Mahakumbh-2025: తొక్కిసలాట తర్వాత హెలికాప్టర్‌ నిఘా పెంపు | Prayagraj Mahakumbh Stampede Helicopter Security | Sakshi
Sakshi News home page

Mahakumbh-2025: తొక్కిసలాట తర్వాత హెలికాప్టర్‌ నిఘా పెంపు

Jan 29 2025 12:06 PM | Updated on Jan 29 2025 12:06 PM

Prayagraj Mahakumbh Stampede Helicopter Security

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుతోంది. అయితే ఈరోజు(బుధవారం) మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుంది. ఈ నేపధ్యంలో సంగమతీరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

తొక్కిసలాట సద్దుమణిగిన దరిమిలా లక్షలాది మంది భక్తులు స్నానం చేయడానికి సంగమ తీరానికి తరలివస్తున్నారు. వీరిని పర్యవేక్షించేందుకు, మరింతగా భద్రత కల్పించేందుకు హెలికాప్టర్ నుండి  నిఘా సారించారు. జనసమూహాన్ని నియంత్రించేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో  బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే జనం మరింతగా పెరిగిపోవడంతో పోలీసులు బారికేడ్లను తొలగించారు. భద్రతను మరింతగా పెంచేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించారు.

కుంభమేళా పర్యవేక్షణ అధికారులు భద్రత విషయంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మహా కుంభలో పరిస్థితి అదుపులో ఉందని, భక్తుల పుణ్యస్నానాలు సజావుగా జరుగుతున్నయని అధికారులు తెలిపారు. తొక్కిసలాట ఘటన అనంతరం సీఎం యోగి స్పందిస్తూ వివిధ గంగా ఘాట్ల వద్ద స్నానాలు చేయాలని భక్తులకు సూచించారు. అధికారులు అందించే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: అలాంటి దుస్తులతో రావొద్దు: ముంబై సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement