-
ప్రేమికుల రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా 'రీ రిలీజ్'
దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన 'జర్నీ' సినిమా అప్పట్లో యూత్ను ఎంతగానో కట్టిపడేసింది. అంజలి, జై, శర్వానంద్, అనన్య జోడిగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను చూసిన వారందరూ ఇప్పటి జనరేషన్లో టువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అనేంతగా సినిమా కథలో హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఇందులోని ప్రేమ కథలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీ.సత్య సంగీతం అందించారు. అప్పట్లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. 2011 సెప్టెంబర్ 16న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్లో ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ.సుప్రియ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్గా మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ప్రేమికులకు ఈ సినిమా మంచి ఫీస్ట్ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
10 మంది పొగిడితే, 50 మంది తిట్టారు: నయనతార
నీలేష్ కృష్ణ దర్శకత్వంలో నయనతార, జై, సత్యరాజ్, తదితరులు నటించిన చిత్రం 'అన్నపూరణి' డిసెంబర్ 1న తమిళంలో మాత్రమే ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని జి స్టూడియోస్, నాట్ స్టూడియోస్ నిర్మించాయి. చిన్న వయస్సులోనే వంటలపై ఆసక్తి కలిగిన ఒక బ్రాహ్మణ యువతి ఎలా ఆ రంగంలో విజయం సాధించింది అన్నదే అన్నపూరణి చిత్రం. రాజా రాణి తర్వాత జై, నయనతార జంటగా ఈ చిత్రంలో నటించారు. అన్నపూరణి చిత్రం ప్రమోషన్లో భాగంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో నటులు జై, నయనతార, దర్శకుడు నీలేష్ కృష్ణ పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో జై, నయనతారల కెమిస్ట్రీ గురించి అడిగినప్పుడు, నయనతార మాట్లాడుతూ.. 'రాజా రాణిలో 20 నిమిషాలు మాత్రమే మేమిద్దరం నటించాము. ఆ సినిమా షూటింగ్ తర్వాత మేము మంచి స్నేహితులం అయ్యాం. వ్యక్తిగతంగా కలుస్తూనే ఉన్నాం. రాజా రాణి సినిమాలో మేము ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చామో అదే విధంగా ఈ సినిమాలో కూడా నటించాం. ఈ సినిమాలో మేము నటించిన సన్నివేశాలు అన్నీ సహజంగానే ఉంటాయి. నేనెలా నటిస్తానో, కెమెరా ముందు జై ఎలా నటిస్తాడో అందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు.' అని ఆమె అన్నారు. నటుడు జై మాట్లాడుతూ 'మహిళల నేపథ్యంలో సాగే చిత్రంలో నయనతారతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మనం తెరపై నేచురల్గా మాట్లాడుతూ నటిస్తే అభిమానులకు నచ్చుతుంది. నటించేటప్పుడు మాకు మంచి అవగాహన ఉంటుంది. మేమిద్దరం కలిసి నటించేటప్పుడు మానిటర్ వైపు కూడా చూడము. సెట్లో కెమెరా ముందు నయనతార నటనను చూసిన వారు ఎవరైనా ఆమెను లేడీ సూపర్స్టార్ అనాల్సిందే అని నేను అంటే.. నయనతార, ''అలా అనకండి, చెబితే తిడతారు. కొంతమంది నేను ఇంకా అక్కడి వరకు చేరుకోలేదని అంటారు. నేను అమ్మాయిని కాబట్టి నాపై విరుచుకుపడతారు.. మళ్లీ నాపై విమర్ళలు మెదలుపెడుతారంటూ ఇలా చెప్పింది. అన్నపూరణి చిత్రానికి సంబంధించినంతవరకు అన్ని విషయాలు తన ఇష్ట్రపకారం జరిగాయని చెప్పింది. ఒక్క లేడీ సూపర్స్టార్ అన్న టైటిల్ కార్డ్ మినహా. అది మాత్రం తన అనుమతి లేకుండా జరిగిందని పేర్కొంది. దాని గురించి దర్శకుడిని అడిగితే అది సర్ప్రైజ్ కోసం అని చెప్పారన్నారంది. నిజం చెప్పాలంటే తనను లేడీ సూపర్స్టార్ అంటే 10 మంది సంతోషపెడితే 50 మంది తిట్టుకుంటున్నారంది. బహుశా అలా అనిపించుకునే స్థాయికి ఎదిగానో లేదో తెలియదన్నారు. ఇదీ చదవండి: నయనతార 75వ మూవీ 'అన్నపూరణి' రివ్యూ.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? కోలీవుడ్లో సూపర్ స్టార్ అనే బిరుదు కేవలం రజనీకాంత్కు మాత్రమే ఉండాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటారు. ఆ ట్యాగ్లైన్ను ఎవరికీ ఉపయోగించకూడదని వారి అభిప్రాయం. కానీ అన్నపూరణి చిత్రంలో లేడి సూపర్ స్టార్ అని టైటిల్ కార్డులో పడటంతో ఆమెపై రజనీ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఈ విషయంపైనే ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. -
ఆర్య సినిమా చేజార్చుకుంది.. ఇల్లు తాకట్టు పెట్టి బిజినెస్లోకి..
జై సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో పనిమనిషిగా కామెడీ పండించి నంది అవార్డు అందుకుంది. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లు చేసిన ఆమె తమిళంలోనే స్థిరపడిపోయింది. తర్వాత సిల్వర్ స్క్రీన్ను వదిలేసి స్మాల్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చింది. అక్కడ సీరియల్స్ చేసింది. కొంతకాలంగా సినిమాలకు, సీరియల్స్కు దూరంగా ఉంటోంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? సంతోషి శ్రీకర్. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో తను ఎందుకు సినిమా ఇండస్ట్రీకి గుడ్బై చెప్పిందనే విషయాన్ని బయటపెట్టింది. రీల్ జంట రియల్ జంటగా.. సంతోషి మాట్లాడుతూ.. నాన్నది విజయవాడ. పుట్టిపెరిగిందంతా చెన్నైలో. జై సినిమా చేసేటప్పుడు కూడా తెలుగు రాదు. కానీ నా భర్తది హైదరాబాద్. మేమిద్దరం కలిసి హీరోహీరోయిన్స్గా సీరియల్ చేశాం. రియల్ లైఫ్లోనూ భార్యాభర్తలమయ్యాం. జై, ఆర్య.. రెండు సినిమాలకు నన్ను సెలక్ట్ చేశారు. అయితే జై చిత్రానికి నేను పర్ఫెక్ట్ అని భావించడంతో అందులోకి తీసుకున్నారు, ఆర్య చేజారిపోయింది. పూరీ జగన్నాథ్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. చాలా వదులుకున్నాను. కొట్టి మరీ ఏడిపించారు జై మూవీలో ఏడ్చే సీన్ ఉంటుంది. నాకు కన్నీళ్లు రావడం లేదని కొట్టి మరీ ఏడిపించారు. ఆ సినిమాకు నేను డబ్బులు తీసుకోలేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చేసే సమయంలో నా వయసు పదిహేడున్నరేళ్లు. ఆ విషయం చెప్తే ఎవరూ నమ్మలేదు. సినిమాలు చేస్తే ఏడాదిలో రెండు, మూడు నెలలే పని ఉంటుంది. అదే సీరియల్స్ అయితే ప్రతి నెలా పని ఉంటుంది. పైగా అక్కడ స్కిన్ షోతో పాటు బెడ్రూమ్ సీన్లు చేయమంటారు. అది ఇష్టం లేకే సినిమా ఇండస్ట్రీ వదిలేసి బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయాను. ఇకపోతే నా ఇల్లును తాకట్టు పెట్టి మరీ బ్యూటీ అండ్ జ్యువెలరీ బిజినెస్ ప్రారంభించాను. నాకు మంచి అవకాశాలొస్తే తిరిగి నటించడానికి సిద్ధంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది సంతోషి శ్రీకర్. చదవండి: స్టార్ కమెడియన్ మరణం.. ఆస్తి రాసినా దక్కలేదు.. అనాథలా వదిలేసిన కుటుంబం.. దిక్కు తోచని స్థితిలో.. -
అలాంటి వ్యక్తినే మనువాడతా!
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి అంజలి. రామ్ దర్శకత్వంలో కట్రదు తమిళ్ చిత్రం ద్వారా కోలీవుడ్కు కథనాయాకిగా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి అంజలి. ఆ తరువాత అంగాడి తెరు చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, కలగలప్పు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అదే విధంగా కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్, వెబ్ సీరిస్లోనూ నటిస్తూ ఇప్పటికి బిజీగానే ఉన్నారు. ఇకపోతే వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి వంటి పలు వదంతుల్లోనూ చిక్కుకున్నారు. ముఖ్యంగా ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు జయ్తో పరిచయం ప్రేమగా మారడం, ఇద్దరు చాలా కాలం సహ జీవనంలో ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగింది. అంతేగాక నటుడు జయ్, అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. అలాంటిది మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారంటూ నటి అంజలి హైదరాబాదుకు మకాం మార్చినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం 36 ఏళ్ల ఈ బ్యూటీ సింగిల్ గానే ఉన్నారు. ఇటీవల ఒక భేటీలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు రిలేషన్షిప్లో మర్యాద చాలా ముఖ్యం అని అంజలి పేర్కొన్నారు. ఆ తర్వాతే ప్రేమ, అభిమానం అన్నీ అన్నారు. మర్యాద లేని వ్యక్తితో సంబంధమే తనకు అవసరం లేదని పేర్కొన్నారు. కెరీర్, రిలేషన్షిప్లలో ఏది కోరుకుంటారు అన్న ప్రశ్నకు తనకు రెండు ముఖ్యమన్నారు. -
పదేళ్ల తర్వాత మళ్లీ ఆ హీరోతో నయనతార స్క్రీన్ షేర్
హీరో జై, హీరోయిన్ నయనతార పదేళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. నయనతార ప్రధాన పాత్రలో నీలేష్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ ఓ సినిమా తెరకెక్కనుంది. ఇది నయనతార కెరీర్లో 75వ సినిమా కావడం విశేషం. కాగా ఈ సినిమాలో యాక్టర్ జై నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. 2013లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘రాజా రాణి’ చిత్రం తర్వాత జై, నయనతార కలిసి మళ్లీ ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
బాధ్యత నాది
కాంగ్రెస్లో పలువురి చేరిక
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
తప్పక చదవండి
Advertisement