
మమతా కులకర్ణి.. గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు చేసింది.

హిందీలో కరణ్ అర్జున్, దిల్బర్, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాల్లో నటించింది.

తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ చిత్రాలతో మెప్పించింది.

2003లో సడన్గా సినిమాలు మానేసి కెనడా వెళ్లిపోయింది.

2014లో కెన్యాలో ఓ డ్రగ్స్ కేసులో మమతాను, ఆమె ప్రియుడు విక్కీ గోస్వామిని అరెస్టు చేశారు.

2016లో భారత్లో రెండు వేల విలువైన డ్రగ్స్ రాకెట్ కేసులో మమతా పేరు బయటికొచ్చింది.

ఈ కేసులతో ఆమె జీవితం తలకిందులైంది. తన పేరుప్రతిష్టలు మసకబారిపోయాయి.

రెండు దశాబ్దాల తర్వాత ఇటీవలే ఇండియా వచ్చిన ఆమె మహాకుంభమేళాకు హాజరై సన్యాసం స్వీకరించింది.

తన పేరును శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది.






