లైవ్‌: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..

3rd Phase Panchayat Elections Results In AP - Sakshi

సాక్షి, అమరావతి : బుధవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. 13 జిల్లాల్లోని 20 డివిజన్లు 160 మండలాల్లో మొత్తం 3221 పంచాయతీలు ఉండగా.. 579 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,639 సర్పంచ్‌,19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. పంచాయతీల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు 2,291 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 263 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 13, ఇతరులు 96 చోట్ల గెలుపొందారు. జిల్లాల వారీగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి..

జిల్లా                                                     పార్టీ మద్దతుదారులు
 వైఎస్సార్‌సీపీ  టీడీపీ   బీజేపీ  ఇతరులు 
శ్రీకాకుళం 195 37 0 0
విజయనగరం 196 9 0 1
విశాఖ 153 45 5 26
తూర్పు  గోదావరి

123

15 1 23
పశ్చిమ గోదావరి 100 19 1 10
కృష్ణా 138 8 4 4
గుంటూరు 130 3 1 0
ప్రకాశం 152 23 0 0
నెల్లూరు 276 12 0 0
చిత్తూరు  193 18 0 0
కర్నూలు 191 25 1 12
అనంతపురం 188 25 0 10
వైఎస్సార్‌ జిల్లా  156 24 0 4
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top