ఎన్నికల కమిషనర్ అధికారులను బెదిరిస్తూ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు. చట్టం, నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు, వాటిని కాలరాస్తూ నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్కు లేదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. ఏకగ్రీవాల ఫలితాలను నిలిపేయాలని కోరడం ద్వారా ఎన్నికల కమిషనర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీన్నే నేను ప్రశ్నించాను. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. నేను చేసిన ప్రకటన ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవడమేనని సింగిల్ జడ్జి అనడం ఎంతమాత్రం సరికాదు’.. అని పెద్దిరెడ్డి తెలిపారు. నోటీసులివ్వకుండా.. వివరణ కోరకుండానే.. ‘నన్ను మీడియా, ప్రెస్తో మాట్లాడవద్దంటూ ఉత్తర్వులు జారీచేసే ముందు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నాకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు. వివరణ కూడా అడగలేదు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా అన్యాయాలను ప్రశ్నించే హక్కు నాకు ఉంది. దీన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. నిమ్మగడ్డ రమేష్ ఉత్తర్వుల్లోని ఏకపక్ష, కక్షపూరిత ఉద్దేశాలను సింగిల్ జడ్జి చూడలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్ పై ఇప్పటికే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు చేపట్టాను. అందుకు కౌంటర్గానే నిమ్మగడ్డ రమేష్ నన్ను మీడియా, ప్రెస్తో మాట్లాడకుండా, ఇంటి నుంచి కదలకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులిచ్చారు’.. అని పెద్దిరెడ్డి తన అప్పీల్లో పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. -
ఆ ఏకగ్రీవాలు సక్రమమే
సాక్షి, అమరావతి: చిత్తూరు, గుంటూరు జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలపై 4 రోజుల కిందట అనుమానం వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్.. సోమవారం ఆ ఏకగ్రీవాలన్నీ సక్రమమేనని తేల్చారు. వీటిని అధికారికంగా ప్రకటించవచ్చని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. కలెక్టర్ల నివేదికలతో పాటు ఆయా జిల్లాల అబ్జర్వర్ల నుంచి తీసుకున్న సమాచారం మేరకు.. 2 జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు. -
నేడే తొలి సం'గ్రామం'
సాక్షి, అమరావతి: పార్టీ రహిత పంచాయతీ సమరంలో బ్యాలెట్ పేపర్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో జరగనున్న నేపథ్యంలో 2,723 సర్పంచి, 20,157 వార్డు సభ్యుల పదవులకు మంగళవారం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ ముగిసిన వెంటనే అక్కడే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. తొలిసారిగా పంచాయతీ ఎన్నికలలోనూ ‘నోటా’గుర్తు ప్రవేశపెట్టారు. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో నోటా గుర్తుకు వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలుపొందినట్లు ప్రకటిస్తారు. కాగా బ్యాలెట్ పేపరులో అభ్యర్థుల గుర్తులు మారడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు గ్రామాల్లో చివరి నిమిషంలో వార్డు సభ్యుల ఎన్నికలు మాత్రం ఆగిపోయాయి. ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి. 525 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లన్నింటినీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అప్పగించారని, అందుకనుగుణంగా అంతా సిద్ధం చేసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,723 చోట్ల సర్పంచి పదవులకు ఎన్నికలు జరుగుతున్నట్లు వివరించారు. ఆయా చోట్ల మొత్తం 7,506 మంది పోటీలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 32,502 వార్డు సభ్యుల పదవులకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతుండగా 12,185 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మరో 160 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 20,157 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ద్వివేదీ తెలిపారు. వార్డు పదవులకు 43,601 మంది పోటీలో ఉన్నట్లు వివరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్తున్న సిబ్బంది అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 3,594.. తొలివిడతలో 29,732 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనుండగా 3,594 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా, మరో 3,458 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల కోసం 48,449 బ్యాలెట్ బాక్స్లను వినియోగిస్తుండగా 18,608 పెద్దవి , 8,503 మధ్య రకం, 21,338 చిన్న బ్యాలెట్ బాక్స్లను ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. పోలింగ్ విధులకు 83,736 మందిని, జోనల్, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా 4,681 మందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు చివరి గంట సేపు అవకాశం.. కోవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బందికి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజులను కేంద్రాల వారీగా సిద్ధం చేసినట్లు ద్వివేది తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల కోసం పీపీఈ కిట్లు ఏర్పాటు చేశామని, పోలింగ్ చివరిలో గంట (2.30 నుంచి 3.30 గంటల మధ్య) పాటు వారు ఓటు వేసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా వసతుల కల్పనకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపుపై 52,285 మందికి శిక్షణ.. పోలింగ్ ముగిసిన అనంతరం ఆ కేంద్రాల వద్దే ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు 14,535 మంది సూపర్వైజర్లు, 37,750 ఇతర సిబ్బందికి కౌంటింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు ద్వివేది తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జిల్లాకొకరు చొప్పున ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ఓటర్లంతా హక్కు వినియోగించుకోవాలి.. ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నట్లు చెప్పారు. మొదటి దశ పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీల్లో ఓటర్లంతా ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞఫ్తి చేశారు. కరోనా జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చి చర్యలు చేపట్టినట్లు ద్వివేదీ విలేకరులకు తెలిపారు. రెండు గ్రామాల్లో వార్డు ఎన్నికలు నిలిపివేత: గిరిజా శంకర్ బ్యాలెట్ పేపరులో అభ్యర్థుల గుర్తులు మారడంతో పశ్చిమ గోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డేగూడెంలో వార్డు సభ్యుల ఎన్నికలు నిలిచిపోయాయని, ఆ గ్రామాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే సమయంలో నిర్వహిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా క్యూలైన్లో ఉండే ఓటర్లను ధర్మల్ స్క్రీనింగ్తో పరీక్షించిన అనంతరం పోలింగ్ కేంద్రాలలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. టీడీపీ బరితెగింపుపై కమిషన్కు ఫిర్యాదు – ఎస్ఈసీ తక్షణమే స్పందించాలి: లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరింపులు, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాల ఉపసంహరణ లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ తక్షణమే స్పందించి టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలపై సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే కుంభా రవి, అంకమరెడ్డి నారాయణమూర్తి, మనోహర్రెడ్డి, ఎన్.పద్మజ తదితరులు ఆయన వెంట ఉన్నారు. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడంతోపాటు నామినేషన్ల సందర్భంగా పార్టీ జెండాలు, కరపత్రాలు, డబ్బులను గ్రామాల్లో పంచుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారని అప్పిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు మద్యం, డబ్బులను పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా నిమ్మగడ్డ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉరవకొండ, పొన్నూరు, కుప్పంలో టీడీపీ డబ్బు పంపిణీ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం, గుంటూరు జిల్లా పొన్నూరు, చిత్తూరు జిల్లా కుప్పంలోని గ్రామాలలో టీడీపీ శ్రేణులు డబ్బులు పంచుతూ అక్రమాలకు పాల్పడుతున్నాయని అప్పిరెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరులో ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి దౌర్జన్యం చేసి గాయపరిచారన్నారు. 45 ఏళ్లుగా వరదరాజులరెడ్డి స్వగ్రామమైన కామనూరులో పంచాయతీ ఎన్నికలలో పోటీ లేకుండా వారి బంధువులు, అనుచరులు బెదిరించి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారన్నారు. ప్రస్తుతం కామనూరు పంచాయతీ బీసీలకు రిజర్వ్ కావడంతో వైఎస్సార్సీపీ అభిమాని షేక్ కరీమూన్ నామినేషన్ వేశారన్నారు. నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోదరులు రాఘవరెడ్డి, భార్గవరెడ్డి, హనుమంతరెడ్డిలు తీవ్రంగా ఒత్తిడి చేశారని తెలిపారు. ఆమెకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ నేత బాలవరదరాజులరెడ్డి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారని చెప్పారు. తక్షణమే ఎస్ఈసీ జోక్యం చేసుకొని షేక్ కరీమూన్కు రక్షణ కల్పించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వరదరాజులరెడ్డితో పాటు ఆయన సోదరులను తక్షణమే ఆరెస్ట్ చేయాలన్నారు. కళ్యాణదుర్గంలో అప్రజాస్వామికంగా ఏకగ్రీవం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కొండాపూరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీదేవిని టీడీపీ నాయకులు చౌలం మల్లిఖార్జున, డాక్టర్ ఉన్నం మారుతీ చౌదరి, అనిల్ చౌదరి, పవన్ చౌదరి, ముత్యాలరెడ్డిలు బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని చెప్పారు. దీంతో టీడీపీ బలపరిచిన త్రివేణి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైందన్నారు. ఈ అప్రజాస్వామిక ఎన్నికను రద్దు చేసి లక్ష్మీదేవి అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్నారు. పాడేరు ఏజన్సీలో పోలింగ్ సమయం మార్చాలి.. విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్లో ఈనెల 17న తేదీన ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరపాలని తొలుత ఎస్ఈసీ నిర్ణయించారని చెప్పారు. కానీ ఇప్పుడు ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని ప్రకటించారని, ఇది పర్వత ప్రాంతం కావడంతో ఓటర్లు కాలి నడకన కి.మీ దూరం ప్రయాణం చేసి పోలింగ్ స్టేషన్కి చేరుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. తొలుత ప్రకటించిన ప్రకారం పాత సమయాన్నే కొనసాగించాలని కోరారు. తొలి దశకు పటిష్ట బందోబస్తు తొలి విడతలో భాగంగా మంగళవారం పోలింగ్ జరగనున్న గ్రామాల్లో పోలీస్ విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి బాడీవోర్న్ కెమెరాలు, డ్రోన్లు, కాల్ సెంటర్, డయల్ 100 వంటి వాటిని వినియోగిస్తున్నారు. అలాగే సోమవారం ఏజెన్సీ ప్రాంతాలకు చేరిన పోలీసు బలగాలు గ్రామాల్లో తిరిగి.. ఓటు వేసేందుకు రావాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్లు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా, 2013లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి తొలిదశ పోలింగ్ ముందు రోజు వరకు 87 కేసులు నమోదైతే.. ఈసారి 44 కేసులే నమోదయ్యాయి. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యానికి.. పోలీసులు, ఎస్ఈబీ సిబ్బంది సరిహద్దుల్లో చెక్ పెడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని డీజీపీ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. -
నిమ్మగడ్డకు షాకిచ్చిన కంపసముద్రం గ్రామస్తులు
సాక్షి, నెల్లూరు: మంత్రి గౌతమ్రెడ్డి ఇలాకలో పంచయతీ ఎన్నికలు సంచలనంగా మారాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాలలో పెద్ద సంఖ్యలో జరిగిన ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలపై కంపసముద్రం గ్రామస్తులు తిరగుబాటు చేశారు. ఏకగ్రీవాలపై ఆయన చేసిన ప్రకటన నేపథ్యంలో ఎన్నికలు బహిష్కరించాలని గ్రామస్తులు తీర్మాణం తీసుకుని ఎస్ఈసీకి షాక్ ఇచ్చారు. నిమ్మగడ్డ ఎసీఈసీగా ఉన్నంతకాలం పంచాయతీ ఎన్నిక వద్దంటూ గ్రామస్తులు తీర్మాణించడంతో అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా సర్పంచ్ స్థానానికి మొదట 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా వారంతా గ్రామస్తుల తీర్మాణంతో నామినేషన్ను ఉపంసహరించుకున్నారు. -
ఆ జిల్లాల ఏకగ్రీవాలపై ఎస్ఈసీదే తుది నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు( మంగళవారం) తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మొత్తం 12 జిల్లాల్లో.. 2,724 గ్రామ పంచాయతీల్లో.. 29,732 పోలింగ్ కేంద్రాలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. అన్నిచోట్లా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మాస్కులు, గ్లోజులు, శానిటైజర్లు పంపిణీ చేశామని తెలిపారు. ( పర్యటన రద్దు.. హైదరాబాద్కు నిమ్మగడ్డ ) జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్ధంగా ఉన్నారని, కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 3 సైజులలో బ్యాలెట్ బాక్సులను ఎన్నికలకు సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తు కూడా ఉందని, నోటాకి పడిన ఓట్ల లెక్కింపు జరగదని పేర్కొన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. -
పంచాయతీ బరిలో బీటెక్ యువతి
కావలి: తాను ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో ఉండేకన్నా తన ఊరును ఆదర్శంగా నిలపాలని ఆలోచించింది ఈ యువతి. పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలోకి దిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం చలంచర్ల గ్రామానికి చెందిన ఇరువూరి అనూష పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసింది. ప్రచారంలోనూ దూసుకెళుతోంది. ఇటీవల బీటెక్ పూర్తిచేసిన ఆమెకు క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగం వచ్చింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆమె ఉద్యోగానికి వెళ్లకుండా గ్రామసేవ చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా అందరి మద్దతుతో నామినేషన్ దాఖలు చేసింది. జగన్ ప్రభుత్వమే స్ఫూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా అందరికీ అవసరమైన వినూత్న పథకాలు అమలు చేస్తూ సమాజంలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వాన్ని గ్రామాల్లోని చిట్టచివరి ఇంటివరకు చేర్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని గ్రామంలోని ప్రజలకు చేర్చాలనే లక్ష్యంతో సర్పంచ్గా పోటీచేయాలనుకున్నాను. ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి, నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. గ్రామస్తుల ఆశీస్సులతో సర్పంచ్గా గెలవగానే.. చలంచర్ల పంచాయతీని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. – అనూష, సర్పంచ్ అభ్యర్థిని -
పిచ్చి పీక్స్కు.. తుగ్లక్ను మరిపిస్తున్న నిమ్మగడ్డ
సాక్షి, అమరావతి: తనకు విశేషాధికారాలున్నాయని, తననెవ్వరూ ప్రశ్నించజాలరని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ మరో పిచ్చి తుగ్లక్గా ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పటికే పలు విషయాల్లో తన పరిధి దాటి వ్యవహరించారని స్పష్టమైనప్పటికీ, ఆయన వైఖరిలో ఇసుమంతైనా మార్పు రాకపోవడం మేధావులను, అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతోనే ఆయన పని చేస్తున్నారనేది అడుగడుగునా స్పష్టమవుతోంది. న్యాయపరంగా చిక్కులు ఎదురవుతాయన్న కనీసపాటి జ్ఞానం లేకుండా, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ అధికారులను పక్కదోవ పట్టించడానికి పూనుకోవడం బహుశా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు గృహ నిర్బంధం చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఆదివారం హైకోర్టు కొట్టేసింది. ఇదే రోజు అధికారులు, రాజకీయ విశ్లేషకులతోపాటు సాధారణ ప్రజలు సైతం విస్తుపోయేలా.. ఎన్నికల తర్వాత కూడా ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వం అనుకున్నట్టుగా కాకుండా తాను చెప్పినట్టే ఉండాలని నిర్దేశిస్తూ నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉండే కలెక్టర్లు మొదలు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల వరకు అందరినీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా బదిలీ చేయకూడదని పేర్కొనడం చూస్తుంటే ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం కాక మరేమవుతుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లోకి చొరబాటే ► ప్రజలెన్నుకున్న ప్రభుత్వంగా ప్రజల సంక్షేమ, అభివృద్ధిని కాంక్షిస్తూ నిర్ధేశించుకున్న వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసే ప్రక్రియలో పాలనాపరంగా అవసరాలకు తగ్గట్టు ఉద్యోగులను బదిలీ చేయడం సాధారణం. కానీ, నిమ్మగడ్డ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను ఒక చోట నుంచి మరొక చోటుకు బదిలీ చేసేందుకు నిర్ణీత కాల పరిమితి వరకు ఆగాలని చెబుతున్నారు. ► ఎన్నికల విధులలో పాల్గొంటున్న కలెక్టర్లు, పోలీసు సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను వారి బదిలీకి నిర్ధేశించిన కాల పరిమితికి ముందు ప్రభుత్వం బదిలీ చేయకూడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రధాన అటవీ సంరక్షణాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ► ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసే అధికారులను అభినందిస్తూ, అందకనుగుణంగా ఆ వివరాలను సంబంధిత అధికారుల సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలన్న నిమ్మగడ్డ ఆదేశాలను చూసి అధికార యంత్రాంగం నివ్వెరపోయింది. ► ఇది ముమ్మాటికీ అధికారులను ప్రలోభ పెట్టడమే అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. టీడీపీ తరఫున నిమ్మగడ్డ వకాల్తా పుచ్చుకుని పని చేస్తున్నారని ఈ పరిణామంతో సామాన్యులకు కూడా పూర్తిగా అర్థమైందని ఓ ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసం, టీడీపీ ఉనికి కాపాడటం కోసం ఓ అధికారి ఇంతగా బరి తెగించడం ఇప్పుడే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ► ఎన్నికలు జరిగే సమయంలో అంటే, కోడ్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు కొన్ని అధికారాలు ఉంటాయి. ఎన్నికల తర్వాత ఎలాంటి అధికారాలు ఉండవు. ఈ విషయం నిమ్మగడ్డకు తెలియదా? అని ఉద్యోగులు నవ్వుకుంటున్నారు. పిచ్చి తుగ్లక్ను మరిపిస్తున్నారంటూ బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. -
పెద్దిరెడ్డి గృహ నిర్బంధ ఉత్తర్వులు రద్దు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఎన్నికల కమిషనర్కు లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనను ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఆదివారం న్యాయమూర్తి విచారణ జరిపారు. రాజ్యాంగ హక్కులను కమిషనర్ హరించారు సీవీ మోహన్రెడ్డి తొలుత వాదనలు వినిపిస్తూ.. ‘ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేయాలన్న ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు రాజ్యాంగ హక్కులను హరించేలా ఉన్నాయి. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎన్నికల కమిషనర్కు లేదు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే ఎన్నికల కమిషనర్ ఆ ఉత్తర్వులు జారీ చేశారు. ఏకగ్రీవాలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డిపై ఉంది. ఒకే నామినేషన్ వచ్చినప్పుడు రిటర్నింగ్ అధికారి వెంటనే ఆ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించాలి. ఎన్నికల ఫలితాన్ని ప్రకటించడానికి ముందే, ఆ ఎన్నికపై ఎన్నికల కమిషన్ విచారణ జరపడానికి, ఫలితాల వాయిదాకు వీల్లేదు. ఎన్నికల కమిషనర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసే ముందు సహజ న్యాయ సూత్రాలను పాటించలేదు’ అని వివరించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను ప్రశ్నించడానికి వీల్లేదు ఎన్నికల కమిషన్ తరఫున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేందుకు ఎన్నికల కమిషనర్ తనకున్న ప్రత్యేకాధికారాలను ఉపయోగించవచ్చు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీసేవిగా, కమిషనర్ అధికారాలను ప్రశ్నించేవిగా ఉన్నాయి. అధికారులను బ్లాక్ లిస్ట్ చేస్తామని బెదిరించడం ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది’ అని చెప్పారు. ఆ అధికారం ఎస్ఈసీకి లేదు వ్యక్తిగత స్వేచ్ఛను చట్ట నిబంధనలకు లోబడే నియంత్రించాల్సి ఉంటుందని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. హౌస్ అరెస్ట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చే అధికారం ఎన్నికల కమిషన్కు లేదని తెలిపారు. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధం అని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు జోక్యం చేసుకుంటూ.. ‘చట్ట నిబంధనలు అనుమతిస్తున్నప్పుడు మాత్రమే ఓ వ్యక్తిని గృహ నిర్బంధం చేయవచ్చు. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకున్న అధికారాన్ని నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసేందుకు పొడిగించడానికి వీల్లేదు. ఈ నెల 21వ తేదీ వరకు పిటిషనర్ గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించే అధికారం ఎన్నికల కమిషనర్కు లేదన్నది న్యాయస్థానం అభిప్రాయం. ఇదే సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛ అపరిమితమైనది కాదు. అది సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుంది’ అని చెప్పారు. ఈ దృష్ట్యా ఈ నెల 21వ తేదీ వరకు గృహ నిర్బంధంలో ఉండాలన్న ఉత్తర్వులను రద్దు చేస్తున్నామన్నారు. అయితే మీడియాతో మాట్లాడకూడదన్న ఉత్తర్వులు 21 వరకు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ కార్యదర్శి, నిమ్మగడ్డ రమేశ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేశారు. -
మా గ్రామానికి ఎన్నికలు రద్దు చేయండి
పిడుగురాళ్లరూరల్ (గురజాల): తమ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద న్యూ వెల్లంపల్లి గ్రామస్తులు ఆదివారం ఆందోళన చేపట్టారు. గతంలో మాచవరం మండలంలోని పులిచింతల ముంపు గ్రామంగా వెల్లంపల్లి ఉంది. ఈ ముంపు వాసులకు పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో నివాసం కల్పించారు. ఆ నివాస ప్రాంతాన్ని న్యూ వెల్లంపల్లి గ్రామ పంచాయతీగా పరిగణిస్తున్నట్లు 2020లో ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు అందాయి. ఈ పంచాయతీకి 2019 ఓటర్ల లిస్టు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్రామంలో నివసించేవారంతా వేరువేరు గ్రామాలకు చెందిన వారని, గతంలో తాము కోర్టుకు వెళ్లగా న్యూ వెల్లంపల్లిలో ఇప్పుడు నివసిస్తున్న వారితోపాటు కొత్త ఓటర్ల లిస్టు తయారు చేయాలని కోర్టు ఆదేశించిందని వివరించారు. అయినా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ధర్నా చేశారు. అధికారులు స్పందించి కొత్త లిస్టు వచి్చన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీడీవో కాశయ్య స్పందిస్తూ ఎన్నికల నిర్వహణ తమ చేతుల్లో లేదని, అధికారుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని చెప్పారు. -
నేటి రాత్రికే గ్రామాలకు..
సాక్షి, అమరావతి: తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 9వతేదీన జరగనున్న నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో సహా ముందు రోజు రాత్రికే ఆయా గ్రామాలకు చేరుకునేలా జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ఆదివారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లు, స్వస్తిక్ మార్క్, రబ్బర్ స్టాంప్లు, ఇండెలిబుల్ ఇంకు తదితర సామాగ్రిని సిబ్బంది సోమవారం మధ్యాహ్నం కల్లా తీసుకుని ఆయా పోలింగ్ బూత్లకు చేరుకోవాలని, రిటర్నింగ్ అధికారులు, పీవోలు పోలింగ్ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ద్వివేది పేర్కొన్నారు. ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బ్యారికేడ్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు రాత్రంతా జరిగే పక్షంలో తగినన్ని లైట్లను సిద్ధం చేసుకోవాలని కమిషనర్ గిరిజా శంకర్ సూచించారు. సిబ్బందికి భోజనం తదితర సదుపాయాలను కల్పించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వెబ్కాస్టింగ్ ద్వారా నిఘా.. వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని కేంద్రాలపై నిఘా వేయాలని, కంట్రోల్ రూం ద్వారా వెబ్కాస్టింగ్ను నిరంతరం పర్యవేక్షించాలని గిరిజా శంకర్ సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే రికార్డు చేసిన డేటాను వినియోగించుకునేందుకు నిక్షిప్తం చేయాలన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వీటి కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఎంపీడీవోలకు పంపాలని జిల్లా అధికారులను కమిషనర్ ఆదేశించారు. అవసరమైతే నాలుగో దశలో విధులు కేటాయించిన ఎంపీడీవోలను కూడా మొదటి దశకు వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది. గతంలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు ఉన్నట్లు గుర్తించిన ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా దృష్టి సారించారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు, ఘర్షణలు నమోదైన గ్రామాలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. 4 దశల్లో 13,133 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 6,254 తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలు, 8,555 సమస్యాత్మక ప్రాంతాలు, 983 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలున్నట్లు గుర్తించారు. పోలీస్ సిబ్బంది, హోంగార్డులు కలిపి 89,100 మంది ఉండగా రోజువారీ శాంతి భద్రతల విధులు, ట్రాఫిక్, ఇతర బాధ్యతలకు సిబ్బందిని కేటాయించిన అనంతరం మిగిలిన వారికి ఎన్నికల విధులు నిర్దేశించారు. పోలింగ్ స్టేషన్ల బందోబస్తులో భాగంగా 1,122 రూట్ మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశారు. ఒక్కో మొబైల్ పార్టీలో ఒక అధికారి, ఇద్దరు సిబ్బంది ఉంటారు. ఒక్కో టీమ్లో ఒక అధికారి, ముగ్గురు సిబ్బంది ఉండేలా మొత్తం 257 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేశారు. 143 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేశారు. ఒక పోలీస్ అధికారితోపాటు ఐదుగురు సిబ్బంది ఉండేలా 199 మొబైల్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. 61 స్ట్రాంగ్ రూమ్స్ భద్రతా టీమ్లు, ఎస్పీ రిజర్వ్ 9 పార్టీలు, అడిషనల్ ఎస్పీ 9 పార్టీలతోపాటు అవసరమైన మేరకు ఏపీఎస్పీ బలగాలను వినియోగిస్తారు. బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు ఎన్నికలను బహిష్కరించాలని ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్లోని గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్కు ఒక పోలీస్ అధికారితోపాటు నలుగురు సిబ్బంది చొప్పున బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్ ఓపెనింగ్ పార్టీ పేరుతో ఒక అధికారి, ఐదుగురు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక టీమ్లను నియమించారు. ప్రత్యేక గస్తీకి ఏరియా డామినేషన్ టీమ్స్ను రంగంలోకి దించారు. ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. -
2,723 గ్రామాల్లో రేపే పోలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడతలో 2,723 గ్రామ పంచాయతీల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఆదివారం రాత్రి 7.30 గంటలతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో ఒక్కటి మినహా.. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్ జారీ చేయగా 525 గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీలో సర్పంచి పదవికి, వార్డు సభ్యులుగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,723 గ్రామాల్లో సర్పంచి పదవికి పోలింగ్ జరగనుంది. మొత్తం 32,502 వార్డు సభ్యుల పదవులు ఉండగా 12,185 ఏకగ్రీవమయ్యాయి. మరో 157 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 20,160 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు కూడా రేపే.. తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఓట్ల లెక్కింపు కూడా మంగళవారమే చేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎక్కడికక్కడే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపును చేపడతారు. గ్రామంలో ఒకటో వార్డు నుంచి చివరి వార్డు వరకు లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపును చేపడతారు. ఫలితాల వెల్లడి తర్వాత వెంటనే వార్డు సభ్యుల ద్వారా ఉప సర్పంచి ఎన్నికను చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఓటు హక్కు విధిగా వినియోగించుకోండి ప్రశాంత వాతావరణంలో పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య పంచాయతీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటర్లను కోరారు. ఈ మేరకు కమిషన్ కార్యాలయం ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేసింది. ఓటు హక్కు వినియోగం ద్వారా పంచాయతీలకు జవసత్వాలు వస్తాయని నిమ్మగడ్డ పేర్కొన్నారు. విధిగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించాలని కోరారు. తొలి విడత ఇలా ► తొలివిడత ఎన్నికల్లో 2,723 సర్పంచి పదవులకు 7,506 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 20,160 వార్డు సభ్యుల పదవులకు 43,601 మంది బరిలో ఉన్నారు. ► సర్పంచి, వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు ఓటర్లు ఒకేసారి ఓటు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపరు విధానంలో ఎన్నిక జరుగుతుంది. ► సర్పంచి పదవికి గులాబీ రంగు (పింక్ కలర్) బ్యాలెట్ పేపరుపైనా, వార్డు పదవికి తెలుపు రంగు బ్యాలెట్ పేపరుపైనా ఓటు వేయాలి. ఓటు వేసిన తర్వాత రెండు బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ బాక్స్ వద్దకు తీసుకెళ్లి రెండూ కలిపి అందులోనే వేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ► పోలింగ్ మెటీరియల్ను సోమవారం ఆయా మండల పరిషత్ల కార్యాలయాల వద్ద సంబంధిత పోలింగ్ సిబ్బందికి అందజేస్తారు. ► బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్లు, ఇంకు, కవర్లు తదితర 38 రకాల పోలింగ్ మెటీరియల్స్ను పోలింగ్ సిబ్బందికి అందిస్తారు. -
టీడీపీ సేవలో బీజేపీ
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు పరువు కాపాడేందుకు టీడీపీ మాజీ నేత.. ప్రస్తుత బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రంగంలోకి దిగారు. అనధికారికంగా జిల్లా టీడీపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థుల ఖర్చులు ఆయనే భరిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిజానికి.. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఈ జిల్లాలో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. మొదటి విడత ఎన్నికల్లో ఇది దాదాపు స్పష్టమైంది. రెండో విడత నుంచి ఆ పరిస్థితులు తలెత్తకూడదని చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా టీడీపీ నేతలు ఎన్నికల నిర్వహణకు పనికి రారని సదరు రాజ్యసభ సభ్యుడిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. కుప్పమే వారికి ప్రతిష్టాత్మకం చిత్తూరు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలను పక్కనపెడితే.. చంద్రబాబుకి కుప్పం నియోజకవర్గం తలనొప్పిగా మారింది. ఇక్కడ నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో టీడీపీ పెద్దఎత్తున డబ్బు ఖర్చుచేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి పంచాయతీలో నామినేషన్ వేయించడంతో పాటు, ఎన్నికల వ్యయం మొత్తం టీడీపీనే భరించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఒక కుప్పం నియోజకవర్గంలో ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు చొప్పున ఖర్చు చేసేందుకు ఆ రాజ్యసభ సభ్యుడు ఏర్పాట్లుచేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ‘తమ’ అనుకున్న వారికే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నారు. అంతా గోప్యమే.. మరోవైపు.. కుప్పంలో టీడీపీ మద్దతుదారునిగా ఏయే పంచాయతీలో ఎవరెవరు నామినేషన్ వేస్తారోనన్నది గోప్యంగా ఉంచుతున్నారు. ప్రత్యర్థిగా ఎవరు వేస్తున్నారో తెలుసుకుని, వారిపై వారిలోనే మరొకరిని బరిలోకి దింపేందుకు కూడా భారీగానే డబ్బులు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఆ వర్గంలో ఇద్దరు నామినేషన్లు వేస్తే.. ఓట్లు చీలిపోయి తమకు లబ్ధిచేకూరేలా పథకం వేస్తున్నారు. అంతేకాక.. ప్రత్యర్థి వర్గంలో చిచ్చుపెట్టేందుకూ ప్రణాళిక రచిస్తున్నారు. -
గీత దాటితే చర్యలు తప్పవు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడినా, గీతదాటి ఏకపక్షంగా వ్యవహరించే వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇదే విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్మీట్ పెట్టి స్పష్టంగా చెప్పారని.. అందులో తప్పేమీ లేదన్నారు. పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ విధించిన ఆంక్షలు పూర్తిగా రాజ్యాంగ, చట్ట విరుద్ధమని.. దీనిని తాను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం మాటలు విని తప్పుడు చర్యలు తీసుకుంటే ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకుంటుందని.. వారిని బ్లాక్ లిస్టులో కూడా పెడతామని అంబటి హెచ్చరించారు. అదే సమయంలో చట్టప్రకారం పనిచేసే అధికారులనూ ఈ ప్రభుత్వమే రక్షిస్తుందని చెప్పారు. తప్పు చేయనంతకాలం ఉద్యోగులు భయపడాల్సిన అవసరంలేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదన్నారు. రాజ్యాంగ హక్కును వ్యతిరేకిస్తారా? మంత్రి పెద్దిరెడ్డి ఇల్లు కదలడానికి, మీడియాతో మాట్లాడ్డానికి వీల్లేదని నిమ్మగడ్డ ఆంక్షలు విధించారని.. ఒక వ్యక్తిని ఈ విధంగా కట్టడి చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యంలో ఏ శక్తికీ లేదని అంబటి స్పష్టంచేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కును వ్యతిరేకిస్తారా అని ప్రశ్నించారు. మంత్రిపై ఆంక్షలు సభా హక్కులకు భంగం కల్గించడమేనన్నారు. చంద్రబాబుకు చిత్తూరులో పలుకుబడి లేకుండా చేస్తున్నందువల్లే ఇలా ఆంక్షలు విధించారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గమైన పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న నిమ్మగడ్డ మూల్యం చెల్లించుకోక తప్పదని అంబటి రాంబాబు అన్నారు. మేనిఫెస్టో విడుదలపై చర్యలేవి? పంచాయతీ ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ఎన్నికల కమిషన్ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తోందని కూడా ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాటి నుంచి తనకేదో అతీతమైన శక్తి వచ్చినట్లుగా, ఈ ప్రపంచంలో తానొక అద్భుతమైన శక్తిలా నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై కక్షతో టీడీపీ, వారి మిత్రపక్షాలకు లాభం చేయాలన్నట్లుగా నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారన్నారు. పార్టీ రహిత ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని.. అలాగే, ఈ–వాచ్ యాప్ను సెక్యూరిటీ సర్టిఫికేట్ లేకుండా ఎలా విడుదల చేశారని అంబటి ప్రశ్నించారు. మరోవైపు.. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాల నిలిపివేత రాజ్యాంగ వ్యతిరేకం కాదా.. వాటిపై ఏమైనా ఫిర్యాదులు అందాయా అని ఆయన నిలదీశారు. ఈ విషయంలో కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. ప్రజలకు రక్షణగా నిలిచేది వైఎస్సార్సీపీయే.. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని.. ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణగా ఉండేది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని అంబటి స్పష్టంచేశారు. విశాఖ స్టీల్ప్లాంట్పై కేంద్రం ఒక అడుగు ముందుకు వేయమనండి.. అప్పుడు చూద్దామని ఆయనన్నారు. ట్వీట్లు పెట్టే చంద్రబాబు కన్నా, రాష్ట్ర ప్రజలపట్ల వైఎస్సార్సీపీనే బాధ్యతగా ఉంటుందన్నారు. -
నిర్బంధ ఉత్తర్వులు ఏకపక్షం
సాక్షి, అమరావతి: తనను ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల అమలును నిలిపేయాలని కోర్టును కోరారు. ఈ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్పై హైకోర్టు ఆదివారం ఉదయం విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ పిటిషన్లోని వివరాలు ఇలా ఉన్నాయి. స్పీకర్కు రాసిన లేఖకు ఇది ప్రతి చర్య ► స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేష్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. గత నెల 28న రాష్ట్ర గవర్నర్కు లేఖ రాసిన నిమ్మగడ్డ అందులో నాపై పలు తప్పుడు ఆరోపణలు చేశారు. ► ఈ నేపథ్యంలో గత నెల 30న నేను అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాసి, సభా హక్కుల ఉల్లంఘన కింద నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని కోరాను. ఇది నిమ్మగడ్డ రమేష్కు ఎంత మాత్రం నచ్చలేదు. ► దీంతో తిరుపతిలో ఈ నెల 5న నేను మాట్లాడిన మాటలను నిమ్మగడ్డ వక్రీకరించారు. ఈ ఉత్తర్వులు జారీ చేసే ముందు నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఎలాంటి వివరణ కోరలేదు. ఇలా చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ► ప్రొటోకాల్ ప్రకారం ఈ నెల 7న తిరుపతిలో నేను రాష్ట్రపతిని ఆహ్వానించాల్సి ఉంది. అయితే నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల నేను స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పోయింది. ఈ దృష్ట్యా ఎస్ఈసీ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి. -
మంత్రి పెద్దిరెడ్డిని గృహనిర్బంధం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఆదేశిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని చెప్పారు. ఈ ఆదేశాల్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ► శుక్రవారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలపై రాజకీయ పార్టీలు, సాధారణ పౌరుల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. మంత్రి మాటలు ఓటర్ల మనసులో భయాందోళనలు సృష్టించాయి. ► మంత్రి వ్యాఖ్యలు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వతంత్రతను బెదిరించడం కిందకు వస్తుంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యలున్నాయి. ► అత్యున్నత పదవిలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి ఉద్దేశ పూర్వకంగానే చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడుతున్నట్టుగా ఉంది. ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుంది. ► జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు స్వేచ్ఛాయుతంగా, న్యాయపరంగా సజావుగా ఎన్నికలు నిర్వహించడానికే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నా. ► వైద్య సహాయం తీసుకోవడానికి, ఇతర సహేతుక కారణాల తెలిపిన సందర్భాలలో ఈ ఆంక్షలు వర్తించవు. అలాంటి సందర్భాల్లోనూ మంత్రిని మీడియాకు, అతని మద్దతు దారులకు, అనుచరులకు దూరంగా ఉంచాలి. మంత్రిగా అధికార పత్రాలను పరిశీలించవచ్చు. ఈ ఆదేశాలు కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే. పరివర్తన, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆదేశాలపై భవిష్యత్లో పునరాలోచన చేసేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉంటుంది. రిటర్నింగ్ అధికారులకు రక్షణ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు అభద్రతా భావనకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలో ఉంటారని పేర్కొన్నారు. వీరిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్నా ఎన్నికల కమిషన్ ముందస్తు అనుమతి విధిగా తీసుకోవాలన్నారు. బెదిరింపు ప్రకటనలను ఎంతటి పెద్దవారు ఇచ్చినా లెక్క పెట్టవలసిన అవసరం లేదన్నారు. -
ప్రశాంత ఎన్నికలకు పక్కాగా ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అలజడులు సృష్టించే అవకాశం ఉన్న వారిని గుర్తించి బైండోవర్ చేస్తున్నారు. అనుమతి కలిగిన ఆయుధాలను ఎన్నికలు అయ్యే వరకు స్వాధీనం చేసుకుంటున్నారు. మద్యం, డబ్బు రవాణాను అడ్డుకుని పంపిణీకి అవకాశం లేకుండా చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా చర్యలు చేపట్టారు. ఎన్నికల నియమ నిబంధనలు అమలు జరిగేలా ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల మ్యాపింగ్ చేసి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్పెషల్ బ్రాంచ్ని రంగంలోకి దించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. గత ఎన్నికల్లో విధ్వంసాలు, అలజడులకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి బాడీవోర్న్ కెమెరాలు, డ్రోన్లు, కాల్ సెంటర్, డయల్ 100 వంటి వాటిని వినియోగిస్తున్నారు. పోలింగ్ అనంతరం కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. గ్రామాలను పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు సందర్శిస్తాయి. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఫ్యాక్షన్ , పాత కక్షలు ఉండే గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే చర్యలు, పార్టీలను, వ్యక్తులను కించపరిచే పోస్టింగ్లు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై నిఘా పెట్టారు. 1,47,391 మంది బైండోవర్.. ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు.. వాటిలో తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలు 6,254, సమస్యాత్మక ప్రాంతాలు 8,555, వామపక్ష తీవ్రవాద ప్రభావం, సంఘ వ్యతిరేక శక్తులు ఉన్న ప్రాంతాలు 983 ఉన్నట్టు నిర్ధారించారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 44 ఘటనలపై కేసులు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలకు సంబంధించి 12,779 కేసుల్లో నిందితులుగా ఉన్న 1,47,391 మందిని బైండోవర్ చేశారు. నేరాల్లో నిందితులుగా ఉండి నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉన్న 4,865 మందిలో 2,246 మందిని పోలీసులు పట్టుకోగలిగారు. లైసెన్స్ కలిగిన ఆయుధాలు 9,942 ఉండగా వాటిలో ఇప్పటి వరకు 9,199 స్వాధీనం చేసుకున్నారు. అనుమతిలేని పేలుడు పదార్థాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశీయ ఆయుధాలు 17, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ 1,058, ఎలక్ట్రిక్ వైర్స్ మూడు క్వాయిల్స్, బ్యాటరీలు 2, సేఫ్టీ ఫ్యూజ్లు, డిటోనేటర్ ఫ్యూజ్లు 37, ఎయిర్ ఫిస్టల్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ. 5,02,49,007 నగదు, రూ. 13,03,73,319 విలువైన బంగారం, వెండి, మద్యం, నాటుసారా, గంజాయి, చీరలు, వాహనాలను తనిఖీల సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 707 కేసులు నమోదు చేశారు. అందరూ సహకరించాలి: డీజీపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పక్కా ప్రణాళికతో కార్యాచరణ చేపట్టినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. శాంతిభద్రతల అడిషినల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్తో కలిసి మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం డీజీపీ మీడియా సమావేశం నిర్వహించారు. నామినేషన్లు, పోలింగ్, పోలింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఏ చిన్న ఘటన జరిగినా పోలీసులు తక్షణం స్పందిస్తున్నారని డీజీపీ వివరించారు. బందోబస్తుకు బయటి ప్రాంతాల నుంచి ఎటువంటి బలగాలు రావడంలేదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తే ఎవర్నీ ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ఎన్నికల బందోబస్తు విధులు కేటాయించడంలేదని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి రక్షణ పరికరాలు అందిస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి గృహ నిర్భందం విధించాలంటూ ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించిన డీజీపీ.. ఆ ఆదేశాల లేఖ ఇంకా తనకు అందలేదని, దానిని పరిశీలించాకే స్పందిస్తానని తెలిపారు. ఏ ఘటనపైన అయినా ఆధారాలు ఉంటే పోలీసుల దృష్టికి తేవాలని, వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. -
కోడ్ కూతలు C/o ట్రస్ట్ భవన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తెరవెనుక నుంచి నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబే అని, ఆయన అడుగు జాడల్లోనే ఎస్ఈసీ నడుస్తున్నారని శనివారం నాటి పరిణామాలతో మరోసారి స్పష్టమైంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల మాట వింటేనే రెచ్చిపోతున్న నిమ్మగడ్డ.. చంద్రబాబు సొంత జిల్లా.. చిత్తూరులో తొలి విడతలో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఏకగ్రీవం కావడం భరించలేకపోయారు. ఈ ఏకగ్రీవాలన్నింటికీ మంత్రి పెద్ది రామచంద్రారెడ్డే కారణం అని, ఆయన్ను ఏకంగా 16 రోజుల పాటు ఇంటి నుంచి కదలకుండా గృహ నిర్భందం చేయాలని ఆదేశాలు జారీ చేయడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఆదేశిస్తూ నిమ్మగడ్డ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలపై పలు పార్టీలు, పౌరుల నుంచి తనకు ఫిర్యాదులు అందాయని, అందువల్లే రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తనకున్న విశేషాధికారాలను ఉపయోగిస్తున్నానని నిమ్మగడ్డ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రి మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని చెప్పారు. నిమ్మగడ్డ వైఖరి చూస్తుంటే.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఓ అధికారి అడ్డగోలు నిర్ణయం తీసుకుని, దానికి విశేషాధికారం అని రంగు పూయడం ఏమాత్రం సమ్మతం కాదని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరిన విధంగా నిర్ణయాలు తీసుకుంటుండటం నిమ్మగడ్డ ప్రతి అడుగులో, ప్రతి మాటలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. తన చర్యల పట్ల ప్రజలు ఏమనుకుంటారనే జంకు లేకుండా, తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు లబ్ధి కలిగించాలనే అజెండాతోనే ఆయన ముందుకెళ్తున్నట్లు స్పష్టమైంది. బాబు పునాదులు కదులుతున్నాయని.. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం ఉన్న ప్రాంతం గుంటూరు జిల్లా. ఈ రెండు జిల్లాలు ఏకగ్రీవాల సంఖ్యలో ముందు వరుసలో ఉన్నాయి. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడం అనేది ఎన్నో దశాబ్దాలుగా జరుగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. కక్షలు, కార్పణ్యాల నుంచి గ్రామ సీమలను తప్పించి, త్వరితగతిన అభివృద్ధి పథంలో నడిపించేందుకే పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డకు ఈ విషయాలు తెలియవా అంటే స్పష్టంగా తెలుసు. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీకి భారీగా నష్టం చేకూరబోతోందనే విషయాలే ఆయనకు నిద్రలేకుండా చేస్తున్నాయి. అడ్డగోలు నిర్ణయాలకు కారణమవుతున్నాయి. నిమ్మగడ్డ చెబుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డిపై ఫిర్యాదులు వచ్చి ఉంటే విచారించాలి కదా? ఎవరు ఫిర్యాదు చేశారో.. ఏమని ఫిర్యాదు చేశారో చెప్పాలి కదా? ఆ ఫిర్యాదులకు సంబంధించి మంత్రిని వివరణ కోరి ఉండవచ్చు. అందుకు మంత్రి స్పందించకపోతేనో.. ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతేనో చర్యలకు ఉపక్రమించానని చెబితే ఒక అర్థం ఉండేది. ఇక్కడ అలాంటిది మచ్చుకైనా కనిపించలేదు. ‘ఎద్దు ఈనిందంటే గాటికి కట్టెయ్యండి’ అన్న చందంగా నిమ్మగడ్డ వ్యవహరించడం చూస్తుంటే.. ఆయనలో చంద్రబాబు పూనాడు అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు. నిబంధనల మేరకు వ్యవహరించాలనడం తప్పా? నిబంధనల ప్రకారం ఎన్నికలు ఏకగ్రీవమైన స్థానాల్లో రిటర్నింగ్ అధికారులు నియమ నిబంధనలను అనుసరించి ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటనలు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఏకగ్రీవాలు జరిగిన చోట ప్రకటించకపోతే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించినట్లుగా భావిస్తూ నిమ్మగడ్డ శనివారం ఉత్తర్వులు జారీ చేసి.. తన రాజకీయ అజెండాలో మరో అంకానికి తెర లేపారు. వాస్తవానికి ఇప్పటిదాకా జరిగిన ఏకగ్రీవాల్లో ఆయనకు ఏమైనా అనుమానాలు ఉంటే ముఖ్యమంత్రితో, ఇతర మంత్రులతో చర్చించవచ్చు. ఇతర అధికారులతో మాట్లాడవచ్చు. వారి నుంచి నివేదికలు తెప్పించుకుని పరిశీలించవచ్చు. ఇవన్నీ ఏమీ లేకుండా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాల ఫలితాలను ఆపాలని ఆదేశించడం నిమ్మగడ్డ అత్యుత్సాహమేనని తేటతెల్లమవుతోంది. పెద్దిరెడ్డి.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బాగోగుల గురించి ఈ మంత్రి మాట్లాడకూడదంటే ఎలా? ప్రతి అడుగులో అధికార దుర్వినియోగం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల పట్ల ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయంలోనూ ప్రభుత్వంతో చర్చించకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదంటున్నారు. నిమ్మగడ్డ తీరుతో తాము ఇక్కట్లకు గురికావాల్సి వస్తోందని వాపోతున్నారు. నిమ్మగడ్డ ప్రతి అడుగులోనూ అధికార దుర్వినియోగం కనిపిస్తోందని ఉదాహరణలతో సహా చెబుతున్నారు. ఓటర్లు భయపడుతున్నారట.. ఎన్నికల్లో పోటీ చేసే వారు, ఓటర్లు భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే తాను మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకున్నానని నిమ్మగడ్డ తన ఆదేశాల్లో పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో మంత్రి జోక్యం చేసుకున్నారని చెబుతూనే.. అధికార పత్రాలను పరిశీలించ వచ్చని, చట్టబద్దమైన బాధ్యతలను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలకు ఆదేశిస్తూ.. ఇంత హడావుడిగా ఆయన జారీ చేసిన సుదీర్ఘ ప్రకటన చూస్తుంటే ఇందులో కచ్చితంగా చంద్రబాబు హస్తం ఉందని స్పష్టమవుతోందని పలువురు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా అధికారులెవ్వరూ అభద్రతా భావనకు గురికావాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. కేంద్ర హోం కార్యదర్శికి లేఖ? రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో భాగంగా తాము మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం కేంద్ర హోం కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిసింది. తమ ఆదేశాలకు మంత్రి కట్టుబడకుండా ఆదివారం చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి పర్యటనలో పాల్గొంటే తాము ఎలా వ్యవహరించాలో స్పష్టం చేయాలని ఆ లేఖలో కోరినట్లు సమాచారం. -
శిఖండి యుద్ధం!
చెట్టుకు కాసిన కుక్కమూతి పిందె గురించి కాదు, ఆ చెట్టుకు సోకిన తెగులు గురించి మాట్లాడుకోవాలి. భీష్ముడిని అస్త్ర సన్యాసం చేయించిన శిఖండి గురించి కాదు, ఆ శిఖండి వెనుక దాక్కొని బాణంవదిలినవాడి ‘వీరత్వం’ గురించి మాట్లాడు కోవాలి. ‘ఏక్ దిన్ కా హీరో’ సైంధవుడి ‘పరాక్రమం’ ముఖ్యం కాదు. ఆ సైంధవుడిని పావుగా వాడుకొని పంతం నెగ్గించుకున్న ద్రోణాచార్యుడి కపటత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అడవి జంతువులు పంటచేలలో చొరబడితే ఏమవుతుంది? ప్రజాస్వామ్య సమాజంలో రాజ్యాంగ వ్యవస్థలు పరిధులు దాటి చెలరేగితే అదే జరుగుతుంది. అదే జరుగుతున్నది కూడా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలను రెండు రాజ్యాంగ వ్యవస్థల నడుమ జరుగుతున్న ఘర్షణగా చిత్రిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగా ఈ దురభిప్రాయాన్ని ప్రచారం చేస్తున్నవారు కొంద రైతే, యథాలాపంగా, మీడియా రిపోర్టుల ఆధారంగా నిర్ధార ణకు వస్తున్నవాళ్లు కొంతమంది. దురభిప్రాయాన్ని ప్రచారంలో పెడుతున్న వారెవరో తేలిగ్గా ఊహించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడి యాగా ప్రచారంలో ఉన్న ఆ పార్టీ అనుబంధ సంస్థలు, చంద్ర బాబుకు అవసరమైనప్పుడల్లా టోకున మద్దతు తెలిపే కొన్ని మిత్రపక్షాలు, ఇతర పార్టీల్లో మారువేషాల్లో ఉన్న స్లీపర్సెల్స్... వగైరాలు ఈ రాజ్యాంగ ‘వివాదం’ పట్ల ప్రస్తుతానికి కలత చెంది నట్లు కనిపిస్తున్నాయి. ఆసక్తి కలిగిన వారెవరైనా, జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే వాస్తవ దృశ్యం కనిపిస్తుంది. ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రభుత్వంపై రాజ్యాంగ వ్యవస్థ ముసుగులో జరు గుతున్న ఒక శత్రుదాడి కనిపిస్తుంది. ఆ దాడిని నిర్దేశిస్తూ, నియంత్రిస్తున్న ఒక క్షుద్ర రాజకీయ కనికట్టు విద్య కనిపిస్తుంది. మచ్చుకు నాలుగైదు దృష్టాంతాలను గుర్తుకు చేసుకుందాం. గత మార్చి నెలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ మధ్యలో హఠాత్తుగా ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికే నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయింది. ఎన్నికలను నిర్వహించ డానికి గానీ, వాయిదా వేయడానికి గానీ ప్రభుత్వంతో, అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరపాలన్న రాజ్యాంగ ధర్మాన్ని, సంప్రదాయాన్ని అతిక్రమించారు. అందుకు కోవిడ్ను కారణంగా చూపెట్టారు. అప్పటికి రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏ దశలో ఎన్నికలను వాయిదా వేస్తున్నారో అదే దశ నుంచి తిరిగి ప్రారంభిస్తానని ఆ సందర్భంగా కమిషనర్ మీడియా సమక్షంలో ప్రకటించారు. తిరిగి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పక్కనపెట్టి పంచా యతీలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు.తానే చెప్పిన మాట ప్రకారం నామినేషన్ల ఘట్టం దగ్గర ఆగి పోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వదిలేసి పంచాయి తీలకు షెడ్యూల్ను ప్రకటించారు. ఆ పంచాయతీలకు జరిగే ఎన్నికలు పార్టీ రహితమని తెలిసినప్పటికీ, ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడం ఆనవాయితీ అని తెలిసినప్పటికీ ఒక వితండ వాదాన్ని లేవదీసి ఏకగ్రీవాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ రహిత పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోను ప్రకటించింది. ఇదొక దుష్ట సంప్రదాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పంచాయతీల పరిధిలో లేని అనేక అంశాలపై మేనిఫెస్టోలో వాగ్దానాలు గుప్పించారు. లక్షల సంఖ్యలో ఆ మేనిఫెస్టో కాగితాలను పంపిణీ చేశారు. దీనిపై వైసీపీ అభ్యంతరం చెప్పింది. కమిషనర్ దీనిపై వెంటనే స్పందిం చలేదు. చంద్రబాబు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ పెట్టి కర పత్రాలు ఇంటింటికీ చేరాయని నిర్ధారణ చేసుకున్నరోజు సాయంత్రానికి కమిషనర్ స్పందించారు. మేనిఫెస్టోను విడుదల చేయడాన్ని తప్పుపట్టారు. ఆ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే సదరు మేనిఫెస్టో కరపత్రం అప్పటికే ఇంటింటికీ చేరిపోయింది. కొంతమందైనా చదివి ఉంటారు. ఎలా రద్దు చేస్తారు? ఇంటింటికీ వెళ్లి ఎలా వెనక్కు తెస్తారు? చదివిన వాళ్ల మస్తిష్కంలోంచి ఎలా వెలికి తీస్తారు? ఇవి సమాధానం దొరకని ప్రశ్నలు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఏ దశ లోనూ ఎన్నికల కమిషన్ సంప్రదింపులు జరిపిన దాఖలా ల్లేవు. కానీ మంత్రి ఏదో సందర్భంలో మాట్లాడిన మాటల వల్ల ఎన్ని కల ప్రక్రియకు భంగం కలగబోతున్నదని ఎన్నికల కమిషనర్ భావించారు. అలా భావించడమే తడవుగా మంత్రిపై ఆంక్షలు విధించారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నంత కాలం పంచాయతీరాజ్ మంత్రి ఇంట్లోనే కూర్చోవాలట. మీడియాతో కూడా మాట్లాడకూడదట. మంత్రి వ్యాఖ్యలు అంత ప్రమాద కరమైనవని కమిషనర్ భావించినప్పుడు ముందుగా ఒక నోటీస్ ఇవ్వాలి కదా! ఆయన వివరణ కోరాలి కదా! అవేమీ లేకుండానే ఒక సీనియర్ మంత్రిపై ఆంక్షలు విధించడ మేమిటి? స్వయంగా ఎన్నికల కమిషన్ తప్పు పట్టిన టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది చంద్రబాబు. విడుదల చేయడమే కాదు, దాన్ని ఇంటింటికీ చేర్చి గట్టిగా ప్రచారం చేయాలని కూడా కార్యకర్తలకు పిలుపుని చ్చారు. మరి చంద్రబాబు మీద చర్యలేవి? రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు ఎంత సీనియరో పెద్దిరెడ్డి కూడా అంతే సీనియర్. చంద్రబాబుకు ఒక న్యాయం, పెద్దిరెడ్డికి ఒక న్యాయం ఎలా కుదురుతుంది? రెండు వారాలు వెనక్కు పోదాం. సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణల మీద ఆరో పణలు చేస్తూ ఎన్నికల కమిషనర్ గవర్నర్కు ఒక లేఖ రాశారు. తమపై లేఖ రాయడమే కాక, దాన్ని మీడియాకు లీక్ చేయ డాన్ని, ఉద్దేశపూర్వకంగా తమ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిం చడమేనని మంత్రులు భావించారు. అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఆ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. దానిపై విచారణ జరగనున్నది. ఇప్పుడు తప్పు చేసినట్టు రుజు వైన చంద్రబాబుపై ఏ చర్యా లేకుండా, పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించడం, అదీ.. ఎటువంటి నోటీసు లేకుండా విధించడం ప్రజలకు ఏ సందేశాన్నిస్తుంది? ప్రివిలేజ్ కమిటీ విచారణకు ఇది ప్రతీకారమని జనం భావిస్తే అది తప్పెలా అవుతుంది? తర్వాత వరుసలో బొత్స సత్యనారాయణ కూడా ఉంటారా? ఎన్నికల కమిషనర్ మొన్న ఆవిష్కరించిన ఈ–వాచ్ అనే యాప్ కూడా తీవ్రంగా విమర్శలపాలైంది. ఈ యాప్ రూప కల్పన, నిర్వహణ విషయాల్లో ఏమాత్రం పారదర్శకత లేని కారణంగా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకే హక్కుల కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం ప్రకారం ఈ యాప్ను గురించిన సమాచారం అందజేయాలని ఎన్నికల కమి షన్ను అభ్యర్థించారు. అందుకు కమిషన్ సమ్మతించలేదు. దాంతో ఆ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి పలు విషయాలను తీసుకొని వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘సీ–విజిల్’, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘నిఘా’ యాప్లు ఉండగా కొత్త యాప్ అవసరమేమిటని పిటిషనర్ ప్రశ్నించారు. ఏ యాప్కైనా ఏపీటీఎస్ఎల్ (ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) నుంచి ధ్రువీ కరణ పత్రం తప్పనిసరి. కానీ, ఆ ధ్రువీకరణ లేకుండానే ఈ యాప్ను ఆవిష్కరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఏపీటీఎస్ఎల్ నుంచి ఆడిట్ సెక్యూ రిటీ సర్టిఫికెట్ను తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు సూచిం చింది. ఈలోగా 9వ తేదీ వరకు యాప్ను వినియోగించరాదని ఆదేశించింది. ఏపీటీఎస్ఎల్ పరిశీలనలో యాప్ వెనుకనున్న మాయలఫకీరు చిలక బండారం బయటపడవలసి ఉన్నది. రేషన్ సరుకులను ప్రజల ఇంటికి చేర్చే ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే ఇది కొన్ని జిల్లాల్లో అమలవుతున్నది. మిగిలిన జిల్లాల్లో ఈనెల ఒకటిన ప్రారంభం కావలసింది. దీన్ని కూడా ఎన్నికల కమిషనర్ అడ్డుకో వాలనుకున్నారు. కమిషనర్ నిర్ణయాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది. పేదల ఆహార కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరి కాదని అభిప్రాయపడింది. ఐదు రోజుల్లో పునఃపరిశీలన చేయాలని కోరింది. గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఆయన స్పందించారు. వాహనాల రంగుల్ని, ముఖ్యమంత్రి బొమ్మను తొలగించి తనకు చూపెట్టాలనీ, తాను సంతృప్తి చెందిన తర్వాత మిగిలిన అన్ని వాహనాల రంగులు తొలగించి అప్పుడు పథ కాన్ని ప్రారంభించుకోవచ్చునని సెలవిచ్చారు. అయినా పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి చిత్రాన్ని తొల గించవలసిన అవసరం ఏమిటని కానీ, ఎప్పుడో ప్రారంభమైన పథకంపై ఇప్పుడు ఆంక్షలేమిటని కానీ ఆయన్ను అడగరాదు. ఆయన సమాధానం చెప్పరు. సాక్షాత్తూ, ఒక ముఖ్యమంత్రిపై ప్రత్యర్థులు కూడా వాడ కూడని భాషలో విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసు కోవడం, దాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేయడం, మంత్రుల మీద, సలహాదారుల మీద ఆరోపణలు చేస్తూ గవ ర్నర్కు లేఖ రాయడం, లీక్ చేయడం, మంత్రులపై ఆంక్షలు విధించడం, ఏకగ్రీవ ఎన్నికలను రద్దు చేయాలనుకోవడం, సంక్షేమ పథకాలను అడ్డుకోవడం... ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నేత ఆదేశిస్తారు ఈ నిమ్మగడ్డ పాటిస్తాడు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకొనిపోయింది. స్వతంత్రంగా వ్యవహ రించవలసిన ఎన్నికల సంఘాన్ని ఒక పార్టీ అధినేతకు తాకట్టు పెట్టి ఆయన ఆదేశాల మేరకు పరిధులు దాటి చెలరేగితే బహుశా బాస్కు కొంత ఊరట కలుగుతుందేమో. ఎన్నికల్లో దారుణ పరాభవం ఫలితంగా గాయపడ్డ అహానికి ఈ చర్యలు కొంత సాంత్వననిస్తాయేమో! వియత్నాం వంటి చిన్న దేశంలో సుదీర్ఘకాలం జరిగిన యుద్ధంలో అమెరికా అవమానకరంగా ఓడిపోయిన తర్వాత అమెరికా జాత్యహంకారుల అహం బాగా దెబ్బతిన్నది. వారి అహాన్ని చల్లార్చడానికి అప్పట్లో రాంబో అనే సినిమా వచ్చింది. సల్వెస్టర్ స్టలోన్ ఒక్కడే బాణాలతోవెళ్లి వియత్నాంలో వీరవిహారం చేస్తాడు. ఈ సినిమా దెబ్బతిన్న వారి అహాన్ని కొంత చల్లార్చింది. చంద్రబాబు, లోకేశ్ బాబులు తమ పాలిటి సల్వెస్టర్ స్టలోన్ను రాజ్యాంగ వ్యవస్థల్లో చూడాలను కోవడం ఒక అమానుషమైన ఆలోచన. ఒక రాజ్యాంగ వ్యవస్థ తానే సర్వాధికారినని, తన పరిధులు దాటి కూడా వ్యవహారం చేయవచ్చనీ భావిస్తే అది చెల్లదని మన దేశ చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. అందుకు మన దేశ రాజ్యాంగం కూడా అంగీకరించదు. ముగ్గురు ఎంపీల సభ్యత్వా లను రద్దుచేస్తూ లోక్సభ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసు కోవడానికి ప్రయత్నించిన సుప్రీంకోర్టునే అప్పటి లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ధిక్కరించారు. సోమనాథ్ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. సుదీర్ఘకాలం సుప్రీంకోర్టు న్యాయ వాదిగా పనిచేశారు. పదిసార్లు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా, రాజ్యాంగ నిష్ణాతు నిగా, మేధావిగా వాసికెక్కారు. పార్లమెంట్ వ్యవ హారాల్లో తలదూర్చే బదులు పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టండని సర్వోన్నత న్యాయస్థానానికి సలహా కూడా ఇచ్చారు. రాజ్యాంగంలోని అధికరణం 105 ప్రకారం సభలో సభ్యుడు వేసిన ఓటును ప్రశ్నించే అధికారం ఏ వ్యవస్థకూ లేదు. సభ్యులు తమ ఓటు ద్వారా తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రశ్నించే అధికారం లేదని ఛటర్జీ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర శాసనసభ అక్కడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను జైల్లో పెట్టిన ఉదంతం ఉండనే ఉన్నది. ఏ వ్యక్తయినా, వ్యవస్థయినా పరి ధులు దాటి రెచ్చిపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. పాత్రధారులు మూల్యం చెల్లిస్తారు సరే! మరి సూత్ర ధారుల సంగతి? ఇప్పుడు మాట్లాడవలసింది సూత్రధారుల మనోగతం గురించే. ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచే మన సూత్రధారులు ఏదోరకంగా మళ్లీ గద్దెనెక్కాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం మీద ఎందుకు కూలదోసే కుట్రలు రచిస్తున్నారు? అమరావతి భూకుంభకోణంమీద విచారణ జరక్కుండా ఎందుకు వ్యూహాలు పన్నుతున్నారు? సమాధుల్లోంచి పిశాచాలను లేపినట్టుగా స్లీపర్ సెల్స్ను నిద్రలేపి ఎందుకు అరాచకం సృష్టించాలనుకుంటు న్నారు? యజ్ఞవాటికల మీద రక్తమాంసాలు వెదజల్లే అసురుల మాదిరిగా ప్రజా పాలనకు విఘ్నాలు సృష్టించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఈ అంశాల మీద జరగాలి చర్చ. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బియ్యం బండిపై మొండిగా!
సాక్షి, అమరావతి: అది రెక్కాడితేగానీ డొక్కాడని పేదల కోసం ఎప్పుడో ప్రకటించిన పథకం. అదేమీ కొత్తది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. క్యూ లైన్లలో నించుని, కూలి పనులు మానుకుని చౌక ధరల దుకాణాల వద్ద పడిగాపులు కాసే దుస్థితి తప్పిందని, ఇన్నాళ్లకు తమ ఇంటివద్దే రేషన్ బియ్యం అందబోతున్నాయని గ్రామీణ పేదలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే పేదల ఇబ్బందులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది ఓ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, పేదలకు తిండిగింజలు అందించటాన్ని సానుకూలంగా చూడాలని హైకోర్టు సైతం సూచించినా పెడచెవిన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన మొబైల్ వాహనాలపై ఉన్న రంగులతో పాటు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బొమ్మలను తొలగించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. తొలుత ఒక వాహనానికి మాత్రం ప్రస్తుతం ఉన్న రంగులను మార్చి తాను పరిశీలించేందుకు తీసుకుని రావాలని పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగు మార్చిన ఆ వాహనాన్ని పరిశీలించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఆ మార్పులకు తాను అనుమతిస్తేనే వాహనాలు తిప్పాలన్నారు. ముందస్తు వ్యూహంతోనే.. మొబైల్ వాహనాలకు ప్రస్తుతం ఉన్న రంగులను మార్పు చేసి పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ పాత రంగులు వేయాలని భావించరాదని నిమ్మగడ్డ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని నిమ్మగడ్డ ప్రకటించారు. దీన్నిబట్టి ఆయన ముందస్తు వ్యూహంతో, నెలల తరబడి ఎన్నికల కోడ్ అమలులో ఉండేలా పక్కా స్క్రిప్టు ప్రకారం వ్యవహరిస్తున్నట్లు వెల్లడవుతోంది. ఎప్పుడో సిద్ధమైన వేల వాహనాలకు ఇప్పటికిప్పుడు రంగులు మార్చడం సాధ్యమయ్యే పనేనా? ఇదంతా ఇప్పట్లో జరిగేపని కాదనే ఎస్ఈసీ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఉత్తర్వును జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలతో నివేదిక ఇచ్చినా.. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా సరుకుల పంపిణీ కోసం మొబైల్ వాహనాలను వినియోగించడానికి వీల్లేదని గత నెల 28న ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పథకం రాజకీయ కార్యక్రమం కాదని, ఈ పథకం పేదలకు ఎంత అవసరమో గమనించాలని న్యాయస్థానం పేర్కొంది. ఇంటింటా రేషన్ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వినతి అందుకున్న ఐదు రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు వాహనాల ద్వారా సరుకులు పంపిణీ వల్ల పేదలకు ఒనగూరే ప్రయోజనాల గురించి ఎస్ఈసీకి పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించడంతో పాటు పూర్తి వివరాలతో నివేదిక కూడా ఇచ్చారు. పథకం అమలుæ కోసం వినియోగించనున్న మొబైల్ వాహనాలను ఈనెల 3న నిమ్మగడ్డ పరిశీలించారు. అయితే ఇటు ప్రభుత్వం అటు హైకోర్టు సూచించిన విషయాలను ఆయన ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తొలుత మొబైల్ వాహనాలపై ఉన్న రంగులను తొలగించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించడంతో పేదలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. -
టీడీపీ ఆఫర్: నామినేషన్ వేస్తే రూ.2 లక్షలు!
సాక్షి, తిరుపతి: పార్టీ రహిత ఎన్నికలైనా.. చిత్తూరు జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు సర్పంచ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. గెలుపోటములతో పనిలేకుండా కేవలం నామినేషన్ వేసేవారికి రూ.2 లక్షలు నగదు అందజేస్తున్నారు. గట్టి పోటీ ఇవ్వాలని భావించే పంచాయతీల్లో పోటీచేసే వారికి ఓటర్లను బట్టి టీడీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. అది కూడా కొందరికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చేరవేస్తుంటే.. మరి కొందరికి రూపాయి కూడా ఇవ్వటంలేదని విశ్వసనీయ సమాచారం. ఈ విషయం తెలిసి.. డబ్బు అందనివారు చంద్ర బాబు, పార్టీ నేతలపై మండిపడుతున్నారు. సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే నామినేషన్లు వేయటానికి కూడా పార్టీవారు ముందుకు రావటం లేదు. దీంతో అనేక గ్రామాల్లో పార్టీలకు అతీతంగా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అవుతున్నాయి. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు, లోకేష్ జిల్లా నాయకులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఏకగ్రీవాలు కావటానికి వీల్లేదని, ఎవరో ఒకరిచేత నామినేషన్ వేయించి ఎన్నికలు జరిగేలా చూడాలని చెప్పినట్లు సమాచారం. ఓడిపోతామని తెలుసు.. అయినా ఎన్నికలు జరిగేలా చూడటమే లక్ష్యం అని వారికి చెప్పినట్లు తెలిసింది. ఎవరూ ముందుకు రాకపోతే.. కేవలం నామినేషన్ వేసి ఉపసంహరించుకోకుండా ఉంటే రూ.2 లక్షలు ఇస్తామని గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించినట్లు తెలిసింది. ఈ తంత్రంతో కొన్ని గ్రామాల్లో నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. మొదటి విడత ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ఆ పంచాయతీల్లో ఓటర్లకు ఆన్లైన్లో రూ.2 వేల వంతున పంపుతున్నట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల కోసం కర్ణాటక, తమిళనాడు నుంచి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున మద్యాన్ని దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. -
‘పంచాయతీ’ల్లో ఏకగ్రీవాలు కొత్తకాదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ వివరణ కోరడం తొందరపాటు చర్య అని, పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కొత్తేమీకాదని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి తొలినుంచి పంచాయతీ ఏకగ్రీవ ఎన్నికలు ఉంటున్నాయని తెలిపారు. విజయనగరంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవం అయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. గత ఎన్నికలతో పోల్చితే ఒక శాతం మాత్రమే అదనంగా జరిగిన దానికే ఎన్నికల కమిషన్ ఎలా వివరణ కోరుతుందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ పునరాలోచించుకోవాలని అన్నారు. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో గందరగోళం సృష్టించి, అశాంతి రేకెత్తించాలని ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోందని అన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
కోడ్ ఉల్లంఘించిన బాబుపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు వి.మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారని దుయ్యబట్టారు. యథేచ్చగా కోడ్ను ఉల్లంఘించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని గత నెల 29న ఫిర్యాదు చేశామని చెప్పారు. కానీ తీరిగ్గా 6 రోజుల తర్వాత టీడీపీ మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉత్తర్వులివ్వడం హాస్యాస్పదమన్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వంపై గవర్నర్కు లేఖలు రాసిన నిమ్మగడ్డ.. బాబు విషయంలో మాత్రం ఎందుకు చూసీచూడనట్లు ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పక్షపాత ధోరణి విడిచిపెట్టి.. బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
ఆ రెండు జిల్లాల్లో ఆగండి: నిమ్మగడ్డ ఆదేశాలు
సాక్షి, అమరావతి: గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తొలివిడత ఎన్నికలు జరిగే చోట్ల ఏకగ్రీవమైన పంచాయతీలను తాను అనుమతి ఇచ్చేవరకు అధికారికంగా ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు జిల్లాల కలెక్టర్లు పంపే వివరణాత్మక నివేదికలను పరిశీలించిన తర్వాత ఏకగ్రీవమైన పంచాయతీలను ప్రకటించడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్ఈసీ పేర్కొన్నారు. అయితే తొలిదశలో ఎన్నికలు జరిగే పంచాయతీలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన మర్నాడు కమిషన్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం. నివేదికలను పరిశీలించాక నిర్ణయం ‘రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉంది. బలవంతపు ఏకగ్రీవాలు రాష్ట్రంలో జరుగుతున్నట్లు కనిపించడం లేదు. అయితే రాష్ట్రం మొత్తం కనబడుతున్న పరిస్థితికి భిన్నంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగినట్లు కనిపిస్తోంది. వీటిపై ఆయా జిల్లా కలెక్టర్లను నివేదిక కోరా. వాటిని పరిశీలించాక కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఆయా నివేదికల ప్రకారం ఈ విషయంలో ఏవైనా వైఫల్యాలను గుర్తిస్తే అందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది’ అని నిమ్మగడ్డ ప్రకటనలో పేర్కొన్నారు. డిక్లరేషన్ ఫారాలు కూడా అందుకున్న ఏకగ్రీవ అభ్యర్థులు! గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో 70 నుంచి 80 శాతం మంది అభ్యర్థులు గురువారమే ధ్రువీకరణ పత్రాలు కూడా పొందినట్లు తెలిసింది. తొలివిడతలో ఎన్నికలు జరిగే 3,249 పంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ సమయానికి ఒకే అభ్యర్ధి పోటీలో ఉంటే సంబంధిత రిటరి్నంగ్ అధికారి (ఆర్వో) ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించి ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రాన్ని కూడా వెంటనే అందజేయాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లాలో 454 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 112 చోట్ల సర్పంచి పదవులు, 2,637 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. గుంటూరు జిల్లాలో 337 గ్రామ పంచాయతీలకుగానూ 67 సర్పంచి పదవులు, 1,337 వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏకగ్రీవ అభ్యర్ధులు రిటర్నింగ్ అధికారుల నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నట్లు తెలిసింది. రిటర్నింగ్ అధికారి ఒకసారి ఎవరైనా అభ్యర్ధి గెలిచినట్లు అధికారికంగా ధ్రువీకరణ ప్రతం అందజేస్తే ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏకగ్రీవాలపై కమిషన్కు కలెక్టర్ల నివేదికలు గుంటూరు జిల్లాలో 67 సర్పంచి పదవులు, చిత్తూరు జిల్లాలో 112 సర్పంచి పదవులకు ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసినట్లు ఆయా జిల్లా కలెక్టర్లు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదిక పంపినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం అత్యధిక స్థానాల్లో గురువారమే రిటర్నింగ్ అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందచేశారని కమిషన్కు తెలియచేసినట్లు సమాచారం. తొలివిడతలో 2,724 గ్రామాల్లో 9న ఎన్నిక తొలివిడతలో విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాలలో 3,249 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా 525 గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,724 గ్రామ పంచాయతీల్లో ఈనెల 9వతేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటల నుంచి 3.30 వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. -
ఏకగ్రీవాలపై ఇదేం పంచాయితీ?
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు గతంతో పోల్చితే అప్పుడూ ఇప్పుడూ ఒకేలా నమోదవుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తాను చెప్పేవరకు ప్రకటించవద్దని కలెక్టర్లను ఆదేశించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రం మొత్తం చూసినా, జిల్లాలవారీగా చూసినా 2013 పంచాయతీ ఎన్నికల మాదిరిగానే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఇప్పుడూ ఏకగ్రీవాలు ఉన్నాయి. అయినా ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవమైన పంచాయతీల సంఖ్య ఎక్కువగా ఉందని, అధికారికంగా ప్రకటించరాదని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా చూసినా.. రాష్ట్రవ్యాప్తంగా చూసినా 2013లో 13 జిల్లాల పరిధిలో 12,740 పంచాయతీల్లో 1,980 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 15.54 శాతం పంచాయతీలు అప్పట్లో ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు తొలివిడత ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా 16 శాతం గ్రామ పంచాయతీల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. 2013లో 33.27 శాతం వార్డులు ఏకగ్రీవం కాగా ఇప్పుడు తొలి విడతలో 37 శాతం ఏకగ్రీవమయ్యాయి. 2013లో సర్పంచి పదవికి సరాసరిన ఆరుగురు చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా ఇప్పుడు తొలి విడతలో కూడా అదే రీతిన ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ నినాదం వెనుకబడిందంటూనే.. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ ఆది నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. గ్రామస్తులంతా ఐకమత్యంగా సాగేందుకు ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం పెంచితే అధికారులకు ఎస్ఈసీ సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఏకగ్రీవాల నినాదం పూర్తిగా వెనుకబడిపోయిందని ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా వాటి సంఖ్య ఎక్కువగా ఉందంటూ ఫలితాల ప్రకటనను నిలిపివేస్తూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆ రెండు జిల్లాల్లో ఇలా.. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో చిత్తూరు జిల్లాలో మొత్తం 1,357 గ్రామ పంచాయతీల్లో 293 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 21.59 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు తొలివిడతలో ఆ జిల్లాలో 454 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 112 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 24.67 శాతం గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లాలో 1,010 గ్రామ పంచాయతీలు ఉండగా 2013లో 162 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 16.03 శాతం పంచాయతీలు అప్పట్లో ఏకగ్రీవంగా ముగిశాయి. అదే జిల్లాలో ఇప్పుడు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో 337 పంచాయతీలకుగాను 67 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంటే తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో 19.88 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. -
30 పంచాయతీలు ఏకగ్రీవం
సాక్షి, రాజమహేంద్రవరం: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నామినేషన్ల ఘట్టం గురువారం ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులెవరనేది తేలింది. కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో తొలి విడత 366 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 4,100 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 30 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. కరప మండలం ఉప్పలంక గ్రామంలో మాత్రం సర్పంచ్ పదవి ఏకగ్రీవమవగా వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన 29 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ సహా వార్డు సభ్యుల పదవులన్నీ ఏకగ్రీవం కావడం విశేషం. గ్రామాభివృద్ధికి తోడ్పాటునివ్వాలనే సంకల్పంతో ఆ గ్రామాల్లో అందరూ ఒకే మాటపై నిలబడటంతో ఏకగ్రీవాలు సాధ్యమయ్యాయి. మాట పట్టింపులతో పోటాపోటీగా దాఖలు చేసిన నామినేషన్ల ఉపసంహరణకు చివరి వరకూ చేసిన ప్రయత్నాలు కొన్నిచోట్ల ఫలితాన్నిచ్చాయి. మాట పట్టింపులకు పోయి విభేదాలు, వర్గ వైషమ్యాలకు తావు ఇవ్వకుండా గ్రామాభివృద్ధికి కలిసి రావాలనే పెద్దల మాటకు కట్టుబడి పలువురు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మరికొన్నిచోట్ల సర్దుబాటు చేయాల్సి రావడం పెద్దలకు తలపోటు తెచ్చి పెట్టింది. పంచాయతీల్లో స్థానికంగా పెద్దలు కల్పించుకుని గ్రామాభివృద్ధికి అందరూ కలిసి రావాలని బుజ్జగిస్తున్నారు. అత్యధికంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల్లో సర్పంచ్తో పాటు వార్డు సభ్యుల పదవులు కూడా ఏకగ్రీవమయ్యాయి. రెండో అత్యధిక స్థానాలు ఏకగ్రీవమైన నియోజకవర్గంగా కాకినాడ రూరల్ నిలిచింది. ఈ నియోజకవర్గంలో ఆరు గ్రామాల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. తుని, జగ్గంపేట నియోజకవర్గాల్లో నాలుగు చొప్పున, పిఠాపురం నియోజకవర్గంలో మూడు, ముమ్మిడివరం, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి, అనపర్తి నియోజకవర్గంలో మూడు పంచాయతీ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. తొలి పోరులో గెలుపెవరిదో.. ఈ నెల 9న జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల అనంతరం గెలుపు ఎవరి పక్షాన నిలుస్తుందనే చర్చ పల్లెల్లో రసవత్తరంగా జరుగుతోంది. ఎనిమిది నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయ్యేసరికి చాలాచోట్ల ముఖాముఖి పోరే ఎక్కువగా కనిపిస్తోంది. ⇔ తుని నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే 58 సర్పంచ్ పదవులకు నాలుగు ఏకగ్రీవం కాగా, మిగిలిన 54 పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో 148 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో 30 పంచాయతీల్లో ముఖాముఖి, 17 చోట్ల త్రిముఖ పోరు, ఏడుచోట్ల బహుముఖ పోటీ జరుగుతోంది. ⇔ ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన 16 పంచాయతీల్లో 42 మంది బరిలో నిలిచారు. ఎనిమిది పంచాయతీలకు ముఖాముఖి, ఏడుచోట్ల త్రిముఖ పోరు, ఒక చోట బహుముఖ పోరు జరుగుతోంది. ⇔ అనపర్తి నియోజకవర్గం పెదపూడి, రంగంపేట మండలాల్లో 36 పంచాయతీలకు మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 32 గ్రామాల్లో పోరుకు తెర లేచింది. ఈ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి 72 మంది బరిలో నిలిచారు. 21 పంచాయతీల్లో ముఖాముఖి, తొమ్మిది చోట్ల త్రిముఖం, రెండుచోట్ల బహుముఖ పోరు జరుగుతోంది. ⇔ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 35 పంచాయతీలకు గాను ఆరు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29 సర్పంచ్ పదవులకు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం 83 మంది పోటీ పడుతున్నారు. వీటిలో 15 పంచాయతీలకు ముఖాముఖి, తొమ్మిదిచోట్ల త్రిముఖం, ఐదు పంచాయతీల్లో బహుముఖ పోరు జరుగుతోంది. ⇔ పెద్దాపురం నియోజకవర్గంలో 41 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన 40 పంచాయతీల్లో 114 మంది బరిలో నిలిచారు. 19 చోట్ల ముఖాముఖి, 10 చోట్ల త్రిముఖం, 11 పంచాయతీల్లో బహుముఖ పోరుకు తెర లేచింది. ⇔ ప్రత్తిపాడు నియోజకవర్గంలో 75 గ్రామ పంచాయతీలుండగా ఎనిమిది ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 67 పంచాయతీల్లో అత్యధికంగా 202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 33 పంచాయతీల్లో ముఖాముఖి, 21 చోట్ల త్రిముఖం, 13 చోట్ల బహుముఖ పోరు జరుగుతోంది. ⇔ జగ్గంపేట నియోజకవర్గంలో 53 పంచాయతీలకు నాలుగు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 49 పంచాయతీల్లో పోటీ జరుగుతోంది. 141 మంది బరిలో నిలిచారు. ⇔పిఠాపురం నియోజకవర్గంలో 52 పంచాయతీలుండగా వాటిలో 3 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగే 49 సర్పంచ్ పదవులకు 132 మంది పోటీ పడుతున్నారు. -
తొలి దెబ్బ అదిరింది
సాక్షి, ఒంగోలు: పల్లె పోరులో రెండు కీలక ఘట్టాలు గురువారం ముగిశాయి. జిల్లాలో మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ, రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలు పూర్తయ్యాయి. మొదటి విడతలో 13 మండలాల పరిధిలోని 227 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణలు పూర్తయ్యాయి. ఇందులో 35 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, 762 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధ్రువీకరించారు. గ్రామాల్లో ఎన్నికలు జరగడం కంటే ఏకగ్రీవాల వల్లే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి 35 గ్రామాల ప్రజలు శాంతి వైపు అడుగులు వేశారు. అభివృద్ధికి తోడ్పాటునందిస్తారనుకున్న వారిని సర్పంచ్గా తామే ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. ఎన్నికల నిర్వహణ ఖర్చు మిగల్చడంతో పాటు ఏకగ్రీవాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు అందుకుని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపాలని నిశ్చయించుకున్నారు. ⇔ ఇందులో భాగంగా పర్చూరు నియోజకవర్గంలో 15 గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్లు ఎన్నుకోగా, సంతనూతలపాడులో 13 గ్రామాల్లో, ఒంగోలులో 3 గ్రామాల్లో, టంగుటూరు మండలంలో 3 గ్రామాలతో పాటు వేటపాలెం మండలంలో ఎన్నిక జరుగుతున్న ఒక్క గ్రామంలో సైతం సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ⇔ మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సమయానికి 35 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 192 గ్రామాల్లో ఈ నెల 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పోటీలో నిలిచిన అభ్యర్ధులకు గుర్తులను కేటాయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ⇔ మరోవైపు రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సైతం గురువారంతో ముగిసింది. చాలా గ్రామాల్లో ఈ దశలో సైతం ఏకగ్రీవాల దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక గ్రామాల్లో ఒకే ఒక్క అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నెల 8వ తేదీన జరిగే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో మరికొన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుని గ్రామాల్లో చిచ్చు రేపాలనే కుట్రను భగ్నం చేస్తూ అనేక గ్రామాల ప్రజలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏకగ్రీవాల వైపు అడుగులు వేయడం శుభపరిణామం. జిల్లాలో ఏకగ్రీవమైన 35 గ్రామ పంచాయతీల్లో 31 చోట్ల వైఎస్సార్ సీపీ అభిమానులు సర్పంచ్లుగా ఏకగ్రీవం కాగా 4 చోట్ల మాత్రమే టీడీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బద్దలైన టీడీపీ కంచు కోటలు.. దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న అనేక గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సర్పంచ్లుగా ఏకగ్రీవంగా ఎన్నిక అవడంతో టీడీపీ కోటలు బద్దలయ్యాయి. గతంలో ఎన్నడూ ఏకగ్రీవం కాని అనేక గ్రామాలు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకోవడం చూస్తుంటే గ్రామాభివృద్ధి కంటే ఎన్నికలు ముఖ్యం కాదనే విషయం ఆయా గ్రామాల ప్రజలు స్పష్టం చేసినట్లయింది. ముఖ్యంగా యద్దనపూడి మండలం దరిశి గ్రామం పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్వగ్రామం. ఆయన కుటుంబ సభ్యులకు అక్కడే ఓటు ఉంది. అయినప్పటికీ అక్కడ వైఎస్సార్ సీపీ అభిమాని అయిన బీసీ మహిళను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాడు తీవ్ర పోటీ.. నేడు ఏకగ్రీవాలు.. ⇔ యద్దనపూడి మండలంలోని వింజనంపాడు గ్రామం సైతం టీడీపీకి కంచుకోటగా మొదటి నుంచి ఉండేది. అక్కడ సైతం వైఎస్సార్ సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్చూరు మండలం ఇనగల్లు గ్రామం ఫ్యాక్షన్తో రగిలిపోయేది. ఎన్నికలు వచ్చాయంటే గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి. ఎన్నికలు వస్తే ఎప్పుడు ఏమవుతుందోనని గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి. గ్రామం ఏర్పడి దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏకగ్రీవం అయిన పరిస్థి లేదు. అయితే తొలిసారిగా ఇక్కడ వైఎస్సార్ సీపీ అభిమాని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికవడం చెప్పుకోదగ్గ విషయం. ⇔ పర్చూరు నియోజకవర్గంలోని ఏలూరివారిపాలెం, చినరావిపాడు, టంగుటూరు మండలం అనంతవరం, అల్లూరు, ఒంగోలు మండలం కరవది, వలేటివారిపాలెం, ఉలిచి, నాగులుప్పలపాడు మండలం కొత్తకోట గ్రామాలు సైతం దశాబ్దాలుగా ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొంటూ వస్తోంది. వీటిలో అనేక గ్రామాల్లో టీడీపీ అభిమానులే సర్పంచ్లుగా గెలుస్తూ వస్తున్నారు. అయితే మొదటిసారి వైఎస్సార్ సీపీ అభిమానులు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. చీరాల నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతున్న ఒకే ఒక్క గ్రామమైన వేటపాలెం మండలం రామన్నపేట గ్రామం గత 40 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఎన్నిసార్లు ఎన్నిక జరిగినా టీడీపీ అభిమానులే సర్పంచ్లుగా ఎన్నికవుతూ వచ్చారు. మొదటిసారిగా రామన్నపేట సర్పంచ్గా వైఎస్సార్ సీపీ అభిమాని ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంచలనం కలిగించింది. కారంచేడు మండలం యర్రంవారిపాలెం గ్రామ పంచాయతీగా ఏర్పడిన వద్ద నుంచి ఒక్కసారి కూడా ఎన్నిక జరగని పరిస్థితి. అక్కడ గ్రామ పెద్దలే ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకుని గ్రామాభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం ఈ సారి కూడా అక్కడ సర్పంచ్ అభ్యరి్థని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
తొలివిడత.. 23 ఏకగ్రీవాలు!
సాక్షి, కృష్ణా: పంచాయతీల ఎన్నికల్లో మరో అంకం పూర్తయింది. గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ పక్రియ ముగిసింది. తొలిదశలో విజయవాడ డివిజన్లోని 14 మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ఈనెల జనవరి 29 నుంచి 31 వరకు నామినేషన్లను స్వీకరించారు. ఈ డివిజన్లో 234 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 23 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 211 పంచాయతీలకు, వార్డులకు ఈనెల 9న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో 6,93,822 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కంకిపాడు (పెనమలూరు), రామవరప్పాడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని మూడు గ్రామ పంచాయతీ సర్పంచిలు ఏకగ్రీవమయ్యాయి. రెండు గ్రామ పంచాయతీలు పూర్తిగా వార్డు సభ్యుల స్థానాలతో సహా ఏకగ్రీవం అయ్యాయి. నెప్పల్లి గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వు కాగా నామినేషన్ల స్వీకరణ నాటికి మండవ ప్రగతి ఒక్కరే సర్పంచి అభ్యరి్థగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ స్థానం తొలుతే ఏకగ్రీవాల జాబితాలో చేరింది. అలాగే కాసరనేనివారిపాలెం, మద్దూరు గ్రామ సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే విజయవాడ రూరల్ ప్రసాదంపాడు సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. సర్నాల గంగారత్నం ఏకగ్రీవంగా ఎన్నికయ్యినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అలాగే ఇక్కడ మొత్తం 16 వార్డులకు గానూ 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. -
అధిక ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదు: నిమ్మగడ్డ
సాక్షి, నెల్లూరు: ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏకగ్రీవాలు లేనప్పుడు సర్పంచ్ పదవులకు మాత్రం ఎందుకని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యాఖ్యానించారు. ఏకగ్రీవాలు అధికంగా అయితే అధికార వైఫల్యం కిందకు వస్తుందన్నారు. అధిక ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదన్నారు. గురువారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎస్ఈసీ పర్యటించారు. పంచాయతీ ఎన్నికలపై ఆయా జిల్లాల అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కోవిడ్–19 అదుపులో ఉందని, ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు ఇబ్బందులు లేవని చెప్పారు. ఎన్నికలను నిజాయితీగా, నిబద్ధతతో నిర్వహించేలా ఉద్యోగులందరూ పని చేయాలన్నారు. గతంలో ఏకగ్రీవాలు 20 శాతం ఉంటే ప్రస్తుతం పది శాతానికి పడిపోయినట్టు చెప్పారు. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా సజావుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యతన్నారు. శాంతిభద్రతలు కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా అధికారులు చూడాలన్నారు. కొత్త యాప్ ద్వారా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో జరిగే లోపాలను మీడియా కూడా ప్రజలకు తెలియచేయాలన్నారు. మీడియాతో కలసి ఎన్నికల కమిషన్ పని చేస్తుందన్నారు. గత ఏడాది మార్చిలో ఏకగ్రీవమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీలను సమీక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒంగోలు సమావేశంలో పాత్రికేయులు ప్రశ్నలు అడుగుతున్నా సమాధానం చెప్పకుండానే ఎస్ఈసీ వెళ్లిపోయారు. -
నీ అంతు చూస్తాం.. కారుతో గుద్ది చంపేస్తాం
సాక్షి నెట్వర్క్: పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వాహనాలు తగులబెడుతున్నారు. తమ మాట వినకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసుల్ని హెచ్చరిస్తున్నారు. బుధవారం పలుచోట్ల అరాచకానికి పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలంలో నగదు పంపిణీ చేస్తూ పట్టుబడటమేగాక పెండ్లిమర్రి మండలంలో దళితుడిని కిడ్నాప్ చేశారు. ఓబులవారిపల్లె మండలం గద్దలరేపుపల్లెలో వైఎస్సార్సీపీ దళిత నాయకుడిపై దాడిచేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో బహిరంగంగా మద్యం తాగుతూ హల్చల్ చేశారు. మద్యం సీసాలతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలో నామినేషన్ వేసిన వ్యక్తి మోటారు సైకిల్ను తగులబెట్టారు. ఖాజీపేట మండలం దుంపలగట్టు సర్పంచి పదవికి రెడ్యం చంద్రశేఖర్రెడ్డి సతీమణి అరుణ పోటీ చేస్తున్నారు. బుధవారం ఎస్సీ కాలనీలో డబ్బు పంపిణీ చేస్తుండగా పోలీసులు వెళ్లారు. రెడ్యం చంద్రశేఖర్రెడ్డి, ఆయన సోదరుడు ఆదినారాయణరెడ్డి, మరికొందరు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద కొంత డబ్బులు స్వాదీనం చేసుకున్న పోలీసులు వారిని ఖాజీపేట పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం పోలీసులు గ్రామంలో ఇరువర్గాల ఇళ్లను తనిఖీ చేయసాగారు. ఈ సమయంలో చంద్రశేఖర్రెడ్డి సోదరుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నా సోదరులనే అరెస్టు చేస్తారా.. మీ సంగతి తేలుస్తా.. అంటూ ఎస్ఐ, సీఐలపై దౌర్జన్యానికి దిగారు. పోలీసులతో వాగ్వాదం చేస్తున్న సుబ్బారెడ్డి కుటుంబీకులు ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు రెడ్యం సోదరులపై కేసు నమోదు చేశారు. పెండ్లిమర్రి మండలం మాచునూరు పంచాయతీ చౌటపల్లె దళితవాడకు చెందిన బి.గంగాధర్ను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. తమ తరఫున సర్పంచి పదవికి నామినేషన్ వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గంగాధర్తో నామినేషన్ వేయించాలని మంగళవారం రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. గంగాధర్ తండ్రి రామాంజనేయులు బుధవారం పెండ్లిమర్రి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నాయకుల చెరనుంచి బాధితుడిని విడిపించారు. చౌటపల్లె, అరవేటిపల్లె గ్రామాలకు చెందిన నలుగురు టీడీపీ నాయకులపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు. దళిత నాయకుడిపై దాడి వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె మండలం గద్దలరేపుపల్లెలో బుధవారం పాయలవారిపల్లె దళితవాడకు చెందిన వైఎస్సార్సీపీ దళిత నాయకుడు బయనేని రెడ్డికుమార్పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు.. గద్దలరేపుపల్లె పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఓసీ మహిళకు రిజర్వు చేశారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ అభిమాని చమ్మర్తి గిరిజమ్మతో నామినేషన్ వేయించాలని వైఎస్సార్సీపీ నాయకులు నిర్ణయించారు. ఈ విషయంపై గిరిజమ్మ బంధువులతో రెడ్డికుమార్ చర్చిస్తుండగా టీడీపీ నాయకులు సురపురాజు శ్రీధర్, సురపురాజు కృష్ణంరాజు, సురపురాజు అభిషేక్ మోటార్ బైక్పై వచ్చి దాడి చేశారు. మా ఊరికి వచ్చి అభ్యర్థిని నిలబెడతావా.. నీ అంతు చూస్తాం.. చంపుతాం.. అంటూ బెదిరించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డాక్టర్ నాయక్ తెలిపారు. పచ్చ కండువాలతో.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో నామినేషన్ వేసే కార్యాలయానికి సమీపంలో టీడీపీ కార్యకర్తలు మద్యం తాగుతూ హల్చల్ చేశారు. సమీపంలోని మద్యం దుకాణంలో కొనుగోలుచేసి పలువురిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. పార్టీ కండువాలు వేసుకుని ఎంపీడీవో కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. నామినేషన్ వేశాడని బైక్కు నిప్పు గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అమీన్సాహెబ్పాలెం రెండో వార్డు మెంబరుగా నామినేషన్ వేసిన గుర్రం రాజేష్ మోటారు సైకిల్ను మంగళవారం రాత్రి తగులబెట్టారు. దీనిపై రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి తక్కెళ్లపాటి రామకోటేశ్వరరావు తనను నామినేషన్ వేయవద్దని బెదిరించాడని.. ఈ నేపథ్యంలో బైక్కు నిప్పుపెట్టారని పేర్కొన్నారు. కారుతో గుద్ది చంపేస్తాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఇసరపు దేవిని కారుతో గుద్ది చంపేస్తామంటూ తెలుగుదేశం నాయకుడి కుమారుడు బుధవారం బెదిరించారు. తండ్రీకొడుకులు ఆమెను దుర్భాషలాడారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్లో పర్యటిస్తున్న ఆమె ఓ వృద్ధుడు పింఛను రావడంలేదని చెప్పడంతో వివరాలు తెలుసుకుంటున్నారు. ఇంతలో టీడీపీ నాయకుడు ఎరుబోతు రమణారావు కుమారుడు అశోక్ వచ్చి.. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్లిపోండి.. లేకపోతే కారుతో గుద్ది చంపేస్తా.. అంటూ దుర్భాషలాడాడు. వైఎస్సార్సీపీ నాయకులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా రమణారావు, అతని కొడుకు అశోక్ పట్టించుకోలేదు. దీంతో వీరిపై వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలు అజిత్సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఓపక్క వైఎస్సార్సీపీ మహిళా నాయకులకు క్షమాపణలు చెబుతూనే మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంచాయతీల్లో టీడీపీ అత్యుత్సాహం
కళ్యాణదుర్గం రూరల్/వి.కోట (చిత్తూరు జిల్లా): పార్టీలకతీతంగా నిర్వహిస్తోన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బరితెగిస్తోంది. సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా బుధవారం అనంతపురంలోని కల్యాణదుర్గం మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కండువాలతో నామినేషన్కు ర్యాలీగా తరలివచ్చారు. నామినేషన్ దాఖలు చేసే కేంద్రానికి సమీపం వరకు కండువాలతోనే రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. అలాగే, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పేరు ఖరారు కావడంతో బుధవారం టీడీపీ కార్యకర్తలు పార్టీ జెండాలు కార్లకు తగిలించుకుని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.