MahaKumbh 2025
-
మహాకుంభమేళాలో ఐక్యత అనే అమృతం ఉద్భవించింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ‘ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళా(Maha Kumbh Mela) నుంచి ఐక్యత అనే అమృతం ఉద్భవించింది. దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి జనం ఈ కార్యక్రమానికి ఐక్యంగా తరలివచ్చారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(మంగళవారం) లోక్సభలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా కుంభ్ను ప్రజలను ఐక్యపరిచిన కార్యక్రమంగా అభివర్ణించారు. మహా కుంభ్ జరిగిన తీరుపై ప్రధాని మోదీ లోక్ సభలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహా కుంభ్లో జాతీయ చైతన్యానికి గల భారీ రూపాన్ని మనం చూశామని అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించడం ద్వారా మన సామర్థ్యాలపై కొంతమందికి ఉన్న సందేహాలకు తగిన సమాధానం లభించిందని మోదీ పేర్కొన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్(SP chief Akhilesh Yadav) గతంలో మహా కుంభమేళాపై గతంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు.ప్రధానమంత్రి మోదీ మహా కుంభ్ను భారతదేశ చరిత్ర(History of India)లోని మైలురాయితో పోల్చారు. ఇటువంటివి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. మహా కుంభ్ పై ప్రశ్నలు లేవనెత్తే వారికి విజయవంతమైన ఈ మహా కుంభ్ తగిన సమాధానం అని ప్రధాని మోదీ అన్నారు. మహా కుంభమేళాలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారని అన్నారు. ఈ మహాకుంభమేళాలో ఐక్యత అనేది ఒక ముఖ్యమైన ఘట్టమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కుంభమేళా కారణంగా యువత సంప్రదాయం, సంస్కృతిని అలవర్చుకుంటున్నారని అన్నారు.గత ఏడాది అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాబోయే వెయ్యి సంవత్సరాలకు దేశం ఎలా సిద్ధమవుతుందో మనమందరం గ్రహించాం. ఇప్పుడు ఒక సంవత్సరం తరువాత నిర్వహించిన ఈ మహా కుంభమేళా మనందరి ఆలోచనలను మరింత బలోపేతం చేసింది. దేశంలోని ఈ సామూహిక చైతన్యం దేశానికున్న బలాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తి ఉద్యమ సమయంలో దేశంలోని ప్రతి మూలలోనూ ఆధ్యాత్మిక స్పృహ ఉద్భవించిందని అన్నారు. శతాబ్దం క్రితం చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రపంచానికి చాటిందని, ఇది భారతీయుల ఆత్మగౌరవాన్ని మేల్కొల్పిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే.. -
మహాకుంభమేళాలో మాయమైన మహిళ తిరిగొచ్చిందిలా..
పట్నా: సోషల్ మీడియాతో కొంతమేరకు ముప్పు పొంచివున్నమాట వాస్తవమే అయినప్పటికీ, ప్రయోజనాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. సోషల్ మీడియాను సరైన రీతిలో వినియోగించుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభింస్తుందనడంలో సందేహం లేదు. బీహార్లోని రోహతక్ జిల్లాలోని బల్దారీ గ్రామానికి చెందిన లాఖ్పాతో దేవి విషయంలో సోషల్ మీడియా ఒక వరంలా మారింది.యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు వెళ్లిన లాఖ్పతో దేవి అక్కడ తప్పిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా సాయంతో ఇంటికి చేరుకుంది. ఆమె ఫిబ్రవరి 24న తన కుటుంబ సభ్యులతో పాటు మహాకుంభ్లో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లింది. అయితే అక్కడ జనసమూహం అధికంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కుంభమేళా ప్రాంతంలోనే రెండు రోజుల పాలు ఉండి, ఆమె కోసం వెదికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఇంటికి తిరుగుముఖం పట్టారు.అయితే ఇది జరిగిన 15 రోజుల తరువాత లాఖ్పాతో దేవి జార్ఖండ్(Jharkhand)లోని గఢ్వా జిల్లాకు చెందిన బహియాపూర్లో ఉందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. బహియాపూర్ పంచాయతీ సభ్యురాలు సోనీదేవి భర్త వీరేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఇటీవల 60 ఏళ్ల మహిళ తమ ఇంటికి వచ్చిందని, ఆ సమయంలో ఆమె బలహీనంగా కనిపించిందన్నారు. దీంతో ఆమెకు ఆహారం అందించి, వసతి కల్పించామన్నారు. ఆమె తన చిరునామా చెప్పలేకపోవడంతో ఆమె ఫొటోను సోషల్ మీడియాలో సంబంధిత వివరాలతో పాటు షేర్ చేశామని తెలిపారు.లాఖ్పాతో దేవి కుమారుడు రాహుల్ తల్లి ఫొటోను చూసి, వెంటనే జార్ఖండ్ చేరుకుని తన తల్లిని తనతోపాటు ఇంటికి తీసుకువచ్చాడు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ మార్చి 10 సోషల్ మీడియాలో తన తల్లి ఫొటోను చూశానని,తరువాత తాను బహియార్ పూర్ చేరుకుని తన తల్లిని కలుసుకున్నానని తెలిపారు. ఇది కూడా చదవండి: తండ్రి ఫోన్ రిపేర్ చేయించలేదని.. కుమారుడు ఆత్మహత్య -
మహాకుంభ్తో నిండిన రైల్వే ఖజానా.. ఎంత ఆదాయమంటే..
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు కోట్లాది మంది జనం తరలివచ్చారు. ఫలితంగా యూపీ సర్కారుకు లెక్కలేనంత ఆదాయం సమకూరింది. కుంభమేళాకు వచ్చేందుకు జనం ప్రధానంగా రైళ్లను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడిపింది.నెలన్నర పాటు జరిగిన మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్(Prayagraj) లోని ఎనిమిది రైల్వే స్టేషన్ల నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లిన రైళ్ల ద్వారా రైల్వేశాఖకు టిక్కెట్ల విక్రయాల రూపంలో దాదాపు రూ.200 కోట్లు సమకూరాయి. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్లోని ప్రయాగ్రాజ్ డివిజన్కు చెందిన డీఆర్ఎం హిమాన్షు బదోనీ, సీనియర్ డీసీఎం హిమాన్షు శుక్లా తెలిపిన వివరాల ప్రకారం మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లోని నార్త్ సెంట్రల్ రైల్వే జోన్లోని నాలుగు రైల్వే స్టేషన్లలో రూ.159.20 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అలాగే ఉత్తర రైల్వేలోని లక్నో డివిజన్లోని మూడు రైల్వే స్టేషన్ల నుండి రూ.21.79 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈశాన్య రైల్వేలోని వారణాసి డివిజన్లోని రెండు రైల్వే స్టేషన్ల నుండి రూ.6 కోట్ల విలువైన టిక్కెట్లను విక్రయించడం ద్వారా రైల్వేలు అధిక ఆదాయాన్ని ఆర్జించాయి. 2019 కుంభమేళాలో రైల్వేశాఖ 86 కోట్ల రూపాయల విలువైన టిక్కెట్లను విక్రయించింది.మహాకుంభమేళాకు ఊహించనంత సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని, అయితే రైల్వేశాఖ(Railways) గత మూడేళ్లుగా ముందస్తు చర్యలు చేపట్టిన కారణంగా ఎక్కడా ఎటువంటి సమస్య రాలేదని డిఆర్ఎం హిమాన్షు బదోనీ తెలిపారు. ఇదిలావుండగా రైల్వేశాఖ 2031లో జరగబోయే కుంభమేళా కోసం ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం మూడు రకాల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయోధ్య, వారణాసి, మీర్జాపూర్, చిత్రకూట్లను కలుపుతూ రైళ్లను నడపాలని అధికారులు యోచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Hit and Run: కారు బీభత్సం.. నలుగురు మృతి -
అయోధ్య రాముని దర్శన వేళల్లో మార్పులు
అయోధ్య: యూపీలోని రామజన్మభూమి అయోధ్య(Ram Janmabhoomi Ayodhya)లో బాలరాముణ్ణి దర్శించుకునే వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయని రామమందిర ట్రస్ట్ తెలిపింది. ఇటీవల ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరిగిన సమయంలో అక్కడి నుంచి వస్తున్న భక్తుల సౌకర్యార్థం అయోధ్య రామాలయాన్ని ప్రతీరోజూ 19 గంటల పాటు తెరిచివుంచారు. ఇప్పుడు ఈ దర్శన సమయాన్ని తగ్గించారు.మహాకుంభమేళా(Mahakumbh Mela) జరిగిన సమయంలో ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ భక్తులకు రామ్లల్లా దర్శనం కల్పించారు. ఇప్పుడు ప్రయాగ్రాజ్ కుంభమేళా ముగిసిన దరిమిలా అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య కొంతమేరకు తగ్గింది. ఈ నేపధ్యంలో రామజన్మ భూమి తీర్థ ట్రస్ట్ గతంలో మాదిరిగానే దర్శనాల సమయాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఇకపై రామభక్తులకు అయోధ్యలో ప్రతీరోజూ 19 గంటలపాటు దర్శనం లభించదని ట్రస్ట్ తెలిపింది.రామాలయ ట్రస్ట్(Ramalaya Trust) సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ఇకపై ప్రతీరోజూ మంగళ హారతి ఉదయం 4 గంటలకు జరుగుతుందని, ఆ తర్వాత 4:15 నుండి 6 గంటల వరకు తలుపులు మూసివేస్తారన్నారు. తిరిగి ఉదయం ఆరు గంటలకు మరో హారతి ఉంటుందని, అనంతరం భక్తులు 6:30 నుండి 11:50 వరకు దర్శనాలు చేసుకోవచ్చన్నారు. తరువాత ఆలయ తలుపులను మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేస్తారన్నారు. మధ్యాహ్న రాజభోగం 12 గంటలకు ఉంటుందని, హారతి అనంతరం దర్శనం 12.30 వరకు ఉంటుందని, ఆ తరువాత ఆలయ తలుపులను ఒంటి గంట వరకు మూసివేస్తారన్నారు. అనంతరం సాయంత్రం 6:50 వరకు దర్శనాలు ఉంటాయన్నారు. తరువాత రాత్రి 7 గంటల వరకు తలుపులు మూసివేస్తారని, సాయంత్రం 7 గంటలకు హారతి అనంతరం రాత్రి 9:45 వరకు బాలరాముని దర్శనం ఉంటుందన్నారు. 9:45 నుండి 10 వరకు తలుపులు మూసివేస్తారని, ఆ సమయంలో బాలరామునికి విందు వడ్డిస్తారన్నారు. శయన హారతి అనంతరం రాత్రి 10:15కు ఆలయ తలుపులు మూసివేస్తారన్నారు. ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ -
Maha Kumbh: 37 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..!
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం మహా కుంభమేళా. ఇది ఎందరెందరో మహమహులు, సాధువులు, సెలబ్రిటీలు ప్రముఖులను ఒక చోట చేర్చి అంత ఒక్కటే అనే భావన కలగజేసిన గొప్ప కార్యక్రమం. ఈ కుంభమేళ సాధువులుగా మారిన గొప్ప గొప్ప మేధావులను పరిచయం చేసింది. యూట్యూబ్ పుణ్యమా అని సాదాసీదా వ్యక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నేపథ్యంలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను అందుకున్నారు. అంతేగాదు ఈ వేడుక ఎన్నో గొప్ప విషయాలకు నెలవుగా మారింది. తాజాగా ఏళ్ల నాటి స్నేహబంధాన్ని హైలెట్ చేసింది. ఎప్పుడో చదువుకుని విడిపోయిన స్నేహితులను కలిపి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది ఈ సంబరం. వాళ్లెరవంటే..వారే సంజీవ్ కుమార్ సింగ్, రష్మి గుప్తాలు. ఇద్దరు ఒకే కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. 1988 బ్యాచ్ విద్యార్థులు. ఎప్పుడో 37 ఏళ్ల క్రితం కలుసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ మహాకుంభమేళా కారణంగా కలుసుకున్నాం అని చెబుతున్నారు ఆ స్నేహితులు. సంజీవ్ కుమార్ అగ్నిమాపక అధికారిగా ఈ మహాకుంభమేళలో విధులు నిర్వర్తిస్తుండగా, అతడి స్నేహితురాలు రష్మి లక్నోలోని ఒక కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తోంది. ఈ మేరకు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..తన స్నేహితుడు చాలా సైలెంట్ అని, మాట్లాడటం చాలా అరుదని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం అతడి వ్యక్తిత్వం పూర్తిగా భిన్నంగా ఉందంటూ నవ్వేశారామె. అనుకోకుండా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తాను ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ఏర్పాట్లు మాకు ఎంతగానే సహాయపడ్డాయని అన్నారు. ఇక సంజీవ్ కుమార్ రష్మిని ఎగతాళి చేస్తూ..రష్మీ, వాళ్ల గ్యాంగ్ తనతో మాట్లాడేందుకు తెగ ట్రై చేసేదంటూ మాట్లాడారు. అలాగే ఆమె చెప్పింది కూడా నిజేమనని, తాను నిజంగానే అప్పుడు అంతగా ఎవరితో ఫ్రీగా కలిసేవాడిని కానని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, జనవరి 13న ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రితో చివరి స్నానం ముగిసింది. ఈ మేళా అనేక లక్షలాదిమంది ప్రజలను ఒక చోట ఏకం చేసిన గొప్ప దైవ కార్యక్రమం.Pehle log Kumbh me kho jate the.Fire officer Sanjeev Kumar Singh 1988 ke baad MahaKumbh me apni classmate se mile.Such a cute conversation! pic.twitter.com/WQzSa35nsd— Swami (@Swami_65) February 26, 2025(చదవండి: అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి..! ఆమె వికాస్ దివ్యకీర్తి.) -
ట్రెండింగ్ బ్యూటీ.. తల్లితో కలిసి కుంభమేళా స్నానం! (ఫోటోలు)
-
కష్టం తీర్చిన కుంభమేళ.. ఆటో కుర్రాడి భావోద్వేగం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం... మహా కుంభమేళ ముగిసింది! త్రివేణీ సంగమ స్థలి ప్రయాగ్రాజ్లో సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోట్లమంది సందర్శించారు. పవిత్ర గంగలో మునకేసి తమ పాపాలు కడిగేసుకున్న పారవశ్యంలో మునిగితేలారు. వీరందరిది ఒక ఎత్తైతే.. కొందరు పరోపకారాన్ని కూడా అంతే శ్రద్ధాసక్తులతో చేసి ఆత్మానందం పొందారు. అలాంటి ఓ సంఘటన సాగిందిలా...కోట్లమందిలాగే.. స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధ పరచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడం కోసం ఆమె కూడా కుంభమేళాకు వెళ్లారు. ఎక్కడో ఓ మూలనున్న రిసార్టులో మకాం. అక్కడి నుంచి సంగమ స్థలికి వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకున్నారు.. దాన్ని నడుపుతోంది ఓ నూనూగు మీసాల కుర్రాడు. మాట మాట కలిసింది. కుశల ప్రశ్నలయ్యాయి. బడికెందుకు వెళ్లడం లేదన్న ప్రశ్న వచ్చింది. అంత సౌలభ్యం లేదన్న సమాధానంతోపాటు తప్పనిసరి పరిస్థితుల్లోనే... బతుకు కోసం ఆటో నడపాల్సి వస్తుందని ఆ కుర్రాడు తన బాధను వెళ్లబోసుకున్నాడు. ఈ మాటలు ఆమెలో ఆసక్తిని పెంచాయి. మెల్లిగా మాటలతో అతడి నేపథ్యం గురించి ఆరా తీశారు.మేడమ్ జీ.. అంటూ మొదలుపెట్టి తన గురించి మొత్తం చెప్పుకొచ్చాడతను. చదువుకోవాల్సిన వయసులో తల్లిని పోషించాల్సిన భారం ఆ కుర్రాడిపై పడింది. అందుకే బాడుగకు ఆటోను నడిపిస్తున్నట్లు చెప్పాడతను. రోజుకు రూ.వెయ్యి కిరాయి చెల్లిస్తేనే ఆటో నడుపుకోవచ్చునని, చెల్లించని రోజు లేదా తక్కువ మాత్రమే ఇవ్వగలిగిన రోజు ఆటో యజమాని నానా ఇబ్బందులు పెడుతున్నాడని ఆ కుర్రాడు వాపోయాడు. అతని పరిస్థితి గురించి తెలుసుకుని ఆమె చలించిపోయారు. సొంత ఆటో ఉంటే బాగుంటుంది కదా? అని అన్నారామె. నిజమే.. కానీ నాకెవరు ఇస్తారు మేడమ్ జీ?. అంత స్థోమతెక్కడిది నాకు? అన్నాడా కుర్రాడు. అదంతా నేను చూసుకుంటా.. నీ వివరాలివ్వు అన్న ఆ మేడమ్ జీ.. మరుసటి రోజు ఆ కుర్రాడికి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఆటో కొనుగోలుకు సంబంధించిన డౌన్పేమెంట్ రసీదును వాట్సప్లో అందుకున్న ఆ కుర్రాడి కళ్లల్లో కచ్చితంగా నాలుగు చుక్కల ఆనందభాష్పాలు రాలే ఉంటాయి. అందుకేనేమో.. కష్టాల ఊబి నుంచి తనను బయటకు లాగేసేందుకు విచ్చేసిన ఇంకో తల్లికి కృతజ్ఞతలు చెప్పాడు. తనతోపాటు జన్మనిచ్చిన తల్లితోనూ ఆ మేడమ్ చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పించాడు. ఆడియో మెసేజీ ద్వారా.. ఆ మేడమ్ జీని దేవుడే పంపించాడని మురిసిపోయారు. మళ్లీ సంగం వస్తే తప్పకుండా తమకు ఇంటికి భోజనానికి రావాలంటూ ఆహ్వానించారు. ఇంతకీ ఆ మేడమ్ ఎవరన్నదేనా మీ సందేహం. పేరు.. భారతి చంద్రశేఖర్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరిశ్ధోన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ సతీమణి. ఎస్సీఎస్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలువురి విద్య, ఆరోగ్య అవసరాలకు సాయం చేసిన భారతీ చంద్రశేఖర్ తాజాగా తనకెంతో తృప్తిని కలిగించిన ఈ అనుభవాన్ని ‘సాక్షి.కాం’తో పంచుకున్నారు. -
విఫలమైతే క్షమాపణలు: కుంభమేళా బ్లాగ్లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ:‘మహా కుంభమేళా(Maha Kumbh Mela) పరిపూర్ణమయ్యింది. ఏకత్వాన్ని చాటే ఈ మహాయజ్ఞం సుపంపన్నమయ్యింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా 140 కోట్ల దేశ ప్రజల ఆధ్యాత్మిక చింతనకు ఆలంబనగా నిలిచింది. ఇంతటి భారీ కార్యక్రమంలో తాము భక్తులకు సేవలు అందించడంలో విఫలమైతే క్షమాపణలు’ అని ప్రధాని మోదీ మహాకుంభ్ ముగిసిన సందర్భంగా తన బ్లాగ్లో రాశారు.ఐక్యతకు ప్రతీకమహాకుంభ్కు సంబంధించి మోదీ(PM Modi) ఈ బ్లాగ్లో పలు విషయాలు ప్రస్తావించారు. 2024, జనవరి 22న తాను అయోధ్యలోని రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేవుని భక్తితో కూడిన దేశభక్తి గురించి మాట్లాడానని బ్లాగ్ మొదట్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాకు దేవుళ్లు, దేవతలు తరలివచ్చారు. సాధువులు, మహాత్ములు, పిల్లలు, వృద్ధులు, మహిళలు, పురుషులా ఇలా అందరూ కలసివచ్చారు. కుంభమేళా నేపధ్యంలో దేశంలోని చైతన్యశక్తిని మనమంతా చూశాం. ఈ మహా కుంభమేళా ఐక్యతకు ప్రతీక. ఈ పండుగ 140 కోట్ల దేశవాసుల నమ్మకానికి ఆలంబనగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు.ఆశ్చర్యపోయిన ప్రపంచంగత 45 రోజులుగా ప్రతిరోజూ, దేశంలోని ప్రతి మూల నుండి లక్షలాది మంది సంగమతీరం వైపు ఎలా కదులుతున్నారో చూశాను. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తున్నప్పుడు ప్రతి భక్తునిలోనూ ఉత్సాహం శక్తి, విశ్వాసం తొణికిసలాడింది. ప్రయాగ్రాజ్(Prayagraj)లో జరిగిన ఈ మహా కుంభమేళా ఆధునిక యుగంలోని విధాన నిపుణులకు ఒక కొత్త అధ్యయన అంశంగా మారింది. యావత్ ప్రపంచంలో ఇంత పెద్ద ఉత్సవం ఎక్కడా జరగనే లేదు. దీనికి సమానమైన ఉదాహరణ మరొకటి లేదు. ఒకే నది ఒడ్డున, త్రివేణి సంగమం తీరంలో కోట్లాది మంది స్నానం చేయడాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ కోట్లాది మందికి అధికారిక ఆహ్వానం లేదు.. ముందస్తు సమాచారం కూడా లేదు. అయినా మహా కుంభమేళాకు తరలివచ్చారు. పవిత్ర సంగమంలో స్నానం చేసి గంగామాత ఆశీర్వాదాలు అందుకున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలను ఎప్పటికీ మరిచిపోలేను. సంతృప్తితో నిండిన ఆ భక్తుల ముఖాలే నిత్యం కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.కొత్త రికార్డులుమహా కుంభమేళాలో స్నానం చేసేందుకు ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నవారి సంఖ్య కొత్త రికార్డులను సృష్టించింది. కుంభమేళా నుండి తిరిగి వెళ్లినవారు వారితో పాటు ఈ పుణ్య జలాలను తమ ప్రాంతాలకు తీసుకువెళ్లి, లక్షలాది మంది చేత కుంభస్నానం చేయించారు. ఇది గత కొన్ని దశాబ్దాలలో ఇంతకు ముందెన్నడూ జరగని ఉదంతం. ప్రయాగ్రాజ్కు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అధికారులు మునుపటి కుంభమేళా అనుభవాల ఆధారంగా నూతన ప్రణాళికను రూపొందించారు. అమెరికా జనాభా(US population)కు దాదాపు రెట్టింపు జనాభా ఈ ఐక్యతా కుంభమేళాలో పాల్గొని స్నానాలు చేశారు.దేశంలోని ప్రతీ భక్తుడూ భాగస్వామిఈ మహా కుంభమేళా భారతదేశ జాతీయ చైతన్యాన్ని బలోపేతం చేసింది. 144 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మహా కుంభమేళా భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం అందించిన సందేశంగా నిలిచింది. దేశంలోని ప్రతి భక్తుడు ఈ మహా యాగంలో భాగస్వామి అయ్యాడు. భారతదేశం అందించిన ఈ మరపురాని దృశ్యం కోట్లాది మందిలో ఆధ్మాత్మికతను పెంపొందించింది. నాడు బాలుడి రూపంలో శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు తన నోటిలో విశ్వాన్ని చూపించాడు. అదేవిధంగా ఈ మహా కుంభ్ ప్రపంచానికి భారతీయులు అపార శక్తి రూపాన్ని చూపింది.ఉత్తరప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలుఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులభం కాదు. అయితే నేను గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థించాను. పూజలలో ఏదైనా లోపం ఉంటే, క్షమించమని కోరాను. భక్తులకు సేవ చేయడంలో విఫలమైతే, క్షమాపణలను కోరుతున్నాను. ఈ ఐక్యతా మహా కుంభమేళాలో కోట్లాది మందికి సేవ చేసే భాగ్యం భక్తి ద్వారానే సమకూరింది. పారిశుధ్య కార్మికులు, పోలీసులు, నావికులు, డ్రైవర్లు.. ప్రతి ఒక్కరూ ఈ మహా కుంభ్ను విజయవంతం చేయడానికి నిరంతరం సేవలు అందించారు. ప్రయాగ్రాజ్ ప్రజలు ఈ 45 రోజుల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులను ఆదరించారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహా కుంభమేళా దృశ్యాలను చూసినప్పుడు నా మనసులో మెదిలిన భావాలు మరింత బలపడ్డాయి. దేశ ఉజ్వల భవిష్యత్తుపై నా నమ్మకం అనేక రెట్లు పెరిగిందని ప్రధాని మోదీ ఈ బ్లాగ్లో రాశారు.ఇది కూడా చదవండి: శివరాత్రి వేళ.. ‘మౌని అమావాస్య’ బాధితులు ఏమన్నారంటే.. -
శివరాత్రి వేళ.. ‘మౌని అమావాస్య’ బాధితులు ఏమన్నారంటే..
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాశివరాత్రి వేడుకలతో మహాకుంభమేళా(Mahakumbh Mela) పరిసమాప్తమయ్యింది. శివరాత్రి రోజున ఆఖరి పవిత్ర స్నానాలు కావడంతో లెక్కలేనంతమంది భక్తులు తరలివచ్చారు. మహాకుంభమేళాలో మొత్తం 66 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కాగా మౌని అమావాస్య నాటి రద్దీని చూసి, ఆనాడు వెనుదిరిగిన బీహార్కు చెందిన ఒక కుటుంబం తిరిగి శివరాత్రి నాడు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు మహాకుంభమేళాకు వచ్చింది. వీరు మౌని అమావాస్య రోజున జరిగిన విషాదాన్ని మీడియాకు వివరించారు.బీహార్(Bihar)లోని బక్సర్లో ఉంటున్న ఆ కుటుంబ సభ్యులలో ఒకరైన మహిళ మీడియాతో మాట్లాడుతూ మౌని అమావాస్య రోజున మహాకుంభమేళాలో జనసమూహాన్ని చూసి, ఇక స్నానాలు చేయలేమని భావించి నిరాశగా ఇంటికి తిరుగుముఖం పట్టామన్నారు. ఇప్పుడు శివరాత్రి వేళ పుణ్యస్నానాలు ఆచరించేందుకు తిరిగి వచ్చామన్నారు. అదే కుంటుంబానికి చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ మౌని అమావాస్యనాడు విషాద ఘటన సంగమ్ నోస్ వద్ద జరగిందని అన్నారు. ఆ రోజున జనం ఎటువైపు వెళుతున్నామో తెలియనంతగా పరిగెట్టారన్నారు. దీనిని చూసిన మా అంటీ భయంతో రోదించసాగారని, దీంతో నేను ఆమెను ఇక్కడి నుంచి పంపించేందుకు ప్రయాగ్రాజ్ జంక్షన్ వరకూ దిగబెట్టానని అన్నారు.ఇదే కుటుంబానికి చెందిన మరో మహిళ మాట్లాడుతూ ఆరోజున తొక్కిసలాట(Stampede) ఎంతగా జరిగిందంటే ఒకరిమీదకు మరొకరు ఎక్కిపోయారన్నారు. అలాగే అందరూ ఒకవైపుగా తోసుకుంటూ పరిగెట్టారని, అక్కడి పరిస్థితి చూసి తామంతా భయపడిపోయామని, పుణ్య స్నానాలు చేయకుండానే వెనుదిరిగామన్నారు. ఆరోజు 25 మంది వరకూ మృతి చెందడాన్ని చూశానని, తనను ఆ గుంపు నుంచి పోలీసులు కాపాడారని, ఊపిరి ఆడని స్థితిలో తనకు ఆక్సిజన్ అందించారని ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండటంతో తాము ఎంతో సంతృప్తికరంగా పుణ్య స్నానాలు చేశామని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి -
మహా కుంభ్లో.. మన నగరం
హరహర మహాదేవ అంటూ హర్షధ్వనులతో గొంతెత్తిన కోట్లాది భక్తజనంలో మన భాగ్యనగరవాసులూ ఉన్నారు. గంగమ్మ తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడమ్మా అంటూ పుణ్యస్నానాలు ఆచరించిన జన సంద్రంలో భాగమై నగరమూ తడిసి ముద్దయి మురిసింది. తండోపతండాలుగా.. నగరం నుంచి కుంభ్కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్యతో కూడిన ఆధ్యాత్మిక యాత్రను ప్రణాళికాబద్దంగా డిజైన్ చేసుకుని కుటుంబ సమేతంగా వెళ్లి వచ్చారు. చాలా మంది వ్యక్తిగత వాహనాలు ఎంచుకోగా, ప్రయాణాల కారణంగా రైళ్లు, బస్సులతో పాటు విమానాల్లో సైతం టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక విమాన యానం ధరలు ఆకాశాన్ని తాకాయి. చివరి రోజైన బుధవారం విమానం టిక్కెట్ ధర రూ.40వేలకు పైగానే ఉండటం రద్దీకి నిదర్శనం.టాలీవుడ్ తెరవేల్పులు ఎందరో మన నగరం నుంచీ కుంభ్మేళాకు తరలివెళ్లారు. సినిమా సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే చిన్నితెర తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా భారీగానే వెళ్లి వచ్చారు. నగరంలో జరిగిన నుమాయిష్ కి లక్షల సంఖ్యలో సందర్శకులు తగ్గిపోవడానికి కుంభ్మేళా ఒక కారణమని నిర్వాహకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. మహా క్రతువు ముగిసిన వేళ.. నగరం నుంచి కుంభ్కి వెళ్లొచ్చిన పలువురు నగరవాసులు తమ జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు.ఈ అనుభూతి వేరు.. నాన్నగారి అస్తికల నిమజ్జనం కోసం తొలిసారి వెళ్లినప్పటి నుంచి అంటే దాదాపు 15ఏళ్లుగా, కాశీ, త్రివేణీ సంగమంతో నాకు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. మనసుకు తోచిన ప్రతీసారీ.. అక్కడకు వెళ్లివస్తుంటా. అయితే ఈ సారి ప్రయాగ్కు చేసిన ప్రయాణం చాలా ప్రత్యేకం. కోట్లాది మంది భక్తులతో కలిసి దైవ నామస్మరణ చేస్తూ పుణ్యస్నానాలు చేయడం.. అద్భుతమైన అనుభవం. నాతో పాటు నా స్నేహితుల్లోనూ ఆధ్యాతి్మకత మరింత పెరిగేలా చేసింది కుంభ్ మేళా. – చంగవల్లి శ్రీనివాస్, స్నేహితులు, దమ్మాయిగూడ ’అనిర్వచనీయం.. ఆ భావం.. మహాకుంభ్ సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి అరడజను మంది స్నేహితులతో కలిసి వ్యక్తిగత వాహనంలో వెళ్లాం. జనసమ్మర్ధం వల్ల, సమాచారం లోపం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. అయినప్పటికీ త్రివేణీ సంగమంలో స్నానాలతో అవన్నీ మరచిపోయాం. ఆ అనుభూతిని అనిర్వచనీయమైనదనే చెప్పాలి. వెళ్లే దారిలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎలా అనిపించినా, ప్రయాగ్రాజ్ నుంచి తిరిగివస్తున్నప్పుడు మాత్రం మళ్లీ రాలేం కదా అని మనసు భారమైంది. కాశీలో 9గంటలు వేచి దర్శనం చేసుకున్నా కూడా అలసట అనిపించలేదు. – ఆర్.అరుణ్కుమార్, ఎల్బీనగర్దేవదేవుని స్పర్శతో పులకించి.. నీళ్లను తాకినట్టుగా అనిపించలేదు. ఆ దేవదేవుడే స్పర్శించినట్టు శరీరం పులకించింది. నగరం నుంచి కాశీ అక్కడ నుంచి ప్రయాగ్రాజ్కు దాదాపు 23 గంటల పాటు ప్రయాణం. అక్కడకు చేరుకోగానే అంతవరకూ ఆవరించిన ప్రయాణ బడలికలన్నీ చేతితో తీసినట్టు మాయమైపోయాయి. నోస్ ఆఫ్ త్రివేణీ సంగమం అనే ప్రత్యేకమైన ప్రాంతంలో నాగసాధువులూ, అఘోరాలతో కలిసి స్నానాలు ఆచరించడం అసలు ఊహించని విశేషం. ఎక్కడ చూసినా భక్త జనసంద్రమే. అక్కడ ఉట్టిపడిన ఆధ్యాత్మికత నాలో నా ఆలోచనల్లో మార్పులు తెచ్చింది. వెళ్లకుండా ఉంటే ఎంత మిస్సయి ఉండేదానినో అనిపించింది. దైవభక్తి ఎక్కువే.. అయితే ఇంతగా తనువూ మనసూ ఆద్యంతం ఆధ్యాత్మికత ఆవరించడం మున్నెన్నడూ జరగలేదు. – అర్చన చిగుళ్లపల్లి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ -
ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి
ప్రయాగ్రాజ్: మొన్నటి జనవరి 13న ప్రారంభమమై, ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు యూపీలోని ప్రయాగ్రాజ్లో కొనసాగిన మహా కుంభమేళా(Maha Kumbh Mela) పరిసమాప్తమయ్యింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణీ సంగమంలో అద్భుమైన రీతిలో హారతినిచ్చారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. #WATCH | Uttar Pradesh | Evening 'aarti' was performed in Prayagraj on the occasion of Maha Shivratri pic.twitter.com/iFyMguK1Fs— ANI (@ANI) February 26, 2025మహాకుంభమేళా పూర్తయిన నేపధ్యంలో డీఎం రవీంద్రకుమార్ మందర్ మాట్లాడుతూ ‘మహా కుంభ్కు కేవలం మనదేశం నుంచే కాకుండా యావత్ ప్రపంచం నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు. ఇక్కడికి వచ్చినవారంతా మహాకుంభమేళా నియమనిబంధనలన్నింటినీ పాటించారు. వారందరికీ ధన్యవాదాలు. మహాకుంభమేళా పూర్తయిన తరుణంలో ఇక్కడికి వచ్చినవారు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం సంగమ ఘాట్లలో పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నాం. మహాశివరాత్రి(Mahashivratri) రోజున రాత్రి 8 గంటల వరకూ త్రివేణీ సంగమంలో 1.53 కోట్లమంది పవిత్రస్నానాలు చేశారు. కుంభమేళా జరిగిన 45 రోజుల్లో మొత్తం 66.30 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు’ అని తెలిపారు.మహాకుంభ్ ముగిసిన తరుణంలో నేడు(గురువారం) యూపీ సీఎం యోగి ప్రయాగ్రాజ్(Prayagraj)కు రానున్నారు. కుంభమేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుంభమేళా అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేయనున్నారు. అలాగే ఇక్కడి పారిశుద్ధ్య కార్మికులకు, ఆరోగ్య సేవలు అందించిన సిబ్బందికి, పడవ నడిపిన నావికులకు సన్మానం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.30కి సీఎం యోగి లక్నో చేరుకోనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రయాగరాజ్కు వచ్చి, కుంభమేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: మే 2 నుంచి కేదార్నాథ్ దర్శనం.. శివరాత్రి వేళ ప్రకటన -
ముగిసిన మహా కుంభమేళా
మహాకుంభ్నగర్: ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా రికార్డుకెక్కిన మహా కుంభమేళా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ముగిసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల ఘట్టానికి తెరపడింది. 144 సంవత్సరాల తర్వాత వచి్చన ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. 45 రోజులపాటు వైభవంగా సాగిన పుణ్యక్రతువులో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు బుధవారం భక్తుల పుణ్యస్నానాలతో గంగ, యమున, సరస్వతి నదుల సంగమస్థలి కిక్కిరిసిపోయింది. ఒక్కరోజే 1.32 కోట్ల మంది తరలివచ్చారు. హరహర మహాదేవ అనే మంత్రోచ్ఛారణలతో ఈ ప్రాంతమంతా మార్మోగిపోయింది. చివరి రోజు కావడంతో భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించారు. ఈ ఏడాది జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజు మహా కుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకూ 66.21 కోట్ల మందికిపైగా జనం స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఖ్య ప్రపంచంలోని చాలా దేశాల ఉమ్మడి జనాభా కంటే అధికం కావడం గమనార్హం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నటులు మహా కుంభమేళాలో పాలుపంచుకున్నారు. భూటాన్ రాజు సైతం పుణ్నస్నానం ఆచరించారు. మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించింది. డ్రోన్లు, కృత్రిమ మేధ కెమెరాలను రంగంలోకి దించింది. మహాకుంభ్నగర్లో ప్రత్యేకంగా టెంట్ సిటీని నిర్మించింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. -
మహాకుంభ్లో పుణ్య స్నానం ఆచరించిన టీమిండియా మాజీ బౌలర్ అశోక్ దిండా
-
Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు
కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాలు సాధువుల ఆశీస్సులతో ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా(Kumbh Mela) చివరి దశకు చేరుకుంది.మహాశివరాత్రి వేళ పవిత్ర స్నానం ఆచరించడానికి మహా కుంభమేళాకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. మహా కుంభమేళాలో ఐక్యత, సామాజిక సామరస్యాల అద్భుతమైన సంగమం కనిపిస్తోంది.మహాశివరాత్రి(Mahashivratri) నాడు మహా కుంభమేళాలో భక్లులు స్నానాలు చేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. సంగమం వద్ద జనం గుమిగూడకుండా సమీపంలోని ఘాట్లలో పవిత్ర స్నానం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 64 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాను సందర్శించారు. మహాశివరాత్రి నాడు ఈ సంఖ్య మరింత పెరగనుంది. మహాశివరాత్రికి ముందు రోజు సాయంత్రం నుంచే ఘాట్ల వద్దకు భక్తజనం చేరుకున్నారు.మహా శివరాత్రి రోజున మహా కుంభమేళాకు చేరుకున్న ప్రతి ఒక్కరూ గంగానదిలో స్నానం చేస్తున్నారు. అనంతరం గంగా మాతను పూజిస్తున్నారు.మహా కుంభ ప్రాంతంలో యాత్రికుల రాక రాత్రింబవళ్లు కొనసాగుతోంది. సంగమ స్థలిలో పూజా సామగ్రి విరివిగా విక్రయిస్తున్నారు. భద్రతా సిబ్బంది భక్తుల రద్దీని నియంత్రించడంలో బిజీగా ఉన్నారు.మహా కుంభమేళా సంప్రదాయాలు మహా శివరాత్రి పూజతో పూర్తవుతాయి. మహాశివరాత్రి సందర్భంగా సూర్యోదయానికి ముందే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం ప్రారంభించారు.మహాశివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో స్నానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోటి మందికి పైగా భక్తులు మహాకుంభ నగరంలో ఉన్నారు.భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున అధికార యంత్రాంగం పలు ఏర్పాట్లు పూర్తి చేసింది. జనసమూహాన్ని నియంత్రించేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.మహా కుంభమేళాలో భద్రతా ఏర్పాట్ల కోసం 37,000 మంది పోలీసులను మోహరించారు. అలాగే 14,000 మంది హోమ్ గార్డులను నియమించారు.భక్తుల భద్రత కోసం 2,750 ఏఐ ఆధారిత సీసీటీవీలు, మూడు వాటర్ పోలీస్ స్టేషన్లు, 18 వాటర్ పోలీస్ కంట్రోల్ రూములు, 50 వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు.చివరి స్నానానికి భక్తుల రద్దీ(Crowd of devotees) ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నందున, మంగళవారం సాయంత్రం నాటికే కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. మహాశివరాత్రి నాడు సజావుగా పుణ్య స్నానాలు జరిగేలా చూసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: ఉప్పొంగుతున్న ఉత్సాహం.. శివభక్తుల పారవశ్యం -
Mahakumbh: ఉప్పొంగుతున్న ఉత్సాహం.. శివభక్తుల పారవశ్యం
నేడు (బుధవారం) మహాశివరాత్రి(Mahashivratri).. మహా కుంభమేళాకు చివరి రోజు.. సంగమ తీరంలో భక్తులు సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. మహా కుంభమేళాకు వచ్చిన భక్తుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. చివరి స్నాన ఉత్సవం వేళ భారీ సంఖ్యలో జనం ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. మహా కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని అధికారులు భారీగా సన్నాహాలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని ఇప్పటికే వాహన రహిత జోన్గా ప్రకటించారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే రహదారులపై భారీగా జనసమూహం కనిపిస్తోంది. #WATCH | Prayagraj: "I cannot express my sentiments in words... We came here with a lot of excitement... We came here because it is the last day of the #MahaKumbh2025. We are fortunate to have the blessings of Maa Ganga...," says a devotee at the Maha Kumbh pic.twitter.com/UtkHStrcMc— ANI (@ANI) February 26, 2025మహాకుంభమేళా(Mahakumbh Mela)లో పుణ్యస్నానాలు ఆచరించేవారి సంఖ్య మొత్తంగా 67 కోట్లకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్యలలో, మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రయాగ్రాజ్కు వచ్చే జనం అటు వారణాసి, ఇటు అయోధ్యలను సందర్శిస్తున్నారు.#WATCH प्रयागराज: महाशिवरात्रि के अवसर पर श्रद्धालु पावन स्नान के लिए महाकुंभ में पहुंच रहे हैं। ड्रोन वीडियो त्रिवेणी संगम से है। #MahaKumbh2025 pic.twitter.com/h6DwRka6IS— ANI_HindiNews (@AHindinews) February 26, 2025మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ్లో స్నానం చేయడానికి వచ్చే సాధువులు, భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం ప్రజలంతా సమాజ సంక్షేమానికి కట్టుబడి ఉండేందుకు ప్రేరణ కల్పిస్తుందని ఆయన అన్నారు.#WATCH | Uttar Pradesh: Devotees continue to arrive in large numbers at Triveni Sangam in Prayagraj to be a part of #MahaKumbh2025 on its last day. The Mela will conclude today, 26th February, on Maha Shivratri. pic.twitter.com/sTAs4XF2kD— ANI (@ANI) February 25, 2025మహా కుంభమేళాకు వచ్చిన ఒక భక్తురాలు మాట్లాడుతూ ‘నా భావాలను మాటల్లో వ్యక్తపరచలేను.మేము ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాం.. ఇది 2025 మహా కుంభమేళాలో చివరి రోజు.. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. గంగా మాత ఆశీస్సులు అందుకోవడం మా అదృష్టం’ అని అన్నారు.#WATCH वाराणसी: महाशिवरात्रि के अवसर पर पूजा करने के लिए काशी विश्वनाथ मंदिर में भक्तों की भीड़ उमड़ रही है। pic.twitter.com/R7GOmiWHTA— ANI_HindiNews (@AHindinews) February 26, 2025మహాశివరాత్రికి ముందే ప్రయాగ్రాజ్ మహాకుంభానికి చేరుకున్న భక్తుల సంఖ్య 65 కోట్లు దాటింది. మహాశివరాత్రి నాడు భక్తుల పవిత్ర స్నానాలు సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) స్థానిక అధికారులతో నిరంతరం టచ్లో ఉంటున్నారు. మరోవైపు ఈరోజు భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఘాట్లలో భక్తులు పవిత్ర స్నానాలను క్రమశిక్షణతో చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో నేటి శివరాత్రితో ముగియనుంది. VIDEO | Devotees in large numbers head towards Triveni Sangam to take holy dip on the occasion of Maha Shivratri. #Mahashivratri2025 #MahaKumbh2025 pic.twitter.com/teaCWZWh7x— Press Trust of India (@PTI_News) February 25, 2025ఇది కూడా చదవండి: Maha Kumbh: ఆఖరిరోజు పుణ్య స్నానాలకు ఎంత మంది అంటే.. VIDEO | Devotees in large numbers head towards Triveni Sangam to take holy dip on the occasion of Maha Shivratri. #Mahashivratri2025 #MahaKumbh2025 pic.twitter.com/teaCWZWh7x— Press Trust of India (@PTI_News) February 25, 2025 -
Maha Kumbh: ఆఖరిరోజు పుణ్య స్నానాలకు ఎంత మంది అంటే..
ప్రయాగ్రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా పేరొందిన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది. మహా కుంభమేళా చివరి అమృత స్నానంలో కోటి మందికి పైగా భక్తులు పాల్గొంటారని స్థానిక అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసింది.జనవరి 13న మహా కుంభమేళా(Maha Kumbh) ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకు దాదాపు 64 కోట్ల మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. రైళ్లు, విమానాలు, రోడ్డు మార్గాలలో కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. శివరాత్రి( Mahashivratri) సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు నగరంలోనికి ఎటువంటి వాహనాలను అనుమతించరు. అయితే వాటి పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు.ప్రయాగ్రాజ్కు వెళ్లే అన్ని ప్రధాన రహదారులలో మోటార్బైక్లపై 40 పోలీసు బృందాలను మోహరించారు. కుంభమేళా చివరి రోజు మహాశివరాత్రి ఒకరోజు అయినందున ప్రయాగ్రాజ్లోని శివాలయాలను సందర్శించేందుకు భక్తులకు అనుమతినివ్వనున్నారు. ఆయా శివాలయాలలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇప్పుటికే అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు. కాగా మహా కుంభమేళా ప్రారంభంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP Chief Minister Yogi Adityanath) ఈ కార్యక్రమానికి 45 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఈ సంఖ్య ఫిబ్రవరి 11 నాటికే నమోదయ్యింది. తరువాతి మూడు రోజుల్లో ఆ సంఖ్య 50 కోట్లు దాటింది. తాజాగా.. 60 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని ప్రభుత్వం ప్రకటించింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం వలన జీవన్మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’ -
Mahakumbh: మహా శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో కొనసాగుతున్న మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 26న కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు జరగనున్నాయి. ఆరోజు మహాశివరాత్రి కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు భక్తుల రద్దీని నియంత్రించేందుకు, వారికి గట్టి భద్రత కల్పించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.మహాకుంభమేళాలో ఇప్పటివరకూ 63 కోట్ల మందికిపైగా జనం పుణ్యస్నానాలు ఆచరించారని గణాంకాలు చెబుతున్నాయి. మహాకుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. శివరాత్రి(Shivaratri) రోజున త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాలని చాలామంది భక్తులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపధ్యంలో జిల్లా యంత్రాంగం పలు ఏర్పాట్లు చేస్తోంది.మహాశివరాత్రి పుణ్య స్నానాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు డీఎం రవీంద్ర కుమార్ మందర్ తెలిపారు. ఈ రోజు(మంగళవారం) మహా కుంభమేళాలో 44వ రోజు. ఇప్పటివరకు 63 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు చేశారు. చివరి మహా కుంభ స్నానం ఫిబ్రవరి 26న జరగనుంది. సగటున ప్రతిరోజూ కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో భారీగా ట్రాఫిక్ జామ్(Traffic jam) నెలకొంది. దానిని క్లియర్ చేసేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు.ప్రత్యేక రోజుల్లో..పుష్య పూర్ణిమ రూ. 1.70 కోట్ల మంది పవిత్ర స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు 3.50 కోట్ల మంది, మౌని అమావాస్య నాడు 7.64 కోట్ల మంది, వసంత పంచమి నాడు 2.57 కోట్ల మంది, మాఘ పౌర్ణమి వేళ రెండు కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించారు.ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్కు 10 లక్షలమంది భారతీయులు -
Mahakumbh: ప్రధాని బాటలో సీఎం.. పారిశుద్ధ్య కార్యికుల కాళ్లు కడిగి..
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా(Kumbh Mela)కు భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఇప్పటివరకూ అంటే ఫిబ్రవరి 23 వరకూ మొత్తం 62 కోట్లకుపైగా జనం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజల మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలోనే గత నెలన్నర రోజులుగా కుంభమేళా ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న సిబ్బందిని సీఎం సత్కరించనున్నారు.కుంభమేళా ప్రాంతంలో పరిశుభ్రతా కార్యక్రమాలు(Sanitation) నిర్వహిస్తున్న సిబ్బంది సేవలను సీఎం కొనియాడారు. అలానే వారిని సన్మానించనున్నామని తెలిపారు. ఆయన త్రివేణీ సంగమ ప్రాంతంలో తిరుగాడుతూ స్వయంగా అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మహాకుంభమేళా ముగిసేందుకు ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలివుంది. మహాశిరాత్రి రోజున భక్తులు కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు చేయనున్నారు. గడచిన నాలుగు రోజులుగా కుంభమేళా ప్రాంతానికి వస్తున్న సీఎం అక్కడి సాధువులను, అధికారులను కలుసుకుంటున్నారు. కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు పూర్తియిన మర్నాడు అంటే ఫిబ్రవరి 27న సీఎం యోగి మరోమారు ప్రయాగ్రాజ్ రానున్నారు. ఆరోజున ఆయన కుంభమేళాకు తరలివచ్చిన భక్తులకు సేవలు అందించిన వారిని సన్మానించనున్నారు. ముఖ్యంగా పారిశుధ్య కార్మికులను, పడవలు నడిపినవారిని సీఎం సత్కరించనున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు(sanitation workers) సమాజంలో తగిన గౌరవ కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో ప్రధాని మోదీ వారణాసిలో పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగి, సమాజంలో వారి స్థానాన్ని గుర్తుచేశారు.ఇది కూడా చదవండి: విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే.. -
దయచేసి ప్రయాగ్రాజ్ రావొద్దు.. నెట్టింట పోస్టులు
ప్రయాగ్రాజ్: మహా కుంభమేళా ముగింపు వేళ ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్రాజ్ సంగమం వద్ద భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహా శివరాత్రి పర్వదినాన పుణ్య స్నానాల కోసం ఇంకా కోట్ల మంది ఆధ్యాత్మిక నగరం(Devotional City Prayagraj) వైపు అడుగులేస్తున్నారు. ఈ తరుణంలో నగరవాసుల ప్రజల తరఫున ఓ విజ్ఞప్తి.. అక్కడ నెలకొన్న అధ్వాన్న పరిస్థితులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.‘‘మీకు దణ్ణం పెడతాం.. దయ చేసి ప్రయాగ్రాజ్ రావొద్దూ..’’ అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పోటెత్తుతున్న భక్తజనంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, అలాగే నగర సందర్శన పేరిట కొందరు ఇప్పటికే ఇక్కడి పరిస్థితిని అధ్వాన్నంగా మార్చేశారని వాపోతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.‘నేను ఎక్కడినుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ప్రయాగ్రాజ్ పూర్తిగా విధ్వంసకర దశకు చేరుకుంది. గత సంవత్సరమేమో కుంభమేళా ఏర్పాట్లకు సరిపోయింది. ఇక్కడి రోడ్లన్నీ తవ్వేశారు. ఫ్లై ఓవర్లు వేశారు. అయితే ప్రస్తుతం మహాకుంభమేళా చివరి అమృత స్నానం కూడా ముగిసింది. అయినా జనం తగ్గకుండా రోజురోజుకు పెరుగుతున్నారు ఎందుకో తెలియడం లేదు. ఇక్కడికి రావడం ఇక ఆపండి. భారీ జనసందోహాన్ని భరించే శక్తి ప్రయాగ్రాజ్(Pyagraj)కు ఎంత మాత్రం లేదు. నగరంలోని చిన్న చిన్న సందులు కూడా ట్రాఫిక్తో నిండిపోయాయి. జనాలకు సివిక్ సెన్స్ లేకుండా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ ఉమ్మేస్తున్నారు. మలమూత్ర విసర్జన చేస్తున్నారు’ అని మండిపడ్డాడు.మహా కుంభమేళా నేపథ్యంలో ఆధునీకరణ పేరిట వేల కోట్ల రూపాయలు కేటాయించింది యూపీ ప్రభుత్వం. కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లతో పాటు రకరకాల హంగుల నగరాన్ని ముస్తాబు చేసింది. అంతేకాకుండా.. భారీగా జనం వస్తారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టింది. అయితే.. మహా కుంభమేళా(Maha Kumbh Mela) ఆరంభం అయ్యాక ఆ పరిస్థితి దారుణంగా మారింది.అందంగా అలంకరించిన నగరాన్ని.. భక్తుల్లో కొందరు అధ్వాన్నంగా తయారు చేశారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. పాదాచారులు ఎక్కడపడితే అక్కడ చెత్తపడేయడం, మూత్రమలవిసర్జన చేసేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగినా ఆ పరిస్థితి మార్పు రాలేదని చెబుతున్నారు. మరోవైపు.. దారులన్నీ జనం, వాహనాలతో నిండిపోయాయి. ఆఖరికి.. ఇరుకు సందులను కూడా వదలకుండా ట్రాఫిక్తో నింపేస్తున్నారు.ఇక.. ప్రైవేట్ వాహనాల దోపిడీ దందా, రోడ్లపై ఇష్టానుసారం సంచరించం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంటున్నారు మరికొందరు. కుంభమేళా ముగుస్తుందనగా.. రద్దీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎందుకు?. గంగానదీ.. త్రివేణి సంగమం ఎక్కడికి పోదు కదా.. తీరికగా వచ్చి పుణ్యస్నానాలు చేసుకోవచ్చు కదా అంటూ కొందరు.. ఇంకోసారి ప్రయాగ్రాజ్ వైపు రావొద్దంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. -
Mahakumbh: జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా..
మహాకుంభమేళా.. ప్రపంచం యావత్తూ తరలివచ్చి, కనులారా వీక్షిస్తున్న మహాద్భుత ఉత్సవం. ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా శివరాత్రి పర్వదినం అంటే ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమం వేదికగా ఈ మహోత్సవం జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు దేశవిదేశాల నుంచి తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ కుంభమేళా భారత్కు పలు కొత్త రికార్డులను కూడా అందించింది. మహాకుంభమేళా ముగుస్తున్న తరుణంలో ఈ ఉత్సవంలో మహోన్నతంగా నిలిచిన కొన్ని అంశాలివే..విదేశీయుల భాగస్వామ్యంమహాకుంభమేళా(Mahakumbh Mela)కు భారీగా జనం తరలివచ్చారు. 183 దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకూ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించినవారి సంఖ్య 60 కోట్లను దాటింది. ఒక్క మౌని అమావాస్య నాడు ఏకంగా 10 కోట్లకుపైగా భక్తులు పవిత్ర స్నానం చేయడం విశేషం.ఆధునిక సాంకేతికతమహాకుంభమేళా డిజిటల్ మహా కుంభ్(Digital Maha Kumbh) దిశగా సాగింది. ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా ఈ ఉత్సవం నిలిచింది. మహాకుంభమేళాలో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిజిటల్ మోనిటరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఏఐ, వీఆర్, ఏఆర్, లిడార్, ఎల్ఈడీ డిస్ప్లే, హోలోగ్రామ్ల వంటి అత్యాధునిక సాంకేతికతలు వినియోగించారు. భక్తులకు కట్టుదిట్టమైన భద్రతను అందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగించారు.ఆకాశంలో అరుదైన దృశ్యంమహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఆ రోజున మహాశివరాత్రి(Mahashivratri) పర్వదినం కావడం విశేషం. ఆనాడు కుంభమేళాలో చివరి రాజ స్నానం ఆచరిస్తారు. మహా కుంభమేళా ముగింపు రోజున ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించనుంది. సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు ఒకేసారి కనిపించనున్నాయి. మహా కుంభమేళా ముగింపు రోజున బుధుడు, శుక్రుడు, శని, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్ మొదలైన ఏడు గ్రహాలు సూర్యునికి ఒక వైపున ఒకే వరుసలో కనిపించనున్నాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సౌర వ్యవస్థలో ఇటువంటి అరుదైన దృశ్యం అత్యంత అరుదుగా కనిపిస్తుంది.ఆర్థిక భాగస్వామ్యంఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళాను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా ముందుకు సాగింది. యూపీ సర్కారు కుంభమేళా బడ్జెట్కు రూ. 6,382 కోట్లు కేటాయించింది. దీనిలో రూ. 5,600 కోట్లు ఈవెంట్ల నిర్వహణ , మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెచ్చించింది. మహాకుంభమేళా పూర్తయ్యేనాటికి యూపీ ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందనే అంచనాలున్నాయి. మహా కుంభమేళా కారణంగా స్థానికంగా ఉన్న చిన్న, పెద్ద వ్యాపారులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే.. -
Mahakumbh: భారత్-బంగ్లా ఉద్రిక్తతలకు ఉపశమనం
ప్రయాగ్రాజ్: గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మహాకుంభమేళా నేపధ్యంలో తగ్గుముఖం పట్టాయి. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన దరిమిలా ఆ దేశంలో అశాంతి చెలరేగింది. ఈ నేపథ్యంలో మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయి. ఈ ఘటనల నేపధ్యంలో భారత్- బంగ్లాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా ఈ ఉద్రిక్తతలకు పరిష్కార మార్గంగా మారింది.బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం మహాకుంభ్లో ప్రదర్శన ఇచ్చేందుకు బంగ్లాదేశ్ కళాకారుల బృందానికి ఆర్థికసాయం అందించింది. గంగా వేదికపై జరిగిన 10వ ఇండియా ఇంటర్నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్లో బంగ్లాదేశ్కు చెందిన ఆరుగురు సభ్యుల నృత్య బృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) సంయుక్తంగా నిర్వహించాయి. బంగ్లాదేశ్ కొంతకాలంగా భారతదేశంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూవస్తోంది.అంతర్జాతీయ కోల్కతా పుస్తక ప్రదర్శన, 30వ కోల్కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదలైనవాటిలో బంగ్లాదేశ్ భాగస్వామ్యం వహించలేదు. అంతకుముందు ఈ కార్యక్రమాలలో బంగ్లాదేశ్ పాల్గొంటూ వచ్చింది. తాజాగా కుంభమేళాలో ప్రదర్శన నిర్వహించిన బంగ్లాదేశ్ కళాకారుల బృందానికి ఢాకా విశ్వవిద్యాలయ నృత్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాచెల్ ప్రియాంక పెర్సిస్ నాయకత్వం వహించారు. ఫిబ్రవరి 22,23లలో మహా కుంభ్లో రెండు రోజుల పాటు బంగ్లాదేశ్ కళాకారుల బృందం నృత్యప్రదర్శనలు నిర్వహించింది. ఈ నృత్య బృందం త్వరలో గుజరాత్, జమ్ముకశ్మీర్, జార్ఖండ్, బీహార్, అస్సాం, మేఘాలయలలో ప్రదర్శనలు ఇవ్వనుంది. ఈ నెలాఖరులో ఢిల్లీలో బంగ్లాదేశ్ కళాకారులు ప్రదర్శన నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే.. -
Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే..
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ముగింపుదశకు చేరింది. మహాశివరాత్రి(ఫిబ్రవరి 26)తో ఈ మహోత్సవం ముగియనుంది. ఈ నేపధ్యంలో త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శివరాత్రి రోజున మహాకుంభమేళాలో చివరి పవిత్ర స్నానాలు జరగనుండటంతో అధికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.మహాశివరాత్రి(Mahashivratri) రోజున ఇక్కడికి తరలివస్తున్న భక్తులందరికీ పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించే దిశగా అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా భక్తులు తరలివస్తున్న నేపధ్యంలో ప్రయాగ్రాజ్కు చేరే అన్నిమార్గాల్లో ట్రాఫిక్జామ్ నెలకొంటోంది. దీనిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనం పెద్ద సంఖ్యలో రైళ్లలో ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు.మహా కుంభమేళా(Mahakumbh) దృష్ట్యా ప్రతిరోజూ 80 నుండి 100 రైళ్లను రైల్వేశాఖ ప్రయాగ్రాజ్ మీదుగా నడుపుతోంది. ఇప్పుడు మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని, ఫిబ్రవరి 26న 200 కి పైగా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లలో 18 నుండి 20 కోచ్లు ఉంటాయి. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా 50 కి పైగా సాధారణ రైళ్లను రద్దు చేశారు. మహా కుంభమేళా సమయంలో భక్తుల కోసం 14 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి.శనివారం (ఫిబ్రవరి 22) వరకు 60 కోట్లకు పైగా భక్తులు మహా కుంభ స్నానం చేశారని డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని మహాకుంభమేళా ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారని, సంగమ ప్రాంతానికి వచ్చే భక్తులు సురక్షితంగా స్నానం చేసి, వారి గమ్యస్థానానికి చేరుకునేలా పర్యవేక్షించేందుకు పలువురు అధికారులు ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్లులు ప్రయాగ్రాజ్కు ఏ మార్గం నుండి వచ్చినా, దానికి సమీపంలోని పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారని వైభవ్ కృష్ణ తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh: వామ్మో.. ఈ రైళ్లు ఇంతలేటా.. ఇక కుంభమేళాకు వెళ్లినట్లే! -
Mahakumbh: వామ్మో.. ఈ రైళ్లు ఇంతలేటా.. ఇక కుంభమేళాకు వెళ్లినట్లే!
యూపీలో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela) మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దీంతో బీహార్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లాలనుకుంటున్న భక్తులు పలు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పట్నా జంక్షన్తోపాటు బీహార్లోని పలు రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్లలోకి ఎలాగైనా ఎక్కాలని పలువురు ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిని నిలువరించడం రైల్వే పోలీసులకు కష్టంగా మారింది. కాగా ప్రయాగ్రాజ్కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే ఈ రైళ్లు ఊహకందనంత లేటుగా నడుస్తున్నాయి.బీహార్(Bihar)లోని పట్నా మీదుగా 10 రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ చాలా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాగ్రాజ్ నుంచి పట్నా వచ్చే ప్రత్యేక రైలు (23320) ఏకంగా 37 గంటలు లేటుగా గమ్యస్థానానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 12:30కు ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరిన ఈ రైలు శనివారం రాత్రి 10:18కి పట్నా జంక్షన్ చేరుకుంది. ఇదేవిధంగా సిక్కిం ఎక్స్ప్రెస్ కూడా శనివారం 20 గంటలు లేటుగా పట్నా చేరుకుంది. అనన్సోల్ మహాకుంభ్ రైలు 9 గంటలు ఆలస్యంగా నడిచింది. కామాఖ్య నుంచి బయలుదేరిన కుంభమేళా స్పెషల్ రైలు నాలుగు గంటలు లేటుగా గమ్యస్ణానానికి చేరుకుంది. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్కు ప్రధాని మోదీ.. క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన -
Mahakumbh: వెలుపల లక్ష వాహనాలు.. 60 కోట్లు దాటిన పుణ్యస్నానాలు
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు ఆఖరి ఆదివారం. దీంతో సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లెక్కకుమించిన రీతిలో భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ వెలుపల ఎంట్రీపాయింట్(Entry point)ల వద్ద లక్షకుపైగా వాహనాలు నిలిచివున్నట్లు సమాచారం.శనివారం సాయంత్రం నుంచే కుంభమేళా ప్రాంతంలో అత్యంత రద్దీ నెలకొంది. ట్రాఫిక్ను నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనికితోడు రాబోయే మహాశివరాత్రికి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న దృష్ట్యా స్థానిక అధికారులు ముందస్తు ఏర్పాట్లుపై దృష్టి సారించారు. ప్రయాగ్రాజ్లోని ఏడు ఎంట్రీపాయింట్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం సంగమం మెయిన్ ఎంట్రీ పాయింట్లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ సేతు(Dr. Shyama Prasad Sethu) చౌరస్తా వద్ద ఐదు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో రీవా పరిధిలోని చాక్ఘాట్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్లోని ఏడు ఎంట్రీపాయింట్లను మూసివేయడంతో భక్తులు ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం నడిచి సంగమస్థలికి చేరుకుంటున్నారు. శనివారం నాటికి కుంభమేళాలో పవిత్రస్నానాలు చేసినవారి సంఖ్య 60 కోట్లు దాటింది. మహాకుంభమేళాకు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాకు 45 కోట్లమంది వస్తారని అంచనా వేశారు. అయితే ఆ అంచనా ఇప్పటికే దాటిపోయింది. 73 దేశాల ప్రతినిధులు ప్రయాగ్రాజ్కు తరలివచ్చి పుణ్యస్నానాలు చేయడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా చదవండి: Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు -
Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా(Mahakumbh) అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఫిబ్రవరి 26(శివరాత్రి)తో కుంభమేళా ముగియనుంది. ఈ నేపధ్యంలో భక్తులు త్రివేణీ సంగమానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో ఎటువంటి తొక్కిసలాట ఘటనలు లాంటివి చోటుచేసుకుండా ఉండేందుకు యూపీ సీఎం స్వయంగా కుంభమేళాను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన అరుదైన రికార్డును కూడా నెలకొల్పారు.జనవరిలో కుంభమేళా ప్రారంభం కావడానికి ముందు నుంచి ఫిబ్రవరి 22 వరకు గడచిన 45 రోజుల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) 12 సార్లు కుంభమేళాను సందర్శించారు. దీంతో అత్యధికంగా కుంభమేళాను సందర్శించిన సీఎంగా చరిత్ర సృష్టించారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి మహా కుంభమేళా 1954లో జనవరి 14 నుండి మార్చి 3 వరకు జరిగింది. ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ రెండుమూడు సార్లు సంగమ స్థలికి వచ్చి పరిస్థితులను పర్యవేక్షించారు. ఆ తరువాత మరే ముఖ్యమంత్రీ కుంభమేళాను పదేపదే సందర్శించలేదు.సీఎం యోగి కుంభమేళా సందర్శనలుజనవరి 09: 13 అఖాడాలు, దండిబారా, ఖాక్ చౌక్ మహాసభల శిబిరాలను సీఎం యోగి సందర్శించారు. డిజిటల్ మీడియా సెంటర్ను ప్రారంభించారు.జనవరి 10: ప్రసార భారతి ఛానల్ కుంభవాణిని ప్రారంభించి, రవాణా సంస్థ బస్సులకు పచ్చజెండా ఊపారు.జనవరి 19: పూజ్య శంకరాచార్య తదితర సాధువులతో సమావేశమయ్యారు. పోలీసు గ్యాలరీ, రాజ్యాంగ గ్యాలరీ, పర్యాటక గ్యాలరీలను ప్రారంభించారు.జనవరి 22: మంత్రివర్గంతో పవిత్ర సంగమ స్నానం చేశారు.జనవరి 25: గురు గోరక్షనాథ్ అఖారాలో, విశ్వ హిందూ పరిషత్(Vishwa Hindu Parishad) సమావేశంలో పన్నెండు శాఖల యోగి మహాసభలో అవధూత వేషధారణలో కనిపించారు.జనవరి 27: హోంమంత్రి అమిత్ షాను స్వాగతించారు. త్రివేణి సంగమంలో పూజలు చేశారు.ఫిబ్రవరి 01: భారత్ సేవాశ్రమ శిబిరాన్ని సందర్శించారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రపంచంలోని 73 దేశాల దౌత్యవేత్తలతో సంభాషించారు.ఫిబ్రవరి 04: బౌద్ధ మహా కుంభ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూటాన్ రాజుకు స్వాగతం పలికారు.ఫిబ్రవరి 05: ప్రధాని మోదీకి స్వాగతం పలికి, త్రివేణి సంగమంలో పూజలు చేశారు.ఫిబ్రవరి 10: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు.ఫిబ్రవరి 16: ప్రదీప్ మిశ్రా కథాశ్రవణం, ప్రభు ప్రేమి సంఘ్ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఫిబ్రవరి 22: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు స్వాగతం పలికారు. మహాశివరాత్రి సన్నాహాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (ఆదివారం) మరోమారు మహాకుంభ్ నగర్ కు రానున్నారు. గత అక్టోబర్లో మహా కుంభ్ లోగో విడుదలైన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్రాజ్ రావడం ఇది 18వ సారి అవుతుంది.ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ.. -
Mahakumbh: 75 జైళ్లలో ఖైదీల పవిత్ర స్నానాలు
లక్నో: యూపీలోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు పవిత్ర సంగమస్థలిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తాజాగా యూపీలోని 75 జైళ్లలో గల ఖైదీలు కూడా త్రివేణీ సంగమంలోని నీటితో పవిత్ర స్నానాలు చేశారు. యూపీ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాగ్రాజ్ నుంచి పవిత్ర జలాలను రాష్ట్రంలోని 75 జైళ్లకు తీసుకువచ్చారు. జైళశాఖ మంత్రి దారా సింగ్ నేతృత్వంలో ఖైదీల పుణ్యస్నానాల కార్యక్రమం సాగింది. లక్నో(Lucknow)లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ‘ప్రపంచంలోని ప్రజలంతా కుంభమేళాలో స్నానాలు చేయాలని ఉత్సాహం చూపిస్తుంటే, ఇక్కడి ఖైదీలకు ఎందుకు ఆ అవకాశం కల్పించకూడదని అనిపించింది. అందుకే ఖైదీలకు కూడా పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించాలని అనుకున్నాం’ అని అన్నారు. జైలు అధికారులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 75 జైళ్లలో మొత్తం 90 వేల మంది ఖైదీలున్నారన్నారు. జైళ్ల డైరెక్టర్ జనరల్(డీజీ) పీవీ రామశాస్త్రి మాట్లాడుతూ పవిత్ర సంగమం నుంచి తీసుకువచ్చిన జలాలను అన్ని జైళ్లకు పంపించామని, ఆ నీటిని స్నానాలకు ఉపయోగించే నీటిలో కలిపి, తరువాత డ్రమ్ములలో నింపారన్నారు. ఆ తరువాత ఖైదీలంతా ప్రార్థనలు చేసి, పుణ్యస్నానాలు చేశారన్నారు. ప్రయాగ్రాజ్ నుంచి తెచ్చిన అమృత కలశంతో పూజలు చేసిన తర్వాత ఖైదీలు పుణ్యస్నానాలు ఆచరించారని బాగ్పట్ జిల్లా(Baghpat District) జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఖైదీలు గంగామాతను కొనియాడుతూ ఎంతో ఉత్సాహంగా స్నానాలు చేశారని, ఈ అవకాశం కల్పించిన జిల్లా జైలు యంత్రాంగానికి ఖైదీలు కృతజ్ఞతలు తెలిపారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Sambhal: లౌడ్ స్పీకర్ బ్యాన్ చేశారని.. -
Mahakumb: నేడు, రేపు జనప్రవాహం.. పర్యవేక్షణలో సీఎం యోగి
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో జనవరి 13 నుంచి ప్రారంభమైన మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. భక్తులు తండోపతండాలుగా త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో సంగమతీరం నిత్యం భక్తుల రద్దీతో ఉంటోంది. ఫిబ్రవరి 26తో కుంభమేళా ముగుస్తున్న తరుణంలో ఈ శనివారం, ఆదివారం (ఫిబ్రవరి 22, 23) రోజుల్లో భక్తులు మరింతగా పోటెత్తే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.కుంభమేళా చివరిదశకు చేరుకుంది. ఈరోజు, రేపు చాలామందికి సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు(Government officials) తగిన ఏర్పాట్లు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంగమతీరంతో పాటు హనుమాన్ మందిరం ప్రాంతాల్లో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ప్రయాగ్రాజ్లోనే ఉన్నారు. ఈయన కూడా కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో ఉన్నారు.ప్రయాగ్రాజ్లోని ప్రస్తుత పరిస్థితుల గురించి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డీఎం) కుమార్ మందార్ మీడియాతో మాట్లాడుతూ ‘వారాంతంలో భక్తుల రద్దీ ఏర్పడనున్న తరుణంలో మరిన్ని ఏర్పాట్లు చేశాం. ఇక్కడికి వచ్చేవారికి పటిష్టమైన భద్రతను అందించేందుకు చర్యలు చేపట్టాం. సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశాం. ముందస్తుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీల సమీక్షా సమావేశం జరిగింది. ప్రవిత్ర స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షిస్తున్నాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: స్నానపు దృశ్యాలు అప్లోడ్ చేసిన వారిపై చర్యలు -
మహా కుంభమేళాలో డిజిటల్ స్నానం! వీడియో వైరల్
మహా కుంభమేళాకు (Maha Kumbh) సంబంధించి ప్రతిరోజూ పలు వింత వార్తలు, కథనాలు వస్తున్నాయి. త్రివేణి సంగమంలో తమ పాపాలను కడుక్కోవడానికి కొందరు వస్తుంటే మరికొందరు ఎప్పుడో దూరమైన తమ కుటుంబాలతో తిరిగి కలుస్తున్నారు. కొందరికి మాత్రం పెద్ద జనసమూహాల మధ్య కొత్త వ్యాపార ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి.ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమానికి ఇప్పటికే దాదాపు 6 కోట్ల మంది యాత్రికులను ఆకర్షించింది. అయితే ప్రయాణం చేయలేని వారి కోసం, స్థానిక ఔత్సాహిక ఎంట్రాప్రెన్యూర్ దీపక్ గోయల్ 'డిజిటల్ స్నాన్' (Digital Snan) సర్వీస్ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా భక్తులు సంగమంలో స్నానం కోసం వాట్సాప్ ద్వారా తమ ఫొటోలను పంపవచ్చు. ఇందుకోసం అతను ఒక్కొక్కరికి రూ.1,100 ధర నిర్ణయించాడు.సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలుమహా కుంభమేళాలో డిజిటల్ స్నానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమర్శలతోపాటు ఉత్సుకతనూ రేకెత్తించింది. కొంతమంది యూజర్లు ఈ ఆలోచనను విశ్వాస దోపిడీ అంటూ విమర్శిస్తూ ఉంటే.. మరికొందరు అక్కడికి వెళ్లలేని వారికి ఇది అనుకూలమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: ‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!ఆధునిక సాంకేతికతతో విశ్వాసం ముడిపడి ఉండటం ఇదే మొదటిసారి కాదు. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఆన్లైన్లో దాని గురించి ఒక కరపత్రాన్ని పంచుకున్నప్పుడు ఇలాంటి 'వాట్సాప్ సాల్వేషన్' సర్వీస్ దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి సర్వీస్లు ఆధ్యాత్మికపరమైన ప్రామాణికతను పలుచన చేస్తాయని విమర్శకులు వాదిస్తున్నప్పటికీ, డిజిటల్ ప్రపంచంలోనూ సంప్రదాయానికి ప్రాధాన్యత ఎలా కొనసాగుతోందో కూడా అవి తెలియజేస్తున్నాయి.Digital Kumbh Snan 😭😭 and people are even paying him 👇pic.twitter.com/qGBr168p0f— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) February 21, 2025 -
‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh) అంతిమ దశకు వచ్చేసింది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు సంగమ తీరానికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా ఈ మహా కుంభమేళా వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్ల ( సుమారు 360 బిలియన్ డాలర్లు) విలువైన వ్యాపారాన్ని సృష్టిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT ) తాజాగా అంచనా వేసింది.ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా మారుతుందని భావిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ ఆధ్యాత్మిక సంరంభానికి 40 కోట్ల మంది తరలివస్తారని, దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని ప్రారంభంలో అంచనా వేశాయి. అయితే 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ అపూర్వమైన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహం కారణంగా ఇందులో పాల్గొన్నవారి సంఖ్య ఇప్పటికే 60 కోట్లు దాటి ఉంటుందని, రూ. 3 లక్షల కోట్లకు పైగా భారీ వ్యాపార టర్నోవర్ జరుగుతుందని తాజాగా అంచనాలను సవరించారు.సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ కూడలి అని, విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని దృఢంగా స్థాపించిందని అభివర్ణించారు. మహా కుంభ్ స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. మహా కుంభ్ థీమ్తో తీర్చిదిద్దిన డైరీలు, క్యాలెండర్లు , జనపనార సంచులు, స్టేషనరీ వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం కారణంగా అమ్మకాలు పెరిగాయి.150 కి.మీ విస్తరించిన వ్యాపారంమహా కుంభమేళా ఆర్థిక ప్రభావం ప్రయాగ్రాజ్కే పరిమితం కాలేదు. ఇక్కడికి 150 కి.మీ పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలు కూడా గణనీయమైన వ్యాపార వృద్ధిని సాధించాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. మరోవైపు అయోధ్య, వారణాసి వంటి తీర్థ స్థలాలకు యాత్రికుల సందర్శనలు పెరిగాయి. ఈ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం లభించింది.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్లు , రోడ్లు అండర్పాస్లతో సహా మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 7500 కోట్లు ఖర్చు చేసింది. ఈ పెట్టుబడి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగిస్తుందని భావిస్తున్నారు. -
మహా కుంభమేళాకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తజనం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా మరో ఐదురోజుల్లో ముగియనుంది. చివరి వారాంతం కావడంతో ప్రయాగ్రాజ్కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఇవాళ 40వ రోజు ఉదయం రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిట్లు అధికారులు ప్రకటించారు.కుంభమేళా ముగుస్తుండడంతో ప్రయాగ్రాజ్(Prayagraj) సంగమంకు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మేలా ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. గురువారం సాయంత్రం గణాంకాల ప్రకారం.. మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. శని, ఆది వారాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.గత వారంగా కుంభమేళా భక్తుల సంఖ్య👇ఫిబ్రవరి 13, గురువారం: 80 లక్షల 46 వేలుఫిబ్రవరి 14 శుక్రవారం: 94 లక్షల 98 వేలుఫిబ్రవరి 15 శనివారం: కోటి 36 లక్షల మందిఆదివారం: కోటి 49 లక్షల మందిసోమవారం: కోటి 35 లక్షల మందిమంగళవారం : కోటి 26 లక్షల మందిబుధవారం: కోటి 19 లక్షల మందిగురువారం: కోటి 55 లక్షల మంది..ఇక.. కుంభమేళా(KumbhmelaI నిర్వహణపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనవరి చివరి వారంలో మౌనీ అమవాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే రద్దీని నియంత్రించేలా అధిక సిబ్బందిని నియమించారు. మరోవైపు.. పరిసరాలను, సంగమ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే వీఐపీ పాస్లను రద్దు చేసిన అధికారులు.. వాహనాల రాకపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.రైల్వే శాఖ కీలక నిర్ణయంమహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగుస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్రాజ్ వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రత్యేక హోర్డింగ్లను ఏర్పాటు చేయించింది. సురక్షిత ప్రయాణం కోసం తాము సూచించే మార్గదర్శకాలను పాటించాలని అందులో విజ్ఞప్తి చేస్తోంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
అమ్మకానికి కుంభమేళా మహిళల పుణ్య స్నానాల వీడియోలు!
లక్నో : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు (Kumbh Mela) భక్తులు పెద్దఎత్తున తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 56 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.ఈక్రమంలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు విక్రయిస్తున్న,కొనుగోలు చేస్తున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు 103 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.యూపీ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ కుంభమేళాలో మహిళలు స్నానమాచరించడం, దుస్తులు మార్చుకునే వీడియోల్ని పలువురు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియా ప్రొఫైళ్లు, గ్రూపుల్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి, వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ మీడియాతో తెలిపారు. బుధవారం కుంభమేళాలో స్నానం చేయడంతో పాటు, దుస్తులు మార్చుకుంటున్న మహిళల వీడియోల్ని తీస్తున్నారు. వాటిని అమ్మకానికి పెడుతున్నట్లు సమాచారం వచ్చింది.ఆ వీడియోలను అమ్మేవారిని, కొనుగోలు చేసే వారిని అరెస్ట్ చేస్తాం. మా సోషల్ మీడియా టీమ్ నిరంతరం వీటిని మానిటర్ చేస్తోంది. ఎవరైతే మహిళల ప్రైవేట్ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారో, వారి ప్రొఫైళ్లపై చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.ఇప్పటివరకు ఎంతమంది వ్యక్తులు లేదా గ్రూపులను గుర్తించారనే సమాచారంపై డీఐజీ వైభవ్ కృష్ణ స్పందించారు. 103 సోషల్ మీడియా ప్రొఫైళను గుర్తించాం. వీటిలో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే అకౌంట్లతో పాటు మహిళల ప్రైవేట్ వీడియోలను పోస్ట్ చేస్తున్న అకౌంట్లు ఉన్నట్లు వెల్లడించారు. 26 సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లలో కుంభమేళాలో స్నానమాచరించే మహిళల వీడియోల్ని అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్నవారందరిపై చర్యలు తీసుకుంటామని కుంభమేళా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ హెచ్చరించారు. కాగా, కుంభమేళాలో మహిళల వీడియోల్ని తీస్తున్న దుండగులు ఒక్కో వీడియోను రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. -
Mahakumbh: స్నానపు దృశ్యాలు అప్లోడ్ చేసిన వారిపై చర్యలు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే మహా కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళలు, బట్టలు మార్చుకుంటున్న మహిళలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఉదంతం వెలుగుచూసింది దీనిని గమనించిన యూపీ పోలీసులు రంగంలోకి దిగి, నిందితులపై చర్యలకు ఉపక్రమించారు.ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు.. సోషల్ మీడియాలో మహా కుంభమేళాకు సంబంధించిన అభ్యంతరకరమైన పోస్టులు, వదంతులను వ్యాప్తి చేసే వారిపై నిరంతరం పోలీసులు దృష్టిసారిస్తున్నారు. అలాంటివారిని గుర్తించి, చర్యలు చేపడుతున్నారు. మహాకుంభ్లో మహిళలు స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు కొందరు వీడియోలు తీసి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేస్తున్నారని పోలీసులకు తెలియవచ్చింది. ఇది మహిళల గోప్యత, గౌరవాన్ని ఉల్లంఘించడమేనంటూ పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.యూపీ పోలీసుల ఈ తరహాలోని రెండు ఉదంతాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న @neha1224872024 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుంభమేళాకు వచ్చిన మహిళలు స్నానం చేస్తూ, బట్టలు మార్చుకుంటున్న వీడియోలను ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఖాతాను నిర్వహిస్తున్న వారిని గుర్తించేందుకు యూపీ పోలీసులు మెటా కంపెనీ నుండి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఇదేవిధంగా ఫిబ్రవరి 19న టెలిగ్రామ్ ఛానెల్లోని ఒక ఖాతాపై కేసు నమోదయ్యింది. మహా కుంభోత్సవంలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలను అందుబాటులో ఉంచుతామని టెలిగ్రామ్ ఛానల్ CCTV CHANNEL 11 పేర్కొంది. దీంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.ఇది కూడా చదవండి: Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు -
Maha Kumbh: వేల రూపాయలు తెచ్చిపెట్టిన ‘పర్సు చోరీ’
ప్రయాగ్రాజ్: కుంభమేళాలో స్నానం చేస్తే తాము చేసిన పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అయితే దీనికి విరుద్ధంగా కొందరు కుంభమేళా ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతూ పాపాలను మూటగట్టుకుంటున్నారు. మధురలోని బృందావనాన్ని సందర్శించి, అక్కడినుంచి కుంభమేళాకు వచ్చిన ఒక వ్యక్తికి చేదు అనుభం ఎదురయ్యింది. జనసమూహంలో అతని పర్సు చోరీకి గురయ్యింది. ఆ పర్సులో నగదు, విలువైన కాగితాలు ఉన్నాయి. దీంతో అతను కాసేపు బాధపడ్డాడు. తిరిగి తన స్వస్థలానికి చేరడం ఎలా అని ఆలోచించాడు. వెనువెంటనే ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు.జేబులో ఒక్కపైసా కూడా లేకపోవడంతో మరోమార్గం లేక అక్కడున్న కొందరు భక్తులకు తన పరిస్థితి చెప్పుకుని, డబ్బులు సాయం చేయాలని కోరాడు. వారిచ్చిన డబ్బుతో టీ తయారు చేసి విక్రయించసాగాడు. ఇలా కుంభమేళాలో రోజుకు రెండు, మూడు వేలు సంపాదిస్తూ రూ. 50 వేలు జమచేశాడు.పర్సుపోతే పోయిందిగానీ, అతనికి ఒక కొత్త ఉపాధి మార్గం దొరికింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నేను బృందావనం నుంచి మహాకుంభమేళాలో స్నానం చేసేందుకు వచ్చాను. ఇంతలో నా పర్సు ఎవరో చోరీ చేశారు. ఏం చేయాలో తెలియక టీ విక్రయిస్తూ, డబ్బులు కూడబెట్టాలని నిర్ణయించుకున్నాను. రాత్రనక, పగలనక ఇక్కడికి వచ్చే భక్తులకు టీ అమ్ముతూ వచ్చాను. రోజుకు మూడు వేల రూపాయల వరకూ సంపాదించాను. అలా ఇప్పటివరకూ రూ. 50 వేలు కూడబెట్టాను’ అని తెలిపాడు. ఇది కూడా చదవండి: శివాజీ జయంతి: చిన్న లక్ష్యంతో మొదలుపెట్టి.. -
పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్
న్యూఢిల్లీ: యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వెళుతున్న భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా అక్కడక్కడా ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాగ్రాజ్ వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది.తాజాగా దుర్గ్(ఛత్తీస్గఢ్) నుండి చాప్రా(బీహార్) వరకూ, అలాగే చాప్రా నుండి దుర్గ్ వరకు నడిచే సారనాథ్ ఎక్స్ప్రెస్ను రైల్వేశాఖ మూడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ దుర్గ్-చాప్రా సారనాథ్ ఎక్స్ప్రెస్ను ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 21 వరకు రద్దు చేశారు. ఈ రైలు ప్రయాగ్రాజ్ మీదుగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. దీంతో ప్రయాగ్రాజ్కు వెళదామనుకున్న ప్రయాణికులు నిరాశకు గురవుతున్నారు. కాగా ఈ రైలు ద్వారా ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారి డబ్బును రైల్వేశాఖ వారి ఖాతాకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. ప్రయాగ్రాజ్లో భారీ రద్దీని తగ్గించడానికి రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని సంబంధిత అధికారులు తెలిపారు.ఇదేవిధంగా రైలు నంబర్ 55098/55097 గోరఖ్పూర్-నర్కటియగంజ్ ప్యాసింజర్ రైలును ఫిబ్రవరి 23 వరకు రద్దుచేశారు. అలాగే రైలు నంబర్ 15080 గోరఖ్పూర్-పాటిలీపుత్ర ఎక్స్ప్రెస్ కూడా ఫిబ్రవరి 22 వరకు రద్దు చేశారు. మహాశివరాత్రికి ప్రయాగ్రాజ్ వెళ్లాలనుకున్న భక్తులకు ఈ వార్త షాక్లా తగిలింది. మరోవైపు జయనగర్ నుండి ప్రయాగ్రాజ్ మీదుగా న్యూఢిల్లీకి వెళ్లే స్వతంత్ర సేనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు రూట్ను మార్చారు. ఈ రైలు ఫిబ్రవరి 28 వరకు ప్రయాగ్రాజ్ మీదుగా వెళ్ళదు. బీహార్, ఛత్తీస్గఢ్ల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివెళుతున్నారు. దీంతో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది.ఇది కూడా చదవండి: రిస్క్లో కుంభమేళా మోనాలిసా? -
రిస్క్లో కుంభమేళా మోనాలిసా?
యూపీలోని జరుగుతున్న కుంభమేళా నేపధ్యంలో చాలామంది వైరల్గా మారారు. అయితే వీరందరిలో ప్రయాగ్రాజ్కు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలినా భోంస్లే ప్రముఖంగా నిలిచారు. ఆమె రాత్రికిరాత్రే సోషల్ మీడియా క్వీన్గా మారిపోయారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ నీలికళ్ల సుందరి రిస్క్లో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై మోనాలిసా వివరణ ఇచ్చింది.కుంభమేళా మోనాలిసాను చూసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వచ్చి సినిమా ఆఫర్ ఇచ్చారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ పేరుతో కుంభమేళా మోనాలిసా హీరోయిన్గా సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. దీనిని విన్నవారంతా ఇక మోనాలిసా దశ తిరిపోయిందంటూ వ్యాఖ్యానించారు. ఇదే తరుణంలో ఆమె న్యూలుక్కు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అలాగే ఆమె నటన నేర్చుకోవడంతో పాటు, చదువుకున్నదంటూ పలు వార్తలు వినిపించాయి. తాజాగా మోనాలిసా ఒక బ్రాండ్ ప్రమోషన్లో కూడా పాల్గొంది.తాజాగా ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ్ కుంభమేళా గర్ల్ మోనాలిసా రిస్క్లో పడిందంటూ వ్యాఖ్యానించారు. ఆమె దర్శకుడు సనోజ్ మిశ్రా ట్రాప్లో పడిందంటూ ఆరోపించారు. సనోజ్ దగ్గర సినిమాను నిర్మించేందుకు సరిపడినంత డబ్బులు లేవని, అయితే లైమ్ లైట్లో ఉండేందుకే ఆయన మోనాలిసాను తన వెంట తీసుకువెళుతున్నారని ఆరోపించారు. అయితే దీనిపై తాజాగా మోనాలిసా వివరణ ఇచ్చింది.ఇన్స్టాగ్రామ్లో మోనాలిసా షేర్ చేసిన ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ సనోజ్ మిశ్రాపై వస్తున్న విమర్శల్లో నిజం లేదని పేర్కొంది. తానేమీ అతని ట్రాప్లో పడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను మధ్యప్రదేశలో ఉన్నానని, యాక్టింగ్ నేర్చుకుంటున్నానని, తన సోదరి, తన పెదనాన్న తనతోనే ఉన్నారని, తానేమీ ఎవరి వలలోనూ పడలేదని పేర్కొంది. సనోజ్ మిశ్రా తనను కుమార్తెలా చూసుకుంటున్నారని, ఆయన చాలా మంచి మనిషి అని, మా సినిమా సవ్యంగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరింది. ఇది కూడా చదవండి: ‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత? -
‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత?
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలోని సంగమ తీరంలో నిర్వహిస్తున్న కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వానికి పలు సవాళ్లు సంధిస్తున్నారు. వీటికి సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాధానమిచ్చారు. మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని, కోట్లాదిమంది తరలివస్తున్నారని, ఈ నేపధ్యంలో ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్యలను కూడా దర్శిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.‘యువ పారిశ్రామికవేత్తలతో సంభాషణ’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మహాకుంభమేళాపై విమర్శలు గుప్పిస్తున్నవారు.. ఈ భారీ కార్యక్రమం కారణంగా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతున్నదని గ్రహించాలన్నారు. మహాకుంభమేళా నిర్వహణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 7,500 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రానికి మూడు లక్షల కోట్లకుపైగా ఆదాయం రానున్నదనే అంచనాలున్నాయన్నారు.కుంభమేళా సందర్భంగా అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ, చిత్రకూట్, గోరఖ్పూర్, నైమిశారణ్యంలో పలు వసతులు కల్పించామని సీఎం అన్నారు. ఒక్క ఏడాదిలో అయోధ్యకు కానుకలు, విరాళాల రూపంలో రూ. 700 కోట్లు సమకూరాయన్నారు. మహాకుంభమేళాలో ఫిబ్రవరి 17 నాటికి మొత్తం రూ.54 కోట్ల 31 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారన్నారు. మహాకుంభమేళా ఫిబ్రవరి 26(శివరాత్రి) వరకూ కొనసాగనుంది. ఇది కూడా చదవండి: Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు -
టిక్కెట్ లేకున్నా వెళ్లొచ్చని మోదీయే చెప్పారు!
పట్నా: ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు జన జాతర కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీ వరకు ఈ మేళా సాగనుంది. ఇక ముఖ్యమైన దినాలేవీ లేనప్పటికీ జనం లక్షలు, కోట్ల సంఖ్యలో ప్రయాగ్రాజ్కు తరలి వెళ్తూనే ఉన్నారు. ముఖ్యంగా రైళ్లలో రద్దీ తీవ్రంగా ఉంటోంది. ఇదే అదనుగా జనం టిక్కెట్ లేకుండానే రైలు ప్రయాణం కానిచ్చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఈ ఘటనే..! బిహార్లోని దానాపూర్ డివిజన్ రైల్వే మేనేజర్ జయంత్ కుమార్ ప్రయాణికుల రద్దీతో నెలకొన్న పరిస్థితిపై రెండు రోజుల క్రితం బక్సార్ రైల్వే స్టేషన్ను పరిశీలించారు. అదే సమయంలో గ్రామీణ మహిళల బృందం ఒకటి ఆయనకు తారసపడింది. వారిని వివరాలడగ్గా కుంభమేళాకు వెళ్తున్నట్లు చెప్పారు. టిక్కెట్లు కొన్నారా అని ప్రశ్నించగా ముక్తసరిగా లేదని బదులిచ్చారు. టిక్కెట్లు కొనకుండానే రైలు ప్రయాణం చేయవచ్చని ఎవరు చెప్పారని జయంత్ కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మోదీయే అలా తమకు చెప్పారంటూ ఆ మహిళలు ఠకీమని ఇచ్చిన సమాధానంతో ఆయన షాక్కు గురయ్యారు. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. చివరికి, ‘అలాంటిదేమీ లేదు. ప్రధాని మోదీయే కాదు, ఏ అధికారి కూడా టిక్కెట్ లేకుండా ప్రయాణం చేయనివ్వరు. ప్రయాణం చేయాలంటే టిక్కెట్ కొనాల్సిందే. లేకుంటే చట్టాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటాం’అంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అనంతరం డీఆర్ఎం జయంత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పండగ సీజన్లప్పుడు చేసినట్లుగానే కుంభ్ మేళాకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. అయితే, జనం రద్దీ తగ్గాల్సిన వేళ పెరుగుతుండటాన్ని తామస్సలు ఊహించలేదన్నారు. లేకుంటే, మరింతగా ఏర్పాట్లు సిద్ధం చేసి ఉండేవారమని వివరించారు. -
భక్తిపారవశ్యంలో బుల్లితెర సెలబ్రిటీలు (ఫోటోలు)
-
పూసల దండలు అమ్మే అమ్మాయి నగల షాపు ఓపెనింగ్కి గెస్ట్గా..!
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయినిగుర్తు పట్టారా? కేరళలో ఒక నగల షాపుకు ఓపెనింగ్కు వచ్చింది. అంటే డబ్బు ఇచ్చి పిలిపించి ఆమె చేత ఓపెనింగ్ చేయించారు. తమాషా చూడండి. రోడ్డు మీద కూచుని పూసల దండలు అమ్మే అమ్మాయి బంగారు ఆభరణాల షోరూమ్కు రిబ్బన్ కత్తిరించడం. సోషల్ మీడియా గొప్పతనం అలా ఉంది. మీకర్థమైంది కదా.. ఈ అమ్మాయి మోనాలిసా. మెడలో పూసలు వేసుకుని తిరిగే అమ్మాయి అదే మెడలో ఖరీదైన నెక్లెస్ను కాసేపటి కోసమైనా ధరించగలనని ఊహిస్తుందా? అదే జరిగింది. అదే మేజిక్.కుంభమేళాకు పూసలమ్ముకోవడానికి వచ్చిన 16 ఏళ్ల మోని భోంస్లే తన అందమైన కళ్లతో ప్రపంచాన్నే ఆకర్షించింది. ఆమె ఫొటోలు సోషల్ మీడియా తోపాటు ప్రొఫెషనల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ‘మోనాలిసా’ పేరుకు రాత్రికి రాత్రి ఇన్స్టాలో ఆమె ఫాలోయెర్లు కోట్లకు పెరిగారు. ఇండోర్లో నిరుపేద కుటుంబానికి చెందిన మోని భోంస్లే ఇప్పుడు సెన్సేషన్. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా కోసం ఆమె 21 లక్షల పారితోషికానికి సైన్ చేసిందని వార్త. ఇక ఇప్పుడు షోరూమ్ల ప్రాంరంభానికి కూడా ఆహ్వానాలు అందుకుంటోంది. కేరళ కోజికోడ్కు చెందిన జ్యువెలరీ షోరూమ్ను వాలెంటైన్స్ డే రోజున మోని భోంస్లే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది. దాని యజమాని బాబీ చెమ్మనూర్ ఒక ఖరీదైన నెక్లెస్ను కాసేపు మెడలో వేసి ఆమెను సంతోషపెట్టారు. ఆమెను చూడటానికి జనం విరగబడ్డారు. ఆమెరాకతో ప్రచారం బ్రహ్మాండంగా దొరికింది. బదులుగా ఆమెకు మంచి పారితోషికం లభించింది. విమానాలలో, లగ్జరీ కారుల్లో ఇప్పుడు మోని భోంస్లే తిరుగుతోంది. సోషల్ మీడియా ఎవరి జాతకాన్ని ఎలా మారుస్తుందో ఊహించలేము. టాలెంట్ ఉంటే జనానికి చేరడానికి సోషల్ మీడియా ఉంది. దానిని సరిగ్గా ప్రదర్శించాలి. అయితే ఇదే సోషల్ మీడియాలో మెజారిటీ సెంటిమెంట్స్కు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే పాతాళానికి పడిపోతాము. కనుక ఆచితూచి వ్యవహరించాలి. ఇటీవల నంబర్ 1 యూట్యూబర్ రణ్వీర్ అహ్లాబాదియా మాట తూలి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. మరో విషయం ఏమిటంటే వ్యక్తిగత వివరాలు, చిరునామాలు వెల్లడి చేయకుండా సోషల్ మీడియాలో కేవలం మన టాలెంట్ను, కళను, ప్రతిభను చూపాలి. స్త్రీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం కలిసొస్తే మోనాలిసా లాంటి ఫేమ్ పెద్ద కష్టం కాదు. View this post on Instagram A post shared by boche (@dr.boby_chemmanur) (చదవండి: కోళ్ల అందాల పోటీలు..!) -
రాజధానిలో ఘోరం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వార్తలొచ్చాయి. శనివారం రాత్రి 9.55 గంటలకు 13, 14వ నంబర్ ప్లాట్ఫామ్ల వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఘటనాస్థలిలో భక్తుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. భయంతో జనం తమ చిన్నారులను భుజాలపైకి ఎత్తుకుని, బ్యాగులు పట్టుకుని పరుగెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తొక్కిసలాటకు కారణాలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడి కాలేదు. అయితే ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన రెండు రైళ్లు ఆలస్యంగా రావడంతో అప్పటికే వేచిఉన్న భక్తులు త్వరగా ఎక్కేందుకు ప్రయత్నించడం, కిక్కిరిసిన జనం కారణంగా తొక్కిసలాట జరిగినట్టు వార్తలొచ్చాయి. ఊపిరాడక స్పృహ తప్పిన కొందరిని సమీప ఆస్పత్రులకు తరలించారు. దాదాపు 12 మందిని లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే అగి్నమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పారు. ఘటనపై రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా ట్లాడారు. ‘‘14వ నంబర్ ప్లాట్ఫామ్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు ఆగి ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అక్కడ వేచి ఉన్నారు. అదే సమయానికి రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిని ఎక్కాల్సిన ప్రయాణికులు 12, 13, 14వ నంబర్ ప్లాట్ఫామ్లపై వేచి ఉన్నారు. దీంతో ప్లాట్ఫామ్లపై జనం ఊహించనంతగా పెరిగిపోయి చివరకు 14వ నంబర్ ప్లాట్ఫామ్, 16వ నంబర్ ప్లాట్ఫామ్ ఎస్కలేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. కమర్షియల్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్టర్(సీఎంఐ) తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్ ప్రతి గంటకు 1,500 టికెట్లు విక్రయించింది. ఊహించనంతగా ప్రయాణికులు వచ్చారు.అందుకే పరిస్థితి అదుపు తప్పింది’’ అని డీసీపీ మల్హోత్రా చెప్పారు. ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉంది. ఘటనాస్థలికి వెంటనే రైల్వే పోలీస్, ఢిల్లీ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే చేరుకున్నాయి. వారాంతం కావడంతో అధికంగా వచ్చిన భక్తుల రాకపోకల కోసం అదనపు రైళ్లను నడుపుతున్నాం’’ అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. -
‘మహా కుంభమేళాను పొడిగించండి’
ప్రపంచంలోనే అత్యంత భారీ ఆధ్యాత్మిక సమ్మేళనం మరో 11 రోజుల్లో ముగియనుంది. ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాను ఇప్పటిదాకా(శుక్రవారం సాయంత్రానికే) 50 కోట్ల మంది హాజరైనట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇది అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యల జనాభా కంటే అధికం. అయితే..మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇంకా కోట్ల మంది ప్రయాగ్రాజ్ వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో కుంభ మేళాను పొడిగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.గతంలో మహా కుంభమేళా, కుంభమేళాల రద్దీ దృష్ట్యా 75 రోజులపాటు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి!. కానీ, ఇప్పుడు నిర్వహిస్తున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela) తక్కువ రోజులు నిర్వహిస్తున్నారని అఖిలేష్ అంటున్నారు. మహా కుంభమేళా కోసం ఎంతో మంది ఆశగా ప్రయాగ్రాజ్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లను నిరాశపర్చడం సరికాదు. కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని అన్నారాయన.ఇదిలా ఉంటే.. ఈసారి మహా కుంభమేళాలో తొక్కిసలాట విషాదం నెలకొంది. జనవరి చివరి వారంలో మౌనీ అమావాస్య సందర్భంగా భక్తులు ప్రయాగ్రాజ్ ఘాట్ల వద్ద ఎగబడడంతో బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో తోక్కిసలాట జరగ్గా ముప్ఫై మంది మరణించారు. అయితే.. మృతుల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాస్తోందని అఖిలేష్ ఆరోపించారు. అంతేకాదు.. నిర్వహణ విషయంలో యోగి సర్కార్ విఫలైమందని, భారత సైన్యానికి కుంభమేళా బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు కూడా. మహా కుంభమేళా కోసం క్యూ కడుతున్న భక్తుల సంఖ్య తగ్గడం లేదు. రైళ్లు, బస్సులు నిండిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కిందటి వారం ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ప్రయాగ్ రాజ్(Prayag Raj) రూట్లో నెలకొనడం చూశాం. ఇంకోవైపు.. జనాల తాకిడితో ప్రయాగ్రాజ్ సంగమ రైల్వే స్టేషన్ను తాత్కాలికంగా మూసేశారు.ఇదిలా ఉంటే.. జనవరి 13వ తేదీన పౌష పూర్ణిమతో మహా కుంభమేళా ఆరంభమైంది. కుంభమేళా అయినా, మహా కుంభమేళా అయినా గ్రహాల స్థితిగతులు.. శాస్త్రాలను.. తదితరాలను అనుసరించి 45 రోజులపాటు కొనసాగుతాయి. ఈ ఏడాది మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది.ఇదీ చదవండి: స్టార్ హీరో భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యమా? -
కుంభమేళా మోనాలిసా స్టన్నింగ్ లుక్!
పూసల దండలు అమ్మేందుకు కుంభమేళాకు వచ్చిన మోనాలిసా వాటిని అమ్మిందో లేదోగానీ, తన నీలికళ్ల అందాలతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్గా మారిపోయింది. ఒకవైపు సినిమా అవకాశాలు, మరోవైపు ప్రకటనల్లో నటించే అవకాశాలు ఆమెకు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న మోసాలిసా ఫొటోలను చూస్తే ఈమె కుంభమేళాలో పూసల దండలు విక్రయించేందుకు వచ్చిన మోనాలిసానేనా అనేలా ఉన్నాయి.మోనాలిసా ప్రస్తుతం తన తొలి బాలీవుడ్ డెబ్యూకు సిద్దమవుతోంది. ఇందుకోసం ఆమె ఒకవైపు నటన నేర్చుకుంటూనే, మరోవైపు అక్షరాలు కూడా దిద్దుతోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ఆమె నటించనుంది. తాజాగా సనోజ్ మిశ్రా, మోనాలిసాలు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళ చేరుకున్నారు. ఈ నేపధ్యంలో బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.కేరళలో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొన్న ఆమె గులాబీరంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆమె కురులు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. కొద్దిపాటి మేకప్తో మోసాలిసా సహజ సౌందర్యరాశిలా నవ్వుతూ కనిపిస్తోంది. కోట్ల రూపాయల ఖరీదైన కారులో ఆమె ఈవెంట్కు హాజరయ్యింది. ఆ సమయంలో ఆమె అత్యంత ఖరీదైన వజ్రాల హారం కూడా ధరించింది. కార్యక్రమానికి హాజరైన అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు తెగ తాపత్రయపడ్డారు.ఇది కూడా చదవండి: రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు? -
Mahakumbh: 1,100 కి.మీ పరుగు.. కుంభమేళాకు అగ్నివీర్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భారీ ఎత్తున జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. కుంభమేళా నేపధ్యంలో పలు విషయాలు వైరల్గా మారుతున్నాయి. ఇదేవిధంగా కొందరు రాత్రికిరాత్రే ఫేమస్ అవుతున్నారు. మరోవైపు సాహసం చేసి, కుంభమేళాకు తరలివస్తున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రూపేష్.2024లో దేశరక్షణ విభాగంలో ‘అగ్నివీర్’గా ఎంపికైన రూపేష్ గత జనవరి 23న కుంభమేళాకు పరుగును ప్రారంభించాడు. సహరసా(బీహార్) నుంచి ప్రారంభమైన అతని పరుగు ప్రయాణం యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు చేరుకునేందుకు 17 రోజులు పట్టింది. రోజుకు 10 గంటపాలు పరుగుపెడుతూ ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర త్రివేణీ సంగమానికి చేరుకున్నాడు. రూపేష్ ఈ సాహసోపేత పరుగులో పలు ఆటంకాలను ఎదుర్కొన్నాడు.కుంభమేళా ప్రాంతానికి పరుగు చేపట్టిన రూపేష్ ఫిబ్రవరి ఒకటిన అనారోగ్యానికి గురయ్యాడు. ఇదేవిధంగా మార్గం మధ్యలో అతని ఫోను, పర్సును దొంగలు లాక్కెళ్లిపోయారు. ఈ సమయంలో స్థానికులు అతనికి సహాయం అందించారు. ఐదారు వేల రూపాయల వరకూ ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. రూపేష్ చేపట్టిన ఈ పరుగు యాత్ర ప్రారంభంలో స్నేహితులిద్దరు అతని వెంట వచ్చారు. అయితే భక్తియార్పూర్ చేరుకోగానే వారిద్దరూ పూర్తిగా అలసిపోవడంతో వెనుదిరిగారు. అటువంటి పరిస్థితిలోనూ రూపేష్ ధైర్యాన్ని కోల్పోక 1,100 కిలోమీటర్ల తన పరుగుయాత్రను పూర్తిచేశాడు.రూపేష్ 2024లో ఇండియన్ ఆర్మీలో ‘అగ్నివీర్’గా ఎంపియ్యారు. ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాడు. మారథాన్లో భారత్ బంగారు పతకం తేవాలనేది రూపేష్ కల. ఈ సందర్భంగా రూపేష్ తండ్రి రామ్ప్రవేశ్ యాదవ్ మాట్లాడుతూ కుంభమేళాకు పరిగెడుతూ వెళ్లాలనుకున్న తన కుమారుని నిర్ణయాన్ని విని చాలామంది ఎగతాళి చేశారని, అయితే రూపేష్ ఇప్పుడు తన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉన్నదన్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు -
Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు
ప్రయాగ్రాజ్: యూపీలోని తీర్థరాజం ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దీనిలో ఇప్పుడు కొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసినవారి సంఖ్య 50 కోట్లు దాటింది. గతంలో కుంభమేళా స్నానాలపై ఉన్న అంచనాలను ఈ రికార్డు దాటేసింది.అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక అందించిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ (జనాభా 34,20,34,432), ఇండోనేషియా (జనాభా 28,35,87,097), పాకిస్తాన్ (జనాభా 25,70,47,044), నైజీరియా (జనాభా 24,27,94,751), బ్రెజిల్ (జనాభా 22,13,59,387), బంగ్లాదేశ్ (జనాభా 17,01,83,916), రష్యా (జనాభా 14,01,34,279), మెక్సికో (జనాభా 13,17,41,347)లలోని జనాభాను దాటినంతమంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు.మహా కుంభమేళకు ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించిన అంచనాలను మించిన రీతిలో కుంభమేళాలో సరికొత్త రికార్డు నమోదయ్యింది. ప్రారంభంలో 45 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తారనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి 11 నాటికి ఆ అంచనా నిజమని రుజువైంది. శుక్రవారం (ఫిబ్రవరి 14) నాటికి ఈ సంఖ్య 50 కోట్లను దాటింది. మహా కుంభమేళాలో ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలివున్నాయి. మరొక స్నాన ఉత్సవం ఫిబ్రవరి 26న శివరాత్ర సందర్భంగా ఉంది. అప్పటికి పుణ్యస్నానాలు చేసే వారి సంఖ్య 55 నుంచి 60 కోట్లు దాటవచ్చనే కొత్త అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటివరకు స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్యను విశ్లేషిస్తే మౌని అమావాస్య నాడు గరిష్టంగా 8 కోట్లు మంది భక్తులు స్నానం చేయగా, మకర సంక్రాంతినాడు 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానం చేశారు. ఫిబ్రవరి ఒకటి, జనవరి 30 తేదీలలో రెండు కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వసంత పంచమి నాడు 2.57 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మాఘ పూర్ణిమ నాడు కూడా రెండు కోట్లకు పైగా భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించారు.ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
మహాకుంభమేళాలో తదుపరి పవిత్ర స్నానం ఎప్పుడు?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు (బుధవారం) భక్తులు మాఘపౌర్ణమి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నాటికి 1.20 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి పుణ్య స్నానాల సందర్భంగా కుంభమేళా అధికారులు హెలికాప్టర్లో భక్తులపై పుష్పవర్షం కురిపించారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. ఈరోజు సుమారు రెండు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళా ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకూ మూడు అమృత స్నానాలు పూర్తయ్యాయి. దీంతో తదుపరి పుణ్య స్నానం ఎప్పుడనే సందేహం చాలామందిలో ఉంది. #WATCH | 'Pushp varsha' or showering of flower petals being done on devotees and ascetics as they take holy dip in Sangam waters on the auspicious occasion of Maghi Purnima during the ongoing #MahaKumbh2025 in Prayagraj. #KumbhOfTogetherness pic.twitter.com/FC1C2uetnb— ANI (@ANI) February 12, 2025కుంభమేళా నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 26న తదుపరి పవిత్ర స్నానాలు ఉండనున్నాయి. ఆరోజు మహాశివరాత్రి కావడం విశేషం. శివుని భక్తులు ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అదేరోజున కుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు శివభక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో శివరాత్రి రోజున కుంభమేళాకు లెక్కకుమించినంతమంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
Maha Kumbh Mela : సింపుల్గా, హుందాగా రాధిక-అనంత్ అంబానీ జంట
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్నమహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ భక్తజన సంద్రంలో అంబానీ కుటుంబంకూడా చేరింది. ముఖేష్ అంబానీ,కోకిలాబెన్ అంబానీ, ఆకాశ్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతాతో పాటు, అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,చిన్న కోడలు రాధిక మర్చంట్ (ఫిబ్రవరి 11న) త్రివేణి సంగమంలో పవిత్ర ఆచారాలలో పాల్గొని పవిత్ర స్నానం చేశారు. (మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో)మహా కుంభ్లో, రాధిక తన లుక్తో ఆకట్టుకుంది. నేవీ బ్లూ సిల్క్ లగ్జరీ కుర్తాలో హుందాగా కనిపించింది. గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీతో జయంతి రెడ్డి రూపొందించిన ఈ దుస్తుల విలువ ఇపుడు హాట్ టాపిక్గా నిలిచింది. V-నెక్లైన్ ,మోచేయి వరకు పొడవున్న స్లీవ్లు నెక్లైన్ బోర్డర్లను జరీ ఎంబ్రాయిడరీతో తీర్చి దిద్దారు. ఈ కుర్తాకు కాంట్రాస్టింగ్ పుదీనా గ్రీన్ ధోతీ ప్యాంటు, మ్యాచింగ్ దుపట్టాతో జత చేసింది. దీని ధర లక్ష రూపాయలని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే జ్యయుల్లరీ తక్కువగా ఉంచినప్పటికీ మోడ్రన్గా ఉండటం విశేషం. సింపుల్ పోనీటైల్తో డైమండ్ స్టడ్ చెవిపోగులు, హారాన్ని ధరించి ఆధ్యాత్మిక లుక్లో అలరించింది. (Valentines Day : లవ్ బర్డ్స్కోసం ది బెస్ట్ డెస్టినేషన్ ఇదే!)ఇక రాధికకు జతగా అనంత్ అంబానీ అద్భుతమైన ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. వెండి మోటిఫ్లు , చక్కటి,చిక్కటి బంగారు ఎంబ్రాయిడరీ చేసిన మెరూన్ వెయిస్ట్కోట్, షైనింగ్ రెడ్ ఎరుపు కుర్తాను ధరించాడు. అలాగే బంగారు గొలుసు, నుదుటిన తిలకంతో తన సాంప్రదాయ రూపాన్ని పూర్తి చేశాడు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలోమహా కుంభమేళా 2025 ఉత్సాహంగా సాగుతోంది. సూర్యుని చుట్టూ బృహస్పతి చుట్టే కక్ష్య పూర్తైన సూచనగా జరుపుకునే ముఖ్యమైన తీర్థయాత్ర పండుగ ఇది. 12-కుంభమేళా చక్రం ముగింపును ఇది సూచిస్తుంది. దీనిని అధికారికంగా 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాగా పిలుస్తారు. ఈ కార్యక్రమం జనవరి 13న మొదలై, ఫిబ్రవరి 26 వరకు సాగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా గుర్తింపు పొందింది. -
#MahaKumbh2025 : మాఘ పూర్ణిమ స్నానాలు కుంభమేళాకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా
కుంభమేళాకు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా తన అందమైన తేనెకళ్ల కారణంగా రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఒక్కదెబ్బతో ఈమె ఖాతాలోకి లెక్కలేనంతమంది అభిమానులు చేరిపోయారు. ఇదే నేపధ్యంలో మోనాలిసా ఒక సినిమా అవకాశాన్ని, ఒక ప్రకటనలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. నిరక్షరాస్యురాలైన మోనాలిసా ఇప్పుడు అక్షరాలు దిద్దేపనిలో పడింది. ఇంటర్నెట్ సస్సేషన్గా మారిన మోనాలిసా ఏనాడూ పాఠశాలకు వెళ్లి చదువుకోలేదు. అయితే ఇప్పుడు ఆమెకు చదువు అవసరం ఏర్పడింది. దీనిని గుర్తించిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు చదువు నేర్పించే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఇటీవల ఆయన షేర్ చేసిన ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో మోనాలిసా హిందీలో అక్షరాలు దిద్దుతున్నట్లు కనిపిస్తోంది. స్లేట్ పెన్సిల్ తీసుకుని, మోనాలిసా అక్షరాలు దిద్దటాన్ని మనం ఆ వీడియోలో చూడవచ్చు.ఎవరూ ఊహించని విధంగా మోనాలిసా జీవితం మారిపోయింది. ఒకవైపు సినిమా అవకాశాలు దక్కించుకుంటూనే, మరోవైపు అక్షర జ్ఞానాన్ని కూడా మోనాలిసా పెంపొందించుకుంటోంది. ఆమె నటిస్తున్న చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత -
పిల్లలకేం చెప్పాలి.. దేవుడా..
ఉప్పల్/మలక్పేట: మహాకుంభ మేళాకు వెళ్లి తమవాళ్లు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారనుకున్న ఆ కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదం వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. ఆనందంతో బయలుదేరి విగత జీవులుగా మారి తిరిగి రావడం తీరని దుఃఖాన్నే మిగిల్చింది. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన బాధితులు భోరుమంటూ విలపిస్తున్నారు. తాము కుశలమేనంటూ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే పిడుగులాంటి వార్త వారి గుండెలను పిండేసింది. మహా కుంభ మేళా నుంచి మినీ బస్సులో తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ జబల్పూర్ వద్ద ట్రక్కు ఢీకొట్టిన ప్రమాదంలో ఏడుగురు నగర వాసులు మృత్యువాత పడ్డారు. నాచారం ప్రాంతానికి చెందిన ఆరుగురు, మూసారంబాగ్కు చెందిన ఒకరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రయాగ్ రాజ్ కుంభ మేళాకు వెళ్లిన వారంతా స్నేహితులే కావడం గమనార్హం. కాగా.. మృత దేహాలు బుధవారం మధ్యాహ్నం వరకు నగరానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.బై బై అంటూ బయలుదేరి.. మూసారంబాగ్కు చెందిన గోల్కొండ ఆనంద్కుమార్ (47) ఇంటి నుంచి బయలుదేరే ముందు భార్యా పిల్లలకు బై బై అని చెప్పి కుంభ మేళాకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఆనంద్ కుమార్ సలీంనగర్లో గోల్డ్ వర్క్షాప్ నిర్వహిస్తున్నాడు. స్నేహితులతో కలిసి శనివారం ఉదయం నాచారం నుంచి మినీ బస్సులో కుంభమేళాకు బయలుదేరారు. త్రివేణి సంగమంలో స్నానం చేశామని, ట్రాఫిక్ జామ్ ఉందని, వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారని, ట్రాఫిక్ క్లియర్ కావడానికి 24 గంటలు పడుతుందని, ఎవరూ రావొద్దని సోమవారం రాత్రి ఫోన్ చెసి చెప్పాడని బంధువులు తెలిపారు. పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందే.. భోరంపేట సంతోష్ భార్య గత ఏడాది క్రితం కన్నుమూశారు. బుధవారం ఆయన పెళ్లి రోజు. వచ్చే నెల్లో భార్య సంవత్సరీకం నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు హాస్టల్లో ఉంటున్నారు. తన పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందే భార్య వద్దకే వెళ్లిపోయాడంటూ కుటుంబీకులు విలపిస్తున్నారు. బతుకు బండికి డ్రైవర్.. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన కల్కూరి రాజు కుటుంబ పరిస్థితి దయనీయం. ఆయన డ్రైవింగ్ చేస్తేనే వారి ఇల్లు గడిచేది. సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయామని, అంతా రోడ్డునపడ్డామంటూ కుటుంబం విలపిస్తోంది. రాజు మరణ వార్త తెలియడంతోనే శ్రీరామ్ కాలనీ బస్తీ శోకసంద్రంలో మునిగిపోయింది. భర్త లేడన్న వార్త తెలిసి రాజు భార్య మహేశ్వరి గుండెలు పగిలేలా రోదిస్తోంది. కాలనీ సమస్యలపైనే దృష్టి మా నాన్న అందరికి రోల్ మోడల్గా ఉండేవారు. అందరికీ సాయపడే వ్యక్తి ఆయన. అందరితో కలిసి మెలిసి ఉండే వారు. నిత్యం స్థానికులతోనే గడిపే వారు. కాలనీయే ఆయనకు సర్వస్వం. సోమవారం గంగ స్నానం అయిందంటూ మాట్లాడారు. తిరిగి వచ్చేస్తున్నా అని కూడా చెప్పాడు. కాని నాన్న ఇంక రాలేరు. – మల్లారెడ్డి కుమారుడు శ్రావణ్ రెడ్డిపిల్లలకేం చెప్పాలి.. దేవుడా.. ‘నా కొడుకు పిల్లలు హాస్టల్లో ఉన్నారు. తండ్రి మరణ వార్త వారికి ఇంకా తెలియదు. గత ఏడాది వారి తల్లి మృతి చెందింది. ఇప్పుడు తండ్రి కూడా చనిపోయాడు. పిల్లలు హాస్టల్ నుంచి వస్తే నేనేం సమాధానం చెప్పాలి దేవుడా’ అంటూ సంతోష్ తల్లి భోరున విలపిస్తోంది. – విలపిస్తున్న సంతోష్ తల్లి -
Mahakumbh-2025: పోటెత్తిన జనం.. కొనసాగుతున్న మాఘ పూర్ణిమ స్నానాలు
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో నేడు మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ నేపధ్యంలో కుంభమేళా అధికారులు ప్రయాగ్రాజ్ నగరంలోనికి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మాఘపౌర్ణమి వేళ మూడు నుంచి కోట్ల నాలుగు కోట్లమంది భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు త్రివేణీ సంగమానికి తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. #WATCH प्रयागराज, यूपी: माघपूर्णिमा के अवसर पर चांद पूरा दिखा। पवित्र स्नान के लिए त्रिवेणी संगम पर श्रद्धालु पहुंच रहे हैं।#MahaKumbh2025 pic.twitter.com/W9s7csNnim— ANI_HindiNews (@AHindinews) February 12, 2025మాఘపౌర్ణమి ఏర్పాట్ల గురించి కుంభమేళా అధికారి వివేక్ చతుర్వేది మాట్లాడుతూ ఈరోజు(బుధవారం) మాఘపౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి తరలివస్తున్నారు. భారీసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఈ స్నానాలు ఈ రోజంతా కొనసాగనున్నాయన్నారు. #WATCH प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर पवित्र डुबकी लगाने के लिए त्रिवेणी संगम पर महाकुंभ मेला क्षेत्र में श्रद्धालुओं की भारी भीड़ पहुंची। #MahaKumbh2025 pic.twitter.com/iA38Vex2Ta— ANI_HindiNews (@AHindinews) February 11, 2025మహాకుంభమేళాకు ఈరోజు 31వ రోజు. ఈరోజున ఐదవ పవిత్ర స్నానాలు కొనసాగుతున్నాయి. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు కుంభమేళా ప్రాంతంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కుంభమేళాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మాట్లాడుతూ జనం ఎటువంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. పోలీసులు కుంభమేళా ప్రాంతంలో అడుగడునా ఉన్నారని, వారు ఎటువంటి వరిస్థితి తలెత్తినా వెంటనే నివారిస్తారన్నారు.కుంభమేళా ప్రాంతంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వైద్యశిబిరాలలోని సిబ్బంది మాట్లాడుతూ ఇక్కడ 30 మంది నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తున్నారని, 500కు పైగా నర్సింగ్ సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కుంభమేళా జరిగే ప్రాంతాన్నంతటినీ నో వెహికిల్ జోన్గా ప్రకటించారు. దీంతో కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతులు కల్పించారు. బయటి నుంచి వచ్చే ఏ వాహనాలను కూడా నగరంలోనికి అనుమతించడం లేదు. #WATCH| #MahaKumbh2025 | प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर महाकुंभ में श्रद्धालु स्नान के लिए पहुंच रहे हैं। ड्रोन वीडियो त्रिवेणी संगम से है। pic.twitter.com/U0mD6gCp5m— ANI_HindiNews (@AHindinews) February 11, 2025ఇది కూడా చదవండి: Mahakumbh: చక్కెర, గోధుమలు, మైదా గోడౌన్లు ఖాళీ.. దొరకని పాలు, బ్రెడ్ #WATCH प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर पवित्र डुबकी लगाने के लिए श्रद्धालुओं की भारी भीड़ अरैल घाट पहुंची।#MahaKumbh2025 pic.twitter.com/3g08taJquH— ANI_HindiNews (@AHindinews) February 11, 2025 -
45 కోట్ల ‘మహా’ కుంభ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాగ్రాజ్(Prayagraj)లో జరుగుతున్న కుంభమేళాకి భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తుతున్నారు. కుంభమేళా(Kumbh Mela) జరిగే 45 రోజుల్లో మొత్తంగా 45 కోట్ల మంది భక్తులు పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేయగా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య దాటిపోయింది.ఈ నెల 11 నాటికే కుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య 45 కోట్లకు చేరిందని, మహా కుంభమేళా చరిత్రలో అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఇది ఒకటిగా మారిందని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, గొప్ప ఆచారాలు, అత్యాధునిక సాంకేతిక సమ్మిళితంగా, ఈ కుంభమేళా జనసమూహ నిర్వహణ, పారిశుధ్యం, డిజిటల్ సౌకర్యాలలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని ప్రకటించింది. నేడు నో వెహికిల్ జోన్గా మేళా ప్రాంతం.. కాగా బుధవారం మాఘ పూర్ణిమ(Magha Purnima) సందర్భంగా కోట్ల మంది భక్తులు అమృత్ స్నానాలను ఆచరించే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మాఘ పూర్ణిమ స్నానం, గురు బృహస్పతి పూజతో సంబంధం కలిగి ఉండటం, గంధర్వుడు స్వర్గం నుండి పవిత్ర సంగమానికి దిగుతాడనే నమ్మకానికి ప్రసిద్ధి చెందడంతో ఈ స్నానమాచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు రానున్నారు.ఈ నేపథ్యంలో మాఘ పూర్ణిమ స్నానం సమయంలో జనసమూహ నిర్వహణను నిర్ధారించడానికి , రాష్ట్ర ప్రభుత్వం నెల 11 ఉదయం 5 గంటల నుంచే మేళా ప్రాంతాన్ని ’వాహనాలు నిషేధించబడిన ప్రాంతం’(నో వెహికిల్ జోన్’)(No Vehicle Zone)గా ప్రకటించింది. అవసరమైన, అత్యవసర సేవలను అందించే వాహనాలను మాత్రమే అనుమతిస్తుంది. మాఘ పూర్ణిమ తర్వాత ఈ నెల 26 శివరాత్రి రోజున అధిక సంఖ్యలో భక్తులు స్నానమాచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 7 లక్షల మందికి పైగా వైద్య సేవలు.. ఇక మేళాకు వచ్చే భక్తులకు విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా 7 లక్షలకు పైగా యాత్రికులు వైద్య సంరక్షణ పొందారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 23 అల్లోపతి ఆసుపత్రులలో 4.5 లక్షలకు పైగా వ్యక్తులకు చికిత్స అందించామని, 3.71 లక్షలకు పైగా పాథాలజీ పరీక్షలు చేయించుకున్నారని తెలిపింది. -
Mahakumbh: చక్కెర, గోధుమలు, మైదా గోడౌన్లు ఖాళీ.. దొరకని పాలు, బ్రెడ్
ప్రయాగరాజ్: యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాగ్రాజ్లో గత ఐదు రోజులుగా కిలోమీటర్ల పొడవున భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. గతంలో రెండు గంటల్లో చేరుకునే దూరానికి ఇప్పుడు 10 గంటల సమయం పడుతున్నదని స్థానికులు వాపోతున్నారు. వాహనాల రద్దీ కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసర సరుకులను తరలించే రవాణా వాహనాలు ప్రయాగ్రాజ్లోనికి ప్రవేశించలేకపోతున్నాయి.ట్రాఫిక్ను నియంత్రించడానికి పోలీసులు పలుచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాణిజ్య వాహనాలు ప్రయాగ్రాజ్లోనికి ప్రవేశించేందుకు అనుమతి లేకపోవడంతో ప్రయాగ్రాజ్లో పాలు, బ్రెడ్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు పెట్రోల్ పంపులలో పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన మార్కెట్ అయిన ముత్తిగంజ్లోని పలు వ్యాపారులకు చెందిన గిడ్డంగులలో చక్కెర, గోధుమలు, మైదా నిల్వలు దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కొద్దిపాటి స్టాక్ ఉన్న వ్యాపారులు రిటైల్ దుకాణాల డిమాండ్ను తీర్చలేకపోతున్నారు. జనవరి 26 నుంచి ప్రయాగ్రాజ్లోనికి వాణిజ్యవాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే వసంత పంచమి తరువాత కొన్ని వాహనాలకు అనుమతులిచ్చారు. దీంతో కొంతమేరకు సమస్య పరిష్కారమయ్యింది. ఇయితే ఇప్పుడు తిరిగి ఆ ఆహార నిల్వలు ఖాళీ అయిపోయాయి.ప్రయాగ్రాజ్కు చెందిన రిటైల్ వ్యాపారి దీపక్ కేసర్వానీ మీడియాతో మాట్లాడుతూ తాను చక్కెర కొనడానికి హోల్సేల్ మార్కెట్కు వెళ్లగా, అక్కడ చక్కెర నిల్వలు లేనట్లు తెలిసిందన్నారు. మరో వ్యాపారి మాట్లాడుతూ తాను 50 కిలోల చక్కెర కోసం ప్రయత్నించగా, 15 కిలోలు మాత్రమే దొరికిందన్నారు. పప్పుధాన్యాలతో నిండిన ట్రక్కులు గత కొన్ని రోజులుగా చక్ఘాట్ సరిహద్దు వద్దనే ఉండిపోయాయని, వాటిని ప్రయాగ్రాజ్లోనికి అనుమతించడం లేదని గ్రెయిన్ ఆయిల్ సీడ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ కేసర్వానీ తెలిపారు. నగరంలో ఆహారధాన్యాలు, నిత్యావసరాల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్? -
కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్?
యూపీలో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా పలువురి తలరాతలను మార్చేసింది. అటువంటి వారిలో మోనాలిసా ఒకరు. కుంభమేళాకు పూసల దండలు విక్రయించేందుకు వచ్చిన ఆమె రాత్రికిరాత్రే ఎంతో ఫేమస్ అయిపోయింది. జనం ఆమెను చూసేందుకు గుమిగూడుతుండటంతో ఆమె తండ్రి మోనాలిసాను మధ్యప్రదేశ్లోని తమ ఇంటికి తిరిగి పంపించేశాడు. అయితే అక్కడకు కూడా ఆమె అభిమానులు తరలివస్తున్నారు.కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా నటిస్తున్న తొలిచిత్రం షూటింగ్ ఫిబ్రవరి 12న ఢిల్లీలోని ఇండియాగేట్ దగ్గర ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. అయితే షూటింగ్ తేదీ విషయమై ఇంకా నిర్థారణ కాలేదని సమాచారం. ఇదిలావుండగా ఇంతలో ఆమెను ఒక ప్రముఖ జ్యూలయరీ కంపెనీ కలుసుకున్నదని, ఆమెను ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.మోనాలిసా నటిస్తున్న సినిమాకు చెందిన చిత్రబృందం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ జ్యూయలరీ కంపెనీ మోనాలిసాను సంప్రదించిందని, ఆమెతో వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. ఇందుకోసం వారు రూ.15 లక్షలకు కూడా ఇచ్చారని చిత్రబృందం పేర్కొంది. ఈ కంపెనీకి సంబంధించిన ప్రకటన షూటింగ్ ఫిబ్రవరి 14న మొదలుకానున్నదని, ఇందుకోసం మోనాలిసా కేరళ వెళ్లనున్నారని వివరించింది.ఇది కూడా చదవండి: Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి -
Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి
మహాకుంభమేళాకు నేడు (మంగళవారం) 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే మాఘపౌర్ణమి పుణ్య స్నానాలకు అధికారులు పకడందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాగ్రాజ్లో నూతన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. #WATCH प्रयागराज: त्रिवेणी संगम पर पवित्र डुबकी लगाने के लिए महाकुंभ मेला क्षेत्र में श्रद्धालुओं की भारी भीड़ पहुंची।#MahaKumbh2025 pic.twitter.com/Qp7OYkvCVA— ANI_HindiNews (@AHindinews) February 11, 2025ఫిబ్రవరి 10 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఈ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 13 రాత్రి 8 గంటల వరకూ కుంభమేళాకు ఎటువంటి వాహనాలనూ అనుమతించరు. కేవలం కుంభమేళాలో విధులు నిర్వహించే అధికారులు, వైద్య సిబ్బందికి సంబంధించిన వాహనాలను మాత్రమే ప్రయాగ్రాజ్లోకి అనుమతించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళాపై అధికారులతో సమీక్ష జరిపారు. మాఘపౌర్ణిమ నాడు ట్రాఫిక్ నియంత్రణ, క్రౌడ్ మేనేజిమెంట్ను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.సంగమానికి ఎలా వెళ్లాలి?సంగమం చేరుకోవడానికి నడక మార్గం: భక్తులు జీటీ జవహర్ మార్గ్ నుండి త్రివేణీ సంగమానికి చేరుకోవచ్చు. ఈ నడకమార్గంలో భక్తులు కాళీ రాంప్, సంగమం అప్పర్ రోడ్ ద్వారా త్రివేణీ సంగమానికి రావాల్సివుంటుంది.తిరుగు నడక మార్గం: సంగమం ప్రాంతం నుండి అక్షయవత్ మార్గ్ మీదుగా తిరుగు మార్గంలో నడచివెళ్లాల్సివుంటుంది.#WATCH प्रयागराज, उत्तर प्रदेश: #MahaKumbh2025 के दौरान श्रद्धालु त्रिवेणी संगम घाट पर पावन स्नान के लिए पहुंच रहे हैं।वीडियो ड्रोन से ली गई है। pic.twitter.com/mXgJqnT7lg— ANI_HindiNews (@AHindinews) February 11, 2025అధికారులకు సీఎం ఆదిత్యనాథ్ సూచనలుమహా కుంభమేళాకు సంబంధించి అధికారులతో సీఎం యోగి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.1.మహా కుంభ్ మార్గ్లో ట్రాఫిక్ ఎక్కడా ఆగకూడదు. పార్కింగ్ స్థలాలను సక్రమంగా నిర్వహించాలి.2 ప్రయాగ్రాజ్కు భక్తులు అన్ని దిశల నుండి వస్తున్నందున రోడ్లపై వాహనాల క్యూలు ఉండకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలి.3. మాఘ పూర్ణిమ నాడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వసంత పంచమి నాడు అమలు చేసిన వ్యవస్థలను తిరిగి అమలు చేయాలి.4. పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పార్కింగ్ ప్రాంతం నుండి జాతర ప్రాంగణానికి షటిల్ బస్సుల సంఖ్యను పెంచాలి.5. అనుమతి లేకుండా ఏ వాహనాన్ని కూడా కుంభమేళా జరిగే ప్రాంగణంలోకి అనుమతించకూడదు.6. ప్రతి భక్తుడిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చడమనేది అధికారుల బాధ్యత.7. మహాకుంభ్ ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. ఉత్సవం జరుగుతున్న ప్రాంతాలన్నింటినీ క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి.8 ప్రయాగ్రాజ్కు ఆనుకుని ఉన్న జిల్లాల అధికారులు ప్రయాగ్రాజ్ అధికారులతో నిరంతరం టచ్లో ఉండాలి. వాహనాల కదలికలను పరస్పర సమన్వయంతో పర్యవేక్షిస్తుండాలి.9. ప్రయాగ్రాజ్లోని ఏ రైల్వే స్టేషన్లోనూ అధిక జనసమూహం గుమిగూడకుండా చూసుకోవాలి. స్పెషల్ రైళ్లు, అదనపు బస్సులను నడపాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘అద్భుత స్వాగతం’.. పారిస్ నుంచి ప్రధాని మోదీ వీడియో -
Mahakumbh: స్టేషన్లో రద్దీ.. ఏసీ కోచ్ అద్దాలు బద్దలు కొట్టి..
సమస్తీపూర్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఈ మహోత్సవానికి ఇంకా కొద్దిరోజులే మిగిలివుండటంతో చాలామందిలో కుంభమేళాకు ఇప్పటికైనా వెళ్లాలన్న ఆలోచన తలెత్తింది. దీంతో ఏ వాహనం దొరికితో ఆ వాహనంలో కుంభమేళాకు చేరుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాగ్ రాజ్కు చేరుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీహార్లోని రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. రైల్లో కూర్చొనేందుకు స్థలం దొరకకపోవడంతో ప్రయాణికులు రైలుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్లో కుంభస్నానానికి వెళుతున్న యాత్రికులు రైలులో ఎలాగైనా ఎక్కాలనే ఆతృతలో స్వతంత్ర సేనాని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులోని అన్ని ఏసీ కోచ్ల అద్దాలను బద్దలు కొట్టారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన నవాడా స్టేషన్లో జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్నవారు తెలిపిన వివరాల ప్రకారం జయనగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఈ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు లెక్కకుమించినంతమంది ప్రయాణికులు స్టేషన్కు చేరుకున్నారు. అయితే జనరల్ కంపార్ట్మెంట్ మొదలుకొని ఏసీ కోచ్ వరకూ దేనీలోని కాలు మోపేందుకు కూడా స్థలం లేకపోవడంతో స్టేషన్లోని ప్రయాణికుల్లో అసహనం మొదలయ్యింది.బయట స్టేషన్లో ఉన్న జనాన్ని చూసిన రైలులోని వారు కోచ్ తలుపులను మూసివేశారు. దీంతో ముధుబని స్టేషన్లో రైలు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు ఏసీ కోచ్ అద్దాలను బద్దలుకొట్టారు. ఆ సమయంలో రైల్వే పోలీసులు అక్కడే ఉన్నా వారు ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన నేపధ్యంలో రైలు 25 నిముషాల పాటు నవాడా స్టేషన్లో నిలిచిపోయింది. ఇది కూడా చదవండి: Madhya Pradesh: మహిళలకు నెలకు రూ. 3000.. సీఎం ప్రకటన -
Mahakumbh-2025: పోటెత్తిన భక్తులు.. ప్రయాగ్రాజ్ సంగమం స్టేషన్ మూసివేత
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు ఈరోజు(సోమవారం) భారీ సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎటువంటి ప్రమాదకర ఘటన జరగకుండా ఉండేందుకు ప్రయాగ్రాజ్ సంగమం రైల్వే స్టేషన్ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రైలు ప్రయాణికులు ప్రయాగ్రాజ్ జంక్షన్ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నాక, సంగమం స్టేషన్ను తిరిగి తెరుస్తామని అధికారులు చెబుతున్నారు.ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రతిరోజూ భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్రాజ్లోని రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్జామ్ ఏర్పడుతోంది. ఇదేతరహాలో సంగమం రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల భారీ రద్దీ ఏర్పడుతోంది. దీనిని నివారించేందుకు ఈస్టేషన్ను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వేశాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. అలాగే కుంభమేళాకు వచ్చే భక్తులకు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇది కూడా చదవండి: Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి.. -
Maha Kumbh: ‘కుంభమేళా’ అనగానే 15 ఏళ్ల గతం గుర్తుకువచ్చి..
మహాకుంభమేళా.. ప్రపంచాన్నంతటినీ ఆకట్టుకుంటున్న మహోత్సవం. దీనిలో పలు అద్భుతాలు, వింతలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం ఎంతో ఆసక్తిగొలుపుతోంది. 15 ఏళ్ల క్రితం కనుమరుగైన ఒక వ్యక్తి అత్యంత విచిత్ర పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ కథనం జార్ఖండ్లోని కోడర్మా జిల్లాకు చెందిన ప్రకాష్ మహతోకు సంబంధించినది.ఆ సమయంలో ప్రకాష్.. కోడర్మా మునిసిపల్ కార్పొరేషన్(Koderma Municipal Corporation)లో పనిచేసేవాడు. 2010లో ఒక రోజున డ్యూటీకి వెళ్లిన ప్రకాష్ ఇంటికి తిరిగి రాలేదు. మానసిక పరిస్థితి సరిగా లేనందున ఇంటికి వెళ్లే దారిని మరచిపోయాడు. ప్రకాష్ కుటుంబసభ్యులు తమకు తెలిసిన అన్నిచోట్లా వెదికినా ఫలితం లేకపోయింది. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎంత గాలించినా ప్రకాష్ ఆచూకీ తెలియరాలేదు.అయితే 15 ఏళ్ల తరువాత తాజాగా ప్రకాష్ మహతోను బీహార్లోని రాణిగంజ్(Raniganj in Bihar) ప్రాంతంలో హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆ హోటల్ యజమాని సుమిత్ అతనికి పహల్వాన్ అని పేరుపెట్టాడు. చాలాకాలంగా ప్రకాష్ అదే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల హోటల్లో కుంభమేళా ప్రస్తావన వచ్చింది. దీంతో ప్రకాష్ తాను కుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నానని, అదే దారిలో తమ ఇల్లు ఉందని హోటల్ యజమాని సుమిత్కు చెప్పాడు. దీంతో సుమిత్ ఈ విషయాన్ని కోడర్మా పోలీసులకు ఫోనులో తెలియజేశాడు. వారు ప్రకాష్ అతనేనని నిర్థారించాక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.దీంతో ఎంతో ఆనందంతో ప్రకాష్ భార్య గీతాదేవి, కుమారుడు సుజల్, కుమార్తె రాణీ తదితరులు రాణిగంజ్ చేరుకున్నారు. భర్తను చూసిన గీతాదేవి, తండ్రిని చూసిన సుజల్, రాణి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకాలం గీతాదేవి కూలిపనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. 15 ఏళ్ల తరువాత ఇంటిపెద్ద కనిపిస్తాడని, వారెవరూ ఊహించలేదు. వారంతా కోడర్మాలోని తమ ఇంటికి చేరుకుని, ఇదంతా కుంభమేళా మహత్మ్యమేనని అందరికీ చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Todays History: ఫిబ్రవరి 10న ఏం జరిగింది? 2013 కుంభమేళాతో లింకేంటి? -
Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఈ మహోత్సవానికి దేశవిదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో చూసినా పొడవైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది.కుంభమేళా(Kumbh Mela)కు వచ్చిన భక్తులు రాష్ట్రంలోని అయోధ్య, వారణాసి, మధుర తదితర ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో ఈ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ఆలయాల్లో కాలుమోపేందుకు కూడా స్థలం కనిపించని విధంగా ఉంది. ఆదివారం(ఫిబ్రవరి 9) సెలవు దినం కావడంతో లెక్కకుమించినంతమంది భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. కుంభమేళాకు వచ్చినవారిలో చాలామంది అయోధ్యను సందర్శిస్తున్నారు. దీంతో అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ ట్రస్ట్ పలు ఏర్పాట్లు చేసింది.భక్తుల రద్దీ కారణంగా అయోధ్యలో విపరీతమైన ట్రాఫిక్ జామ్(Traffic jam) ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ విభాగం వాహనాలను నియంత్రించేందుకు పలు ప్రయత్నాలు చేసింది. ఈ నేపధ్యంలో పలు సమస్యలు తలెత్తాయి. ఇదేవిధంగా యూపీలోని సుల్తాన్పూర్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడి నుంచి భారీసంఖ్యలో జనం కుంభమేళాకు తరలివెళుతుండటంతో నేషనల్ హైవే వాహనాలతో నిండిపోయింది. ట్రాఫిక్ ఏమాత్రం ముందుకు కదలకపోవడంతో పలుచోట్ల ప్రయాణికులు ఆందోళనకు దిగారు.మధురలోని బృందావనం(Vrindavan in Mathura) కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం నాడు మధురకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించినవారంతా నేరుగా మధురకు చేరుకుని, శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో మధురలో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. ఇదే తరహాలో వారణాసిలోనూ భక్తుల కోలాహలం కనిపించింది. కాశీలోని అన్ని గల్లీలు భక్తులతో నిండిపోయాయి. ఇక్కడి అన్ని ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇది కూడా చదవండి: భలే కుర్రాడు.. ఆన్సర్ షీట్లో ఆ ఒక్క ముక్క రాసి.. -
స్నేహితులతో కలిసి మహాకుంభ మేళాకు ఉపాసన.. పోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్ మేళాకు వెళ్లారు. తన సోదరి, మరికొందరు స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్తున్న ఫోటోలను ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం ఆరు గంటలకే ప్రయాగ్ రాజ్ విమానాశ్రయం చేరుకున్నట్లు పోస్ట్లో తెలిపింది. యూపీలోని ప్రయాగ్రాజ్లో కొద్ది రోజులు పలువురు సినీ ప్రముఖులు సైతం గంగానదిలో పవిత్రస్నానాలు ఆచరించారు. మూడు లడ్డూలతో కలిసి కుంభ్ మేళాను వెళ్తున్నానంటూ తన ఫ్రెండ్స్ను ఉద్దేశించి ఫన్నీగా రాసుకొచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్ సెట్లోని ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నందున రామ్ చరణ్ యాత్రకు వెళ్లలేదు. ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్ మూవీతో అభిమానులను పలకరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయింది.యూపీలో జరుగుతున్న కుంభ మేళాకు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ తన తల్లితో కలిసి ప్రయాగ్రాజ్ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సైతం తన తల్లి మాధవితో కలిసి మహాకుంభ్ మేళాకు హాజరయ్యారు. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఇటీవలే కుంభ్ మేళాలో కనిపించారు. -
Mahakumbh-2025: పెట్టుబడి పిసరంత.. ఆదాయం కొండంత.. ఏం ఐడియాలు గురూ!
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 26 వరకూ ఈ పవిత్ర ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా కోట్లాదిమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఉత్సవం నేపధ్యంలో కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోగా, మరోవైపు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్నారు.టూత్ స్టిక్స్ విక్రయిస్తూ..మహా కుంభమేళా(Kumbh Mela)లో కొందరు చిరువ్యాపారులు లక్షలు సంపాదిస్తున్న ఉదంతానికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతున్నాయి. వీరిలో కొందరు టూత్ స్టిక్స్ విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తుండగా, మరికొందరు టీ విక్రయిస్తూ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇటీవల ఒక కుర్రాడు కుంభమేళాలో టూత్ స్టిక్స్ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆ కుర్రాడు ఈ ఐడియా తన గర్ల్ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాడు. టూత్ స్టిక్స్ అమ్ముతూ తాను రోజూ వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆ కుర్రాడు ఆ వీడియోలో తెలిపాడు.టీ అమ్ముతూ రోజుకు రూ. 15 వేలుమరోవ్యక్తి మహా కుంభ్లో టీ స్టాల్ ఏర్పాటు చేసుకుని టీ తోపాటు భేల్ పూరి విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ కుర్రాడు తాను భేల్ పూరీలు తయారు చేస్తూ, టీ తయారు చేసే పనికోసం మరో కుర్రాడిని నియమించి, రోజుకు రూ. 15 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ఇలాంటి మరో వీడియోలో ఒక కుర్రాడు తన చేతిలో కెటిల్ పట్టుకుని కుంభమేళా ప్రాంతమంతా కలియతిరుగుతూ టీ విక్రయిస్తున్నాడు. తాను టీ విక్రయిస్తూ(Selling tea) రోజుకు ఎనిమిది నుంచి 10 వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు.తిలకం దిద్దుతూ రోజుకు రూ. 20 వేలుమహా కుంభమేళాకు వచ్చిన భక్తులకు తిలకం దిద్దతూ ఒక వ్యాపారి రోజుకు పది వేల నుంచి 20 వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడంటే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది నిజం.. ఆ వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం అతను తాను తిలకం దిద్దిన ఒక్కో వ్యక్తి నుంచి రూ. 10 చొప్పున వసూలు చేస్తున్నాడు. రోజుకు తాను రెండువేల మందికి తిలకం దిద్దుతున్నానని తెలిపాడు. ఈ మహా కుంభమేళా ముగిసేనాటికి తాను ఎనిమిది లక్షల రూపాయల వరకూ సంపాదించగలనని ఆ వ్యాపారి చెబుతున్నాడు.నాణేలు ఏరుతూ రోజుకు రూ. 4 వేలుకుంభమేళా వీడియోల్లో మరో వీడియో అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ వీడియోలో ఒక కుర్రాడు గంగానదిలో ఐస్కాంతం సాయంతో నాణేలను వెదుకుతున్నాడు. భక్తులు గంగానదిలో విసిరిన నాణేలను సేకరిస్తున్నట్లు ఆ కుర్రాడు చెప్పాడు. ఈ విధంగా తాను రోజుకు నాలుగు వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నట్లు తెలిపి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది కూడా చదవండి: Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష -
ప్రయాగ్ రాజ్లో పుష్పరాజ్.. పోలీసులు ఫిదా!
అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఇటీవల పుష్ప-2 ఓటీటీలో విడుదలవగా.. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్పై తెగ చర్చింకుంటున్నారు. హాలీవుడ్ అభిమానులు సైతం పుష్ప ఫైట్ సీన్పై వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లే పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక ఇండియావ్యాప్తంగా బన్నీ క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. పుష్ప-2 నార్త్లో ప్రభంజనం సృష్టించింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. గతంలో ఏ హిందీ సినిమాకు సాధించని ఘనతను సొంతం చేసుకుంది. దీంతో సౌత్ కంటే నార్లోనే పుష్పరాజ్ హవా ఎక్కువగా కొనసాగింది. దీంతో ఉత్తరాది ఫ్యాన్స్ బన్నీ మేనరిజానికి ఫిదా అయిపోయారు. పుష్ప స్టైల్లో డైలాగ్స్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.తాజాగా ఓ అభిమాని అచ్చం పుష్పరాజ్ స్టైల్లో కనిపించి సందడి చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని ప్రయాగ్రాజ్లో మహాకుంభ్ మేళాకు వచ్చాడు. పవిత్ర స్నానం చేసిన అల్లు అర్జున్ అభిమాని అచ్చం పుష్ప సినిమాలో దుస్తులు ధరించి డైలాగ్స్తో అదరగొట్టాడు. ఇది చూసిన పోలీసులు అతని స్టైల్కు ఫిదా అయ్యారు. అతన్ని చెప్పే డైలాగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.(ఇది చదవండి: పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్!)కాగా.. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేసింది. తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప-2 ఓవరాల్గా రూ.1831 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో మెప్పించారు.Prayagraj: A fan of Allu Arjun, who came from Maharashtra to take the Maha Kumbh bath.During this, the fan also recited many dialogues from the movie Pushpa while acting, which became a topic of discussion among the devotees present there.#Prayagraj #AlluArjunFan #Mahakumbh pic.twitter.com/mK0s1wtasA— Our North East (@1OurNortheast) February 6, 2025महाकुम्भ स्नान करने के लिए महाराष्ट्र से आए अल्लू अर्जुन के एक फैन ने संगम में आस्था की डुबकी लगाई। इस दौरान फैन ने पुष्पा फिल्म की एक्टिंग करते हुए कई डायलॉग भी सुनाए, जो वहां मौजूद श्रद्धालुओं के बीच चर्चा का विषय बने। #Prayagraj #AlluArjunFan #Mahakumbh @MahaaKumbh pic.twitter.com/wxetmRuQoH— Dinesh Tiwari 🇮🇳 (@TiwariDineshTi1) February 5, 2025 -
కుంభమేళాపై డీకేఎస్ కీలకవ్యాఖ్యలు
బెంగళూరు:కుంభమేళాకు వెళ్లడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(డీకేఎస్) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానమాచరించడం అనేది తన వ్యక్తిగత విషయమని చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం(ఫిబ్రవరి5) మీడియాతో మాట్లాడారు. కుంభమేళాకు వెళ్తానని తాను చెప్పడంపై కర్ణాటక ప్రతిపక్షనేత ఆర్.అశోక్ చేసిన విమర్శలకు శివకుమార్ ఘాటుగా స్పందించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుంభమేళాపై చేసిన వ్యాఖ్యలకు తన కుంభమేళా పర్యటనకు లింకు పెట్టడంపై శివకుమార్ మండిపడ్డారు. అశోక్ కాదు ప్రధాని మోదీ, అమిత్ షా ఈ విషయంపై మాట్లాడితేనే తాను సమాధానం చెప్తానన్నారు.గంగా,కావేరీ,కృష్ణా నదులు ఎవరికీ చెందినవి కాదని, నీటికి రంగు రుచి ఉండదన్నారు. అశోక్ తనపై కాదని, ప్రధాని కుంభమేళాకు వెళ్లి స్నానం చేసిన అంశంపై విమర్శలు చేయాలని సూచించారు. -
కుంభమేళాలో ఆకర్షించిన ప్రధాని వస్త్రధారణ
ప్రయాగ్రాజ్:ప్రధాని మోదీ తాను ధరించే దుస్తుల ప్రత్యేకత గురించి వేరే చెప్పనవసరం లేదు. దుస్తుల విషయంలో ఆయన ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ను అనుసరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించే సందర్భం ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదాయానికి తగట్టు వ్యవహరిస్తూనే ఫ్యాషన్ను ఫాలో అవుతుంటారు.బుధవారం(ఫిబ్రవరి5) ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఏకంగా మూడు రకాల దుస్తులు ధరించారు. అరాలీ ఘాట్ నుంచి త్రివేణి సంగమానికి బోట్లో వెళుతున్న సమయంలో సంప్రదాయ కుర్తా,పైజామా పైన నెహ్రూ జాకెట్ ధరించారు.ఇక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించే సమయంలో మాత్రం ప్రధాని సంప్రదాయానికి భిన్నంగా అథ్లీజర్ దుస్తులను ధరించారు. మెడలో నీలిరంగు స్కార్ఫ్ వేసుకుని మణికట్టుకు రుద్రాక్ష మాల చుట్టుకున్నారు.స్నానం పూర్తయి హారతి ఇచ్చే సమయంలో కుర్తా,చుడీదార్ పైజామా వేసుకున్నప్పటికీ కుర్తాపై పఫ్ఫర్ జాకెట్ ధరించారు.తలపై రంగురంగుల పహారీ టోపీ ధరించారు. ప్రధాని కుంభమేళా పర్యటన సమయంలో ధరించిన దుస్తుల విషయంలో సోషల్మీడియాలో చర్చ జరుగుతోంది. -
నేడు మహాకుంభ మేళాకు మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభ మేళా(Maha Kumbh Mela)కు ప్రధాని మోదీ(Narendra Modi)5న హాజరవుతున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బుధవారం ఉద యం ఢిల్లీ నుంచి ప్రత్యేక వి మానంలో ఆయన ప్రయాగ్ రాజ్కు చేరుకుంటారు.ఉదయం 11 గంటల సమయంలో త్రివేణి సంగమంలో మోదీ స్నానమాచరించి, గంగాదేవికి పూజలు చేస్తారు. జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనుంది. -
తొక్కిసలాట పెద్ద విషయమేమీ కాదు: హేమామాలిని
న్యూఢిల్లీ: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని మహా కుంభమేళా దుర్ఘటనపై చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలో అంత మంది చనిపోవడం పెద్ద విషయమేమీ కాదని అన్నారామె. మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం తొక్కిసలాటలో 30 మంది మరణించగా.. 60 మంది గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. మరణాల సంఖ్యను యూపీ సర్కార్ దాస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ అంశం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలనూ కుదిపేస్తోంది. అయితే ఈ విమర్శలపై హేమా మాలిని స్పందించారు. #WATCH | Delhi: BJP MP Hema Malini says "...We went to Kumbh, we had a very nice bath. It is right that an incident took place, but it was not a very big incident. I don't know how big it was. It is being exaggerated...It was very well-managed, and everything was done very… pic.twitter.com/qIuEZ045Um— ANI (@ANI) February 4, 2025‘‘మేమూ పుణ్య స్నానం కోసం అక్కడికి వెళ్లాం. జరిగిందేదో జరిగింది. అయినా అదేం అంత పెద్ద ఘటనేం కాదు. కేవలం ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్న అతిశయోక్తి మాత్రమే. కుంభ మేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది. అంతా సజావుగానే జరుగుతోంది. అయితే అంత మంది వస్తుండడంతో.. నిర్వాహణ కాస్త కష్టతరమే. కాబట్టి తొక్కిసలాట పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు అని అన్నారామె. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ తారీఖ్ అన్వర్ కౌంటర్ ఇచ్చారు. ఆమె నటి, పైగా అధికారంలో ఉన్నారు. అందుకే ఆమెకు వీఐపీ ట్రీట్మెంట్ దక్కి ఉంటుంది. తొక్కిసలాటకు దారి తీసే భయంకరమైన రద్దీ ఎలా ఉంటుందో బహుశా ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు అని అన్నారామె. ఒకవేళ అది(తొక్కిసలాట ఘటన) పెద్ద విషయం కాదని ఆమె అంటే.. అది నిజంగా దురదృష్టకరం. అది బాధిత కుటుంబాలను అవమానించడమే అని అన్నారాయన#WATCH | On BJP MP Hema Malini's statement on the Maha Kumbh Stampede, Congress MP Tariq Anwar says, "Hema Malini can never know what it was really like. When she visited, she was given VIP treatment. Things at Maha Kumbh went downhill because the police and administration were… pic.twitter.com/SnsQGfnIkA— ANI (@ANI) February 4, 2025ఇదిలా ఉంటే.. గత వారం పుణ్య స్నానానికి వెళ్లిన హేమా మాలిని.. గొప్ప అనుభూతిని పొందినట్లు ఆ టైంలో వ్యాఖ్యానించారు. ఆ టైంలో ఆమె వీవీఐపీ టట్రీట్మెంట్ గురించి చర్చ నడిచింది. మరోవైపు మహాకుంభమేళాలో సామాన్యులను పట్టించుకోవడం లేదని, కేవలం వీవీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు ఉంటున్నాయనే ఆరోపణలు మొదటి నుంచి వినవస్తున్నాయి. -
తొక్కిసలాట మరణాలపై తప్పుడు లెక్కలు.. లోక్సభలో అఖిలేష్ ఫైర్
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్లో దుమారం చెలరేగింది. ఈ దుర్ఘటనలో మరణాలు దాస్తున్నారంటూ.. ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కుంభమేళా సందర్భంగా యోగి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపైనా మండిపడ్డ ఆయన.. తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?.. అసలైన లెక్క బయటపెట్టండి.. అంటూ ప్రసంగించారు.రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు పార్లమెంట్ మంగళవారం కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ క్రమంలో.. కుంభమేళా దుర్ఘటనపై అఖిలేష్ యాదవ్ ప్రసంగించారు. ‘‘మహా కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరం. యూపీ ప్రభుత్వం 30 మంది చనిపోయారని, 60 మందికి గాయాలయ్యాయని చెబుతోంది. కానీ, విపక్షాలు ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నాయని అంటున్నాయి. బడ్జెట్ విషయంలో సరైన లెక్కలు చెప్పే ఈ ప్రభుత్వం.. కుంభమేళా మరణాల సంఖ్యను మాత్రం ఎందుకు దాస్తోంది. అసలు ఈ దుర్ఘటనకు బాధ్యత ఎవరిది? ఇప్పటిదాకా ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు అని అఖిలేష్ ప్రశ్నించారు.#WATCH | Samajwadi Party Chief Akhilesh Yadav says "Uttar Pradesh Chief Minister did not express condolence. When the President and Prime Minister of the country expressed condolence, after 17 hours the (State) government accepted it. These are the people who cannot accept the… pic.twitter.com/4F3ONlYA0l— ANI (@ANI) February 4, 2025కుంభమేళా తొక్కిసలాట ఘటనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించాలి. మరణాలు, గాయపడ్డవాళ్లు, వాళ్లకు అందుతున్న చికిత్స, అక్కడి వైద్య సిబ్బంది, రవాణా సదుపాయలు, వైద్యం.. ఇలా అన్నింటి గురించి చర్చ జరగాలి అని ఆయన డిమాండ్ చేశారాయన. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపేంతదాకా యోగి సర్కార్ సంతాపం ప్రకటించకపోవడంపైనా అఖిలేష్ విరుచుకుపడ్డారు. అలాగే.. పెట్టుబడుల విషయంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఇంజిన్లు మాత్రమే కాదు.. భోగీలు కూడా ఢీ కొట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి.. మౌని అమావాస్య పురస్కరించుకుని అమృత స్నానాల కోసం భక్తులు పోటెత్తారు. అఖాడా ఘాట్ల వద్ద ఒక్కసారిగా తోపులాట జరగడంతో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు మృతి చెందగా, గాయపడ్డవాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటలకు పరిస్థితి అదుపులోకి రావడంతో పుణ్య స్నానాలు యథాతధంగా కొనసాగాయి. చివరకు.. ఘటనలో 30 మంది మరణించినట్లు అక్కడి పోలీసు అధికారులు సాయంత్రం ప్రకటించారు. -
Maha Kumbh: మిగిలినవి అమృత స్నానాలు కాదు.. కారణమిదే
మహా కుంభమేళాలోని మూడవ, చివరి అమృత స్నానం వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాడు ప్రశాంతంగా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో మూడు ప్రముఖ రోజులలో అమృత స్నానాలు జరిగాయి. ఇంకో రెండు పుణ్యస్నానాలు కూడా ఉన్నాయి. అయితే పండితులు వాటిని అమృత స్నానాలుగా పరిగణించరు.మాఘ పూర్ణిమ(ఫిబ్రవరి 12), మహాశివరాత్రి(ఫిబ్రవరి 26) రోజులలో కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అయితే ఈ స్నానాల సమయంలో అమృత ఘడియలు లేవని చెబుతారు. మొఘలుల కాలం నుండి నాగ సాధువులకు ప్రత్యేక గౌరవం ఇస్తూ, వారికి ప్రత్యేక రాజ స్నానాల హోదాను కల్పించారు. ఆది శంకరాచార్యులు(Adi Shankaracharya) ధర్మ సంరక్షకునిగా నాగ సాధువుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నాగ సాధువులకు మొదట స్నానం చేసే హోదాను కూడా శంకరాచార్యులే కల్పించారని చెబుతారు.నాగ సాధువులు వసంత పంచమి నాడు అమృత స్నానం చేశాక వారి నివాసస్థానాలకు వెళ్లిపోతారు. అమృత స్నానాల నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉంది. సూర్యుడు మకర రాశిలో.. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే రాజ స్నానాలు చేస్తారు. వీటినే అమృత స్నానాలు అని కూడా ఉంటారు. మాఘ పూర్ణిమ(Magha Purnima) నాడు, బృహస్పతి వృషభరాశిలో ఉంటాడు. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా శివరాత్రి రోజున కూడా సూర్యుడు కుంభ రాశిలోనే ఉంటాడు. ఫలితంగా అది పవిత్ర స్నానం అవుతుంది. కానీ దానికి అమృత స్నానం అనే స్థితి లభించదు.ఇది కూడా చదవండి: 5న ప్రధాని మోదీ కుంభస్నానం -
5న ప్రధాని మోదీ కుంభస్నానం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాను సందర్శించనున్నారు. అనంతరం పవిత్ర తివేణీ సంగమంలో పుణ్య స్నానం చేయనున్నారు. బుధవారం, మాఘ మాసం అష్టమి తిథి నాడు ప్రధాని మోదీ పవిత్ర స్నానం చేయనున్నారు. తరువాత త్రివేణీ సంగమం ఒడ్డున గంగామాతను పూజించి, దేశప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయనున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు మహాకుంభ్ ప్రాంతానికి చేరుకోనున్నారు. అనంతరం అరయిల్ ఘాట్ నుండి పడవ ద్వారా సంగమ ప్రాంతానికి వెళ్తారు. ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్లో దాదాపు గంటసేపు ఉంటారు. కాగా 2024 డిసెంబర్ 13న ప్రధాని సంగమం ఒడ్డున గంగా నదికి హారతినిచ్చి, పూజలు నిర్వహించి, కుంభమేళా విజయవంతం కావాలని ప్రార్థించారు. బుధవారం కుంభమేళాకు వస్తున్న ప్రధాని మోదీ అక్కడ అఖాడాలను కలుసుకోనున్నారు.2019లో ప్రయాగ్రాజ్లో జరిగిన అర్థ కుంభమేళాలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగి, సామాజిక సామరస్య సందేశాన్ని అందించారు. ప్రధాని నుంచి అటువంటి గౌరవాన్ని పొందిన ఐదుగురు సిబ్బందికి నోటమాటరాలేదు. ఆ దృశ్యాన్ని చూసిన ఇతర పారిశుధ్య కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ కూడా దీనిని తన జీవితంలో అత్యంత మరపురాని క్షణంగా అభివర్ణించారు.ఇది కూడా చదవండి: 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్తో భేటీ? -
Mahakumbh: అఖాడాల అమృతస్నానం.. హెలికాప్టర్ నుంచి పూల వర్షం.. వార్ రూమ్లో సీఎం యోగి
యూపీలో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు(సోమవారం) వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాటికి ఐదు కోట్లకు పైగా భక్తులు స్నానాలు ఆచరిస్తారని కుంభమేళా నిర్వాహకులు అంచనా వేశారు. జనసమూహాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వసంత పంచమి అమృత స్నానాల సందర్బంగా భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘వార్ రూమ్’లో కూర్చుని, కుంభమేళా పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు. #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: A woman devotee blows the conch shell at Sangam Ghat as saints and devotees gather for Amrit Snan on the occasion of Basant Panchami. pic.twitter.com/vXlIqmiVun— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్రాజ్లో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానానికి సిద్ధమైన సాధువులు, భక్తుల మధ్య సంగమ్ ఘాట్ వద్ద శంఖం పూరిస్తున్న ఒక మహిళా భక్తురాలు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: Foreign devotees sing 'Hanuman Chalisa' as they head to Triveni Sangam for the 'Amrit Snan' on the occasion of Basant Panchami. pic.twitter.com/Fnmw9AhYP8— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్రాజ్లో వసంత పంచమి సందర్భంగా 'అమృత స్నానం' కోసం త్రివేణి సంగమం వైపు వెళుతున్న విదేశీ భక్తులు 'హనుమాన్ చాలీసా' పఠిస్తూ కనిపించారు.స్వామి కైలాసానంద గిరి మాట్లాడుతూ ‘13 అఖాడాలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తున్నారు. మేము గంగా మాతను, శివుడిని పూజించాం. నాగ సాధువులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది మా మూడవ 'అమృత స్నానం', నేను ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాను. 13 అఖాడాలకు అవసరమైన ఏర్పాట్లు చేసినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అభినందనలు’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | Spiritual leader Swami Kailashanand Giri says, "All the 13 Akhadas took a holy dip at Triveni Sangam...We offered prayers to Ganga Maa, Lord Shiva...All the Nagas are very excited...This was our third 'Amrit Snan'...I congratulate UP… pic.twitter.com/po5OtrAArf— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్రాజ్లోని ఒక నాగ సాధువు మాట్లాడుతూ ‘గత రెండు అమృత స్నానాల కంటే ఈరోజు ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయి. ఈరోజు స్నానం మాకెంతో ముఖ్యమైనది’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | A Naga sadhu says, "Arrangements today were better than the previous two Amrit Snans... Today's snan was the biggest for us saints..." pic.twitter.com/n1OPYfYw34— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్రాజ్లోని ఒక సాధువు మీడియాతో మాట్లాడుతూ ‘ఈరోజు అమృత స్నానం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అఖాడాలు, సాధువులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | A saint says, "... The Amrit Snan was very good today... All akharas and saints took a holy dip. The arrangements were very nice." pic.twitter.com/Ebqvcv8oTG— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానం చేసిన తర్వాత ఒక విదేశీ భక్తుడు మాట్లాడుతూ ‘ఇది మాటల్లో చెప్పలేని మధుర అనుభవం. నేను చాలా ధన్యుడినయ్యానని భావిస్తున్నాను’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: After taking a holy dip, a foreign devotee says, "It is an experience beyond words and I feel very blessed..." pic.twitter.com/8N3o8DUjsl— ANI (@ANI) February 3, 2025ఆచార్య లక్ష్మీనారాయణ్ త్రిపాఠి మాట్లాడుతూ ‘ఈ పవిత్రమైన రోజున అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అఖాడాలు ఎల్లప్పుడూ ఐక్యంగానే ఉంటారు’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: After taking a holy dip, a foreign devotee says, "It is an experience beyond words and I feel very blessed..." pic.twitter.com/8N3o8DUjsl— ANI (@ANI) February 3, 2025జునా అఖారా స్నానం పూర్తయింది. మొదట మహానిర్వాణి, తరువాత శ్రీ నిరంజని, అనంతరం జునా అఖారా స్నానం చేశారు. జూనా అఖారాకు చెందిన నాగ సాధువులు వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం చేశారు. #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | Acharya Laxminarayan Tripathi of Kinnar Akhara says, "... We are all very happy on this auspicious day. The Kinnar Akhara was, is, and will always be united." pic.twitter.com/z867gPFecp— ANI (@ANI) February 3, 2025ఇది కూడా చదవండి: Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: Naga sadhus of the Juna Akhara take a holy dip as part of the Amrit Snan on the occassion of Basant Panchami. pic.twitter.com/1WsR4Elltj— ANI (@ANI) February 3, 2025 -
Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు(సోమవారం) వసంతపంచమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే త్రివేణీ సంగమంలో అమృత స్నానాలు మొదలయ్యాయి. నాగ సాధువులు ఈరోజు తొలిస్నానం ఆచరిస్తున్నారు. #WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: The Juna Akhada reaches for the 'Amrit Snan' on the occassion of Basant Panchami. pic.twitter.com/CSVam6KdGJ— ANI (@ANI) February 3, 2025మహాకుంభమేళా ప్రాంతంలో వసంత పంచమి సందర్భంగా మూడవ అమృత స్నానానికి వేలాది మంది భక్తులు సిద్ధమయ్యారు. దీంతో త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది.Millions of pilgrims, saints, yogis, and visitors from around the world gathered at the sacred Triveni Sangam—the confluence of Maa Ganga, Yamuna, and Saraswati—seeking spiritual purification. They took a holy dip in the sacred waters during the Amrit Snan on the auspicious… pic.twitter.com/FahoAvrb0O— Mahakumbh (@MahaKumbh_2025) February 2, 2025గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో నిరంజని అఖాఢా అధిపతి కైలాశానంద గిరి మహారాజ్, నిరంజని అఖాఢాకు చెందిన ఇతర సాధువులు పవిత్ర స్నానాలు చేశారు. మహంత్ రవీంద్ర పూరి మాట్లాడుతూ తమ స్నానం ఎంతో సంతోషంగా జరిగిందని, అందరూ చాలా ఆనందంగా ఉన్నారన్నారు. పవిత్ర స్నానాలు చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారన్నారు.#WATCH | #MahaKumbh2025 | Prayagraj: Avigail from Austria says, "It is unbelievable and amazing. This is once in a lifetime experience...I have started understanding the people of India...I have never seen anything like this..." pic.twitter.com/3wXVj392J2— ANI (@ANI) February 3, 2025రష్యాకు చెందిన మహానిర్వాణి అఖాడాకు చెందిన మీనాక్షి గిరి మాట్లాడుతూ ‘ఇది నా జీవితంలో చాలా పవిత్రమైన క్షణం. నేను గత 17 సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాను’ అని అన్నారు.#WATCH | Prayagraj, UP | #MahaKumbhMela2025 | Drone visuals of Maha Kumbh Mela Kshetra, Triveni Sangam, as thousands of devotees gather for the third Amrit Snan on the occassion of Basant Panchami. pic.twitter.com/LtLjC083QP— ANI (@ANI) February 3, 2025నాగ అఖాడాలన్నింటిలో అతిపెద్దదైన జునా అఖాఢా సాధువులు అమృత స్నానం కోసం వేచిచూస్తున్నారు. ఇదేవిధంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఘాట్ వద్దకు చేరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు(వసంత పంచమి)ఇప్పటివరకు 16.58 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.VIDEO | Maha Kumbh 2025: Juna Akhara prepares to leave for Basant Panchami Amrit Snan. #MahaKumbh2025 #MahaKumbhWithPTI pic.twitter.com/c2Mq1AXipQ— Press Trust of India (@PTI_News) February 2, 2025వసంత పంచమి అమృత స్నానాల వేళ నాగ సాధువులు మాత్రమే కాకుండా అదృశ్య ఋషులు కూడా స్నానం చేయడానికి వస్తారని చెబుతుంటారు. ఈ రోజున స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని అఖాఢా మహానిర్వాణికి చెందిన ఒక సాధువు తెలిపారు.నిరంజని అఖాడా ఆచార్య మహామండలేశ్వర్, నిరంజన్ పీఠాధీశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహారాజ్ మాట్లాడుతూ ‘నేడు వసంత పంచమి. ఈరోజు సనాతనీయులంతా సరస్వతి మాతను పూజిస్తారని అన్నారు.VIDEO | Maha Kumbh 2025: A seer from Panchayati Akhara Mahanirvani speaks on the importance of Basant Panchami Amrit Snan and praises the administration for the arrangements. #MahaKumbh2025 #MahaKumbhWithPTI pic.twitter.com/dwaspnZrrC— Press Trust of India (@PTI_News) February 2, 2025శ్రీ పంచాయితీ అఖాడ మహానిర్వాణి 'అమృత స్నానం' కోసం త్రివేణి సంగమానికి చేరుకున్నారు. అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పురి మాట్లాడుతూ ‘ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం చేశాక, తాము తిరిగి వారణాసికి బయలుదేరుతామన్నారు. భక్తులంతా సంయమనం పాటిస్తూ అమృతస్నానం చేయాలి’ అని అన్నారు. #WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP | Akhadas head towards Triveni Sangam with their deities for the Amrit Snan on the occasion of Basant Panchami. pic.twitter.com/5pbNqS2eTa— ANI (@ANI) February 2, 2025ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
Mahakumbh: వసంత పంచమికి ముమ్మర ఏర్పాట్లు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గల త్రివేణీ సంగమంలో కుంభమేళా పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆదివారం(ఫిబ్రవరి 2) కావడంతో ఉదయం నుంచే పవిత్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాలున్నాయి.వసంతపంచమి(Vasanta Panchami) నాడు స్నానాలు ఆచరించేందుకు రెండురోజుల ముందుగానే భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంనకు దారితీసే అన్ని మార్గాలు భక్తుల వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా రోడ్లపై జనసమూహం కనిపిస్తోంది. దీనిని గుర్తించిన అధికారులు ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.జనవరి 29 మౌని అమావాస్య రోజున దాదాపు ఎనిమిది కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మరుసటి రోజు కూడా ఇదే తీరు కనిపించింది. తరువాత శుక్ర, శనివారాల్లో రద్దీ కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే ఈరోజు (ఆదివారం) ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు వస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాళీ మార్గ్, ఆనకట్ట, సంగమం వైపు వెళ్లే రహదారులలో భద్రతను మరింత కట్టిదిట్టం చేశారు. మరోవైపు మౌని అమావాస్య స్నానోత్సవంలో జరిగిన ప్రమాదం తర్వాత, ప్రభుత్వం నిఘాను మరింతగా పెంచింది.వసంత పంచమి రోజున సంగమ ఘాట్(Sangam Ghat) వద్ద జనం గుమిగూడకుండా చూసుకోవాలని పోలీసులకు, సైనికులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భక్తులు స్నానం చేసిన వెంటనే ఘాట్ నుంచి బయటకు వెళ్లేలా చూడాలని అధికారులు వారిని ఆదేశించారు. వసంత పంచమినాడు ఎవరూ కూడా బారికేడ్లను బద్దలు కొట్టకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బారికేడ్లు దాటవద్దని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్ యాత్రికులు మృతి
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. కుంభమేళా సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలతో పాటు విషాదకర ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఉదంతం బీహార్లోని ముజఫర్పూర్లోని మధుబని నాలుగు లేన్ల రోడ్డులో చోటుచేసుకుంది.బైక్ రైడర్లను కాపాడే ప్రయత్నంలో స్కార్పియో వాహనం(Scorpio vehicle) రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో స్కార్పియోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్పీ విద్యా సాగర్ తన బృందంతోపాటు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఎస్కేఎంసీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నేపాల్లోని మొహతారికి చెందిన కొందరు ప్రయాగ్రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ్లో స్నానం చేసి, స్కార్పియో వాహనంలో తిరిగి నేపాల్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి స్థానికులు మాట్లాడుతూ ఈ ఘటనకు ముందు కొంతమంది యువకులు నాలుగు లేన్లలో బైక్లపై విన్యాసాలు చేస్తుండగా, ఒక స్కార్పియో వాహనం చాలా వేగంగా వారికి ఎదురుగా వచ్చిందన్నారు. ఆ వాహనం బైక్ నడుపుతున్నవారిని తప్పించే ప్రయత్నంలో డివైడర్ను ఢీకొని, ఆపై బోల్తా పడిందన్నారు. ఇది చూసిన ఆ యువకులు బైక్లతో సహా అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. స్కార్పియో వాహనం మూడు సార్లు బోల్తా పడటంతో దానిలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని వివరించారు. కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి -
యోగి సర్కారును మెచ్చుకున్న ఉపరాష్ట్రపతి ధన్కర్
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వేడుకగా కొనసాగుతోంది. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పవిత్ర సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాకు ఘనమైన ఏర్పాట్లు చేశారని యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం గురించి మీడియా ఆయనను ప్రశ్నించినప్పుడు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పరిస్థితులు సద్దుమణిగాయని, దీనిని చూస్తుంటే యూపీ సర్కారు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నదో ఇట్టే గ్రహించవచ్చని అన్నారు. ఈ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ను మెచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి(Vice President) అన్నారు. ఈ భూమిపై ఎక్కడా ఇంతటి భారీ కార్యక్రమం జరిగివుండదు. కుంభమేళా నిర్వహణకు యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ధన్కర్ పేర్కొన్నారు.మహా కుంభమేళాలో లక్షకు పైగా మరుగుదొడ్లు నిర్మించారని, యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్ మహా కుంభ్(Maha Kumbh)కు వచ్చిన వారి సంఖ్య అమెరికా జనాభాకు సమానం అని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారని ఆయన అన్నారు. తాను కుంభ్ స్నానం కోసం నీటిలోకి దిగిన క్షణం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయం అని ధన్కర్ పేర్కొన్నారు. ప్రపంచంలో భారతదేశం లాంటి దేశం మరొకటి లేదని, అంకితభావం, సామర్థ్యం, సంస్కృతి పరిజ్ఞానం, దేశానికి సేవ చేసే స్ఫూర్తి ఇక్కడ ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. -
Mahakumbh-2025: యాత్రికులకు మమతా సర్కారు హెల్ఫ్డెస్క్
కోల్కతా: మౌని అమావాస్య నాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్కు చెందిన నలుగురు మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన మమతా సర్కారు పశ్చిమ బెంగాల్ నుంచి కుంభమేళాకు వెళ్లేవారికి పలు సూచనలు జారీ చేసింది. ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.కుంభమేళాకు పశ్చిమబెంగాల్ నుంచి వెళుతున్న యాత్రికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి(Emergency) తలెత్తినప్పుడు ఈ హెల్ప్డెస్క్ సాయం అందించనుంది. వారంలో ప్రతిరోజూ 24 గంటల పాటు సహాయం అందించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ, పౌర రక్షణ శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ హెల్ప్డెస్క్(Helpdesk) పర్యవేక్షణ జరగనుందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు మహా కుంభమేళాకు వెళ్తున్నారని, వారికి సహాయం చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు హెల్ప్లైన్ నంబర్ (033) 2214-3526, టోల్-ఫ్రీ నంబర్ 1070ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్(West Bengal)కు చెందిన నలుగురు యాత్రికులు మృతిచెందగా, తొమ్మిది మంది గల్లంతయ్యారు. ఇదిలావుండగా మహా కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల గణాంకాలను ప్రభుత్వం అందించాలని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరూ విశ్వసించడం లేదన్న అఖిలేష్ ఒక ప్రకటనలో ఈ ప్రభుత్వానికి దేశ ప్రజల విషయంలో ఎలాంటి దార్శనికత లేదు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, యువత, పేదలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ గణాంకాల కంటే, మహా కుంభ్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన, గాయపడిన, తప్పిపోయిన వారి గణాంకాలు చాలా ముఖ్యమైనవని అఖిలేష్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి -
Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. అయితే జనవరి 29న మౌని అమావాస్య అమృత స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు.బాధితులు చికిత్స పొందుతున్న ప్రయాగ్రాజ్లోని స్వరూప రాణి నెహ్రూ ఆసుపత్రి(Swaroop Rani Nehru Hospital)కి చేరుకున్న ఆదిత్యనాథ్ బాధితులను పరామర్శించడంతో పాటు, వారి ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తుందని, వారికి అవసరమైన ఇతర ఏర్పాట్లలో ఎటువంటి లోటు ఉండదని సీఎం యోగి హామీనిచ్చారు. ఒక బాధితురాలితో సీఎం మాట్లాడుతూ దేనికీ ఆందోళన చెందవద్దని, వైద్యులు అంతా చూసుకుంటారని తెలిపారు. మరో బాధితురాలు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్(Discharge) అవుతుండటాన్ని గమనించిన యోగి ఇలాంటివారిని వారిని ఇళ్లకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది సీఎంతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న ఏ బాధితుని పరిస్థితి విషమంగా లేదని, కొందరు బాధితులు కోలుకునేందుకు నాలుగువారాల సమయం పడుతుందని తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh: పట్నా నుంచి ప్రయాగ్రాజ్కు బస్సులు.. చౌకలో ప్రయాణం -
Mahakumbh: పట్నా నుంచి ప్రయాగ్రాజ్కు బస్సులు.. చౌకలో ప్రయాణం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివెళుతున్నారు. ఇప్పుడు బీహార్ నుండి మహా కుంభమేళాకు వెళ్లే వారికి బీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పట్నా నుండి ప్రయాగ్రాజ్కు బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సు సర్వీసు ఫిబ్రవరి 28 వరకు నడుపుతున్నట్లు పేర్కొంది. మహా కుంభమేళా(Great Kumbh Mela)కు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం ఈ కొత్త బస్సు సర్వీసును ప్రారంభించినట్లు తెలిపిన బీఎస్ఆర్టీసీ ఈ సర్వీసును రాత్రిపూట నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ బస్సు ఎక్కినవారు ఉదయానికల్లా గమ్యస్థానానికి చేరుకుంటారని వెల్లడించింది. మహాకుంభ్లో పెరుగుతున్న భక్తుల సంఖ్య దృష్ట్యా, రెండు కొత్త బస్సులను నడపాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బస్సులు బీహార్ రాజధాని పట్నా నుంచి యూపీలోని ప్రయాగ్రాజ్(Prayagraj) వరకు నడుస్తాయి.బీహార్ రాష్ట్ర రవాణా కార్యదర్శి సంజయ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ మహా కుంభమేళాకు వెళ్లే ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బస్సుల ద్వారా భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించి మహా కుంభమేళాకు చేరుకోవచ్చని తెలిపారు. పట్నా నుండి ప్రయాగ్రాజ్కు బస్సు ఛార్జీ రూ. 550. ఈ బస్సు పట్నాలో రాత్రి 8:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ప్రయాగ్రాజ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం(Return journey)లో ఈ బస్సులు ప్రయాగ్రాజ్ నుండి రాత్రి 10 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు పట్నా చేరుకుంటాయని సంజయ్కుమార్ తెలిపారు. ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం -
కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం
అయోధ్య: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. వీరిలోని చాలామంది అయోధ్యకు చేరుకుని, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. దీంతో అయోధ్యలోనూ జనప్రవాహం కనిపిస్తోంది. కుంభమేళా ప్రారంభమైనది మొదలు ప్రతిరోజూ రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. దీంతో గరిష్ట సంఖ్యలో భక్తులు రాంలల్లాను దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయాన్ని ప్రతిరోజూ 18 గంటల పాటు తెరిచి ఉంచుతున్నారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు శ్రీరాముణ్ణి దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఆలయానికి భక్తులు పోటెత్తుతుండటంతో కొన్ని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రెండవ అంతస్తుతో పాటు శిఖరంపై నిర్మాణ పనులు, సప్త మండపం, శేషావతార్ ఆలయం పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆలయ ప్రాకారాలు, స్తంభాలపై కుడ్యచిత్రాలను రూపొందించే పనులు కూడా మందకొడిగా కొనసాగుతున్నాయి. దర్శన్ మార్గ్ ప్రక్కనే ఉన్న యాత్రికుల సౌకర్యాల కేంద్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను కూడా నిలిపివేశారు.రామ్ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు కొన్ని పనులు నిలిపివేశామన్నారు. గడచిన 10 రోజుల్లో 70 లక్షలకు పైగా భక్తులు అయోధ్యను సందర్శించారని తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుండి సరయు నదిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. అయోధ్యకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. విదేశీ భక్తులు కూడా సరయు నదిలో స్నానం చేసిన తర్వాత రామ్లల్లా దర్శనం చేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: నేడు మరో సరికొత్త రికార్డు.. -
Mahakumbh-2025: నేడు మరో సరికొత్త రికార్డు..
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు 30 కోట్లకు పైగా భక్తులు స్నానాలు చేశారు. ఈ సంఖ్య పలు రికార్డులను నెలకొల్పుతోంది. ప్రపంచంలోని 195 దేశాలలోని 192 దేశాల జనాభా 30 కోట్ల కంటే తక్కువగా ఉంది. అంటే ఆ 192 దేశాలకు మించినంతటి జనాభా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారని గణాంకాలు చెబుతున్నాయి. జనాభా పరంగా చూస్తే ప్రపంచంలోని నాల్గవ, ఐదవ అతిపెద్ద దేశాలైన ఇండోనేషియా, పాకిస్తాన్లలో కూడా 30 కోట్ల కంటే తక్కువ జనాభా ఉంది. దీనిప్రకారం చూస్తే కేవలం 19 రోజుల్లో పాకిస్తాన్, ఇండోనేషియా జనాభాకు మించిన భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు. ఇండోనేషియా జనాభా(Indonesian population) 28 కోట్లు కాగా, పాక్ జనాభా 25.35 కోట్లు. కుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్యను చూస్తే వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాటికి సంగమంలో పుణ్య స్నానాలు చేసే వారి సంఖ్య 35 కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి.మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 91,690 మంది విమాన ప్రయాణం(Air travel) ద్వారా ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. 650 కి పైగా విమానాలు ఇక్కడకు రాకపోకలు సాగించాయి. ఇప్పుడు ఫిబ్రవరి ఒకటిన ఇక్కడికి వచ్చే విమానాలు, ప్రయాణికుల సంఖ్య గరిష్టంగా ఉండవచ్చనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుండి, తొలిసారిగా ప్రయాగ్రాజ్ నుండి చెన్నైతో సహా అనేక ప్రధాన నగరాలకు నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఢిల్లీకి 10 విమానాలు, ముంబైకి ఏడు విమానాలు ఉన్నాయి. ఇది సరికొత్త రికార్డు కానుంది. ఇది కూడా చదవండి: Jharkhand: జేఎంఎంలోకి తిరిగి సీతా సోరెన్? -
Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు మనదేశం నుంచి కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారంతా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే ఇక్కడి పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. వీటిలో ‘సరస్వతి బావి’ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, అదృశ్య సరస్వతి(Invisible Saraswati) నదుల త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. త్రివేణి సంగమానికి కొద్ది దూరంలోని సరస్వతి బావి ఇక్కడికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ సరస్వతి మాత జలాన్ని నేరుగా దర్శనం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.ప్రయాగ్రాజ్ కోటలో కనిపించే ఈ సరస్వతి బావి.. సరస్వతి నదికి రహస్య వనరు అని పండితులు చెబుతుంటారు. ఈ బావి నుంచి ఊరుతున్న నీటి ప్రవాహం నేరుగా త్రివేణి(Triveni) సంగమానికి అనుసంధానమై ఉంది. 2016లో శాస్త్రవేత్తలు, పరిశోధకులు సాగించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ఈ సరస్వతి బావికి ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్న సుబేదార్ మేజర్ రామ్ నారాయణ్ పాండే మాట్లాడుతూ ఇక్కడి నీటి ఊట బావి ఆకారంలో ఉన్నందున దీనికి సరస్వతి బావి అనే పేరు వచ్చిందన్నారు. సరస్వతి నది మానా గ్రామంలో ఉద్భవించిందని చెబుతుంటారు.పురాణాలలోని వివరాల ప్రకారం మహర్షి వేద వ్యాసుడు(Maharishi Veda Vyas) చెబుతుండగా గణేశుడు 18 పురాణాలను రాస్తున్నాడు. అయితే అదే సమయంలో సరస్వతి నది ప్రవాహ ధ్వని కారణంగా గణేశునికి వినికిడి సమస్య ఏర్పడిందట. దీంతో సరస్వతి మాత తన నీటి ప్రవాహాన్ని పాతాళం వైపు ప్రవహించాలని ఆదేశించిందట. సరస్వతి ప్రవాహం ప్రయాగ్రాజ్ చేరుకున్న సమయంలో విష్ణువు ఆ నీటిని సంగమంలో విలీనం చేయమని సరస్వతి మాతను కోరాడట. దీనికి సర్వస్వతి మాత సమ్మతించిందట. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తులు సరస్వతి బావిని తప్పకుండా సందర్శిస్తుంటారు.ఇది కూడా చదవండి: Delhi Elections: ఆప్కు భారీ షాక్.. -
ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళాలో యాంకర్ లాస్య ఫ్యామిలీ (ఫోటోలు)
-
'నా మనసుకు ఇంకా గాయం..' మహాకుంభమేళాలో పవిత్ర గౌడ
అభిమాని రేణుకాస్వామి హత్య కేసు నిందితులు హీరో దర్శన్ (Darshan), అతడి ప్రేయసి, నటి పవిత్రగౌడ (Pavithra Gowda) ఆలయాల బాటపట్టారు. దైవభక్తిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాజాగా పవిత్రగౌడ మహాకుంభమేళాకు వెళ్లింది. మౌని అమావాస్య రోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆశీర్వాదం..ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య రోజు మహాకుంభమేళా (Mahakumbh 2025)లో స్నానం ఆచరించడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నెగెటివ్ ఎనర్జీ నుంచి నాకు స్వేచ్ఛ లభించిందని నమ్ముతున్నాను. హరహర మహాధేవ్ అని క్యాప్షన్ జోడించింది. ఒకరి కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నావా? అంటూ నెటిజన్లు నటిని తిట్టిపోస్తూనే ఉన్నారు. దీంతో ఆమె మరో పోస్ట్ పెట్టింది.మరింత బాధ, శోకం..మతానికి, అన్యాయానికి జరిగిన సంఘర్షణలో మతమే గెలుస్తుంది. ఒకవేళ మొదట అన్యాయం విజయం సాధించినా చివరకు గెలిచేది మాత్రం మతమే! నన్ను తిడుతూ, నన్ను బాధపెడుతున్న న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా సైట్స్కు థాంక్స్. హద్దులు మీరుతూ మీరు చేస్తున్న కామెంట్లు నా మనసును మరింత బాధకు గురి చేస్తున్నాయి. ఇంకా శోకంలోకి నెట్టేస్తున్నాయి అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official) View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official)చదవండి: సన్యాసిగా మారిన హీరోయిన్పై బహిష్కరణ వేటు -
మహా కుంభమేళా.. విమాన ఛార్జీలు తగ్గింపు
మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ తరుణంలో కొన్ని విమాన సంస్థలు ఇప్పటికే ఛార్జీలు పెంచాయి. దాంతో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల సహేతుకమైన విమాన ఛార్జీలు ఉండాలనేలా ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు ఆకాసా ఎయిర్ స్పందించింది. విమాన ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు, ప్రయాగ్రాజ్కు విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది.ఛార్జీల తగ్గింపు, విమానాల సంఖ్య పెంపుఆకాసా ఎయిర్ ప్రయాగ్రాజ్కు విమానాల టికెట్ ధరలను 30-45% తగ్గించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం భక్తులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చింది. ముంబై, ఢిల్లీ నుంచి రోజువారీ డైరెక్ట్ సర్వీసులతో పాటు పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతుంది. మహా కుంభమేళా సందర్భంగా విమానాలను పెంచాలని, సహేతుకమైన ఛార్జీలను నిర్వహించాలని విమానయాన సంస్థలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో కంపెనీ ఈమేరకు స్పందించినట్లు తెలిపింది.ప్రభుత్వ జోక్యంవినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు గతంలో లేఖ రాశారు. ప్రయాగ్రాజ్ విమాన ప్రయాణానికి అధిక ఛార్జీలు ఉన్నాయనే ఫిర్యాదులను ఆ లేఖలో హైలైట్ చేశారు. తరువాత ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికపరమైన ప్రయాణ ఇబ్బందులు లేకుండా మహా కుంభమేళాకు భక్తులు వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం జోక్యం చేసుకుంది.ప్రయాణికులపై ప్రభావం..ఛార్జీల తగ్గింపు, విమానాల పెంపు నిర్ణయం మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. గతంలో విమాన ఛార్జీలు 300-600% పెరగడంతో, చాలా మంది రోడ్డు లేదా రైలు రవాణా మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ పీక్ పీరియడ్లో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఆకాసా ఎయిర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..ఇప్పటికే చాలా సంస్థలు..యాత్రికుల రాకపోకలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు చేసే ప్రయత్నాల్లో ఆకాసా ఎయిర్ ఒక్కటే కాదు.. ఇండిగో, స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు కూడా ప్రయాగ్రాజ్కు తమ విమానాల సంఖ్యను పెంచాయి. విమానయాన పరిశ్రమ నుంచి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షల మంది భక్తుల ప్రయాణం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగుతుంది. -
మోనాలిసా బాలీవుడ్ ఎంట్రీ.. ఇంటికెళ్లి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్
యూపీలో జరుగుతున్న ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళా ఏకంగా ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. సోషల్ మీడియా పుణ్యమాని ఆమె వీడియో పెద్దఎత్తున వైరల్ కావడంతో ఓవర్నైట్ స్టార్గా ఎదిగిపోయింది. ఇంకేముంది ఆమె ఫోటోలు, వీడియోలు చూసిన సినీ ప్రముఖులు సైతం ఆమె అందాన్ని ప్రశంసించారు. అసలు పేరు ఇంకా చెప్పట్లేదని బాధపడుతున్నారా? అదేనండి తన తేనేలాంటి కళ్లతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న మోనాలిసా. ఇప్పుడంతా దేశంలో ఎక్కడా చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. పూసలమ్మే ఆ అమ్మాయి అందం తన తలరాతను మార్చనుంది. ఇప్పటికే సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఓ ఆఫర్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.మహాకుంభ్ మేళాలో పూసలు అమ్ముతున్న మోనాలిసాకు అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మరో అడుగు ముందుకేశారు. మోనాలిసాకు తాను తెరకెక్కించబోతున్న చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్లో ఉన్న మోనాలిసా ఇంటికి వెళ్లి మరి ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. తాజాగా మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మిశ్రా కలిసి ఫోటో కూడా బయటకొచ్చింది.అంతేకాదు.. మోనాలిసా సైతం ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కష్టపడతానని సనోజ్ మిశ్రాకు హామీ కూడా ఇచ్చింది మోనాలిసా. ఇంకేముంది తేనేకళ్ల సుందరిని బిగ్ స్క్రీన్పై చూసే ఛాన్స్ కూడా త్వరలోనే రానుంది. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే పేరుతో సనోజ్ మిశ్రా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తాజాగా ఇవాళ సినిమాలో నటించేందుకు మోనాలిసా సంతకాలు చేయడంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది.ఊహించని విధంగా ఫేమ్..మహాకుంభ్ మేళాకు జీవనోపాధి నిమిత్తం వెళ్లిన మోనాలిసాకు ఊహించని విధంగా ఫేమ్ వచ్చింది. ఓ నెటిజన్ ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్దఎత్తున వైరలైంది. దీంతో అక్కడికెళ్లిన వారంతా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వ్యాపారం కంటే ఆమెను చూసేందుకు ఎక్కువమంది వచ్చారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ వారి తాకిడి పెరగడంతో మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్కు పంపించేశారు.దర్శకుడు సనోజ్ మిశ్రా మాటాడుతూ..' తన రాబోయే చిత్రం "ది డైరీ ఆఫ్ మణిపూర్" కోసం మోనాలిసాను ఎంచుకున్నా. ఈ చిత్రం ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ఇద్దరు కథానాయికల్లో మోనాలిసా కూడా ఉంటారు. మోనాలిసా సింప్లిసిటీకి ముగ్ధుడై నా సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. మోనాలిసా కుటుంబాన్ని ఇంటికి వెళ్లి కలిశా. ఆమె నా సినిమాలో నటించేందుకు అంగీకరించారు. తాను జీవితంలో ఎప్పుడూ నటించలేదనే విషయం నాకు తెలుసు. అదే నేను సవాల్గా తీసుకున్నా. మోనాలిసాకు నటనలో శిక్షణ ఇస్తా. ఆ తర్వాత ఏప్రిల్లో సినిమా ప్రారంభిస్తాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలు పాపులారిటీ కోసం అసభ్యకరమైన రీళ్లు తయారు చేస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన మోనాలిసా వంటి సాధారణ అమ్మాయి కూడా వినోద ప్రపంచంలో పని చేయడం ద్వారా ముందుకు తీసుకెళ్లవచ్చని నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నా' అని అన్నారు.సనోజ్ మిశ్రా ఎవరు?లక్నో నివాసి అయిన సనోజ్ మిశ్రా రచయితగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సనోజ్ ఇప్పటివరకు 15 సినిమాలు తీశారు. 2023లో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే చిత్రాన్ని రూపొందించి ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ సినిమా ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించాడని కొందరు ఆరోపించారు. -
Maha Kumbh 2025: పాల్గొన్న ఇండిగో సీఈవో.. మాటల్లో చెప్పలేని శాంతి..!
భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ఈ మహా కుంభమేళా. ఇందులో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఈ వేడుకలో ఎందరో ప్రముఖులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. తాజాగా ఇండిగో సీఈవో డచ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆయన ఈ ఉత్సవాన్ని తిలకించి తన అధ్యాత్మిక అనుభవాల తోపాటు అందుకు సంబధించిన ఫోటోలను షేర్ చేసుకున్నారు.ఇండిగోIndiGo) సీఈవో పీటర్ ఎల్బర్స్(Pieter Elbers ) లింక్డ్ఇన్(LinkedIn)లో ఆ సందర్భం తాలుకా ఫోటోల తోపాటు తన అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. ఈ డచ్ ఎగ్జిక్యూటివ్ తాను ఉదయం 5 గంటలకు త్రివేణి సంగమంలో స్నానం చేసి.. గందరగోళం నడుమ ఆధ్యాత్మిక శాంతిని పొందానన్నారు. ఈ ఏడాదిలో ఈ మహా కుంభమేళా అద్వితీయమైన ఘట్టంగా అభివర్ణించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు కేవలం 45 రోజుల్లోనే 450 మిలియన్ల మంది సందర్శకులను తరలివస్తారనేది అంచనా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలో భూమిపై ఉండే యావత్తు మానవాళిలో అత్యధిక మంది ఈ అధ్యాత్మిక వేడుకలో చేరి గుమిగూడే సమయం ఇది. ఈ స్థాయిలో అసంఖ్యాక ప్రజలను చూడటం అనేది దాదాపు అసాధ్యం కూడా. ఇది యూరప్ జనాభాకు సమానం. పైగాయూఎస్ జనసాంద్రతకు మించి అని లింక్డ్ ఇన్ పోస్ట్లో రాసుకొచ్చారు ఎల్బర్స్. తాను గత వారంలోని గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత వారసత్వ సంగమాన్ని జరుపుకునే మహాకుంభమేళాలో పాల్గొన్నాను అని తెలిపారు. అంతేగాదు ఈ ప్రదేశానికి ఉన్న శక్తిని ఏ వాక్యం, ఏ పదం లేదా చిత్రాలు వర్ణించేందుకు సరిపోవు అని అన్నారు. తాను ఈ త్రివేణి సంగమంలో ఉదయ ఐదు గంటల సమయంలో పుణ్య స్నానాలు ఆచరించానని చెప్పారు. మంత్రాలు, ప్రార్థన, భక్తి, మానవత్వం ఐక్యతల నడుమ చుట్టుముట్టిన ఈ గందరగోళం మధ్య ఓ గొప్ప ఆధ్యాత్మిక శాంతిని అనుభవించే క్షణం దొరికిందని ఆనందంగా చెప్పారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ దివ్యమైన గొప్ప అనుభవంలో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు ఇండిగో సీఈవో. అంతేగాదు ఈ కార్యక్రమం కోసం అధికంగా వస్తున్న యాత్రికుల రద్దీని చక్కగా నిర్వహిస్తున్న తమ ఇండిగో బృందానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఈ మొదటి పదిరోజుల్లో పది కోట్లకు పైగా భక్తులు ఇప్పటికే సంగంలో స్నానాలు ఆచరించారు. అంటే ఈ 45 రోజుల పండుగ ముగిసే సమయానికి ఆ సంఖ్య కాస్తా 40 కోట్లకు చేరుతుందనేది అంచనా.(చదవండి: 'ది బిలియనీర్స్ డాటర్' ఆ ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్..!) -
తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో పిల్
న్యూఢిల్లీ: యూపీ ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనకు బాధ్యత యూపీ ప్రభుత్వానిదేనంటూ ఓ అడ్వొకేట్ సుప్రీం కోర్టులో పిల్ వేశారు. త్రివేణి సంగమం వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. అయితే..మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న మహా కుంభమేళాలో అన్ని రాష్ట్రాల సమన్వయంతో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయించేలా అధికార యంత్రాగాన్ని ఆదేశించాలని కోరారాయన.మరోవైపు తీవ్ర విషాదం నేపథ్యంతో.. మహా కుంభమేళా నిర్వహణలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పాస్లను పూర్తిగా రద్దు చేసింది. బుధవారం అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత కీలక నిర్ణయాలను వెల్లడించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా యోగి సర్కారు నిషేధం విధించింది. ఈ ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించింది. అలాగే.. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంకోవైపు.. వీవీఐపీ, స్పెషల్ పాస్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాగ్రాజ్ పొరుగునున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేయనుంది. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక.. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్రాజ్ నగరంలోకి ఫోర్ వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది. భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది. మేళా ప్రాంతంలో పెట్రోలింగ్ను పెంచాలని పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మౌనీ అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలిరావడంతో సంగం ఘాట్వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. బుధవారం తెల్లవారుజామున 1, 2 గంటల మధ్య అఖాడాల కోసం ఏర్పాటు చేసిన సంగం స్నాన ఘాట్కు వెళ్లేందుకు అఖాడా మార్గ్వద్ద ఉన్న బారికేడ్లపైకి భక్తులు ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. -
Mahakumbh-2025: కుంభ స్నానం కోసం 21 కి.మీ నడిచి.. బ్యాంకు ఉద్యోగి విషాదాంతం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో మౌని అమావాస్య నాడు తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతిచెందారు. ఒకరు కుమారుడిని కోల్పోగా, మరొకరు తల్లిని, ఇంకొకరు సోదరుడిని కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన 60 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటన అనంతరం మృతులకు సంబంధించిన విషాదగాథలు వెలుగు చూస్తున్నాయి. జార్ఖండ్ నుంచి ప్రయాగ్రాజ్కు వచ్చిన ఒక వ్యక్తి త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు 21 కిలోమీటర్ల దూరం నడిచాడు. అయితే పుణ్య స్నానం చేయడానికి ముందే జీవితాన్ని ముగించాడు. వివరాల్లోకి వెళితే జార్ఖండ్లోని ఘట్శిల ప్రాంతం నుండి పలువురు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్ వచ్చారు. వారిలో ఒకరే బ్యాంకు ఉద్యోగి శివరాజ్ గుప్తా(58). బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు జరిగిన తొక్కిసలాటలో శివరాజ్ గుప్తా మరణించారు.శివరాజ్ గుప్తా 16 మంది భక్తుల బృందంతో కలిసి ప్రయాగ్రాజ్(Prayagraj)కు వచ్చారు. తొక్కిసలాట జరగడానికి కొద్దిసేపటికి ముందే శివరాజ్ గుప్తా తన స్నేహితులతో కలిసి సంగమం తీరానికి చేరుకున్నాడు. అతను త్రివేణీ సంగమంలో స్నానం చేసేలోపే, మృత్యువు అతనిని చుట్టుముట్టింది. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు జనం పెరగడంతో శివరాజ్ గుప్తా తన స్నేహితుల బృందం నుండి విడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో జరిగిన తొక్కిసలాటలో శివరాజ్ గుప్తా జనసమూహం కాళ్ల కింద నలిగి, ఊపిరాడక మరణించాడు. ఈ తొక్కిసలాట(Stampede)లో అతని బృందంలోని ఇతర సభ్యులు కూడా గాయపడ్డారు. శివరాజ్ గుప్తా భార్య పూనమ్ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం రాత్రే తన భర్తతో మాట్లాడానని తెలిపారు. తన భర్త సంగమతీరం చేరుకునేందుకు 21 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందన్నారు. మర్నాటి ఉదయం తొక్కిసలాట వార్త తెలియగానే పూనమ్ తన భర్తకు ఫోన్ చేశారు. కానీ ఎటువంటి స్పందన రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శివరాజ్ గుప్తా మృతి చెందినట్లు పూనమ్కు సమాచారం అందింది. శివరాజ్ గుప్తా జార్ఖండ్(Jharkhand) రాష్ట్ర సహకార బ్యాంకు ఉద్యోగి. అతని కుమార్తె స్వర్ణ ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు శివమ్ బెంగళూరులో ఉంటున్నాడు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం భద్రత పెంపు -
Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం భద్రత పెంపు
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మౌని అమావాస్య నాడు తొక్కిసలాట చోటుచేసుకున్న దరిమిలా యూపీ ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. భక్తులకు మరింతగా భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. తొక్కిసలాట ఘటన మహాకుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో 30మంది వరకూ మరణించారని సమాచారం. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధిక సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించడంతో పాటు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేసింది.ప్రత్యేక రైళ్లు కుంభమేళాకు తరలివచ్చే భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పుడు భక్తులకు సమర్థవంతమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు తాజాగా మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.భద్రతా చర్యలు మహాకుంభ మేళాలో భక్తుల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్ వంటి సహాయక వ్యవస్థలు ఏర్పాటు చేశారు.ఆరోగ్య సేవలు మహాకుంభ మేళాలో భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యసాయం అందించేందుకు పలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వైద్యులు, నర్సులు, ఆంబులెన్సులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. భక్తులకు అవసరమైన అన్ని ఆరోగ్య సేవలు సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారు.రవాణా- పార్కింగ్ ప్రయాగ్రాజ్లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. రవాణా నియంత్రణలో భాగంగా మార్గాల సూచికల బోర్డులను ఏర్పాటు చేశారు.ఆహార సౌకర్యాలు భక్తుల ఆహార అవసరాలను తీర్చేందుకు పలు ఫుడ్ స్టాల్స్, తాగునీటి సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రదేశాలలో ఏర్పాటు చేసి స్టాల్స్ భక్తులకు సౌకర్యాన్ని అందించేలా రూపొందించారు.సోషల్ మీడియా ద్వారా సమాచారం భక్తులకు ఎప్పటికప్పుడు కుంభమేళాకు సంబంధించిన సమాచారం అందించేందుకు అధికారిక యంత్రాంగం సోషల్ మీడియా వేదికలను ఉపయోగించింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫారమ్లలో కుంభమేళాకు సంబంధించిన మార్గదర్శకాలు, పరిస్థితులపై అప్డేట్స్ అందిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: ప్రభుత్వ చొరవతో తగ్గిన విమానయాన ఛార్జీలు -
Mahakumbh 2025: ప్రభుత్వ చొరవతో తగ్గిన విమానయాన ఛార్జీలు
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలువురు విమానాల్లోనూ ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలు విమానయాన సంస్థలు విమానయాన ఛార్జీలను అమాంతం పెంచేశాయి.ప్రయాగ్రాజ్కు విమాన ఛార్జీల పెంపు పై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. మహా కుంభమేళా వేళ ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న విమానయాన సంస్థలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. విమానయాన సంస్థలు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను కొనసాగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ నేపధ్యంలో ఇండిగో విమానయాన సంస్థ ప్రయాగ్రాజ్కు విమాన ఛార్జీలను 30 నుంచి 50 శాతం మేరకు తగ్గించింది.మహా కుంభమేళా సమయంలో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు పలు విమానయాన సంస్థలతో సమన్వయ సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశంలో, విమానయాన సంస్థల ప్రతినిధులు, డీజీసీఏ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి, దేశంలో వివిధ నగరాల నుంచి 132 విమానాలు ప్రయాగ్రాజ్కు సేవలు అందిస్తున్నాయి.ఇండిగో తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 16 వరకు ఢిల్లీ-ప్రయాగ్రాజ్ విమానాలకు టిక్కెట్ ధరలు రూ.13,500 కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని తెలిపింది. జనవరి 31న ధరలు రూ.21,200 పైగా ఉన్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 12కి ధరలు తగ్గి రూ.9 వేలకు చేరనున్నాయని తెలిపింది. అయితే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చొరవతో విమానయాన సంస్థలు టిక్కెట్ ఛార్జీలు తగ్గించనున్నట్లు ప్రకటించాయి. ఇది కూడా చదవండి; Mahakumbh 2025: ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి -
Mahakumbh 2025: ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి
ప్రయాగ్రాజ్: మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభ్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు జిల్లాల సీనియర్ పోలీసు అధికారులు, జిల్లా పరిపాలన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు.ప్రతి భక్తుని రక్షణ బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మహా కుంభమేళా ప్రాంతంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల భద్రత, సౌలభ్యం కోసం చేసిన ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి అయోధ్య, వారణాసి, మీర్జాపూర్, చిత్రకూట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రయాగ్రాజ్లోని అన్ని రైల్వే స్టేషన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారు సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుకునేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అయోధ్య-ప్రయాగ్రాజ్, కాన్పూర్-ప్రయాగ్రాజ్, ఫతేపూర్-ప్రయాగ్రాజ్, లక్నో-ప్రతాప్గఢ్-ప్రయాగ్రాజ్, వారణాసి-ప్రయాగ్రాజ్ తదితర మార్గాల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.ఇది కూడా చదవండి: mahakumbh: 27 ఏళ్ల క్రితం అదృశ్యం.. నేడు అఘోరిగా ప్రత్యక్షం -
mahakumbh: 27 ఏళ్ల క్రితం అదృశ్యం.. నేడు అఘోరిగా ప్రత్యక్షం
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వేడుకగా సాగుతోంది. ఈ కుంభమేళాలో పలు ఆసక్తికర ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతమొకటి ఇప్పుడు వైరల్గా మారింది.27 ఏళ్ల క్రితం తమ కుటుంబం నుంచి తప్పిపోయిన ఒక వ్యక్తిని కుంభమేళాలో కనుగొన్నామని జార్ఖండ్కు చెందిన ఒక కుటుంబం మీడియాకు తెలిపింది. దీంతో తమ 27 ఏళ్ల ఆవేదన ఇప్పుడు తీరిపోయిందని వారు ఆనందంగా చెబుతున్నారు. నాడు ఇంటి నుంచి తప్పిపోయిన గంగాసాగర్ యాదవ్ వయసు ఇప్పుడు 65 ఏళ్లు. ఇప్పుడాయన అఘోరి సాధువుగా కుటుంబ సభ్యులకు దర్శనమిచ్చారు. ఇప్పుడు అతని పేరు బాబా రాజ్ కుమార్.1998లో గంగాసాగర్ కుటుంబ సభ్యులంతా బీహార్లోని పట్నాకు వెళ్లారు. అప్పుడు గంగాసాగర్ అదృశ్యమయ్యాడు. దీంతో అతని భార్య ధన్వ దేవి ఇంటి బాధ్యతలను భుజానికెత్తుకుని వారి కుమారులు కమలేష్, విమలేష్లను పెంచిపెద్దచేసింది. గంగాసాగర్ తమ్ముడు మురళీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ‘తమ సోదరుడిని తాము మళ్లీ చూస్తామనే ఆశను కోల్పోయాం. అయితే కుంభమేళాకు వెళ్లిన మా బంధువులలో ఒకరు గంగాసాగర్ ఫోటో తీసి మాకు పంపారు. దీంతో నేను, ధన్వా దేవి, వారి ఇద్దరు కుమారులతో కలిసి కుంభమేళాకు వెళ్లాం.అక్కడ గంగాసాగర్ను గుర్తించాం. అయితే అతను తన పూర్వపు గుర్తింపును అంగీకరించేందుకు నిరాకరించారు. పైగా తాను బాబా రాజ్కుమార్ను అని చెబుతూ, వారణాసికి చెందిన సాధువును అని తెలిపాడు. అయితే తాము ఆయన నుదిటిపై, మోకాలిపై ఉన్న గాయాల గుర్తులును చూశాకనే ఆయనను గంగాసాగర్ యాదవ్గా గుర్తించాం. కుంభమేళా ముగిసే వరకు ఇక్కడే ఉంటాం. అవసరమైతే డీఎన్ఏ పరీక్షలు చేయిస్తాం. అవి సరిపోలకపోతే బాబా రాజ్కుమార్కు క్షమాపణలు చెబుతాం’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: సంగమ తీరంలో.. ఢిల్లీకి నాలుగింతల జనాభా -
‘చెల్లాచెదురైన’ బతుకులు.. కుంభమేళా ఘటనలో హృదయవిదారక దృశ్యాలు
లక్నో: చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. బ్యాగులు.. దుస్తులు.. దుప్పట్లు.. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన జరిగిన ప్రయాగ్రాజ్ సెక్టార్-2లో ప్రస్తుతం దృశ్యాలివే. మరోవైపు తమ వారి జాడ తెలియక వందల మంది ప్రయాగ్రాజ్ ఆస్పత్రుల ముందు కంటతడి పెడుతూ కనిపిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరొందిన మహా కుంభమేళాలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తగా.. బారికేడ్లు విరిగిపోవడంతో భక్తులు చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా.. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. వాటి మీది నుంచే అందరూ పరుగులు తీసినట్లు అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మరోవైపు.. ఘటనకు అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప చెత్తకుండీలే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోయాక.. తొక్కిసలాట చోటు చేసుకుంది. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వాళ్ల మీద నుంచే మిగతా వాళ్లు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. ఊపిరి ఆడని పరిస్థితుల నుంచి తాము క్షేమంగా బయటపడ్డామని కొందరు చెబుతున్నారు.ప్రయాగ్రాజ్ ఆస్పత్రుల ప్రాంగణాలు బాధితుల కుటుంబాల రోదనలతో మారుమోగుతున్నాయి. తమ వాళ్లు కనిపించకుండా పోవడంతో హెల్ప్ సెంటర్ల వద్దకు కొందరు పరుగులు తీస్తున్నారు. ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి గాయాలయ్యాయనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన సమయంలో.. బారికేడ్లు, ఫెన్సింగ్ల మీద నుంచి దూకి ప్రాణభయంతో కొందరు పరుగులు పెట్టిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. सरकार को पहले से ही पता था इतनी भीड़ आएगी तो फिर पूरा प्रबंध सरकार ने सेना को क्यों नहीं दे दिया... #MahakumbhStampede #MouniAmavasya #AmritSnan #MahaKumbh2025 #Prayagraj #Stampedepic.twitter.com/ZAF2zW0iov— Prerna Yadav (@prerna_yadav29) January 29, 2025A daughter is hugging her father and crying because her mother has left this world💔But only those who have experienced such loss can truly understand the pain of a family.#MahakumbhStampede pic.twitter.com/2dGo0OQKxQ— هارون خان (@iamharunkhan) January 29, 2025CM Yogi Adityanath should watch this video and feel some shame 👇#MahakumbhStampede pic.twitter.com/t0l3aUldGc— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) January 29, 2025#MahakumbhStampede15 pilgrims have paid with thier lives in a stampede in #MahaKumbh2025 #Mahakumbh #MahaKumbhMela2025 pic.twitter.com/0f26oBgnMH— Sanghamitra Bandyopadhyay (@SanghamitraLIVE) January 29, 2025 -
Mahakumbh-2025: సంగమ తీరంలో.. ఢిల్లీకి నాలుగింతల జనాభా
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈరోజు(బుధవారం) మౌని అమావాస్య కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు లెక్కలేనంతమంది భక్తులు సంగమ తీరానికి చేరుకున్నారు.మౌని అమావాస్యకు ఒక రోజు ముందు అంటే మంగళవారం నాటికే ప్రయాగ్రాజ్కు భక్తులు తండోపతండాలుగా చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం దాదాపు 5.5 కోట్ల మంది సంగమంలో స్నానమాచరించారు. ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం 8 నుంచి 10 కోట్ల మంది జనాభా ఉన్నారని ముఖ్యమంత్రి స్వయంగా తెలిపారు.ఈ గణాంకాల ప్రకారం చూస్తే ఇక్కడ ఇప్పుడున్న జనాభా.. ఢిల్లీలో ఉంటున్న జనాభాకు నాలుగు రెట్లు అధికంగా ఉంది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతమంతా జనసంద్రంలా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ నగరంలో దాదాపు 10 కోట్ల మంది ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళా జరుగుతున్న ప్రాంతం నాలుగు వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ అధికారులు 45 ఘాట్లను ఏర్పాటు చేసినప్పటికీ, భక్తులు త్రివేణీ సంగమంలోనే స్నానాలు చేయాలని భావిస్తున్నారు. దీంతో సంగమ ప్రాంతంలో విపరీతంగా భక్తుల రద్దీ నెలకొంది. కుంభమేళా ప్రాంతంలోని భూలా బిస్రా సెంటర్లో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట తర్వాత హెలికాప్టర్ నిఘా పెంపు -
మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధాని విచారం
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో ఈ ఉదయం ప్రయాగ్రాజ్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్(Prayagraj)లో జరిగిన ప్రమాదం బాధాకరం. ఘటనలో తమ వారిని కోల్పోయిన వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. క్షతగాత్రులకు సాయం అందించడంలో అధికారులు ఉన్నారు. ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నా. ముఖ్యమంత్రి యోగితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నా అని ప్రధాని మోదీ(PM Modi) ట్వీట్ చేశారాయన. ఘటనపై ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్ష జరుపుతున్నారని ఇటు యూపీ సీఎం యోగి, అటు పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं ने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा हुआ है। इस सिलसिले में मैंने…— Narendra Modi (@narendramodi) January 29, 2025మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రయాగ్రాజ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఘటనపై ఉప రాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, ఇతర రంగాల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మహా కుంభమేళాలో మౌనీ అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ సెక్టార్-2 వద్ద అమృత స్నానాల కోసం వచ్చారు. ఈ క్రమంలో తోపులాటలో బారికేడ్లువిరిగిపడగా.. తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన భక్తులను ఆంబులెన్స్లలో ఆస్పత్రలకు తరలించారు. అయితే మరణాలపై రకరకాల ప్రచారం జరిగినప్పటికీ అక్కడి అధికారులెవరూ దానిని ధృవీకరించలేదు. చివరకు ప్రధాని మోదీ ప్రకటనతో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. అయితే ఎంత మంది మరణించారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే అక్కడికి భారీగా భక్తులు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తం కాకూడదనే యూపీ ప్రభుత్వం మరణాల విషయంలో ప్రకటనేదీ చేయలేదని ఓ అధికారి జాతీయ మీడియాతో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. మరోవైపు ఈ ఘటనతో విపక్షాలు యూపీ సర్కార్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి.ఇదీ చదవండి: నిర్వహణ లోపాల వల్లే తొక్కిసలాట ఘటన.. యూపీ సర్కార్పై సంచలన ఆరోపణలు -
Mahakumbh-2025: తొక్కిసలాట తర్వాత హెలికాప్టర్ నిఘా పెంపు
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుతోంది. అయితే ఈరోజు(బుధవారం) మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుంది. ఈ నేపధ్యంలో సంగమతీరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.తొక్కిసలాట సద్దుమణిగిన దరిమిలా లక్షలాది మంది భక్తులు స్నానం చేయడానికి సంగమ తీరానికి తరలివస్తున్నారు. వీరిని పర్యవేక్షించేందుకు, మరింతగా భద్రత కల్పించేందుకు హెలికాప్టర్ నుండి నిఘా సారించారు. జనసమూహాన్ని నియంత్రించేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే జనం మరింతగా పెరిగిపోవడంతో పోలీసులు బారికేడ్లను తొలగించారు. భద్రతను మరింతగా పెంచేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించారు.కుంభమేళా పర్యవేక్షణ అధికారులు భద్రత విషయంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మహా కుంభలో పరిస్థితి అదుపులో ఉందని, భక్తుల పుణ్యస్నానాలు సజావుగా జరుగుతున్నయని అధికారులు తెలిపారు. తొక్కిసలాట ఘటన అనంతరం సీఎం యోగి స్పందిస్తూ వివిధ గంగా ఘాట్ల వద్ద స్నానాలు చేయాలని భక్తులకు సూచించారు. అధికారులు అందించే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: అలాంటి దుస్తులతో రావొద్దు: ముంబై సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్ -
Mahakumbh-2025: యోగి ప్రభుత్వానిదే బాధ్యత: కాంగ్రెస్
మహా కుంభమేళాలో మౌని అమావాస్య వేళ జరిగిన తొక్కిసలాటకు యోగి ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. మహా కుంభమేళాకు ఏర్పాట్లు చేయడానికి బదులుగా, ప్రభుత్వం ప్రచారంలో బిజీగా ఉందని కాంగ్రెస్ ప్రతినిధి అన్షు అవస్థి ఆరోపించారు. భక్తులను పట్టించుకునేందుకు బదులుగా ప్రభుత్వం తన ఫోటో సెషన్లో బిజీగా ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వం వీఐపీ సంస్కృతిని విడనాడి, భక్తులకు భద్రత కల్పించాలని కోరారు.కుంభమేళాలో నిర్వహణ లోపం, సన్నాహాలలో నిర్లక్ష్యం, తగిన ఏర్పాట్లు లేకపోవడం కారణంగానే తొక్కిసలాట జరిగిందని, దీనికి బీజేపీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలని అన్షు అవస్థి పేర్కొన్నారు. మహా కుంభమేళా బడ్జెట్ అంతా అవినీతితో నిండిపోయిందని ఆరోపించారు. కుంభమేళా మొదటి రోజు నుండే తాము భక్తుల రద్దీ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం భక్తులకు తగిన విధంగా అవగాహన కల్పించి ఉంటే, ఈ తొక్కిసలాటను నివారించగలిగేదన్నారు. వీఐపీ స్వాగత సంస్కృతిని ఆపాలని, బడ్జెట్లో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని యోగి సర్కార్కు అన్షు అవస్థీ విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: ఆ లోపాలే తొక్కిసలాటకు కారణం: మల్లికార్జున ఖర్గే -
ఆ లోపాలే తొక్కిసలాటకు కారణం: మల్లికార్జున ఖర్గే
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం మౌని అమావాస్య పుణ్యస్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.‘మహా కుంభమేళా సందర్భంగా తీర్థరాజ సంగమం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారనే వార్త వినడం హృదయ విదారకంగా ఉంది’ అని మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ లో రాశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. महाकुंभ के दौरान, तीर्थराज संगम के तट पर हुई भगदड़ से कई लोगों की जान गई है और अनेकों लोगों के घायल होने का समाचार बेहद हृदयविदारक है। श्रद्धालुओं के परिजनों के प्रति हमारी गहरी संवेदनाएँ और घायलों की शीघ्रातिशीघ्र स्वास्थ्य लाभ की हम कामना करते हैं। आधी अधूरी व्यवस्था,…— Mallikarjun Kharge (@kharge) January 29, 2025ఇదే పోస్టులో ఆయన మహా కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన నిలదీశారు. విస్తృత ఏర్పాట్లు, విఐపిల కదలిక, నిర్వహణ కంటే స్వీయ ప్రమోషన్పై అధికంగా దృష్టి పెట్టడం, నిర్వహణలో లోపాలే తొక్కిసలాటకు కారణమని ఆయన పేర్కొన్నారు.వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, అటువంటి బలహీన వ్యవస్థను కలిగి ఉండటం ఖండించదగినది. ఇంకా కొన్ని రాజ స్నానాలు మిగిలి ఉన్నాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడే మేల్కొని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏర్పాట్లను మెరుగుపరచాలని ఖర్గే సూచించారు. భక్తుల వసతి, ఆహారం, ప్రథమ చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లను మరింతగా విస్తరించాలని, సాధువులు కూడా ఇదేకోరుకుంటున్నారని అన్నారు. బాధితులకు సాధ్యమైనంత త్వరగా సహాయం అందించాలని మల్లిఖార్జున ఖర్గే ప్రభుత్వాన్ని కోరారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి -
తొక్కిసలాట ఘటన.. ప్రధాని నాలుగుసార్లు ఫోన్ చేశారు: సీఎం యోగి
లక్నో: మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ ఉదయం మీడియాతో స్పందించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయని చెప్పారాయన. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని తెలిపారాయన. ‘‘నిన్న రాత్రి నుంచి మౌని అమావాస్య పుణ్య స్నానాలు మొదలయ్యాయి. ప్రయాగ్రాజ్లో భక్తుల రద్దీ ఎక్కువగా నెలకొంది. అయినా అమృత స్నానాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ తగ్గాక తాము స్నానాలకు వెళ్తామని అఖాడాలు తెలిపారు. ఈ ఉదయం 8గం. వరకే దాదాపు 3 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ప్రయాగ్రాజ్కి ఇవాళ 8-10 కోట్ల మంది వస్తారని అంచనా. .. గత రాత్రి తొక్కిసలాట జరిగింది. అఖాడ మార్గం గుండా వెళ్లి స్నానాలు చేయాలని కొందరు భక్తులు ప్రయత్నించారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రధాని మోదీ ఇప్పటికే నాలుగుసార్లు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు, కేంద్ర మంత్రి అమిత్ షా,గవర్నర్ కూడా ఘటన గురించి చర్చించారు ’’ అని యోగి ప్రకటించారు. అలాగే.. త్రివేణి సంగం వద్దకు కాకుండా ఎక్కడికక్కడే ఘాట్లకు వెళ్లి స్నానం చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. #WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath says," The situation in Prayagraj is under control...""Around 8-10 crore devotees are present in Prayagraj today. There is continuous pressure due to the movement of devotees towards the Sangam Nose. A few devotees have… pic.twitter.com/lOc1OIraqm— ANI (@ANI) January 29, 2025ఇదిలా ఉంటే.. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. సుమారు 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా.. త్రివేణి సంగమానికి 30 కిలోమీటర్ల వరకే అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు కాలినడకన చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సెక్టార్ 2 వద్ద తొక్కిసలాటలో పలువురికి గాయాలు కాగా చికిత్స అందుతోంది. ఘాట్ వెంట కిక్కిరిసిన భక్తులతో కిలోమీటర్ మేర బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో ఊపిరాడని పరిస్థితుల నడుమ భక్తులు నలిగిపోయారు. తీవ్రంగా గాయపడిన 50 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పది నుంచి 15 మంది మరణించారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. దీనిని అధికారులు ధృవీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. జరిగింది ఇదే! -
Mahakumbh-2025: నిర్వహణ లోపంతోనే ప్రమాదం: అఖిలేష్ యాదవ్
ప్రయాగ్రాజ్: మహాకుంభమేళాలో బుధవారం ఉదయం తొక్కిసలాట జరిగిన దరిమిలా యోగి సర్కార్పై సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే యోగి ప్రభుత్వానికి ఐదు విజ్ఞప్తులు చేశారు. మహా కుంభ్లో నిర్వహణ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లి తక్షణం వైద్య చికిత్స అందించాలని, మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేయాలని అఖిలేష్ కోరారు. సహాయక చర్యలను కొనసాగిస్తూనే, సురక్షితమైన నిర్వహణ అందించాలని సూచించారు. ఈ క్లిష్ట సమయంలో భక్తులు సంయమనం పాటిస్తూ, సహనంతో వ్యవహరించాలని అఖిలేష్ విజ్ఞప్తి చేశారు. నేటి సంఘటన నుండి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని భక్తులకు తగిన రక్షణ వ్యవస్థ కల్పించాలన్నారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి -
Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు ఈరోజు(బుధవారం) సంగమ తీరానికి లేక్కలేనంతమంది భక్తులు వచ్చారు. ఈ నేపధ్యంలో తొక్కిసలాట చోటుచేసుకుంది.ఈ ఘటన గురించి తెలియగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. దీనితో పాటు భక్తులకు ఒక విజ్ఞప్తి చేశారు. యూపీ సర్కారు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పలు ఘాట్లను నిర్మించిందని తెలిపారు. అక్కడ కూడా స్నానాలు చేయవచ్చని సూచించారు. పుణ్యస్నానాల సందర్భంగా ఎటువంటి వదంతులు వ్యాపించినా పట్టించుకోవద్దని కోరారు.మరోవైపు ఈరోజు ఉదయం తొక్కిసలాట చోటుచేసుకున్న కారణంగా అన్ని అఖాడాలు అమృత స్నానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీనిని నిరంజన్ కంటోన్మెంట్ అఖాడ పరిషత్ అధ్యక్షుడు శ్రీమహంత్ రవీంద్ర గిరి మీడియాకు తెలిపారు. తొక్కిసలాటలో కొందరు మహిళలు, పిల్లలు గాయపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా.. -
మౌని అమవాస్య రద్దీ.. మహా కుంభమేళాలో తొక్కిసలాట (ఫొటోలు)
-
Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా..
ప్రయాగ్రాజ్: నేడు (బుధవారం) మౌని అమావాస్య. ఈ సందర్భంగా కుంభమేళాలో స్నానం చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపధ్యంలో కుంభమేళాకు దారితీసే మార్గాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.యూపీ-బీహార్ సరిహద్దు అయిన కర్మనాషా నుంచి బీహార్లోని రోహ్తాస్లోని శివసాగర్ ఖుర్మాబాద్ వరకు 70 కి.మీ మేరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచే జీటీ రోడ్డులోని రెండు లేన్లు పూర్తిగా జామ్ అయ్యాయి. దీని కారణంగా ద్విచక్రవాహనాలు వెళ్ళడం కూడా కష్టంగా మారింది.భారీ ట్రాఫిక్ జామ్ దృష్ట్యా ఉత్తరప్రదేశ్లోకి భారీ వాహనాల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని అధికారులు సడలించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. మరోవైపు ఢిల్లీ నుండి కోల్కతాకు వెళ్లే ప్రయాణికులకు ఆధారమైన జీటీ రోడ్డు గత 12 గంటలుగా స్తంభించిపోయింది. కుద్ర, మోహానియా, కైమూర్ జిల్లాలోని టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్ నెలకొంది. కోల్కతా, జార్ఖండ్తో పాటు ఇతర ప్రాంతాల నుండి ప్రయాగ్రాజ్కు వెళుతున్న భక్తుల వాహనాలు జాతీయ రహదారి- 19లో చిక్కుకుపోయాయి. భక్తులతో వెళ్తున్న ఒక బస్సు రాత్రంతా రద్దీలో చిక్కుకుపోయింది.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: నాలుగు నిముషాలకు ఒక రైలు.. మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు -
Mahakumbh-2025: నాలుగు నిముషాలకు ఒక రైలు.. మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈరోజు (జనవరి 29) మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలో రెండవ అమృత స్నానం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భక్తులు ముందుగానే సంగమస్థలికి చేరుకుంటున్నారు. మహా కుంభమేళా పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భారతీయ రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ స్టేషన్ నుండి 190 ప్రత్యేక రైళ్లు, 110 సాధారణ రైళ్లు, 60 మెమూ రైళ్లు సహా 360 రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ మీడియాకు తెలిపారు.కుంభమేళాకు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల ప్రయాణ అవసరాలను తీర్చడంపై భారత రైల్వేశాఖ దృష్టిసారించిందన్నారు. మౌని అమావాస్య నాడు పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నామని తెలిపారు. ప్రయాగ్రాజ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. ప్రతి స్టేషన్లో తాగునీరు, ఫుడ్ కోర్టులు, టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు.అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రథమ చికిత్స బూత్లు, వైద్య పరిశీలన గదులను ఏర్పాటు చేశామని, ప్రయాగ్రాజ్ జంక్షన్, ప్రయాగ్రాజ్ ఛోకిలలో యాత్రి సువిధ కేంద్రాల్లో వీల్చైర్లు, లగేజ్ ట్రాలీలు మందులు మొదలైనవి అందిస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అసలేం జరిగిందంటే..!
లక్నో: మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటు చేసుకుంది. మౌని అమవాస్య సందర్భంగా బుధవారం వేకువఝామున అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా తోసుకోవడంతో కిందపడి పదుల సంఖ్యలో భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు మరణించి ఉంటారని ప్రచారం నడుస్తున్నా.. అధికారులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రయాగ్రాజ్ సెక్టార్ 2 వద్ద రాత్రి 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. అమృత స్నానం కోసం భక్తులు ఎగబడడంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో భక్తులు ఒకరిమీద ఒకరు పడిపోయి చెల్లాచెదరు కావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ‘‘మేం మొత్తం అరవై మంది రెండు బస్సుల్లో ప్రయాగ్రాజ్ వచ్చాం. తొమ్మిది మంది ఒక గ్రూప్గా అమృత స్నానం కోసం వెళ్లాం. ఒక్కసారిగా జనం తోసుకున్నారు. అందులో మేం ఇరుక్కుపోయి కిందపడిపోయాం. ఆ గందరగోళంలో కిందపడినవాళ్లను తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఆ టైంలో జనాలను నియంత్రించలేని పరిస్థితి నెలకొంది’’ అని కర్ణాటకకు చెందిన సరోజినీ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. ఈ గందరగోళంలో భక్తులు భయంతో పరుగులు తీశారు. తొక్కిసలాటలో 50 మందిదాకా గాయపడ్డారు. వీళ్లలో అధికంగా మహిళలే ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆంబులెన్స్లలో ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో తొలుత అఖాడ పరిషత్ కమిటీ అమృత స్నానాలు రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే.. ఘటన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రద్దీ తగ్గడంతో అమృత స్నానాలు కొనసాగించాలని అఖాడ పరిషత్ కమిటీ నిర్ణయించింది. రద్దీ తగ్గడంతో అమృత స్నాన కార్యక్రమాన్నికొనసాగిస్తునన్నట్లు అధ్యక్షుడు రవీంద్ర పూరి ప్రకటించారు. అలాగే.. తప్పుడు సమాచారం బయటకు వెళ్తోందని, దానిని కట్టడి చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారాయన. ఇక.. భక్తులు త్రివేణి సంగమం ద్వారం వద్ద కాకుండా, ఘాట్ల వద్దే స్నానమాచరించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. #WATCH | Prayagraj, Uttar Pradesh: Rescue operations are underway after a stampede-like situation arose in Maha Kumbh and several people were reported injured. https://t.co/4z63F7pAS9 pic.twitter.com/YxZHXIoy51— ANI (@ANI) January 29, 2025ఇదిలా ఉంటే.. ఘటనపై ప్రధాని మోదీకి సమాచారం అందింది. దీంతో ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూచించారు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని మోదీ కుంభమేళాలో పవిత్ర స్నానం కోసం వెళ్లనున్నారు. మరోవైపు.. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ సైతం ఆరా తీసినట్లు సమాచారం. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభ మేళాకు బుధవారం నాటి ‘మౌనీ అమావాస్య’ సందర్భంగా భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు యూపీ సర్కారు ప్రకటించుకుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటిదాకా 15 కోట్లమందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేయగా, బుధవారం(ఇవాళ) ఒక్కరోజే అమృతస్నానం కోసం 10 కోట్లమంది తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంతకుముందు అంచనా వేశారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ప్రయాగ్ రాజ్లో ప్రకాశ్ రాజ్'.. సోషల్ మీడియాలో వైరల్
యూపీలోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభ్ మేళాలో సినీనటుడు ప్రకాశ్ రాజ్ స్నానం చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ తెగ వైరలవుతోంది. నదిలో ఆయన స్నానం చేస్తున్న ఫోటో నెట్టింట వైరల్గా మారింది. అయితే దీనిపై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం.ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో రాస్తూ..'ఇది నకిలీ వార్త. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి వారి పవిత్ర పూజలను కూడా కలుషితం చేయడమే వారి పని. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశా. అసలు నిజమేంటో కోర్టులో తెలుస్తుంది. ఇలా చేయడం సిగ్గుచేటు' అని కన్నడలో పోస్ట్ చేశారు. మహాకుంభ్ మేళాలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారని తెలియగానే నెటిజన్స్ విభిన్నమైన కామెంట్స్ చేశారు. అయితే.. ప్రకాశ్ రాజ్ ఫోటోను డీప్ ఫేక్ టెక్నాలజీతోనే క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ಸುಳ್ಳು ಸುದ್ದಿ“ಸುಳ್ಳ ರಾಜ” ನ ಹೇಡಿಗಳ ಸೈನ್ಯಕ್ಕೆ .. ಅವರ ಪವಿತ್ರ ಪೂಜೆಯಲ್ಲೂ ಸುಳ್ಳು ಸುದ್ದಿ ಹಬ್ಬಿಸಿ ಹೊಲಸು ಮಾಡುವುದೇ ಕೆಲಸ .. police complaint ದಾಖಲಾಗಿದೆ .. ಕೋರ್ಟಿನ ಕಟಕಟೆಯಲ್ಲಿ ಏನು ಮಾಡುತ್ತಾರೋ ನೋಡೋಣ 😊 #justasking pic.twitter.com/S6ySeyFKmh— Prakash Raj (@prakashraaj) January 28, 2025 -
కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
ఝాన్సీ : మహాకుంభమేళాకు వెళుతున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. మధ్యప్రదేశ్లోని హర్పాల్పూర్లో ఝాన్సీ నుండి ప్రయాగ్రాజ్ వెళ్తున్న రైలుపై అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. ఈ రైలు మహా కుంభమేళాకు వెళుతోంది.ఝాన్సీ డివిజన్లోని హర్పాల్పూర్ స్టేషన్లో సోమవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అకస్మాత్తుగా రైలుపై దాడి జరిగిన నేపధ్యంలో రైలులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అల్లరిమూకలు రైలులోనికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో రాళ్లతో కిటికీలను పగులగొట్టారని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారని సమాచారం.విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక పోలీసులతో పాటు రైల్వే రక్షణ దళం పరిస్థితిని అదుపులోనికి తెచ్చింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఛతర్పూర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వాల్మిక్ చౌబే మాట్లాడుతూ ఛతర్పూర్ రైల్వే స్టేషన్లో గేటు తెరవకపోవడంతో తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో కొందరు అల్లరిమూకలు రైలుపై రాళ్లు రువ్వారని తెలిపారు. ఈ రైలు ఛతర్పూర్ నుండి ప్రయాగ్రాజ్ వెళుతోందని, దాడికి పాల్పడినవారంతా పరారయ్యారని తెలిపారు.ఇది కూడా చదవండి: Baghpat Incident: లడ్డూ పండుగలో విషాదం.. ఏడుగురు మృతి -
Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది. దేశ విదేశాల నుండి పర్యాటకులు, భక్తులు మహా కుంభమేళాకు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.మహాకుంభమేళాలో మూడవ పుణ్య స్నానం జనవరి 29న అంటే మౌని అమావాస్య రోజున జరగనుంది. ఆ రోజున పుణ్యస్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు మహా కుంభ స్నానం చేసే వారి సంఖ్య 15 కోట్లు దాటింది. గడచిన 17 రోజుల్లో 15 కోట్లకు పైగా జనం మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారు. మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్ల మంది భక్తులు, సాధువులు స్నానమాచరించారు.రాబోయే మౌని అమావాస్య సందర్భంగా 8 నుండి 10 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వస్తారనే అంచనాలున్నాయి. 2025 మహా కుంభమేళాకు మొత్తంగా 40 కోట్ల మంది హాజరవుతారనే అంచనాలున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య అనంతరం ఫిబ్రవరిలో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం జరగనుంది. మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 26న అంటే మహాశివరాత్రి రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు -
Mahakumbh 2025: కుంభమేళా కవర్ చేస్తున్న రిపోర్టర్.. ఇంతలో ఊహించని విధంగా
యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కుంభమేళాకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా అటువంటి వీడియో ఒకటి నెటిజన్లను తెగ అలరిస్తోంది.ఒక మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ అత్యంత ఉత్సాహంగా కుంభమేళాపై వీడియో కవర్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చినవారిని పలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఆ రిపోర్టర్ ఒక వ్యక్తిని కుంభమేళా అనుభవాల గురించి అడుగుతుండగా, ఆ పక్కనే ఉన్న ఒక యువకుడు తాను మాట్లాడుతానని అడగడాన్ని వీడియోలో మనం గమనించవచ్చు. దీనికి సమాధానంగా ఆ రిపోర్టర్ కొంచెం దూరంగా ఉండు.. తరువాత నువ్వు మాటాడవచ్చు అని చెబుతాడు. కొద్దిసేపు అలానే నిలబడిన ఆ యువకుడు ఒక్కసారిగా ముందుకువచ్చి, ఆ రిపోర్టర్ నుంచి మైక్ తీసుకుని పారిపోవడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఇది జరిగిన వెంటనే ఆ రిపోర్టర్తో పాటు అక్కడున్నవారంతా ఆ యువకుడిని వెంబడిస్తారు. महाकुंभ मे माहौल पूरी तरह हंसी मजाक का बना रखा है लोगो ने.... अब रिपोर्टर साहब का माइक लेकर लड़का फरार 😅😃 pic.twitter.com/03ndTJvlxa— Ganesh Bhamu (@GaneshBhamu87) January 27, 2025ఈ వీడియో @GaneshBhamu87 అనే ఖాతా నుంచి ఎక్స్ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక లక్షా 71 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చూసిన కొందరు యూజర్స్ ఇది రిపోర్టర్ ఆడిన గేమ్ అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు కుంభమేళాను రంగులమయం చేస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు -
ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తాజాగా జనవరి 27 (సోమవారం) రాత్రి 10 గంటల వరకు ఒక్కరోజులో 1.5 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు.జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకూ 14 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుంభమేళాలో పాల్గొని, పవిత్ర స్నానం చేశారు. ఈ సమయంలో ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బాబా రామ్దేవ్ తదితరులు ఉన్నారు.మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరలివస్తున్నారు. ఇటాలియన్ భక్తుడైన ఆంటోనియో తాను భారతదేశంలో జరిగే కుంభమేళాను చూడాలనే తన కలను నెరవేర్చుకున్నానని తెలిపారు. 10 సంవత్సరాలుగా ఇక్కడికి రావాలనుకుంటున్నానని, ఇప్పుడు కుంభమేళా సమయంలో వచ్చానని మీడియాకు తెలిపారు. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాంటి 12 కుంభమేళాల తరువాత వచ్చిన మహా కుంభమేళా ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే -
Mahakumbh Mela 2025 పవిత్ర స్నానం గురించి బాధపడకండి..ఇలా చేస్తే పుణ్యఫలం!
మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సమారంభం. ఎందరో సాధువులు, బాబాలు, అవధూతలు, సిద్ధులు, యోగులు, వైష్ణవులు, శాక్తులు, ఇలా హైందవ ధర్మంలో ఉన్న అనేక ఆచారాలకు సంబంధించిన ఎందరో మహిమాన్వితులు మహాకుంభ మేళాకు తరలి వెళతారు. ప్రపంచ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు ఆ దివ్య మహోత్సవ సందర్శనార్థం ప్రయాగ చేరుకుంటారు. నదులకు సహజ సిద్ధంగా దివ్యశక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. ఈ కారణంగానే ఎన్నో దివ్య క్షేత్రాలు, ధామాలు పుణ్యనదుల పరీవాహక ప్రాంతాల్లో కొలువుదీరి ఉంటాయి. ఈ సంవత్సరం మహా కుంభమేళ ప్రయాగలో జరుగుతుంది. భూమాతను ఆసురీ శక్తుల ప్రభావం నుండి కాపాడేందుకు, దివ్యశక్తిని పెంచేందుకు ఎందరో యోగులు, సిద్ధులు, గురువులు ప్రత్యక్ష, పరోక్ష రూ΄ాలతో కృషి చేస్తుంటారు. మహా కుంభమేళా సమయంలో ఎందరో సాధువులు, మహా యోగులు నదీ గర్భంలోకి తమ త΄ోశక్తులను కూడా ప్రవహింపచేసి, అక్కడికి వచ్చిన అనేక మంది భక్తులను అనుగ్రహిస్తారు. నదిలోని దివ్య శక్తి, విశ్వంలో గ్రహాల అమరిక వల్ల ఉత్పన్నమయ్యే విశ్వశక్తి, మహాయోగుల తపోశక్తి వెరసి, దివ్య ప్రకంపనలు భూ గ్రహమంతా విస్తరిస్తాయి. అక్కడికి చేరుకున్న వ్యక్తులకే కాకుండా, ఈ దివ్య ప్రకంపనలు సామూహిక చైతన్యానికి కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. యోగవిద్యలో చెప్పిన ఇడా, పింగళ, సుషుమ్న నాడులకు, ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం వద్ద గంగా, యమున, సరస్వతీ నదుల కలయికకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. త్రివేణి సంగమం వద్ద మూడు పుణ్యనదులు కలిసి ఒక పవిత్ర తీర్థంగా మారినట్లే, మానవుడిలో ఇడా, పింగళ సుషుమ్న నాడులు భృకుటీ మధ్య భాగంలో సంగమిస్తాయి. అందుకే బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని జ్ఞాన త్రివేణిగా అభివర్ణిస్తారు. ఈ మూడు నాడులు ఏకీకృతం అయినప్పుడు చైతన్య జాగృతి కలుగుతుంది. అందుకే భకుటీ మధ్యంలో గంధం, కుంకుమ, పసుపు లేదా భస్మాన్ని బొట్టుగా ధరిస్తారు. భ్రూ మధ్యంలో మూడు నాడుల కలయిక అన్నది యోగంలో చెప్పే అమృతత్వ స్థితిని ప్రదానం చేసేందుకు మార్గం అవుతుంది. ఈ సంవత్సరం సంక్రాంతి నుండి శివరాత్రి వరకు దాదాపు 45 రోజుల పాటు సాగే ఈపవిత్ర సమయంలో ఆధ్యాత్మిక చింతనతో పాటుగా మనసును క్లేశ రహితంగా మార్చుకోవడం వల్ల దివ్య శక్తిని ఎక్కడ ఉన్నా పొందవచ్చు. త్రివేణి సంగమ స్థలికి చేరుకోలేని వారు, ఇంటి వద్దే 45 రోజుల పాటు ధ్యాన సాధన చేయడం ద్వారా కూడా అమృతతత్వాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. – మాతా ఆనందమయి,ఆధ్యాత్మిక గురువు చదవండి: రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో -
Mahakumbh Mela 2025: భారత్ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి
144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళ ఆశ్చర్యకర ఘటనలకు, అద్భుతాలకు నిలయంగా మారింది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఎందరెందరో దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. అందులో ఎందరో ఉన్నత విద్యావంతులు బాబాలుగా మారిన వారిని వెలుగులోకి తెచ్చింది. అందరివీ వేరు దారులైన అంతా కలిసేది ఈఆధ్యాత్మిక సాగరంలోనే అని చాటిచెబుతోంది. ఈ మహాకుంభమేళలో రెండు వేర్వురు దేశాలకు చెందిన అమ్మాయి అబ్బాయి ఒక్కటయ్యేందుకు వేదికగా మారింది. వాళ్లెవరు..? మన హిందూ వివాహ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు..? తదితరాల గురించి తెలుసుకుందామా..!.మన భారత్కి చెందిన యువకుడి గ్రీకు అమ్మాయిని పెళ్లాడింది. అది కూడా మన హిందూ వైవాహిక సాంప్రదాయంలోనే వివాహం చేసుకోవడం విశేషం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో ఆదివారం ఈ అద్భుతం చోటుచేసుకుంది. గ్రీకు యువతి పెన్లోప్ భారత్కు చెందిన సిద్ధార్థ్ అనే యువకుడిని వివాహం చేసుకుంది. అయితే వారిద్దరూ మన హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని భావించి అత్యంత పుణ్యప్రదమైన ప్రయాగ్రాజ్లోని ఈ మహాకుంభమేళాని ఎంచుకున్నట్లు తెలిపారు ఇరువురు. ఇక గ్రీకు యువతి పెన్లోప్ కొన్నేళ్ల క్రితం సనాతనధర్మం సంప్రదాయాలను అవలంభిస్తోందని, శివుని భక్తురాలిగా మారిందని జూనా అఖారాకు చెందిన దర్వి చెప్పారు. ఇక సిద్ధార్థుడు కూడా మా భక్తుడే, ఆయన యోగాను వ్యాప్తి చేయడానికి, సనాతన సేవ చేయడానికి వివిధ విదేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అలాగే వారి వారి వివాహ క్రతువు జూనా అఖారాకు చెందిన మహామండలేశ్వర్ స్వామి యతీంద్రానంద గిరి ఆధ్వర్యంలో జరిగింది. ఇక కన్యాదాన ప్రక్రియ వధువు తల్లి, ఆమె బంధువులు కలిసి నిర్వహించారు. ఈ పుణ్యప్రదమైన సమయంలోనే పెళ్లిచేసుకోవాలని ప్రగాఢంగా కోరుకున్నామని ఆ జంట తెలిపింది. ఇక పెన్లోప్ కూడా కొత్త సంస్కృతిని స్వీకరించడం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. తానెప్పుడు భారతీయ వివాహం చూడలేదన్నారు. అందువల్ల తనకు ప్రతీది కొత్తగా ఉందన్నారు. ఈ జంట ఈ మహాకుంభమేళ అయ్యే వరకు ఇక్కడే ఉండి స్నానాలు ఆచరిస్తామని చెప్పారు. అలాగే రానున్న మౌని అమావాస్య జనవరి 29 పవిత్ర స్నానాలు ఆచరిస్తామని చెప్పారు. గ్రీకు యువతి పెన్లోప్ తల్లి కూడా తాము కూడా ఈ పుణ్యకార్యక్రమాన్ని మిస్ చేసుకోవాలని అనుకోవట్లేదని అన్నారు. ఈ మహాకుంభ మేళ ప్రారంభం నుంచి ఇక్కడే ఉన్నామని, పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటన్నట్లు తెలిపారు.(చదవండి: ఐఐటీ గ్రాడ్యుయేట్, టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం..కట్చేస్తే ఇవాళ..!) -
Maha Kumbh Mela 2025: ఆధ్యాత్మిక బాటపట్టిన సురేశ్ రైనా.. సతీసమేతంగా..(ఫొటోలు)
-
కుంభమేళాలో అమిత్ షా పుణ్యస్నానం
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా జరగుతోంది. ఈరోజు (సోమవారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇప్పటివరకూ 13.21 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని గణాంకాలు చెబుతున్నాయి. #WATCH | Union Home Minister Amit Shah arrives in Prayagraj. Uttar Pradesh CM Yogi Adityanath, along with his cabinet ministers, receives him at the airport. The HM will take a holy dip at #MahaKumbh2025 today. pic.twitter.com/pU6Xk9wByc— ANI (@ANI) January 27, 2025తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరైల్ ఘాట్కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గ మంత్రులు అమిత్షాకు ఘన స్వాగతం పలికారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..#WATCH | #MahaKumbh2025 | Union Home Minister Amit Shah arrives at Selfie Point Arail Ghat in Uttar Pradesh. He will take a holy dip at #MahaKumbh2025 in Prayagraj shortly.CM Yogi Adityanath, Deputy CMs KP Maurya and Brajesh Pathak, and others are with him. pic.twitter.com/cSiFJNvTMY— ANI (@ANI) January 27, 2025 -
కుంభమేళా నుంచి వస్తుండగా ప్రమాదం.. కుటుంబమంతా దుర్మరణం
ఫతేహాబాద్: యూపీలోని ఆగ్రా పరిధిలో గల ఫతేహాబాద్లోని లక్నో ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.కుంభమేళాకు వెళ్లి, పుణ్యస్నానాలు ఆచరించి, తిరిగి వస్తున్న ఒక కుటుంబం రోడ్డు ప్రమాదం బారినపడింది. ఈ కుటుంబ యజమాని హైకోర్టు న్యాయవాది అని తెలుస్తోంది. తొలుత వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి, మరో లేన్లోకి వెళ్లింది. తరువాత ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా అక్కడికక్కడే మృతిచెందారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు, కుమార్తె మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. వారిని గుర్తించిన అనంతరం మృతదేహాలను పోలీసులు పోస్ట్మార్టం కోసం తరలించారు.ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నివాసి ఓం ప్రకాష్ ఆర్య ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుంటారు. తన హ్యుందాయ్ కారులో తన కుటుంబంతో కలిసి ప్రయాగ్రాజ్ కుంభ స్నానం చేసేందుకు వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక భార్య పూర్ణిమ సింగ్ (34), కుమార్తె అహానా (12), కుమారుడు వినాయక్ (4)లతో పాటు తిరిగి కారులో ఢిల్లీకి బయలుదేరారు. ఈ వారు ప్రయాణిస్తున్న కారు ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ముందుగా డివైడర్ను ఢీకొని ప్రమాదం బారినపడింది.ఈ ప్రమాదంలో ఓం ప్రకాష్తో పాటు అతని కుటుంబమంతా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. సమాచారం అందిన వెంటనే ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎస్ఎన్ హాస్పిటల్ అత్యవసర విభాగానికి తరలించారు. దెబ్బతిన్న వాహనాన్ని క్రేన్ సహాయంతో తొలగించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్ప్రెస్వేపై కొద్దిసేపు ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి.. -
Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంతో పాటు ప్రపంచంలోని నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భారీ జనసమూహంతో కిటకిటలాడుతున్న ఈ ప్రాంతంలో పలు ఆసక్తికర ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పరారీలోవున్న ఒక నేరస్తుడు పుణ్యస్నానం ఆచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.వివరాల్లోకి వెళితే ఆదివారం మహా కుంభమేళాలో పర్యాటకులు, భక్తులు స్నానమాచరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఒక మద్యం స్మగ్లర్ కూడా పుణ్యస్నానం చేసేందుకు సంగమతీరానికి చేరుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు సంగమస్థలిలో మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని భదోహి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకు తెలియజేశారు.మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్ రాజస్థాన్లోని అల్వార్ జిల్లా నివాసి అని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు. ప్రవేశ్ యాదవ్ ఒకటిన్నర సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. 2023, జూలై 29న జాతీయ రహదారి-19పై వాహనాల తనిఖీలు చేస్తుండగా మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రవేశ్ యాదవ్, రాజ్ దోమోలియాలను పోలీసులు అరెస్టు చేసినట్లు అభిమన్యు పేర్కొన్నారు. నాడు ఆ నిందితులు బీహార్కు అక్రమంగా తరలిస్తున్న కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతలో ప్రవేశ్ యాదవ్ పోలీసుల కన్నుగప్పి, అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కుంభమేళాలో పుణ్యస్నానం చేసేందుకు ప్రవేశ్ యాదవ్ వచ్చాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్ మీడియాలో చక్కర్లు -
మహాకుంభమేళాకే హైలైట్.. సోషల్ మీడియాలో చక్కర్లు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా యావత్ ప్రపంచం దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. అయితే ఇక్కడికి వస్తున్నవారిలో కొందరు అనూహ్యరీతిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. దీనికి వారిలో ఉన్న ఏదో ఒక విశిష్ట లక్షణం కారణంగా నిలుస్తోంది. దీంతోవారు సోషల్ మీడియా కుంభమేళా స్టార్లుగా నిలుస్తున్నారు.1. ఐఐటీ బాబాఐఐటీ పట్టభద్రుడైన అభయ్ సింగ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించారు. చదువును, మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టిన అభయ్ సింగ్ గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కొద్దిరోజ్లులోనే అభయ్సింగ్ ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.2. అమ్మాయిల గంగా హారతిమహా కుంభమేళాలో సంగమం తీరంలో హారతి ఇచ్చే అవకాశం కొందరు అమ్మాయిలకు దక్కింది. త్రివేణి సంగమంలో ప్రతిరోజూ ఏడుగురు అమ్మాయిలు గంగా హారతికి సారధ్యం వహిస్తున్నారు. హారతి సమయంలో ఈ అమ్మాయిలు ఢమరుకం వాయిస్తూ, పూజలు నిర్వహిస్తున్నారు.3. బవండర్ బాబామధ్యప్రదేశ్ నుండి మహా కుంభ్కు వచ్చిన బవండర్ బాబా సోషల్ మీడియాలో వైరల్గా మారారు. ఈ బాబా దివ్యాంగుడు కావడంతో మూడు చక్రాల వాహనంపై ప్రయాణం సాగిస్తుంటాడు. హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు, చిత్రాలపై జనానికి అవగాహన కల్పిస్తాడు.4. తేనె కళ్ల మోనాలిసామహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునే ఒక సాధారణ అమ్మాయి మోనాలిసా సోషల్ మీడియా స్టార్గా మారిపోయింది. ఆమెకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. 5. విదేశీయుల ఆశ్రమంమహా కుంభ్లో విదేశీ మహామండలేశ్వరుల ఆశ్రమం ప్రత్యేకంగా నిలిచింది. ఇక్కడున్న తొమ్మిది మంది మహామండలేశ్వరులు విదేశీయులు. పైగా వీరంతా సంస్కృతంలో సంభాషిస్తున్నారు.6. అంబాసిడర్ బాబాఅంబాసిడర్ బాబా ప్రయాగ్రాజ్ మహా కుంభ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ బాబా పేరు మహంత్ రాజ్ గిరి నాగ బాబా. ఆయన నిరంతరం తన అంబాసిడర్ కారులో ప్రయాణిస్తుంటారు. దానిలోనే నివాసం కూడా ఏర్పరుచుకున్నారు.7. 11 కోట్ల మంది రాకమహా కుంభమేళాకు పది రోజులలో దాదాపు 11 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మహా కుంభ స్నానం జనవరి 13న పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది. రెండవ స్నానోత్సవం మకర సంక్రాంతి నాడు జరిగింది. 8. డిజిటల్ మౌని బాబాడిజిటల్ మౌని బాబా రాజస్థాన్లోని ఉదయపూర్ నివాసి. ఆయన 12 సంవత్సరాలుగా మౌన వ్రతం పాటిస్తున్నారు. ఆయన డిజిటల్ మాధ్యమం ద్వారా వివిధ విషయాలను శిష్యులకు తెలియజేస్తుంటారు.9. ముక్కుతో వేణువు వాయించే బాబాపంజాబ్లోని పటియాలా నుండి మహా కుంభ్కు వచ్చిన ఈశ్వర్ బాబా ఒకేసారి రెండు వేణువులను వాయిస్తారు. ఈయన తన ముక్కుతో కూడా వేణువును వాయిస్తుంటారు. దీంతో ఆయనను అంతా బన్సూరి బాబా అని పిలుస్తుంటారు10. పర్యావరణ బాబాఆవాహన్ అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ అరుణ గిరి కూడా మహా కుంభమేళాలో అందరినీ ఆకర్షిస్తున్నారు. 2016లో ఆయన వైష్ణో దేవి నుండి కన్యాకుమారి వరకు 27 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. దీంతో ఆయనను పర్యావరణ బాబా అని పిలుస్తుంటారు.ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: తేనె కళ్ల మోనాలిసా ఇల్లు ఇదే.. వైరల్ వీడియో -
ఆ కేసుతో జీవితమే తలకిందులు.. సన్యాసం తీసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
Maha Kumbh 2025: తేనె కళ్ల మోనాలిసా ఇల్లు ఇదే.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వచ్చిన కొందరు సోషల్ మీడియాలో ప్రముఖస్థానం సంపాదించుకుంటున్నారు. ఈ జాబితాలోకే వస్తారు మోనాలిసా. కుంభమేళాకు వచ్చిన వారిని తన అందమైన కళ్లతో కట్టిపడేసిన మోనాలిసా తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. అందులో తాను ఎక్కడ నివసిస్తున్నానో, తాముంటున్న ఇల్లు ఎలా ఉందో చూపించారు. ఇటీవలి కాలంలో మోనాలిసాతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి యూట్యూబర్లు ఆమె వెంటపడుతున్నారు. కొందరు ఆమెతో ఫోటోలు దిగాలని, మరికొందరు వీడియోలు తీయాలని తాపత్రయపడుతున్నారు. दोस्तों मेरा इंस्टाग्राम अकाउंट किसी ने हैक कर लिया, बहुत जल्दी ही दूसरा एकाउंट बनाऊँगी।हम बोल भी क्या सकते हैं, उम्मीद है कि बापस मिल जायेगा। pic.twitter.com/rRLlQE8sPZ— Monalisa Bhosle (@MonalisaIndb) January 25, 2025మోనాలిసా 'ఎక్స్'లో ఒక వీడియోను షేర్ చేశారు. దీనిలో ఆమె ‘నేను ఇక్కడ ఉంటున్నాను. ఇది మా ఇల్లు. ఈ ప్రాంతంలో 100 మందికి పైగా జనం ఉంటున్నారు. నేను పూసల దండలు అమ్మడానికి ప్రయాగ్రాజ్ వెళ్ళాను. అక్కడ దండలు అమ్మడం కుదరలేదు. ఎవరో నా ఇన్స్టాగ్రామ్ ఐడీని కూడా హ్యాక్ చేశారు. నా ఐడిని హ్యాక్ చేసిన వారు నా ఐడిని తిరిగి ఇవ్వండి. దాని నుండి ఎంతోకొంత సంపాదించాలనుకున్నాను’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు -
కుంభమేళాలో మళ్లీ అగ్ని ప్రమాదం
మహాకుంభ్ నగర్(యూపీ): ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం చోటుచేసుకున్న ఘటనలో రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసికి చెందిన ఓ కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఫైర్ అధికారి వివరించారు. అందులోని వారందరినీ కాపాడి, మంటలను వెంటనే అదుపులోకి తెచ్చామన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఈ నెల 19న మహాకుంభ్ నగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 18 క్యాంపులు భస్మీపటలమయ్యాయి. మంటలను సకాలంలో ఆర్పివేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒకటిన 73 దేశాల దౌత్యవేత్తల రాకరష్యా, ఉక్రెయిన్ సహా 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు మహాకుంభ్ మేళాలో మొదటిసారిగా పుణ్యస్నానాలు చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన వీరంతా రానున్నారని మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం విదేశాంగ శాఖ యూపీ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాసిందన్నారు. జపాన్, అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలండ్, బొలీవియా తదితర దేశాల దౌత్యాధికారులు పాల్గొంటారని చెప్పారు. బోట్లో సంగం వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారన్నారు. అనంతరం, అక్షయ్వట్, బడే హనుమాన్ ఆలయాలను దర్శించుకోనున్నారు. డిజిటల్ మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో వీరికి మహాకుంభ్ ప్రాశస్త్యాన్ని వివరించనున్నామన్నారు.సొంత అఖాడాకు సీఎం యోగి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రయాగ్రాజ్లోని తన సొంత శ్రీ గురు గోరక్షా నాథ్ అఖాడాను సందర్శించారు. ధర్మ ధ్వజ్కు స్వయంగా ఉత్సవ పూజ జరిపారు. ఈ సందర్భంగా సీఎం యోగి దేశం నలుమూలల నుంచి మహాకుంభ్కు విచ్చేసిన సిద్ధ యోగులతో చర్చలు జరిపారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది గురు గోరక్షా నాథ్ సంప్రదాయాన్ని కొనసాగించే సీఎం యోగి సొంత అఖాడా అని యోగి మహాసభ ప్రత్యేక ఉపాధ్యక్షుడు మహంత్ బాలక్ నాథ్ యోగి చెప్పారు. యోగుల బసకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లున్నాయన్నారు. -
Mahakumbh: కారులో మంటలు.. అగ్నిమాపక దళం అప్రమత్తం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. తాజాగా కుంభమేళా ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ పార్క్ చేసిన ఒక కారు నుంచి మంటలు వెలువడ్డాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను వెంటనే అదుపులోకి తెచ్చింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కారు సగం మేరకు దగ్ధమైపోయింది.ఈ సంఘటన గురించి అగ్నిమాపక అధికారి విశాల్ యాదవ్ మాట్లాడుతూ ‘అనురాగ్ యాదవ్ అనే వ్యక్తి నుండి మాకు కాల్ వచ్చింది. ఒక కారు మంటల్లో చిక్కుకుందని ఆయన తెలిపారు. వెంటనే వెళ్లి మంటలను అదుపులోనికి తెచ్చాం. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు’ అని తెలిపారు. కాగా కొన్ని రోజుల క్రితం ఇదే కుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాటి సంఘటనలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే గీతా ప్రెస్కు నష్టం వాటిల్లింది. ఈ ఘటన దరిమిలా ఎల్పీజీ భద్రతపై అధికారులు ఒక ప్రత్యేక సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎల్పీజీ లీకేజీ వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. కాగా మహా కుంభమేళా ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, దానిని ఎదుర్కొనేందుకు రెస్క్యూ టీమ్ 24 గంటలూ అందుబాటులో ఉంది. ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత? -
Mahakumbh: మహాకుంభమేళాకు 73 దేశాల దౌత్యవేత్తలు
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళా విశిష్టతను యావత్ ప్రపంచం గుర్తించింది. దీంతో పవిత్ర త్రివేణీ సంగమం ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. తొలిసారిగా 73 దేశాల నుండి దౌత్యవేత్తలు సంగమంలో స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు.త్రివేణీ సంగమానికి వస్తున్న దౌత్యవేత్తల విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచమంతా ప్రత్యర్థులుగా భావిస్తున్న రష్యా, ఉక్రెయిన్ రాయబారులు కూడా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మహాకుంభమేళా కార్యక్రమం గంగా నది ఒడ్డున జరుగుతున్న విభిన్న సంస్కృతులు, భావజాలాల సామరస్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ కార్యక్రమంలో అమెరికా, బంగ్లాదేశ్ దౌత్యవేత్తలు కూడా పాల్గొననున్నారు.మీడియాకు కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి ఒకటిన 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు మహా కుంభమేళాలో పాల్గొననున్నారు. ఈ విషయమై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ పంపింది. ఈ దౌత్యవేత్తలంతా బడే హనుమాన్ ఆలయం తదితర ప్రాంతాలను సందర్శించనున్నారు. వీరు ముందుగా పడవలో సంగమ తీరం చేరుకుని, పుణ్యస్నానం చేసి, బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు.అనంతరం డిజిటల్ మహాకుంభ్ కేంద్రాన్ని సందర్శించి, కుంభమేళా పరమార్థాన్ని తెలుసుకోనున్నారు. తరువాత వీరంతా యూపీ స్టేట్ పెవిలియన్, అఖాడా, యమునా కాంప్లెక్స్, అశోక స్తంభం తదితర ప్రదేశాలను సందర్శించనున్నారు. కాగా బమ్రౌలి విమానాశ్రయంలోని ప్రత్యేక వీఐపీ లాంజ్లో విదేశీ అతిథులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. 140 ప్రత్యేక పడవలను కూడా ఏర్పాటు చేశారు.ఈ దేశాల దౌత్యవేత్తలు..మహా కుంభమేళాకు జపాన్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, జర్మనీతో పాటు అర్మేనియా, స్లోవేనియా, హంగేరీ, బెలారస్, సీషెల్స్, మంగోలియా, కజకిస్తాన్, ఆస్ట్రియా, పెరూ, గ్వాటెమాల దేశాలకు చెందిన దౌత్యవేత్తలు తరలి వస్తున్నారు. అలాగే మెక్సికో, అల్జీరియా, దక్షిణాఫ్రికా ఎల్ సాల్వడార్, చెక్ రిపబ్లిక్, బల్గేరియా, జోర్డాన్, జమైకా, ఎరిట్రియా, ఫిన్లాండ్, ట్యునీషియా, ఫ్రాన్స్, ఎస్టోనియా, బ్రెజిల్, సురినామ్, జింబాబ్వే దేశాల రాయబారులు కూడా కుంభమేళాకు హాజరుకానున్నారు. ఇదేవిధంగా మలేషియా, మాల్టా, భూటాన్, లెసోతో, స్లోవాక్, న్యూజిలాండ్, కంబోడియా, కిర్గిస్తాన్, చిలీ, సైప్రస్, క్యూబా, నేపాల్, రొమేనియా, వెనిజులా, అంగోలా, గయానా, ఫిజి, కొలంబియా, సిరియా, గినియా, మయన్మార్, సోమాలియా, ఇటలీ, బోట్స్వానా, పరాగ్వే, ఐస్లాండ్, లాట్వియా, నెదర్లాండ్స్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, థాయిలాండ్, పోలాండ్, బొలీవియా దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కుంభమేళాను సందర్శించనున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత? -
Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది. ఈ సమయంలో కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. కుంభమేళా జరిగే రోజుల్లో కొన్ని తిథులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. వాటిలో మౌని అమావాస్య ఒకటి. మాఘ మాసంలో వచ్చే ఈ అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేస్తే, పాపాల నుండి విముక్తి లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మౌని అమావాస్య జనవరి 29, బుధవారం నాడు వచ్చింది.హిందూ క్యాలెండర్ ప్రకారం మౌని అమావాస్య మాఘ మాసంలో వస్తుంది. అందుకే ఈ అమావాస్యను మాఘ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఆ రోజున ఎవరైనా తమ పెద్దలకు పిండప్రదానం చేస్తే, వారు పితృ దోషం నుండి విముక్తి పొందుతారని పెద్దలు చెబుతుంటారు. ఇదేవిధంగా మౌని అమావాస్య నాడు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇప్పుడొచ్చిన మౌని అమావాస్య..మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో రావడం విశేషంగా భావిస్తున్నారు. మౌని అమావాస్యనాడు నిశ్శబ్ద ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు.మౌనం వలన కలిగే లాభాలను మౌని అమావాస్య గుర్తుచేస్తుంది. మౌనం అంటే బాహ్య మౌనం కాదని, అంతర్గతంగా మౌనంగా ఉండాలని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనిషి మౌన ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని మానసికశాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు. తద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుందని, ఏకాగ్రత ఏర్పడుతుందని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం అలవడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌనం పాటించడం అనేది సాధకులను ఎంతో ముఖ్యమని, తద్వారా ఆధ్యత్మిక ఎదుగుదల అలవడుతుందని ఆధ్మాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మళ్లీ గూగుల్ మ్యాప్ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్ పర్యాటకుల వంతు -
Mahakumbh: అద్భుతం.. అమోఘం.. డ్రోన్ షో
యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. శుక్రవారం ప్రయాగ్రాజ్లోని సెక్టార్ 7లో అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహించిన ఈ ప్రదర్శనలో వందలాది డ్రోన్ల సహాయంతో ఆకాశంలో వివిధ దృశ్యాలను ప్రదర్శించారు.డ్రోన్ షోలో దేవతలు అమృత కలశాన్ని సేవిస్తున్నట్లు చూపారు. అలాగే సముద్ర మథనానికి సంబంధించిన దివ్య శకటం ఎంతో అందంగా కనిపించింది.డ్రోన్ సహాయంతో ఆకాశంలో కనిపించిన మహా కుంభమేళా చిత్రంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లోగో అందరినీ ఆకర్షించింది. సంగమ ప్రదేశంలో స్నానం చేస్తున్న సాధువు, శంఖం ఊదుతున్న సన్యాసి చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.అసెంబ్లీ భవనంపై రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం డ్రోన్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యూపీ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక శకటం ఈ కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చింది.జనవరి 24 నుండి 26 వరకు జరగనున్న అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన మహాకుంభమేళా ప్రాంతాన్ని మరింత శోభాయమానం చేసింది. ఈ ప్రదర్శనలో సనాతన సంప్రదాయ వారసత్వానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించారు.ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: 104 నాగసాధు అభ్యర్థనలు రద్దు.. 12 అఖాడాల నిర్ణయం -
Maha Kumbh-2025: 104 నాగసాధు అభ్యర్థనలు రద్దు.. 12 అఖాడాల నిర్ణయం
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. ఇక్కడికి వచ్చే సామాన్యులను మహామండలేశ్వరులు, నాగ సాధువులు అమితంగా ఆకర్షిస్తున్నారు. అయితే మహామండలేశ్వరులు, నాగసాధువులుగా మారడం అంత సులభం కాదు.మహామండలేశ్వరులు, నాగ సాధువులుగా మారేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. జీవితంలో సత్యనిరతి, సనాతనధరంపై అంకితభావం కలిగివుండాలి. ఈ విలువలకు అఖాడాలు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. మహామండలేశ్వరులు, నాగ సాధువులకు అఖాడాలు దీక్షనిస్తారు. జీవితంలో ఏమాత్రం విలువలు పాటించకుండా సాధకులమని చెప్పుకునేవారికి దీక్షలు ఇచ్చేందుకు అఖాడాలు ఆసక్తి చూపరు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో మహామండలేశ్వరులు, నాగసాధుకులుగా మారాలనుకున్న పలువురికి నిరాశ ఎదురయ్యింది.మహామండలేశ్వరులుగా మారాలనుకున్న 12 మంది సాధకులు, సాగ సన్యాసం స్వీకరించాలనుకున్న 92 మంది సాధకుల దరఖాస్తులను అఖాడాలు తిరిస్కరించారు. జునా అఖాడా, ఆవాహన్ అఖాడా, నిరంజని అఖాడా, బడా నిరంజని అఖాడాలు మొత్తం 104 అభ్యర్థనలను తిరస్కరించారు. ఈ అభ్యర్థుల తీరుతెన్నులు సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా లేవని తేలండంతో అఖాడాలు వీరి దరఖాస్తులను తిరస్కరించారు.మకర సంక్రాంతి నుండి ఇప్పటివరకు వివిధ అఖాడాలలో కొత్తగా 30 మందికి మహామండలేశ్వరులుగా, 3,500మందికి నాగ సాధువులుగా దీక్ష ఇచ్చారు. వసంత పంచమి నాడు జరిగే మూడవ అమృత స్నానం వరకు, మహామండలేశ్వరులకు, నాగ సన్యాసులకు దీక్షనిచ్చే కార్యక్రమం కొనసాగుతుంది.మహామండలేశ్వరులు, లేదా నాగ సాధువుగా మారేందుకు ముందుగా అఖాడాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం వారు ఆ దరఖాస్తులో తల్లిదండ్రులు, విద్యార్హతతో సహా పలు వ్యక్తిగత వివరాలు తెలియజేయాలి. వీటిని అఖాడాలు సమగ్రంగా పరిశీలిస్తారు. ఈ విధంగా వచ్చిన దరఖాస్తులలో నిరంజని అఖాడా ఆరు దరఖాస్తులను, జునా అఖాడా నాలుగు దరఖాస్తులను, ఆవాహన్ అఖాడా మహామండలేశ్వర్గా మారేందుకు వచ్చిన రెండు దరఖాస్తులను రద్దు చేసింది. నాగ సాధువులుగా మారేందుకు వచ్చిన దరఖాస్తులలో 92 దరఖాస్తులను రద్దు చేశారు. ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి -
ఫిబ్రవరి 5నే ప్రధాని మోదీ కుంభస్నానం ఎందుకు? ఆ రోజు ప్రత్యేకత ఇదే..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో పుణ్యస్నానం చేసేందుకు జనం పోటెత్తుతున్నారు. ప్రతీరోజు ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకూ.. కొన్ని లక్షలమంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న కుంభ స్నానం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ ఫిబ్రవరి 5నే మహా కుంభ స్నానానికి ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్న అందరిమదిలో మెదులుతోంది.ఫిబ్రవరి 5.. మాఘ మాసం, గుప్త నవరాత్రి, అష్టమి తిది(ఉత్తరాదిన) రోజున ప్రధాని మోదీ కుంభమేళాలో పుణ్యస్నానం చేయనున్నారు. ఆరోజున స్నానం చేయడం, ధ్యానం చేయడం ఎంతో మంచిదని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అలాగే మాఘ మాసం అష్టమి రోజున పవిత్ర నదిలో స్నానం చేసి, పూర్వీకులకు నీరు, నువ్వులు, బియ్యం, పండ్లు మొదలైనవి సమర్పించడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని హిందూ గ్రంథాలలో పేర్కొన్నారు.కాగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, బీజేపీ ఎంపీ రవి కిషన్, ఆధ్యాత్మిక గురువు సద్గురు, నటుడు అనుపమ్ ఖేర్, కుమార్ విశ్వాస్ సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించారు. -
ఎవరీ మోనాలిసా? ఓవర్నైట్లో జాక్పాట్ కొట్టిన తేనె కళ్ల సుందరి (ఫోటోలు)
-
మహాకుంభ్ మేళా తేనే కళ్ల బ్యూటీ.. ఏకంగా సినిమాలో ఆఫర్!
సోషల్ మీడియా ఆ మహిళను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతకుముందు తాను ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాదు.. రాజకీయ నాయకురాలు అంత కన్నా కాదు. ఆమె ఓ సాధారణ మహిళ. పొట్టికూటి కోసం రోడ్డు వెంట చిన్న చితకా వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఇప్పుడేమో ఆ మహిళ ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టిసిందేనే వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం.యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహకుంభ్ మేళా మోనాలిసా అనే మహిళకు ఒక్కసారిగా ఫేమ్ తీసుకొచ్చింది. ఆమెను ఓవర్నైట్ స్టార్ను చేసింది. దానికి కారణం ఆమె కళ్లు. తేనేలాంటి కళ్లతో మహాకుంభ్ మేళాలో పూసల దండలు విక్రయిస్తున్న మోనాలిసా అనే మహిళను ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ తర్వాత అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఏ సోషల్ మీడియా చూసిన ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోనాలిసా పేరు వైరల్ కావడంతో ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఏకంగా సినిమా ఛాన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు.మహాకుంభ్ మేళాలో అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న తేనేకళ్ల సుందరి మోనాలిసా. ఆమెను చూసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు. దీనికి కారణం ఆమెకున్న స్పెషల్ అట్రాక్షన్ కళ్లు. ఆ అందమైన కళ్లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన సినిమాలో అమ్మాయి కోసం వెతుకున్న బాలీవుడ్ డైరెక్టర్కు మోనాలిసా గురించి తెలిసింది. డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో ఆమెకు అవకాశమివ్వనున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమెకు తన సినిమాలో ఓ రైతుకు బిడ్డగా నటించే పాత్ర ఇస్తానని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వల్ల ఓవర్నైట్ స్టార్ అయిన మోనాలిసా ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
ఈ తేనె కళ్ల వెనుక ఇంత కథ ఉందా?
-
Mahakumbh: నాగసాధువులుగా మారిన మహిళా సాధకులు
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కుంభమేళాకు తరలివచ్చిన నాగ సాధువుల గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరు చేసే సాధన వివరాలు తెలుసుకోవాలని పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో వందలాది మంది మహిళా సాధకులు నాగ సన్యాసత్వాన్ని స్వీకరించారు. వీరు నాగ సన్యాసం తీసుకునే ముందు గంగా నదిలో స్నానం చేసి, తమ కుటుంబ సభ్యులతో పాటు తమకు తాము పిండప్రదానం చేసుకున్నారు. ఆ తరువాత వారికి విజయ సంస్కారం నిర్వహించారు.ఈ సంప్రదాయాలన్నీ పూర్తయ్యాక నాగ సన్యాసినులుగా మారబోయే ఈ స్త్రీలకు జునా అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి అవధేశానంద్ మహారాజ్ గురు దీక్ష ఇచ్చారు. దీంతో వారంతా నాగ సన్యాసినులుగా మారారు.జునా అఖాడాకు చెందిన మహామండలేశ్వర్ లాంవీ విశ్వరి మాత ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయ సంస్కారం తర్వాత, సన్యాసం స్వీకరించే స్త్రీలు గంగానదిలో స్నానం చేసి, గురువు ముందు దీక్ష తీసుకున్నారని, సన్యాసం స్వీకరించిన వీరంతా కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించి, ధర్మ మార్గాన్ని అనుసరిస్తారని విశ్వరి మాత తెలిపారు.దీక్ష తీసుకున్న నాగ సన్యాసినులు అన్ని అనుబంధాలను త్యజించాలి. కాగా విదేశీయులతో సహా వందలాది మంది మహిళలు నాగ సన్యాసం తీసుకున్నారని అవధేశానంద్ మహారాజ్ తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumbh: సంస్కృతంలో సంభాషిస్తున్న విదేశీ స్వాములు -
Mahakumbh: కుంభమేళాకు భయపడిన బ్రిటీష్ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గల పవిత్ర త్రివేణీ సంగమంలో జరుగుతున్న కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అత్యంత భారీగా జరుగుతున్న కుంభమేళాను వీక్షించేందుకు, సనాతన ధర్మం గురించి తెలుసుకునేందుకు లక్షలాదిమంది విదేశీయులు కూడా భారత్కు తరలిరావడం విశేషం. కుంభమేళాకు ఘన చరిత్ర ఉంది. 1942లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగిన కుంభమేళా ఉదంతం గురించి యూపీకి చెందిన భాషావేత్త పృథ్వీనాథ్ పాండే మీడియాకు తెలిపారు.కుంభమేళా కేవలం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవమే కాదు. భారతదేశ స్వాతంత్య్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. 1857లో ఆధ్యాత్మిక బోధనలు సాగించిన పండితుడు ప్రయాగ్వాల్ నాటి విప్లవకారులకు అండగా నిలిచారని భాషావేత్త పృథ్వీనాథ్ పాండే తెలిపారు. ఆయన స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా నాటి ఉద్యమకారులకు ఊపిరిపోశారన్నారు. నాడు మహారాణి లక్ష్మీబాయి ప్రయాగ్రాజ్ వచ్చినప్పుడు ఆమె పండితుడు ప్రయాగ్వాల్ ఇంట్లో ఆశ్రయం పొందారు. స్వాతంత్య్ర పోరాటంలో కుంభమేళా భాగస్వామ్యం కూడా ఉంది. దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న 1918 నాటి రోజుల్లో కుంభమేళా అంత్యంత వైభవంగా జరిగింది. దీనిలో పాల్గొనేందుకు జాతిపిత మహాత్మాగాంధీ ప్రయాగ్రాజ్కు వచ్చారు. నాడు ఆయన త్రివేణి సంగమంలో స్నానం చేయడమే కాకుండా, అక్కడున్న సాధువులను కలుసుకున్నారు. యాత్రికులతో సంభాషించారు.హిందువుల ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచిన కుంభమేళా ఉత్సవం బ్రిటిష్ ప్రభుత్వ ఆందోళనను మరింతగా పెంచింది. మరోవైపు అదేసమయంలో గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకుంది. 1942లో ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరిగింది. ఇది తమ పరిపాలనకు అడ్డుకులు కల్పిస్తుందనే ఉద్దేశంలో బ్రిటీషర్లు ప్రయాగ్రాజ్కు వచ్చే రైళ్లు, బస్సులను అడ్డుకున్నారు. ఈ ప్రయాణ సాధనాలకు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలను నిషేధించారని భాషావేత్త పృథ్వీనాథ్ పాండే తెలిపారు. కుంభ్ ప్రాంతం విప్లవ ప్రదేశంగా మారుతుందని బ్రిటీష్ పాలకులు భయపడ్డారు. బ్రిటీషర్లు అడ్డుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రయాగ్రాజ్కు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఇది కూడా చదవండి: Kumbh Mela: కుంభమేళాకు వెళితే వీటిని తప్పక చూడండి -
Mahakumbh: సంస్కృతంలో సంభాషిస్తున్న విదేశీ స్వాములు
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోగల త్రివేణీ సంగమంలో భక్తులు మహాకుంభమేళా స్నానాలను ఆచరిస్తున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఉత్సవం ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ కొనసాగనుంది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు కూడా తరలివస్తున్నారు. వీరిలో స్వామీజీలు కూడా ఉండటం విశేషం.కుంభమేళాలోని 17వ సెక్టార్లో ఉన్న శక్తిధామ్ ప్రత్యేకమైన ఆశ్రమంగా పేరొందింది. ఈ ఆశ్రమంలోని తొమ్మిది మంది విదేశాలకు చెందిన మహామండలేశ్వరులు ఉన్నారు. వీరు సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఈ మహామండలేశ్వరులంతా హిందూధర్మాన్ని స్వీకరించారు. వీరిలో అమెరికా, ఇజ్రాయెల్ జపాన్కు చెందినవారున్నారు. ఈ తొమ్మిదిమంది మహామండలేశ్వరులలో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.అమెరికాలో నివసిస్తున్న మహామండలేశ్వర్ అనంత్ దాస్ మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ తాను అమెరికాలో ఉంటున్న సాయి మాతను కలుసుకున్నానని తెలిపారు. ఆ తరువాత తాను సనాతన ధర్మానికి అమితంగా ప్రభావితుడనయ్యానని అన్నారు. వెనువెంటనే సాయి మా ఆశ్రమంలో చేరానని, కొద్దిరోజుల తరువాత వారణాసికి వచ్చి, శక్తిధామ ఆశ్రమంలో మహామండలేశ్వర్ దీక్ష తీసుకున్నానని తెలిపారు. ఇప్పుడు తాను విద్యాబోధనతో పాటు యోగా నేర్పిస్తున్నానని, విదేశీయులను సనాతన ధర్మంతో అనుసంధానించడానికి కృషి చేస్తున్నానని తెలిపారు.ఇది కూడా చదవండి: నేడు కుంభమేళాకు గౌతమ్ అదాని.. సంస్థ అందిస్తున్న సేవలివే.. -
నేడు కుంభమేళాకు గౌతమ్ అదాని.. సంస్థ అందిస్తున్న సేవలివే..
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. నేడు (మంగళవారం) అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్కు రానున్నారు.గౌతమ్ అదానీ తన పర్యటనలో భాగంగా తొలుత త్రివేణీ సంగమంలో స్నానం చేయనున్నారు. అలాగే బడే హనుమంతుని దర్శనం చేసుకోనున్నారు. అదానీ గ్రూప్.. ఇస్కాన్, గీతా ప్రెస్ల భాగస్వామ్యంతో మహా కుంభమేళాలో భక్తులకు పలు సేవలు అందిస్తోంది. మహాకుంభమేళా ప్రాంతంలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అదానీ గ్రూప్ మహాప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది.గౌతమ్ అదానీ నేడు ఇస్కాన్ ఆలయంలో నిర్వహించే భండార సేవలో కూడా పాల్గొననున్నారు. మహా కుంభమేళాలో అదానీ అందిస్తున్న సేవలను చూసి భక్తులు మెచ్చుకుంటున్నారు. గీతా ప్రెస్ సహకారంతో అదానీ గ్రూప్ భక్తులకు ఆధ్మాత్మిక పుస్తకాలను వితరణ చేస్తోంది. ఈ విధంగా ఆదానీ సంస్థ ఆధ్యాత్మిక సాహిత్యం గురించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇదేవిధంగా ఆదానీ గ్రూప్ భక్తులకు ప్రయాగ్రాజ్లో ఉచిత ప్రయాణి సౌకర్యాన్ని అందిస్తోంది. ఇది మహా కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఉపయోగకరంగా ఉంది. ఇది కూడా చదవండి: Trump oath ceremony: ‘అమెరికా ది బ్యూటీఫుల్’ గాయని ఘనత ఇదే -
Kumbh Mela: కుంభమేళాకు వెళితే వీటిని తప్పక చూడండి
యూపీలోని ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది. కోట్లాదిమంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం ప్రయాగ్రాజ్ను తీర్థరాజం అని అంటారు.ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ తీరం నుండి అక్షయ వాటిక వరకు పలు మతపరమైన కట్టడాలు ఉన్నాయి. మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ మరింత అందంగా ముస్తాబయ్యింది. నగరంలో పలు సాంస్కృతిక, చారిత్రక వారసత్వ కట్టడాలు కనిపిస్తాయి. ఇక్కడ కొలువుదీరిన శయన హనుమంతుడు, నాగవాసుకి, అలోపి ఆలయం, అక్షయ వాటికలు సందర్శకులను ఎంతగానో అలరిస్తాయి. ప్రయాగ్రాజ్లో ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి.ఖుస్రో బాగ్ఖుస్రో బాగ్.. ఇది ప్రయాగ్జార్లోని ఒక ప్రధాన చారిత్రక ప్రదేశం. ఇక్కడ జహంగీర్ కుమారుడు ఖుస్రో, సుల్తాన్ బేగం సమాధులు ఉన్నాయి. ఈ సమాధులు ఇసుకరాయితో నిర్మించిన మొఘల్ నిర్మాణ శైలికి చక్కని ఉదాహరణలు. ఈ తోటను జహంగీర్ ఆస్థాన కళాకారుడు అకా రజా తీర్చిదిద్దారు.అలహాబాద్ కోటఅలహాబాద్ కోటను మొఘల్ చక్రవర్తి అక్బర్ 1583లో నిర్మించాడు. ఈ కోట గంగా సంగమం దగ్గర యమునా నది ఒడ్డున నిర్మించారు. అక్బర్ ఈ కోటకు ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. అంటే అల్లా అనుగ్రహించినదని అర్థం. తరువాత ఇది అలహాబాద్గా మారింది. ఈ కోట అక్బర్ నిర్మించిన కోటలలో అతిపెద్దది.ఆనంద్ భవన్ఆనంద్ భవన్ అనేది నెహ్రూ కుటుంబపు నివాస గృహం. ఇది ఇప్పుడు మ్యూజియంగా మారింది. దీనిని మోతీలాల్ నెహ్రూ నిర్మించారు. తరువాత కాంగ్రెస్ కార్యకలాపాలకు స్థానిక ప్రధాన కార్యాలయంగా ఉండేది.భరద్వాజ ఆశ్రమంఇక్కడున్న ఒక ఆశ్రమాన్ని భరద్వాజ మహర్షి ఆశ్రమం అని చెబుతారు. పురాణాల ప్రకారం ఈ ఆశ్రమంలోనే భరద్వాజ మహర్షి పుష్పక విమానాన్ని నిర్మించారు.చంద్రశేఖర్ పార్క్1931లో ఇక్కడి ఒక పార్కులో స్వాతంత్య్ర సమరయోధుడు చంద్ర శేఖర్ ఆజాద్ బ్రిటిష్ వారి కాల్పుల్లో అమరుడయ్యాడు. ఆ సమయంలో ఆజాద్ వయసు కేవలం 24 ఏళ్లు. అప్పటి నుంచి ఈ పార్కును చంద్రశేఖర్ పార్కు అని అంటారు. ఇది కూడా చదవండి: Kumbh Mela: ప్రముఖుల రాక.. మరిన్ని మార్గదర్శకాలు జారీ -
Kumbh Mela: ప్రముఖుల రాక.. మరిన్ని మార్గదర్శకాలు జారీ
యూపీలోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా అత్యంత వేడుకగా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళాలో మరిన్ని సన్నాహాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు.కుంభమేళాకు రాబోయే రోజుల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ప్రయాగ్రాజ్కు రానున్నారని, దీనితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఇక్కడే జరగనుందని సీఎం మీడియాకు తెలిపారు.రాబోయే గణతంత్ర దినోత్సవం, మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళా ప్రాంతంలో జనసమూహ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరచడపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా అమృత స్నానాల సమయంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రద్దీ నిర్వహణ దృష్ట్యా, ఈ ప్రత్యేక రోజులలో పాంటూన్ వంతెనపై ట్రాఫిక్ను వన్-వేగా ఉంచాలని అధికారులకు తెలిపారు. ప్రయాగ్రాజ్కు వచ్చిన సీఎం యోగి మహా కుంభ్ ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం అధికారులతో జరిగిన సమావేశంలో పలు మార్గదర్శకాలు జారీ చేశారు.ఇది కూడా చదవండి: Delhi Election 2025: కేజ్రీవాల్, ఆతిశీ సహా ‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్లు వీరే -
Mahakumbh: 18 నాటికి ఎన్నికోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారంటే..
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జనవరి 18 వరకు 7.72 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానం చేశారు.ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం(జనవరి 19) మధ్యాహ్నం నాటికీ ఈ ఒక్కరోజే 30.80 లక్షలకు పైగా జనం సంగమంలో స్నానం చేశారు.యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు(ఆదివారం) ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. ఆయన ఈరోజు ఐదు గంటల పాటు కుంభ్ ప్రాంతంలో ఉండి, పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఈరోజు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం సంగమంలో స్నానం చేసి, మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రశంసించారు.ఇది కూడా చదవండి: తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు -
ప్రపంచం చూపు.. ప్రయాగ్రాజ్ వైపు.. మహా కుంభమేళా చిత్రాలు
-
తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు లెక్కలేనంతమంది నాగ సాధువులు తరలివచ్చారు. వీరు చేసే కఠోర సాధన వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా ప్రయాగ్రాజ్లో 1500 మంది నాగ సాధువులుగా మారారు. వీరు జునా అఖాడా నుంచి దీక్ష తీసుకున్నారు.నాగ సాధువుగా మారడానికి అనేక రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. ఈ ప్రక్రియకు ఆరు నెలల నుండి ఒక ఏడాది వరకూ పడుతుంది. ఈ కఠిన పరీక్షల్లో విజయం సాధించాలంటే, సాధకుడు ఐదుగురు గురువుల నుండి దీక్ష పొందాలి. ఈ దీక్ష ఇచ్చేవారిని పంచ దేవ్ అని అంటారు.నాగ సాధువుగా మారాలంటే, ఆ వ్యక్తి ప్రాపంచిక జీవితాన్ని పూర్తిగా త్యజించాలి. తనకు తాను పిండప్రదానాన్ని చేసుకోవాలి. భిక్షాటన ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తినాల్సి ఉంటుంది. ఏ రోజైనా ఆహారం లభించకపోతే, ఆకలితోనే ఉండాలి.తాజాగా జునా అఖాడాలో నాగ సాధువులుగా చేరిన 1,500 మంది, వారి తల్లిదండ్రులతో సహా ఏడు తరాల వారికి పిండప్రదానాన్ని చేశారు. దీంతో అతనికి ఇకపై తన కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ నాగ సాధువులు తమ జీవితాంతం సనాతన ధర్మ పరిరక్షణకు, వేద సంప్రదాయ పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండాలి.ఇది కూడా చదవండి: సంధ్యావేళ.. మహా కుంభమేళా -
సంధ్యావేళ.. మహా కుంభమేళా
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. శనివారం మహాకుంభ్లో 42 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. ఇప్పటివరకు 7 కోట్ల 72 లక్షల మంది మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు.ఈ నేపధ్యంలో మహాకుంభ్ నగరానికి చెందిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఈ చిత్రాలలో వేదికలు, టెంట్లు, అద్భుతమైన లైట్లు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూపుతిప్పుకోలేనివిగా ఉన్నాయి.ఈ మహాకుంభ్ నగర దృశ్యాలు డ్రోన్ సాయంతో తీసినవి. కుంభ్ ప్రాంతంలో మిరిమిట్లుగొలిపే రంగురంగుల లైట్లు కూడా కనిపిస్తున్నాయి. దీనిలో సంగమం దగ్గరున్న అందమైన చెట్లు కూడా కనిపిస్తున్నాయి.మహా కుంభమేళా సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఏర్పాట్లను ఈ చిత్రాలలో వీక్షించవచ్చు. మహాకుంభ నగరం వెలుగుజిలుగుల మధ్య ఎంతో అందంగా కనిపిస్తోంది.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఎక్స్ హ్యాండిల్లో మహాకుంభ్ నగరపు అందమైన చిత్రాలను షేర్ చేశారు. ఈ దృశ్యాలను చూడటం ఆనందంగా ఉన్నదన్నారు.మహా కుంభమేళా సందర్భంగా శనివారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఎంపీ సుధాంశు త్రివేది కూడా పుణ్యస్నానం ఆచరించారు. సంగమంలో స్నానం చేసిన రక్షణ మంత్రి అనంతరం అక్షయవత్, పాతాళపురి, బడే హనుమాన్ ఆలయాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.జనవరి 22న మహా కుంభమేళాపై సమీక్షించేందుకు యూపీ మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు త్రివేణి సంగమంలో స్నానం చేయనున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో.. -
Mahakumbh 2025:‘మోనాలీసా’, ‘ఏంజలీనా జోలీ’ డస్కీ బ్యూటీ ఫోటోలు
-
Mahakumbh 2025 : డస్కీ బ్యూటీ, ‘ఏంజలీనా జోలీ’ వైరల్ వీడియో
ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవోపేతంగా సాగుతు మహాకుంభమేళా సాగుతోంది, పవిత్ర త్రివేణిసంగమానికి కోట్లదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తజన సందోహం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించు కుంటోంది. ఈ మేళాలో ఇప్పటికే దేశానికి చెందిన సాధువులతో పాటు, విదేశాలకుచెందిన సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా పూసల దండలు అమ్ముకునే అమ్మాయి ఇంటర్నెట్ను ఆకర్షిస్తోంది.ఇండోర్ నుండి మహాకుంభమేళాకు వచ్చిన యువతి నెట్టింట సంచలనంగా మారింది. ఆమె తేనె రంగు కళ్లతో డస్కీ బ్యూటీ వెలిగిపోతోంది. కోటేరు ముక్కు, చంద్రబింబం లాంటి మోము, తేజస్సుతో వెలిగిపోతున్న కళ్లు ‘మోనాలిసా’ ను తలపిస్తోంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వుతో, పొడవాటి, సిల్కీ, జడ జుట్టు అద్బుతమైన ఆమె సౌందర్యానికి మరింత వన్నెతీసుకొచ్చింది.దీంతో మేళాకు హాజరయ్యే ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు, ఆమెతో సెల్ఫీలు , వీడియోల కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోనాలిసా ఆఫ్ మహాకుంభ్’, ‘ఏంజలీనా జోలీ’, ‘‘ఎంత అందమైన కళ్లు’’, ‘చాలా అందంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ‘‘ఎందుకలా ఆమె వెంటపడుతున్నారు.. సిగ్గుచేటు" అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. (Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి)కాగా ఈ ఏడాది మహాకుంభమేళాలో ఐఐటీ బాబా, విదేశీ బాబా,అందమైన సాధ్వి, కండల బాబా ఇలా చాలామంది విశేషంగా నిలుస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి హర్యానాకు చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అలాగే రష్యాకు చెందిన బాబా కండలు దీరిన దేహంతో మహాకుంభమేళాలో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే.एक गरीब लड़की इंदौर(MP) से महाकुंभ आती है, मालाएं बेचती है और दिन के 2 से ढाई हजार कमा लेती है।ये मेले हमारी सांस्कृतिक पहचान ही नहीं बल्कि आर्थिक समृद्धि के भी प्रतीक हैं। pic.twitter.com/BGhwuFbm0D— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) January 17, 2025 పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా ఈ ఏడాది జనవరి 13 సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మొత్తం 45 రోజులపాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిమంది తరలి వస్తున్నారు. इनसे मिलिए ये हैं महाकुंभ मेला में माला बेचने वाली वायरल गर्ल मोनालिसा.. इनकी आंखे बहुत सुंदर है.. इसको कहते हैं किस्मत बदलते देर नहीं लगती.. #महाकुम्भ_अमृत_स्नान #महाकुंभ2025 #MahaKumbhMela2025 pic.twitter.com/Et87nnpRql— 🌿🕊️RACHNA MEENA 🌿❤️ (@RACHNAMEENA34) January 18, 2025 -
స్టార్టప్ కుంభమేళా
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్టార్టప్ల వాతావరణాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘స్టార్టప్ మహాకుంభ్ 2025’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. దీనిద్వారా వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి భాగస్వామ్యాల ద్వారా కొత్త లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ద్వారా ‘స్టార్టప్ మహాకుంభ్ 5.0’నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2047 నాటికి భారత్లో స్టార్టప్లు సాధించాల్సిన లక్ష్యాలపై ఇందులో చర్చించి, దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్టార్టప్లకు ఊతమిచ్చేలా పాలసీలు, ప్రోగ్రామ్లు దేశంలో స్టార్టప్ల వాతావరణానికి ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పాలసీలు, ప్రోగ్రాములను అమలు చేస్తోంది. నేషనల్ మెంటార్íÙప్ ప్లాట్ఫామ్, సీడ్ ఫండ్ సపోర్ట్, ఫండ్ ఆఫ్ ఫండ్ ఫర్ స్టార్టప్స్, స్టార్టప్ ఇండియా యాత్ర, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వంటివి చేపట్టింది. ఈ క్రమంలోనే భారతీయ స్టార్టప్లు అంతర్జాతీయ స్థాయికి తమ కార్యకలాపాలను విస్తరించేలా స్టార్టప్ మహాకుంభ్ 2025ను కేంద్ర ప్రభుత్వ అనుబంధ విభాగం డీపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 1.54 లక్షల స్టార్టప్లు డీపీఐఐటీ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2016లో 502 స్టార్టప్లు ఉండగా.. 2024 నవంబర్ 24 నాటికి 1,54,719 స్టార్టప్లకు చేరాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 17 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. స్టార్టప్లలో అత్యధికంగా 17,618 స్టార్టప్లు ఐటీ సేవలు, 14,285 స్టార్టప్లు ఆరోగ్య రక్షణ, 9,047 స్టార్టప్లు విద్యా రంగానికి చెందినవి ఉన్నాయి. మొత్తంగా చూస్తే మహారాష్ట్ర (27,459 స్టార్టప్లు), కర్ణాటక (16,335), ఢిల్లీ (15,851) దేశంలో టాప్ మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 5,157 స్టార్టప్లు ఉన్నాయి. భారత్లోని స్టార్టప్లలో నాయకత్వ స్థాయిలో 48 శాతం మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం. ఫలితాలను ఇస్తున్న పథకాలు భారతీయ స్టార్టప్ల రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు ఫలిస్తున్నాయి. స్టార్టప్ల ఆవిష్కరణలు, వాణిజ్య భాగస్వామ్యాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్టార్టప్ ఐడియాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ‘స్టార్టప్ యాత్ర’236 జిల్లాలు, 23 రాష్ట్రాల మీదుగా సాగుతూ... 143 బూట్ క్యాంపులను, 300 చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. స్టార్టప్ బ్రిడ్జెస్ కార్యక్రమంలో భాగంగా 21 దేశాలతో భారతీయ స్టార్టప్లను అనుసంధానం చేశారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ ప్రోగ్రామ్లో భాగంగా 2024 నాటికి 1,165 స్టార్టప్లలో 21,221 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైంది.యూనికార్న్ల వైపు అడుగులు..కొద్దిపాటి పెట్టుబడులతో వినూత్న ఆవిష్కరణలతో ప్రారంభమైన సంస్థలు స్వల్పకాలంలో ఒక బిలియన్ డాలర్లకుపైగా (సుమారు రూ.8,629 కోట్లు) విలువ కలిగిన సంస్థగా ఎదిగితే యూనికార్న్లుగా పిలుస్తారు. 2016 నాటికి భారత్తో 11 యూనికార్న్లు ఉండగా.. 2014 నాటికి వాటి సంఖ్య 118కి చేరింది. ఎడ్టెక్ రంగంలో అన్ అకాడమీ, వేదాంత.. ఫిన్టెక్లో పేటీఎం, ఫోన్పే, జెటా.. ఈ–కామర్స్లో ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రై.. హెల్త్ టెక్లో ఫార్మ్ ఈజీ వంటి సంస్థలు భారతీయ యూనికార్న్ల జాబితాలో ఉన్నాయి. ఇలా భారతీయ స్టార్టప్ల నుంచి మరిన్ని యూనికార్న్లు ఎదిగేందుకు ‘స్టార్టప్ మహాకుంభ్’దోహదం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
అంబరాన మహాకుంభ సంబరం
ఆకాశం అంటే అనంతం... అనంతమైన భక్తి కూడా ఆకాశం లాంటిదే. తనలోని అనంతమైన భక్తిని ఆకాశ వేదికగా చాటింది ఇరవై నాలుగు సంవత్సరాల అనామికాశర్మ...ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన స్కైడైవర్ అనామికా శర్మ బ్యాంకాక్ మీదుగా 13 వేల అడుగుల ఎత్తులో మహాకుంభ్ అధికారిక జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించింది. అనామిక డేరింగ్ ఫీట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విమానం ఎక్కే ముందు ఆత్మవిశ్వాసంతో మహాకుంభ్ జెండాను అనామిక పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో ఉన్నాయి. అనామిక విమానం నుండి దూకడం, జెండా ఎగరవేస్తూ ‘మహాకుంభ్ 2025’కు ప్రపంచానికి స్వాగతం పలికే దృశ్యాలు, బ్యాక్గ్రౌండ్లో వినిపించే కుంభమేళ న్ట అబ్బురపరుస్తాయి.‘ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభ్ 2025కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆహ్వానిస్తున్నాను’ అని అనామిక శర్మ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోనే చూస్తూ నెటిజనులు అనామికను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.వాటిలో కొన్ని...‘అపూర్వ సాహసం, భక్తిభావం మేళవించిన దృశ్యం’‘మన సంస్కృతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు’‘ఇది స్టంట్ కాదు. ప్రపంచానికి అందించిన శక్తిమంతమైన సందేశం’అనామిక తండ్రి మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తండ్రి ఒడిలో సాహసాల ఓనమాలు నేర్చుకున్న అనామికకు ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడమే తెలుసు. తాజా ఫీట్తో తన సాహసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది.పవిత్ర క్షేత్రమైన ప్రయాగ్రాజ్కు చెందిన అనామిక మన సంస్కృతి, సంప్రదాయాలను వింటూ పెరిగింది. ‘మన సంస్కృతిలోని గొప్పదనం ఏమిటంటే, ఒక మంచి పని కోసం అందరూ ముందుకు వస్తారు. నేనేమిటి? నా స్థాయి ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించరు. రామాయణంలో ఉడుత కథ దీనికి ఉదాహరణ. భరతమాత బిడ్డను అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను’ అంటుంది అనామిక.భవిష్యత్లో మరెన్నో సాహసాలు చేయడానికి సిద్ధం అవుతున్న అనామిక ట్రైన్డ్ స్కూబా డైవర్ కూడా. మన దేశంలో ‘స్కై సి లైసెన్స్’ ఉన్న యంగెస్ట్ ఫీమెల్ స్కైడైవర్గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.‘వీడియోను చూసి చాలామంది... మీకు భయంగా అనిపించలేదా అని అడిగారు. నిజం చెప్పాలంటే భక్తి భావంతో నాకు భయం కలగలేదు. ఒకటికి పదిసార్లు మనసులో మేరా భారత్ మహాన్ అనుకున్నాను’ అంటోంది అనామిక. -
మహాకుంభమేళలో అందమైన సాధ్వి..!
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో మహా కుంభమేళ(Maha Kumbh) అత్యంత అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకలో పాల్గొని గంగా స్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఎందరో ప్రముఖులు, ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికతవైపు అడుగులు వేసి సన్యాసులగా మారిన మేధావులను కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేగాదు ఈ మహత్తర వేడుకలో పాల్గొని తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తుల లక్షలాదిమందిగా కదిలి రావడం విశేషం. తాజాగా ఈ వేడుకలో ఒక అందమైన సాధ్వి(beautiful sadhvi) తళుక్కుమంది. ఆమె అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. హీరోయిన్ రేంజ్లో అందంగా ఉన్న ఆ యువతి సాధ్వీగా జీవిస్తోందా..? అని అంతా విస్తుపోయారు. ఇది నెట్టింట హాట్టాపిక్గా మారి చర్చనీయాంశమైంది. అయితే ఆమె అంతా అనుకున్నట్లు సాధ్వి కాదని తేలింది. కేవలం అది గెటప్ అని ఆమె ఎలాంటి దీక్ష తీసుకోలేదని ఆ యువతే స్వయంగా చెప్పింది. ఆ అందమైన సాధ్వి పేరు హర్ష రిచారియా. ఆమె ఓ సోషల్ మీడియా ఇన్ఫ్టుయెన్సర్. గతంలో కూడా తాను ఇలా రీల్స్ద్వారా సనాతన ధర్మంలోని గొప్ప గొప్ప విశేషాలను ప్రజలకు తెలియజేశానని చెప్పుకొచ్చింది. అలానే ఈసారి ఈ కుంభమేళలో వారిలా సాధ్విగా గెటప్ వేసుకుని వారిని ఇంటర్వ్యూ చేసి..ఆధ్యాత్మికత గొప్పతనం గురించి తెలియజే యత్నం చేస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే ఈ గెటప్లో ఉన్నట్లు వివరణ ఇచ్చింది. అయితే ఆమె ఇలా సాధ్విలా కనిపించడంపై సోషల్మీడియా ట్రోల్కి గురయ్యింది. ఆధ్మాత్మికత అంటే నవ్వులాటగా ఉందా..?. ఆ వేషధారణలోనే తెలుసుకునే యత్నం చేయాలా అంటూ నెటిజన్లు తింటిపోశారు. (చదవండి: ఆ రెండు అస్సలు వదిలిపెట్టని రమ్యకృష్ణ.. అందుకే 50 ఏళ్లు దాటినా అంత ఫిట్గా..!) -
Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో..
అందరినీ ఆకట్టుకునే సోషల్ మీడియా ఇప్పుడు కుంభమేళా ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. వీటిలోని కొన్ని వీడియోలు అమితంగా అలరిస్తుండగా, మరికొన్ని ఆశ్చర్యపరిచేవిగా, తెగ నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. ఇదేకోవలోని ఒక వీడియో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. కుంభమేళాకు వచ్చి, కుటుంబ సభ్యులు తప్పిపోతారేమోనని భయపడేవారికి మంచి సలహా ఇస్తున్నట్లుంది ఈ వీడియో..మహా కుంభమేళాలో జనసమూహం అధికంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయం పర్యాటకుల్లో ఉంటుంది. అయితే దీనికి ఒక వ్యక్తి చక్కని పరిష్కారం కనుగొన్నాడు. దీనిని చూడగానే నవ్వు వచ్చినప్పటికీ, ఓమారు ఆలోచింపజేస్తుంది.भारत एक जुगाड़ प्रधान देश है, पूरे परिवार को रस्सी से बांध लिया ताकि महाकुंभ में खो ना जाये 🤣🤣 #MahaKumbh pic.twitter.com/WJXU4EYCwO— Raja Babu (@GaurangBhardwa1) January 15, 2025సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ముందుకు నడుస్తుండగా, అతని వెనుక అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఉండటాన్ని గమనించవచ్చు. అయితే వాళ్లెవరూ దారితప్పికోకుండా ఉండేందుకు వారందరి చుట్టూ ఒక తాడుతో కట్టినట్లు చూడవచ్చు. వారంతా ఆ తాడులోపలే ఉంటూ ముందుకు కదులుతుండటాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియోను @GaurangBhardwa1 అనే ఖాతా ద్వారా ఎక్స్ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేశారు. ‘మహా కుంభమేళాలో తప్పిపోకుండా ఉండటానికి కుటుంబాన్నంతటినీ తాడుతో కట్టేశారు' అని ఆ వీడియో కింద క్యాప్షన్ ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక లక్షా 42 వేలకు పైగా జనం వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ‘ఆడవాళ్లు ఇక్కడకు అక్కడకు వెళ్లిపోతారు. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు సరైన పని చేశారు’ అని రాశారు. మరొక యూజర్ ‘ఈ టెక్నిక్ భారతదేశం నుండి బయటకు వెళ్లకూడదు’అని రాశారు. ఇది కూడా చదవండి: Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు -
Mahakumbh 2025: పడుకున్నా, లేచినా, ఏం చేస్తున్నా.. తొమ్మిదేళ్లుగా బాబా తలపై పావురం
యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతోంది. దేశం నుంచే నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. బాబాలు, సాధువులు కూడా కుంభమేళాలో స్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు. కుంభమేళాకు వచ్చిన సాధువుల్లో కొందరు ప్రత్యేక వేషధారణతో కనిపిస్తున్నారు. వీరు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ కోవలోకే వస్తారు రాజస్థాన్లోని చిత్తోర్గఢ్కు చెందిన ‘పావురం బాబా. ఈ యన కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గత 9 సంవత్సరాలుగా ఈయన తలపై పావురం కూర్చుంటోంది. అది ఎప్పుడూ ఆయనను అంటిపెట్టుకునే ఉంటోంది. దీంతో పావురం బాబాను చూసేందుకు జనం అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా జునా అఖారాకు చెందిన మహంత్ రాజ్ పురి మహారాజ్ తలపైననే ఈ పావురం ఉంటోంది.అందుకే ఈయనను ‘కబూతర్ వాలే బాబా అని పిలుస్తారు. कबूतर वाले बाबा 🤔 pic.twitter.com/DNbVOdDotr— Sanjai Srivastava (@SanjaiS41453342) January 11, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం మహంత్ రాజ్ పురి మహారాజ్ ‘జీవులకు సేవ చేయడమే గొప్ప మతం' అని చెబుతుంటారు. ఈ బాబా నిద్రపోతున్నప్పుడు, మేల్కొన్నప్పుడు, తినేటప్పుడు.. ఇలా అనునిత్యం ఆ పావురం బాబాను అంటిపెట్టుకునే ఉంటోంది. కబూతర్ బాబాను చూసి భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. జీవులకు సేవ చేసేవారు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందుతారని కబూతర్ బాబా చెబుతుంటారు. @SanjaiS41453342 అనే యూజర్ ఎక్స్లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో కబూతర్ బాబా పావురంతో సమయం గడుపుతున్నట్లు చూడవచ్చు. ఆ క్లిప్లో ఆ పావురం బాబా తలపై కూర్చొని ఉండటాన్ని కూడా చూడవచ్చు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు -
Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర సంగమం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కటౌట్లు ఇక్కడికి వచ్చేవారిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కుంభమేళాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.మహాకుంభమేళా సందర్భంగా పంచాయితీ అఖాడా ఇస్తున్న బడా హారతి భక్తులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో 40 నుండి 50 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా.మహా కుంభమేళా సందర్భంగా ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ అలియాస్ కమల అఖాడ శ్రీ నిరంజని అధిపతి స్వామి కైలాసానంద గిరి నుండి ఆధ్యాత్మిక దీక్షను పొందారు.2025 మహా కుంభమేళా సందర్భంగా జరిగిన శోభా యాత్రలో ఇస్కాన్ భక్తులు పాల్గొంటున్నారు. ఇతర దేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ఇస్కాన్ భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. వారు చేసే కీర్తనలు, భజనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.మహా కుంభమేళా ప్రాంతంలో తీవ్రమైన చలి ఉన్నప్పటికీ భక్తులు అత్యంత ఉత్సాహంతో త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. ‘హర్ హర్ మహాదేవ్’, ‘జై శ్రీరామ్’, ‘జై గంగా మాతా’ అని నినాదాలు చేస్తూ భక్తులు సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు.మహాకుంభ ఉత్సవంలో సాధుసన్యాసులు భజన కీర్తలను ఆలపిస్తూ, ఆధ్యాత్మిక ప్రసంగాలు సాగిస్తున్నారు. వీరిని దర్శించుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. మహా కుంభమేళాలో లక్షలాది మంది సాధువులు పాల్గొంటున్నారు.విహంగ వీక్షణలో మహా కుంభమేళా వేదిక అత్యంత అద్భుతంగా కనిపిస్తోంది. ఫొటోలోని కొంతభాగమే ఇంత అందంగా ఉంటే.. పూర్తి చిత్రం ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పర్యాటకులు మహా కుంభమేళాలో సంగమం దగ్గర స్నానాలు ఆచరించారు. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తొలి అమృత స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు త్రివేణి సంగమంలో దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు స్నానమాచరించారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: స్నానానికి 45 నిముషాలు.. ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్లో వెల్లడి -
Mahakumbh 2025: స్నానానికి 45 నిముషాలు.. ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్లో వెల్లడి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమానికి చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే ప్రతీభక్తుడు పుణ్య స్నానానికి ఎంత సమయం కేటాయిస్తున్నాడు? తాజాగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.భక్తుల సంఖ్యను తెలుసుకునేందుకు..త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తున్న ప్రతి భక్తుడు స్నాన ఘాట్లో సగటున 45 నిమిషాలు గడుపుతున్నాడని వెల్లడయ్యింది. రేడియో ఫ్రీక్వెన్సీ రిస్ట్ బ్యాండ్ల ద్వారా సేకరించిన డేటా ఈ వివరాలను తెలియజేసింది. ఇదేవిధంగా ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్ నుండి సేకరించిన డేటాను మేళాకు హాజరయ్యే భక్తుల సంఖ్యను లెక్కించేందుకు కూడా సంబంధిత అధికారులు ఉపయోగిస్తున్నారు.మహా కుంభమేళాకు వచ్చే భక్తుల వాస్తవ సంఖ్యను తెలుసుకునేందుకు అధికారులు ప్రత్యేక పద్దతిని ఉపయోగిస్తున్నారు. అదే ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్. దీనిని యాత్రికుల మణికట్టుకు కట్టారు. ఈ ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్ల నుండి సేకరించిన డేటా ప్రకారం, మకర సంక్రాంతి, పుష్య పూర్ణిమ రోజుల్లో భక్తులు స్నాన ఘాట్ల వద్ద సగటున 45 నిమిషాలు గడిపారని వెల్లడయ్యింది. ఘాట్ చేరుకోవడం నుండి స్నానం చేసి, తిరిగి వచ్చే వరకు 45 నిముషాలు పట్టిందని తేలింది.ఐదు లక్షల మంది ఉచిత ప్రయాణాలుఘాట్ వద్ద భక్తులు సగటున ఎంత సమయం గడుపుతారో తెలుసుకోవడం ద్వారా రద్దీని నియంత్రించగలుగుతామని పోలీసు అధికారులు తెలిపారు. ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్ డేటా అనాలిసిస్ టెక్నాలజీ నుండి పొందిన ఫలితాలు జనసమూహ నిర్వహణకు సహాయపడతాయని ఎస్ఎస్పీ రాజేష్ కుమార్ ద్వివేది తెలిపారు. కాగా పుష్య పూర్ణిమ, మకర సంక్రాంతి పండుగల సందర్భంగా జనం మధ్య చోటుచేసుకున్న తోపులాటలో 200 మందికి పైగా జనం గాయపడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి చెందిన సర్జన్ డాక్టర్ వినయ్ యాదవ్ తెలిపారు. గడచిన నాలుగు రోజుల్లో దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణికులు షటిల్ బస్సులలో ఉచితంగా ప్రయాణించారు. గురువారం నుండి ప్రయాణికులు సాధారణ రోజుల మాదిరిగానే ఈ బస్సులలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.93 ఏళ్ల తర్వాత..1932లో ప్రయాగ్రాజ్ నుండి లండన్కు ఒక విమానాన్ని నడిపారు. ఇప్పుడు 93 ఏళ్ల తర్వాత బుధవారం ప్రయాగ్రాజ్ విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానం బయలుదేరింది. ఈ విమానం అమెరికన్ బిలియనీర్ మహిళా వ్యవస్థాపకురాలు లారెన్ పావెల్ జాబ్స్ కోసం ఇక్కడికి వచ్చింది. ఈ విమానం భూటాన్కు వెళ్లింది. జాబ్స్ కొద్ది రోజుల పాటు భూటాన్లో ఉంటారని సమాచారం. బ్రిటిష్ పాలనలో ప్రయాగ్రాజ్ నుండి అంతర్జాతీయ విమానాలు నడిచేవి. 1932 వరకు ఇక్కడి నుండి లండన్ కు నేరుగా విమానం ఉండేది.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: నేడు అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పవిత్ర స్నానాలు -
Mahakumbh 2025: నేడు అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పవిత్ర స్నానాలు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దీనిలో దేశవిదేశాలకు చెందినవారు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు (గురువారం) పవిత్ర తీవేణీ సంగమంలో పది దేశాల నుంచి వచ్చిన 21 మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం పవిత్ర స్నానాలు ఆచరించనుంది. వీరి పర్యటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్యావేక్షిస్తోంది.నేడు ప్రయాగ్రాజ్(Prayagraj)లో పవిత్ర స్నానాలు ఆచరించే ప్రతినిధి బృందంలో ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యూఎఈ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈ పుణ్యస్నానాలు ఆచరించే ముందు ఈ బృందం సభ్యులు వారసత్వ నడకను చేపట్టారు. ఈ సందర్భం వీరు ప్రయాగ్రాజ్కు చెందిన సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని తెలుసుకున్నారు. వీరు బస చేసేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది.ఈ ప్రతినిధి బృందం పుణ్యస్నానాలు ఆచరించిన అనంతం హెలికాప్టర్(Helicopter) ద్వారా మహా కుంభ్ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేయనుంది. కాగా గంగా, యమున, పౌరాణిక సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ కుంభమేళాకు 45 కోట్ల మంది వరకూ యాత్రికులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి -
Mahakumbh 2025: విదేశీ మహిళ ఒడిలో గణేశుడు.. ‘బ్యూటీ ఆఫ్ సనాతన్’
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దీనిలో పాల్గొనడానికి విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది. దేశంలో ఎవరిని కదిపినా, ఎక్కడ చూసినా కుంభమేళాకు సంబంధించిన సంగతులే వినిపిస్తున్నాయి. అలాగే మహా కుంభమేళాకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ భక్తుల ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒక విదేశీ మహిళా భక్తురాలి ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఒక విదేశీ మహిళ శాలువా కప్పుకుని, తన చేతులతో గణేశుని విగ్రహాన్ని పొదివి పట్టుకుంది. ఫొటోను చూడగానే గణేశునికి అమ్మప్రేమ అందిస్తున్న మాతృమూర్తిలా ఆమె కనిపిస్తోంది. ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్లోని sarcasticschool_ అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో కింద ‘2025 మహాకుంభ్లో గణేశుడి విగ్రహంతో విదేశీ మహిళ’ అని ఉంది. ఈ ఫొటోను చూసిన ఒక యూజర్ కాంమెంట్ బాక్స్లో ‘బ్యూటీ ఆఫ్ సనాతన్’ అని రాశారు. మరొక యూజర్ ‘జై గణేష్’ అని రాయగా, మరొక వినియోగదారు ‘అద్భుతం’ అని రాశారు. ఇది కూడా చదవండి: Mahakumbh 2025: మహాకుంభమేళాలో మూడో రోజు విశేషాలు.. -
Mahakumbh 2025: మహాకుంభమేళాలో మూడో రోజు విశేషాలు..
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. దేశవిదేశాల నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.ఈరోజు(బుధవారం) మహాకుంభమేళాలో మూడవ రోజు. అత్యంత భారీస్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు వివిధ ఘాట్ల వద్ద భక్తులు ఉదయం నుంచే క్యూలు కడుతున్నారు. మహా కుంభమేళా(Great Kumbh Mela) ప్రారంభమైనది మొదలుకొని ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు గంగా మాత హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో సంగమతీరం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది.మంగళవారం మకర సంక్రాంతి(Makar Sankranti) సందర్భంగా సాధువులతో పాటు భక్తులు తొలి అమృత స్నానం చేశారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒకరి తర్వాత ఒకరుగా స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు సుమారు 3.50 కోట్ల మంది భక్తులు గంగా సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం మొదటి స్నానోత్సవం నాడు 1.65 కోట్ల మంది భక్తులు స్నానం చేశారు. ఈ విధంగా రెండు రోజుల్లో మొత్తం 5.15 కోట్ల మంది సంగమంలో స్నానం చేశారు.ఈసారి జరుగుతున్న మహా కుంభమేళా ఎంతో ప్రత్యేకమైనది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభమేళా ఇది. సంగమ తీరంలోని 4,000 హెక్టార్ల ప్రాంతంలో ఈ ఉత్సవం జరుగుతోంది. మహా కుంభమేళాలో స్నానం చేసిన భక్తులు తాము సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కుంభమేళా తొలిరోజున సంగమతీరంలో స్నానాలాచరిస్తున్న వారిపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు.ఇది కూడా చదవండి: Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు -
Maha Kumbh: యధేచ్ఛగా ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రచార దందా
మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు, పర్యాటకులు రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రముఖ వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు సంగమ ప్రాంతంలో తమ ప్రచార దందాను యధేచ్చగా కొనసాగిస్తున్నాయి.ప్రముఖ అగ్రశ్రేణి బ్రాండ్లు, కార్పొరేట్ సంస్థలు(Corporate organizations) ప్రయాగ్ రాజ్లో తమ కొత్త దుకాణాలను తెరిచాయి. ఇవి తమ ఉత్పత్తుల శాంపిల్ ప్యాక్లను పర్యాటకులకు ఉచితంగా పంపిణీ చేస్తూ, వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మార్కెట్లలో ధరలు పెరగడం, అమ్మకాలు తగ్గడం లాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న పలు బ్రాండ్లు మహా కుంభ్కు వచ్చే వినియోగదారులతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాయి. ఈ బ్రాండ్లు 45 రోజుల పాటు జరిగే కుంభమేళాను తమ ఉత్పత్తుల ప్రచారానికి సద్వినియోగం చేసుకుంటున్నాయి.మహా కుంభమేళాకు 40 కోట్ల మంది హాజరవుతారనే అంచనాలున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries)కు చెందిన ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్) సంగమ స్థలిలో కొత్తగా కార్యాలయం ఏర్పాటు చేసి, తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తోంది. ప్రముఖ పరిశుభ్రత బ్రాండ్ డెటాల్ కుంభమేళాలో దాదాపు 15 వేల మంది పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇచ్చింది. వారికి సబ్బులను ఉచితంగా పంపిణీ చేసింది.డాబర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మోహిత్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ ‘ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాల సమయంలో, మేము వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాన్ని కోరుకుంటామన్నారు. మా బ్రాండ్లు డాబర్ చ్యవన్ప్రాష్, డాబర్ హనీ, డాబర్ రెడ్ పేస్ట్, ఆమ్లా హెయిర్ ఆయిల్, వాటిక, హజ్మోలా, హోనిటస్ల గురించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇదేవిధంగా మంగళ్దీప్ అగరుబత్తుల కంపెనీ ఇక్కడ విరివిగా ప్రచారం సాగిస్తోంది.కోకా-కోలా ఇండియా ఆసియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గ్రీష్మా సింగ్ మాట్లాడుతూ కుంభమేళాలో పునర్వినియోగ ప్యాకేజింగ్ను ప్రోత్సహిస్తున్నామని, వినియోగదారులలో రీసైక్లింగ్పై అవగాహన పెంచేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఐటీసీ ప్రతినిధి మాట్లాడుతూ, మంగళ్దీప్ అగర్బత్తితో సహా ఐటీసీకి చెందిన ఎఫ్ఎంసీజీ బ్రాండ్లను ప్రజలకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నామని’ అన్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు