breaking news
IPL 2026 auction
-
ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ చుక్కలు చూపిస్తున్నాడు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఓ యువ పేస్ బౌలర్ దుమ్ములేపుతున్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వెటరన్ భువనేశ్వర్ కుమార్ను తలపించే స్వింగ్ బౌలింగ్తో దూసుకుపోతున్నాడు. తన సంచలన బౌలింగ్తో పవర్ ప్లే స్పెషలిస్టుగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే బరోడాకు చెందిన యువ పేస్ సంచలనం రాజ్ లింబానీ.బెంగాల్పై అదుర్స్..దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్లో లింబానీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అస్సాంతో జరిగిన తొలి మ్యాచ్లో 3 వికెట్లతో సత్తాచాటిన రాజ్.. ఇప్పుడు శుక్రవారం బెంగాల్పై 5 వికెట్ల హాల్తో మెరిశాడు. అతడి బౌలింగ్ ధాటికి బెంగాల్ జట్టు కేవలం 205 పరుగులకే కుప్పకూలింది.ఆరంభంలో బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన లింబానీ.. ఆ తర్వాత షాబాజ్ ఆహ్మద్ వంటి కీలక ప్లేయర్లను ఔట్ చేశాడు. మొత్తంగా తన పది ఓవర్ల కోటాలో 65 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను లింబానీకి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో లింబాని(8) సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. దీంతో ఎవరీ రాజ్ లింబానీ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ రాజ్ లింబాని?20 ఏళ్ల రాజ్ లింబాని.. గుజరాత్లోని కచ్లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్లో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రాజ్ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2024లో భారత జట్టు తరపున ఆడి తన అద్భుతమైన 'ఇన్స్వింగర్ల'తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆసియాకప్లోనూ భారత అండర్-19 జట్టకు ప్రాతినిథ్యం వహించాడు. ఆసియా కప్లో నేపాల్పై కేవలం 13 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.తన స్వింగ్ బౌలింగ్తో జానియర్ భువీగా అతడు పేరు సంపాదించుకున్నాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం రాజ్ లింబానికి నిరాశే ఎదురైంది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు.అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న లింబానిని ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఎవరైనా గాయపడితే అతడిని రిప్లేస్మెంట్గా తీసుకునే అవకాశముంది. ఐపీఎల్-2025లో లింబాని గుజరాత్ టైటాన్స్ నెట్బౌలర్గా తన సేవలు అందించాడు. అతడు ఇప్పటివరకు డొమాస్టిక్ క్రికెట్లో 25 మ్యాచ్లు 39 వికెట్లు పడగొట్టాడు.చదవండి: VHT 2025-26: సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్.. ఉతికారేశారు -
ఐపీఎల్ వద్దు పొమ్మంది.. కట్చేస్తే.. డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. యువ క్రికెటర్లు తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి ఒక సరైన వేదిక. ఎంతో మంది ఆటగాళ్లు ఇదే వేదికపై సత్తాచాటి క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యారు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క ఆటగాడు కనీసం ఒక్కసారైనా ఐపీఎల్లో భాగం కావాలని భాగం కావాలని కలలు కంటాడు.అలా కలలు కంటున్న వారిలో ఒడిశాకు చెందిన స్వస్తిక్ సామల్ ఒకరు. 25 ఏళ్ల స్వస్తిక్ సామల్ ఐపీఎల్లో ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతీసారి అతడికి నిరాశే ఎదురు అవుతోంది. ఐపీఎల్-2026 మినీ వేలంలో కూడా అతడు తన పేరును రూ.30 లక్షల బేస్ ప్రైస్తో రిజిస్టర్ చేసుకున్నాడు.అయితే దురదృష్టవశాత్తూ తుది వేలం జాబితాలో (369 మంది) అతడికి చోటు దక్కలేదు. కానీ అతడు కొంచెం కూడా దిగులు చెందలేదు. తన సత్తాను మైదానంలోనే చూపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టు ఏకంగా డబుల్ సెంచరీతో మెరిశాడు.డబుల్ సెంచరీతో వీర వీహారం..విజయ్ హాజారే ట్రోఫీ-2025లో భాగంగా అలూర్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో స్వస్తిక్ సామల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన సామల్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అలూర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 169 బంతుల్లో 21 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 212 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 6 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది.అయితే ఈ లక్ష్యాన్ని సౌరాష్ట్ర 5 వికెట్లు కోల్పోయి చేధించేసింది. ఒడిశా ఓడిపోయినప్పటికి స్వస్తిక్ సామల్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. అంతేకాకుండా లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఒడిశా ప్లేయర్గా స్వస్తిక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఐదవ ఆటగాడిగా ఏకంగా సంజూ శాంసన్ (212*) రికార్డును సమం చేశాడు. దీంతో సామల్ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిచూపుతున్నారు.ఎవరీ సమాల్?25 ఏళ్ల స్వస్తిక్ సామల్.. ఒడిశాలోని కోరాపుట్లో జన్మించాడు. అయితే అతడికి చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కవ. 10 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. ఆ తర్వాత స్ధానికంగా ఓ క్రికెట్ అకాడమీలో అతడు చేరాడు.అనంతరం ఒడిశా అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో అతడికి 2019లో ఒడిశా సీనియర్ జట్టు తరపున ఆడే అవకాశముంది. తొలుత అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మిజోరంపై టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది లిస్ట్-ఎ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. టీ20, లిస్ట్-ఎలో అద్భుతంగా రాణించడంలో అతడు రెండేళ్ల కిందట ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పుడు ఒడిశా జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఓపెనర్గా వచ్చి దూకుడగా ఆడడం అతడి స్పెషాలిటి. ముఖ్యంగా టీ20 టీ20 ఫార్మాట్లో పవర్ ప్లే ఓవర్లను అద్భుతంగా ఉపయోగించుకునే సత్తా అతడికి ఉంది. గ్రౌండ్ నలుమూలలా కూడా అతడు షాట్లు ఆడగలడు. స్వస్తిక్ సామల్ అండర్-16, అండర్-19 ,అండర్-23 స్థాయిలలో ఒడిశా కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. అతడు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 686 పరుగులతో పాటు లిస్ట్-ఎ క్రికెట్లో 521 రన్స్ నమోదు చేశాడు. అదేవిధంగా టీ20ల్లో 13 మ్యాచ్లు 362 పరుగులు చేశాడు. అయితే మూడు ఫార్మాట్లలోనూ అతడి పేరిట సెంచరీ ఉంది. -
పెట్టిన సొమ్ముకు.. అతడి ఆటకు సంబంధమే లేదు! అయినా..
కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ప్రయాణం ముగిసింది. ఐపీఎల్-2026లో అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన మినీ వేలంలో వెంకటేశ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, కేకేఆర్, ఆర్సీబీ మధ్య పోటీ నెలకొంది.ఈ క్రమంలో రూ. 3.2 కోట్ల ధర దాటిని తర్వాత లక్నో, గుజరాత్ తప్పుకోగా.. కేకేఆర్ (KKR) రూ. 6.8 కోట్ల వరకు బిడ్ వేసింది. అయితే, ఆఖరికి రూ. 7 కోట్లకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. కాగా 2021లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన మధ్యప్రదేశ్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer).. 2025 వరకు అదే జట్టుతో కొనసాగాడు.ధరలో హై జంప్రూ. 20 లక్షల కనీస ధరతో కేకేఆర్లో చేరిన వెంకీ అద్భుత ప్రదర్శన కనబరచగా.. మరుసటి ఏడాది వేలానికి ముందు ఏకంగా రూ. 8 కోట్లకు జట్టు రిటైన్ చేసుకుంది. 2023, 24 సీజన్లలోనూ ఈ మేర భారీ మొత్తమే చెల్లించింది. అయితే, 2024లో జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన వెంకీ వేలానికి ముందు జట్టును వీడాడు.అనూహ్య రీతిలో రూ. 23.75 కోట్లుఈ క్రమంలో ఆక్షన్లో అతడి కోసం కేకేఆర్ ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది. నిజానికి అతడి స్థాయికి అది మించిన ధరే అని చెప్పవచ్చు. అయినప్పటికీ కేకేఆర్ వెంకీ కోసం పర్సు నుంచి భారీ మొత్తమే వెచ్చించి అతడిని మళ్లీ జట్టులో చేర్చుకుంది. అయితే, ఈసారి అతడు కనీస స్థాయి ప్రదర్శన కూడా కనబరచలేదు.పెట్టిన సొమ్ముకు.. అతడి ఆటకు సంబంధమే లేకుండా పోయింది. పదకొండు మ్యాచ్లు ఆడి కేలం 142 పరుగులే చేశాడు. ఇక ఈ పేస్ ఆల్రౌండర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు కేకేఆర్ అతడిని విడిచిపెట్టింది. అయినప్పటికీ తిరిగి తెచ్చుకోవాలని భావించగా.. ఆర్సీబీ ఈసారి పట్టు వీడకుండా అతడిని తమ సొంతం చేసుకుంది.తక్కువ ధరకే కొందాం అనుకొన్నాంఈ పరిణామాల నేపథ్యంలో కేకేఆర్ హెడ్కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ ఎల్లప్పుడూ తమ ఆటగాళ్ల వెంటే పడుతుందని పేర్కొన్నాడు. జియోహాట్స్టార్తో మాట్లాడుతూ.. ‘‘తన కెరీర్ ఆరంభం నుంచి వెంకటేశ్ అయ్యర్ మా ఫ్రాంఛైజీతోనే ఉన్నాడు.అతడిని తిరిగి సొంతగూటికి తీసుకురావాలని మేము ప్రయత్నించాము. వైవిధ్యభరితమైన ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు తమ డబ్బును సేవ్ చేసుకుంటాయని అనుకున్నాము. కాబట్టి వెంకటేశ్ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని భావించాము.ఆర్సీబీ మా వాళ్ల వెంటే పడుతుందిఅయితే, ఆర్సీబీ ఎల్లప్పుడూ మా ఆటగాళ్ల వెంటే పడుతుంది కదా!.. ఈసారి ఎట్టకేలకు అతడిని సొంతం చేసుకుంది. చాలా ఏళ్లుగా వెంకటేశ్ మా జట్టుతో ఉన్నాడు. ఐపీఎల్లో అతడి కొత్త ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నా’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు.కాగా అభిషేక్ నాయర్ చెప్పినట్లు ఆర్సీబీ మరీ కేకేఆర్ ఆటగాళ్ల వెంబడే పడినట్లు ఎప్పుడూ కనిపించలేదు. అయితే, కేకేఆర్ మాజీ ప్లేయర్లు ఫిల్ సాల్ట్, క్రిస్ గేల్, సూయశ్ శర్మ తదితరులు ఆర్సీబీ ఆడారు. ఫ్రాంఛైజీ క్రికెట్లో ఇలాంటివి సహజమే. ఇక వెంకటేశ్ అయ్యర్కు బదులు కేకేఆర్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ను జట్టులో చేర్చుకుంది. ఇందుకోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చుపెట్టింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు.చదవండి: Rohit Sharma: చాలా బాధపడ్డాను.. క్రికెట్ వదిలేయాలనుకున్నా -
చవక ధరకే బెస్ట్ ప్లేయర్లు.. వేలంలో సూపర్ హిట్!
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ స్పందించాడు. ఈసారి వేలంపాటలో అందరి కంటే ఢిల్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఎక్కువగా ఖర్చు పెట్టకుండానే మెరుగైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నారని కొనియాడాడు.రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతోఅబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతో ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆఖిబ్ నబీ కోసం రూ. 8.40 కోట్లు ఖర్చు చేసిన యాజమాన్యం.. అతి తక్కువగా సాహిల్ పరాఖ్ కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.చవక ధరకే బెస్ట్ ప్లేయర్లుఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ ఎస్. బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి వేలంలో సింగిల్ డిజిట్ స్కోర్ (కోట్లలో)తోనే వాళ్లు ఆటగాళ్లందరినీ కొనుగోలు చేశారు. ఒక్కరి కోసం అంతకుమించి ఖర్చుపెట్టలేదు. అంటే.. వారు ఈసారి వేలంపాటలో మంచి ప్రదర్శన ఇచ్చారని అర్థం.వేలంలో చవక ధరకే డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, ఆఖిబ్ నబీ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన తీరు నిజంగా అద్భుతం. దీనిని బట్టే వారు వేలం కోసం ఏ స్థాయిలో సన్నద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పేపర్ మీదైతే వాళ్ల జట్టు సమతూకంగా ఉంది.ఇక మైదానంలో దిగిన తర్వాత ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. 13-14 మంది ప్లేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని.. వారికే తరచూ అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాలి. ఈ జట్టుతో ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఢిల్లీ ఈసారి టాప్-4లో ఉండటం ఖాయం’’ అని పేర్కొన్నాడు. కాగా ఆఖరి నిమిషంలో ఢిల్లీ తమ మాజీ ఆటగాడు పృథ్వీ షాను రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయడం విశేషం.వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు- ధరఆఖిబ్ నబీ (రూ.8.40 కోట్లు), పాతుమ్ నిసాంక (రూ.4 కోట్లు), కైలీ జేమీసన్ (రూ.2 కోట్లు), లుంగీ ఎన్గిడి (రూ.2 కోట్లు), బెన్ డకెట్ (రూ. 2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్ పరాఖ్ (రూ.30 లక్షలు)వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
పాటిదార్ అవుట్.. కెప్టెన్గా వెంకటేశ్ అయ్యర్
వెంకటేశ్ అయ్యర్కు కెప్టెన్గా ప్రమోషన్ వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్లో అతడు మధ్యప్రదేశ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా 2015లో మధ్యప్రదేశ్ తరఫున దేశీ క్రికెట్లో అడుగుపెట్టిన వెంకీ.. ఇప్పటికి ఫస్క్లాస్ క్రికెట్లో 20, లిస్ట్-ఎ క్రికెట్లో 48, టీ20లలో యాభైకి పైగా మ్యాచ్లు ఆడాడు.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా సత్తా చాటుతూ పరుగులు రాబట్టడంతో పాటు ఆయా ఫార్మాట్లలో వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్లోనూ అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer).. ఇప్పటి దాకా కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో కొనసాగాడు. 2024లో ట్రోఫీ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. ఈ నేపథ్యంలో ఈ ఆల్రౌండర్ను 2025 వేలానికి ముందు రిలీజ్ చేసిన కేకేఆర్.. ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది.రూ. 7 కోట్లకు ఆర్సీబీ సొంతంఅయితే, తాజా ఎడిషన్లో వెంకటేశ్ బ్యాట్, బంతితో పూర్తిగా తేలిపోయాడు. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు అతడిని విడిచిపెట్టగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లోనూ వెంకటేశ్ అయ్యర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. అయినప్పటికీ ఆర్సీబీ ఈ మేర భారీ మొత్తమే చెల్లించగా.. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సైతం మరోసారి నమ్మకం ఉంచి ఏకంగా కెప్టెన్గా నియమించింది.పాటిదార్ అవుట్.. కెప్టెన్గా వెంకటేశ్ అయ్యర్అయితే, ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించిన సారథి, మధ్యప్రదేశ్కు గతేడాది విజయ్ హజారే ట్రోఫీ అందించిన రజత్ పాటిదార్ ఈ జట్టులో లేడు. కెప్టెన్గా అతడి స్థానాన్ని వెంకటేశ్ అయ్యర్ భర్తీ చేశాడు. ఇక ఈ ఇద్దరు ఆర్సీబీ బాయ్స్తో పాటు జట్టులో కొత్తగా చేరిన మరో మధ్యప్రదేశ్ ఆటగాడు మంగేశ్ యాదవ్ కూడా దేశీ వన్డే టోర్నీ ఆడబోతున్నాడు. కాగా పాటిదార్ గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలో కోలుకున్న అతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా పొందాడు. అయినప్పటికీ మధ్యప్రదేశ్ జట్టుకు దూరమయ్యాడు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా డిసెంబరు 14- జనవరి 8 మధ్య విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశ నిర్వహించనున్నారు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26కు మధ్యప్రదేశ్ జట్టువెంకటేశ్ అయ్యర్ (కెప్టెన్), హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), యశ్ దూబే, శుభమ్ శర్మ, హర్ప్రీత్ సింగ్, రిషబ్ చౌహాన్, రితిక్ తడా, కుమార్ కార్తికేయ, సారాంశ్ జైన్, శివంగ్ కుమార్, ఆర్యన్ పాండే, రాహుల్ బాథమ్, త్రిపురేష్ సింగ్, మంగేశ్ యాదవ్, మాధవ్ తివారి (ఫిట్నెస్ ఆధారంగా).చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చింది. క్యాష్ రిచ్ లీగ్లోని ఫ్రాంఛైజీలు తమ జట్లను పటిష్ట పరచుకునే క్రమంలో మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి.. ఒక రకంగా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాయి. ఐపీఎల్-2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది.రూ. 14.20 కోట్లుఅన్క్యాప్డ్ ఆటగాళ్లు అయిన కార్తిక్ శర్మ (Kartik Sharma), ప్రశాంత్ వీర్ (Prashant Veer)లపై చెరో రూ. 14.20 కోట్లు కుమ్మరించి మరీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ప్రపంచంలోని టాప్ టీ20 లీగ్లో వీరిద్దరు నయా సెన్సేషన్లుగా నిలిచారు. ఇద్దరిదీ మధ్య తరగతి కుటుంబమే. తల్లిదండ్రుల త్యాగాలతోనే ఆటగాళ్లుగా ఎదిగిన కార్తిక్, ప్రశాంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా చరిత్ర సృష్టించారు.వీరిద్దరిలో కార్తిక్ శర్మ కుటుంబం ఒకానొక దశలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని అతడి కుటుంబమే స్వయంగా IANSకు తెలిపింది. పందొమ్మిదేళ్ల కార్తిక్ స్వస్థలం రాజస్తాన్లోని భరత్పూర్. అతడి తల్లిదండ్రులు మనోజ్ శర్మ, రాధ. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం.అయితే, కుమారుడిని క్రికెటర్ చేయాలన్నది కార్తిక్ తల్లిదండ్రుల కల. ముఖ్యంగా అతడి తల్లి రాధ కొడుకు ఏదో ఒకరోజు కచ్చితంగా ఆటగాడిగా ఎదుగుతాడని బలంగా నమ్మేవారు. అందుకోసం భర్తతో కలిసి ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఈ విషయం గురించి కార్తిక్ తండ్రి మనోజ్ శర్మ మాటల్లోనే..నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు‘‘మా ఆదాయం అంతంతమాత్రమే. అయితే, నా భార్య రాధకు మాత్రం ఓ కల ఉండేది. ఎట్టిపరిస్థితుల్లోనైనా కార్తిక్ను క్రికెటర్ చేయాలని ఆమె అంటూ ఉండేది. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. మా కుమారుడు క్రికెటర్ అయితే చాలు అనుకునేది.కార్తిక్ శిక్షణ కోసం మేము మాకున్న చిన్నపాటి ప్లాట్లు, బరేనా గ్రామంలో మాకున్న పొలం అమ్మేశాము. రాధ తన నగలు కూడా అమ్మేసింది. మా జీవితాల్లో అదొక అత్యంత కఠినమైన దశ. అయితే, ఆర్థిక ఇబ్బందుల ప్రభావం కార్తిక్పై పడకుండా మేము చూసుకున్నాము.గ్వాలియర్లో టోర్నమెంట్ ఆడేందుకు కార్తిక్ను నేను అక్కడికి తీసుకువెళ్లాను. నాలుగైదు మ్యాచ్లలోనే జట్టు ఇంటిబాట పడుతుందని అనుకున్నాము. అయితే, కార్తిక్ ప్రదర్శన కారణంగా జట్టు ఫైనల్ చేరింది. అయితే, ఆ మ్యాచ్ అయ్యేంత వరకు గ్వాలియర్లోనే ఉండేందుకు మా దగ్గర సరిపడా డబ్బు లేదు.ఖాళీ కడుపుతోనేఅప్పుడు మేము ఓ నైట్ షెల్టర్లో ఉన్నాము. తినడానికి ఏమీ లేదు. ఖాళీ కడుపుతోనే ఆరోజు నిద్రపోయాము. తర్వాత ఫైనల్లో మ్యాచ్ గెలిచిన తర్వాత కార్తిక్కు వచ్చిన ప్రైజ్మనీతోనే మేము తిరిగి ఇంటికి చేరుకోగలిగాము’’ అని తాము పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు.అదే విధంగా.. ‘‘రెండున్నరేళ్ల వయసులోనే నా కుమారుడు బ్యాట్తో బంతిని బాది రెండు ఫొటోఫ్రేములను పగులగొట్టాడు. అది మాకెంతో ప్రత్యేకం. ఆరోజే మేము తన భవిష్యత్తు గురించి ఓ అంచనాకు వచ్చేశాము. నిజానికి క్రికెటర్ కావాలని నేనూ కలగన్నాను. అయితే, నా కోరిక తీరలేదు. నా కుమారుడి రూపంలో ఇప్పుడు ఆ కల నెరవేరింది’’ అని మనోజ్ శర్మ తెలిపారు.చదువునూ కొనసాగిస్తాకాగా దేశీ క్రికెట్లో సత్తా చాటిన వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ కోసం వేలంలో గట్టి పోటీ ఎదురైనా చెన్నై మాత్రం అతడిని వదల్లేదు. భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన కార్తిక్.. క్రికెట్తో పాటు చదువునూ కొనసాగిస్తానని చెబుతున్నాడు. ఇక కార్తిక్ పెద్ద తమ్ముడు చదువుపైనే ఎక్కువగా దృష్టి పెట్టగా.. చిన్న తమ్ముడు మాత్రం క్రికెట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.సంకల్పం బలంగా ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరవచ్చని ఇప్పటికే ఎంతో మంది యువ క్రీడాకారులు నిరూపించారు. ఇప్పుడీ జాబితాలో కార్తిక్ శర్మ కూడా చేరాడు. తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలంగా.. టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసే ఐపీఎల్కు అతడు సెలక్ట్ అయ్యాడు. చెన్నై వంటి చాంపియన్ జట్టు అతడిని ఏరికోరి కొనుక్కోవడం అతడి ప్రతిభకు నిదర్శనం.చదవండి: IND vs SA: 'ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో ఆడాను.. అంపైర్ల నిర్ణయంతో షాకయ్యాను' -
మరోసారి ఐపీఎల్లో.. సర్ఫరాజ్ స్పందన ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్ ఆడిన ఈ ముంబైకర్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ క్యాష్ రిచ్లో పునరాగమనం చేయనున్నాడు.ఐదుసార్లు చాంపియన్ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్.. సర్ఫరాజ్ ఖాన్ను కొనుక్కుంది. అబుదాబి వేదికగా మంగళవారం నాటి మినీ వేలంలో కనీస ధర రూ. 75 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.సర్ఫరాజ్ స్పందన ఇదేసోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకుంటూ.. ‘‘కొత్త జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎస్కే’’ అంటూ సర్ఫరాజ్ ఖాన్ చెన్నై యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఇన్స్టా స్టోరీలో నాని ‘జెర్సీ’ సినిమాలోని ఎమోషనల్ సీన్కు సంబంధించిన దృశ్యాలను జతచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో తిరిగి అమ్ముడుపోవడంపై స్పందించిన తీరు వైరల్గా మారింది.కాగా దేశవాళీ క్రికెట్లో రన్ మెషీన్గా గుర్తింపు పొందినా కూడా భారత టెస్టు జట్టుకు కూడా దూరమయ్యాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు భాగమయ్యాడు. ఇక ఇప్పటికి.. సర్ఫరాజ్ 7 ఇన్నింగ్స్లలో కలిపి ఏకంగా 203.08 స్ట్రయిక్రేట్తో 329 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ వేలంలో ముందుగా రూ.75 లక్షల కనీస ధరకు అతడిని ఎవరూ తీసుకోలేదు. మళ్లీ అతడి పేరు వచ్చినప్పుడు ఇదే మొత్తానికి చెన్నై ఎంచుకుంది. కాగా సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటి వరకు ఐపీఎల్లో యాభై మ్యాచ్లు ఆడి.. 585 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. మరోవైపు.. సర్ఫరాజ్ మిత్రుడు పృథ్వీ షాను కూడా ఢిల్లీ తీసుకోవడం విశేషం. అతడిని ఢిల్లీ కనీస ధర రూ. 75 లక్షలకే కొనుక్కుంది.అమ్ముడుపోని స్టార్లు వీరేఐపీఎల్లో గతంలో ఆడిన లేదా అంతర్జాతీయ క్రికెట్లో గుర్తింపు ఉన్న పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఈ జాబితాలో ఉన్న ప్రముఖ విదేశీ క్రికెటర్లలో డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, గెరాల్డ్ కొయెట్జీ, ముజీబుర్ రహమాన్, మహీశ్ తీక్షణ, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, షాయీ హోప్... టామ్ కరన్, అల్జారీ జోసెఫ్, నవీన్ ఉల్ హక్, రహ్మనుల్లా గుర్బాజ్, వియాన్ ముల్డర్, జానీ బెయిర్స్టో, ఫజల్హఖ్ తదితరులు ఉన్నారు. భారత క్రికెటర్లలో ఉమేశ్ యాదవ్, దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్, కరణ్ శర్మ, మనన్ వోహ్రాను ఎవరూ పట్టించుకోలేదు. Sarfaraz Khan’s emotional Instagram story after being sold for ₹75 lakh to Chennai Super Kings in the auction for IPL 2026.🥹❤️This shows that if you work hard, you will definitely get the reward for it. God never disappoints those who work hard. pic.twitter.com/X3Z81AmB0g— Mention Cricket (@MentionCricket) December 16, 2025 -
ఒకప్పుడు ‘డాడీస్ ఆర్మీ’.. ఇప్పుడు కుర్రాళ్లకు కోట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారాయి. క్యాష్ రిచ్ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై ఈసారి మినీ వేలంలో ఓ రకంగా ప్రకంపనలు సృష్టించింది. సాధారణంగా అనుభవానికి పెద్దపీట వేసే సీఎస్కే ... ఈసారి మాత్రం భవిష్యత్తుపై భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టింది.ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా... అన్క్యాప్డ్ ఆటగాళ్ల కోసం చెన్నై ఫ్రాంచైజీ కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టింది. ఒకప్పుడు ‘డాడీస్ ఆర్మీ’గా ముద్రపడ్డ చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్ (Prashant Veer), కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసుకుంది.రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టోర్నీ, భారత్ ‘ఎ’, అండర్–19, అండర్–23 ఇలా ఏ స్థాయిలోనూ పెద్దగా ఆకట్టుకోకపోయినా... కేవలం నైపుణ్యాన్ని నమ్మి యువ ఆటగాళ్ల కోసం భారీగా వెచ్చిచండం విశేషం. ప్రతిభకు పెద్ద పీట వేసే చెన్నై జట్టు ఇంత భారీ ఖర్చు పెట్టడంతో... కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వీరిద్దరి నేపథ్యాలను పరిశీలిస్తే...ధోనీకి ప్రత్యామ్నాయమా! ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి... ఏవో కొన్ని మ్యాచ్లు తప్ప... దాదాపు అన్నీ సమయాల్లో మహేంద్ర సింగ్ ధోనినే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వికెట్ కీపర్గా దర్శనమిచ్చాడు. అయితే గత కొన్నాళ్లుగా బ్యాటింగ్ ఆర్డర్లో ఆఖర్లో వస్తున్న ధోని... ఇంకెంతో కాలం ఐపీఎల్లో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వికెట్ల వెనక సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు... లోయర్ ఆర్డర్లో ధాటిగా షాట్లు ఆడగల ప్లేయర్ను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో చెన్నై ఫ్రాంచైజీ వేలంలో అడుగు పెట్టింది.అంతకుముందే టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్(Sanju Samson)ను ట్రేడింగ్లో తీసుకున్నా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రాజస్తాన్కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ కోసం కోట్లు కుమ్మరించింది. జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు... ఐపీఎల్ వేలానికి ముందే ట్రేడింగ్లో రవీంద్ర జడేజాను వదిలేసుకున్న చెన్నై జట్టు అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉత్తర ప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ వీర్ను ఎంపిక చేసుకుంది. ఎడంచేతి వాటం స్పిన్నర్ అయిన ప్రశాంత్... లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల సమర్థుడు. ఉత్తర ప్రదేశ్ లీగ్లో మంచి ప్రదర్శనలు కనబర్చిన ప్రశాంత్... ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2 మ్యాచ్లాడి 2 వికెట్లు తీశాడు. ఇక టి20ల్లో 9 మ్యాచ్లాడి 160కి పైగా స్ట్రయిక్ రేట్తో 112 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టాడు. ప్రాధమిక ధర రూ. 30 లక్షలతో వేలంలో అడుగపెట్టిన ప్రశాంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు -
వేలంలో రూ. 25.20 కోట్లు.. చేతికి రూ. 18 కోట్లు మాత్రమే!
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ముగ్గురు ఆటగాళ్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వీరిలో ఒకరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green).. మరో ఇద్దరు దేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు కార్తీక్ శర్మ (Kartik Sharma), ప్రశాంత్ వీర్ (Prashant Veer).రాజస్తాన్కు చెందిన పందొమిదేళ్ల కార్తీక్ శర్మను, ఉత్తరప్రదేశ్ ఆటగాడు ప్రశాంత్ వీర్లకు చెన్నై సూపర్ కింగ్స్ కోట్లాభిషేకం చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్గా సేవలు అందించే కార్తీక్ కోసం రూ. 14.20 కోట్లు.. బ్యాటింగ్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం కూడా అంతే మొత్తం చెన్నై వెచ్చించింది. అత్యధిక ధరఇక ఈసారి మినీ వేలంలో టాప్లో నిలిచిన గ్రీన్ను.. కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా అతడు నిలిచాడు. అయితే, కోల్కతా వెచ్చించిన రూ. 25.20 కోట్ల మొత్తం అతడు అందుకోలేడు. వేలంలో ఈ మేర భారీ ధర పలికినా.. గ్రీన్కు గరిష్టంగా రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి.కారణం ఇదేఐపీఎల్ నిబంధనల ప్రకారం మినీ వేలంలో విదేశీ ఆటగాడికి ఎంత విలువ పలికినా... ఆటగాళ్ల గరిష్ట రీటెయినింగ్ ఫీజు (రూ.18 కోట్లు) లేదా.. మెగా వేలంలో ఆటగాడికి దక్కిన మొత్తం (రూ.27 కోట్లు; రిషభ్ పంత్)కు ఇది మించరాదు. రెండింటిలో ఏది తక్కువైతే అంతే మొత్తం.. సదరు ఆటగాడికి లభిస్తుంది.ఆసీస్ ఆల్రౌండర్ అయిన కామెరాన్ గ్రీన్కు ఈ నిబంధన వర్తిస్తుంది. కాబట్టి రీటెయింగ్ ఫీజుకు సమానంగా అతడికి రూ. 18 కోట్లు దక్కుతాయి. కేకేఆర్ అతడి కోసం పర్సు నుంచి తీసిన మొత్తంలో.. మిగిలిన రూ.7.20 కోట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్ల సంక్షేమ నిధికి చేరతాయి. అత్యధిక పర్సు వాల్యూతో..కాగా ఈసారి అత్యధిక పర్సు వాల్యూ రూ. 64.3 కోట్లతో వేలం బరిలో దిగింది కోల్కతా. విధ్వంసకర ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుగా గ్రీన్ కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేసింది. అదే విధంగా శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ కోసం రూ. 18 కోట్లు, బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ కోసం రూ. 9.20 కోట్లు వెచ్చించింది.వీరితో పాటు తేజస్వి సింగ్ (రూ.3 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్ అలెన్ (రూ.2 కోట్లు), సీఫెర్ట్ (రూ.1.50 కోట్లు), ఆకాశ్దీప్ (రూ.1 కోటి), రాహుల్ త్రిపాఠి (రూ. 75 లక్షలు), దక్ష్ కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్ రంజన్ (రూ.30 లక్షలు), ప్రశాంత్ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.30 లక్షలు)లను వేలంలో కొనుగోలు చేసింది.ఐపీఎల్-2026కు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇదేఅజింక్య రహానే, రోవ్మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్దీప్ సింగ్, రింకూ సింగ్ కామెరాన్ గ్రీన్, మతీశ పతిరణ, ముస్తఫిజుర్ రెహ్మాన్, తేజస్వి సింగ్ , రచిన్ రవీంద్ర, ఫిన్ అలెన్ , సీఫెర్ట్, ఆకాశ్దీప్, రాహుల్ త్రిపాఠి , కామ్రా , సార్థక్ రంజన్ , ప్రశాంత్ సోలంకి, కార్తీక్ త్యాగి.చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు -
IPL 2026: మినీ వేలంలో ఎవరికి ఎంత?.. పది జట్ల పూర్తి వివరాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 సీజన్కు పది ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. వేలానికి ముందు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. మంగళవారం నాటి వేలంపాటలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అబుదాబి వేదికగా జరిగిన వేలంలో.. అత్యధిక పర్సు (రూ. 64.3 కోట్లు) కలిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది.మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ అన్క్యాప్డ్ ఆటగాళ్లు కార్తీక్ శర్మ (రూ. 14.20 కోట్లు), ప్రశాంత్ వీర్(రూ. 14.20 కోట్లు)లపై కనక వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న, కొనుగోలు చేసిన ఆటగాళ్లతో కూడిన పది జట్ల వివరాలు మీకోసం..ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుఅల్లా ఘజన్ఫర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ (లక్నో నుంచి ట్రేడింగ్), అశ్వనీ కుమార్, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్ఫర్డ్ (ట్రేడింగ్), కార్బిన్ బాష్, రఘు శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్, రాజ్ అంగద్బవా, తిలక్ వర్మ, హార్దిక్పాండ్యా, రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, మయాంక్ మార్కండే (ట్రేడింగ్), రియాన్ రికెల్టన్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుక్వింటన్ డి కాక్ (రూ.1 కోటి), మయాంక్ రావత్ (రూ. 30 లక్షలు), అథర్వ అంకోలేకర్ (రూ. 30 లక్షలు), మొహమ్మద్ ఇజ్హార్ (రూ. 30 లక్షలు), డానిశ్ మాలేవర్ (రూ. 30 లక్షలు). చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లురుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుకార్తీక్ శర్మ (రూ.14.20 కోట్లు), ప్రశాంత్ వీర్ (రూ.14.20 కోట్లు), రాహుల్ చహర్ (రూ.5.20 కోట్లు), మాట్ హెన్రీ (రూ.2 కోట్లు), అకీల్ హొసీన్ (రూ.2 కోట్లు), మాథ్యూ షార్ట్ (రూ.1.50 కోట్లు), జాక్ ఫూల్క్స్ (రూ.75 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.75 లక్షలు), అమన్ ఖాన్ (రూ.40 లక్షలు). కోల్కతా నైట్ రైడర్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅజింక్య రహానే, రోవ్మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్దీప్ సింగ్, రింకూ సింగ్వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుకామెరాన్ గ్రీన్ (రూ. 25.20 కోట్లు), మతీశ పతిరణ (రూ.18 కోట్లు), ముస్తఫిజుర్ రెహ్మాన్ (రూ.9.20 కోట్లు), తేజస్వి సింగ్ (రూ.3 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్ అలెన్ (రూ.2 కోట్లు), సీఫెర్ట్ (రూ.1.50 కోట్లు), ఆకాశ్దీప్ (రూ.1 కోటి), రాహుల్ త్రిపాఠి (రూ. 75 లక్షలు), కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్ రంజన్ (రూ.30 లక్షలు), ప్రశాంత్ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.30 లక్షలు)సన్రైజర్స్ హైదరాబాద్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లులివింగ్స్టోన్ (రూ.13 కోట్లు), జేక్ ఎడ్వర్డ్స్ (రూ.3 కోట్లు), సలీల్ అరోరా (రూ.1.50 కోట్లు), శివమ్ మావి (రూ.75 లక్షలు), ఫులెట్రా (రూ. 30 లక్షలు), ప్రఫుల్ (రూ. 30 లక్షలు), అమిత్ కుమార్ (రూ. 30 లక్షలు), ఓంకార్ (రూ. 30 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (రూ. 30 లక్షలు), శివాంగ్ కుమార్ (రూ. 30 లక్షలు).గుజరాత్ టైటాన్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుశుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), అనూజ్ రావత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, సాయి కిశోర్, కగిసో రబడ, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుజేసన్ హోల్డర్ (రూ.7 కోట్లు), బాంటన్ (రూ. 2 కోట్లు), అశోక్ శర్మ (రూ.90 లక్షలు), ల్యూక్వుడ్ (రూ.75 లక్షలు), పృథ్వీరాజ్ (రూ. 30 లక్షలు). రాజస్తాన్ రాయల్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, డొనొవాన్ ఫెరీరా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్), యుధ్వీర్ చరక్, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్ హెట్మెయిర్, లువాన్ డ్రి ప్రిటోరియస్, శుభమ్ దూబే, నండ్రీ బర్గర్, తుషార్ దేశ్పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), వైభవ్ సూర్యవంశీ.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లురవి బిష్ణోయ్ (రూ.7.20 కోట్లు), మిల్నే (రూ.2.40 కోట్లు), రవి సింగ్ (రూ.95 లక్షలు), సుశాంత్ మిశ్రా (రూ.90 లక్షలు), కుల్దీప్ సేన్ (రూ.75 లక్షలు), బ్రిజేశ్ శర్మ (రూ. 30 లక్షలు), పేరాల అమన్రావు (రూ. 30 లక్షలు), విఘ్నేశ్ (రూ. 30 లక్షలు), యశ్రాజ్ (రూ. 30 లక్షలు). రాయల్ చాలెంజర్స్ బెంగళూరుఅట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅభినందన్ సింగ్, నువాన్ తుషార, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, యశ్ దయాళ్, జేకబ్ బెతెల్, రసిఖ్ ధార్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, జోష్ హాజిల్వుడ్, సూయాంశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లువెంకటేశ్ అయ్యర్ (రూ. 7 కోట్లు), మంగేశ్ యాదవ్ (రూ.5.20 కోట్లు), డఫీ (రూ.2 కోట్లు), కాక్స్ (రూ.75 లక్షలు), కనిష్క్ (రూ. 30 లక్షలు), విహాన్ (రూ. 30 లక్షలు), విక్కీ (రూ. 30 లక్షలు), సాత్విక్ (రూ. 30 లక్షలు). ఢిల్లీ క్యాపిటల్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుఆఖిబ్ నబీ (రూ.8.40 కోట్లు), నిసాంక (రూ.4 కోట్లు), జేమీసన్ (రూ.2 కోట్లు), ఎన్గిడి (రూ.2 కోట్లు), డకెట్ (రూ. 2 కోట్లు), మిల్లర్ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్ పరాఖ్ (రూ.30 లక్షలు)లక్నో సూపర్ జెయింట్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅబ్దుల్ సమద్, దిగ్వేశ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్, ఐడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్. ఆకాశ్ సింగ్, మణిమరన్ సిద్దార్థ్, ప్రిన్స్ యాదవ్. అర్జున్ టెండుల్కర్ (ముంబై నుంచి ట్రేడింగ్), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్ పంత్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మొహమమ్మద్ షమీ (సన్రైజర్స్ నుంచి ట్రేడింగ్), ఆయుశ్ బదోని, మిచెల్ మార్ష్వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుఇన్గ్లిస్ (రూ.8.60 కోట్లు), ముకుల్ చౌధరీ (రూ.2.60 కోట్లు), అక్షత్ రఘువంశీ (రూ.2.20 కోట్లు), నోర్జే (రూ. 2 కోట్లు), హసరంగ (రూ. 2 కోట్లు), నమన్ తివారి (రూ.1 కోటి). పంజాబ్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅర్ష్దీప్ సింగ్, మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముషీర్ ఖాన్. సూర్యాంశ్ షెడ్గే, హర్నూర్ పన్నూ, నేహాల్ వధేరా, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్, వైశాక్ విజయ్కుమార్, లాకీ ఫెర్గూసన్, ప్రియాంశ్ ఆర్య, జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, పైలా అవినాశ్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టొయినిస్, శశాంక్ సింగ్, యజువేంద్ర చహల్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుబెన్ డ్వార్షుయిస్ (రూ.4.40 కోట్లు), కూపర్ కనోలీ (రూ.3 కోట్లు), నిషాద్ (రూ. 30 లక్షలు), ప్రవీణ్ దూబే (రూ. 30 లక్షలు). -
ఐపీఎల్ వేలంలో రూ. 25 కోట్లు.. కట్ చేస్తే! అక్కడ డకౌట్
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన గ్రీన్.. వేలం ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన పేలవ ప్రదర్శనతో అందరిని నిరాశపరిచాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ప్రారంభమైన మూడో టెస్టులో గ్రీన్ డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన గ్రీన్ తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. 2 బంతులు ఎదుర్కొని జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బ్రైడన్ కార్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో నెటిజన్లు గ్రీన్పై సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎల్లో కూడా ఇలానే ఆడుతావా? కేకేఆర్ భయపడుతోంది అంటూ పోస్ట్లు పెడుతున్నారు. గాయం కారణంగా గత ఐపీఎల్ సీజన్కు దూరంగా ఉన్న గ్రీన్.. ఈసారి కేకేఆర్ తరపున బరిలోకి దిగనున్నాడు.గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్కు ఆడాడు. దాదాపు ఆరు నెలల తర్వాత పోటీ క్రికెట్లో తిరిగొచ్చిన గ్రీన్.. టెస్టుల్లో మాత్రం రాణించలేకపోతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం పర్వాలేదన్పిస్తున్నాడు. అయితే కామెరూన్ తనదైన రోజున ఒంటి చేత్తో జట్టును గెలిపించగలడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ(106) సూపర్ సెంచరీతో చెలరేగగా.. ఉస్మాన్ ఖవాజా(126 బంతుల్లో 82), ఇంగ్లిష్(32) రాణించారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ స్టార్క్(33), లియోన్(0) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, బ్రైడన్ కార్స్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: 'డేల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా'.. ఢిల్లీ జట్టులోకి పేస్ సంచలనం -
కేకేఆర్లోకి పప్పు యాదవ్ కొడుకు.. ధర ఎంతంటే?
అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్కతా నైట్రైడర్స్ భారీ బిడ్డింగ్స్తో ఆశ్చర్యపరిచింది. రూ. 64.30 కోట్ల భారీ పర్సుతో వేలంలోకి దిగిన కేకేఆర్.. మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి తమ జట్టును పటిష్టం చేసుకుంది.ఈ వేలంలో కేకేఆర్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ఏకంగా రూ. 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. అదేవిధంగా కేకేఆర్.. భారత అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా తమ పర్స్లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. కేకేఆర్ కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ (పప్పు యాదవ్) కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు. సార్థక్ను రూ. 30 లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. 29 ఏళ్ల సార్థక్ ఐపీఎల్కు ఎంపిక కావడం ఇదే తొలిసారి.సార్థక్ రంజన్ డొమెస్టిక్ క్రికెట్లో ఢిల్లీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అతడు 9.33 సగటుతో 28 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 105, టీ20ల్లో 5 మ్యాచ్లు 66 పరుగులు చేశాడు. ఇక తన కుమారుడు ఐపీఎల్కు ఎంపిక కావడం పట్ల పప్పు యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు."అభినందనలు సార్థక్! నీ టాలెంట్తో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో, నీ కలలను నిజం చేసుకో" అంటూ ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా పప్పు యాదవ్ బీహార్లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్! -
ఎస్ఆర్హెచ్లోకి విధ్వంసకర వీరుడు.. ఎన్ని కోట్లంటే?
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ లైమ్ లివింగ్స్టోన్కు కళ్లు చెదిరే ధర దక్కింది. ఈ డేంజరస్ ప్లేయర్లను రూ. 13 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బెస్ ప్రైస్తో వేలం తొలి రౌండ్లోకి వచ్చిన అతడిని దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.కానీ యాక్సలరేటెడ్ రౌండ్లో మాత్రం లివింగ్స్టోన్ కోసం ఫ్రాంచైజీలు ప్రయత్నించాయి. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ తమ పర్స్లో ఉన్న డబ్బులతో చివరి వరకు బిడ్డింగ్ చేసింది. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. దీంతో లక్నో పోటీ నుంచి తప్పుకోంది. చివరికి అతడు హైదరాబాద్ సొంతమయ్యాడు. లివింగ్స్టోన్ గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. కానీ వేలానికి ముందు అతడిని ఆర్సీబీ తమ జట్టు నుంచి రిలీజ్ చేసింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడికి జాక్ పాట్ తగిలింది.కానీ ఈ మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. లియామ్ లివింగ్స్టోన్ మినహా మిగతా అందర్నీ అన్క్యాప్డ్ భారత ప్లేయర్లనే కొనుగోలు చేసింది. సన్రైజర్స్ సొంతం చేసుకున్న ఆటగాళ్ల వీళ్లే.. లియామ్ లివింగ్స్టోన్, సలీల్ అరోరా, క్రైన్స్ ఫులేత్రా, ప్రఫుల్ హింజే, ఓంకార్ తర్మాలే, అమిత్ కుమార్, షాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్. -
రూ.30 లక్షలతో ఎంట్రీ.. కట్ చేస్తే! ఏకంగా రూ.14.20 కోట్లు
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఓ 20 ఏళ్ల యువ ఆటగాడిపై కాసుల వర్షం కురిసింది. అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీల సైతం పోటీ పడ్డాయి. రూ. 30ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆ యువ ఆల్రౌండర్.. నిమిషాల వ్యవధిలోనే కోటీశ్వరుడిగా మారిపోయాడు.రికార్డు ధర దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడే ఉత్తర్ప్రదేశ్కు చెందిన ప్రశాంత్ వీర్. దుబాయ్ వేదికగా జరుగుతున్న మినీ వేలంలో ప్రశాంత్ వీర్ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఏకంగా రూ. 14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్తో పోటీ పడి మరి అతడిని సీఎస్కే సొంతం చేసుకుంది. తొలి బిడ్ నుంచి పోటీలో ఉన్న సీఎస్కే ఆఖరి వరకు వెనక్కి తగ్గలేదు. రచిన్ రవీంద్ర, లైమ్ లివింగ్స్టోన్ వంటి విధ్వంసకర ఆల్రౌండర్లను కాదని మరి ఈ యువ ఆటగాడిని సీఎస్కే దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్గా ప్రశాంత్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా పేసర్ అవేష్ ఖాన్(రూ. 10 కోట్లు) పేరిట ఉండేది. తాజా వేలంతో అవేష్ రికార్డును ప్రశాంత్ బ్రేక్ చేశాడు. దీంతో ఎవరీ ప్రశాంత్ వీర్ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ ప్రశాంత్ వీర్..?యూపీలోని అమేథీకి చెందిన ప్రశాంత్ వీర్.. అద్భుతమైన బ్యాటింగ్ ఆల్రౌండర్. 20 ఏళ్ల ప్రశాంత్కు బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్లు ఆడడం అతడి స్పెషాలిటీ. అతడు లెఫ్మ్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. యూపీ టీ20 లీగ్-2025లో నోయిడా సూపర్ కింగ్స్ తరపున ఆడిన ప్రశాంత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్లు ఆడిన వీర్.. 320 పరుగులతో పాటు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ టీ20 లీగ్లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేటు 169.69 ఉంది. ఈ ప్రదర్శనలతో అతడు సీఎస్కే స్కౌట్ల దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్కు పిలిచింది. ట్రయల్స్లో కూడా ప్రశాంత్ అద్భుతంగా రాణించాడు. రవీంద్ర జడేజాకు దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా ఈ యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని సీఎస్కే అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కోసం సీఎస్కే భారీ ధర వెచ్చించింది. అయితే అంత భారీ ధర కేటాయిస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతడు దుమ్ములేపాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో 112 పరుగుల (స్ట్రైక్ రేట్ 170)తో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్లో కేవలం 10 బంతుల్లోనే 37 పరుగులు చేసి ఔరా అన్పించాడు. కాగా ప్రశాంత్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు.🚨 Prashant Veer🚨A 20 year-old all-rounder from UP left-handed batter and economical left-arm spinner. He impressed in UPT20 with 320 runs and 8 wickets in 10 matches (SR 155.34). A flexible middle-overs option with both bat and ball.Let’s see which team shows interest in him pic.twitter.com/Ei1cdvOZ85— Neeraj (@NeerajY00859341) December 15, 2025చదవండి: IPL 2026 Auction: సీఎస్కే వదిలేసింది.. కట్ చేస్తే! వేలంలో కోట్ల వర్షం -
సీఎస్కే వదిలేసింది.. కట్ చేస్తే! వేలంలో కోట్ల వర్షం
ఐపీఎల్-2026 మినీ వేలంలో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానాకు జాక్ పాట్ తగిలింది. అతడిని రూ. 18 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పతిరానా కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీ పోటీనుంచి తప్పుకోవడంతో కోల్కతా నైట్రైడర్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ జూనియర్ మలింగ కోసం కేకేఆర్, లక్నో మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. లక్నో అతడిని దక్కించుకునేందుకు ఆఖరివరకు ప్రయత్నాలు చేసింది. కానీ కేకేఆర్ మాత్రం బిడ్ను పెంచుకుంటూ పోతుండడంతో లక్నో వెనక్కి తగ్గింది. దీంతో ఈ యార్కర్ల కింగ్ కేకేఆర్ సొంతమయ్యాడు.పతిరానా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే నాలుగు సీజన్ల పాటు తమ జట్టుకు ఆడిన పతిరానాను సీఎస్కే.. ఐపీఎల్-2026 వేలంకు ముందు రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలోకి వచ్చిన పతిరానాపై కాసుల వర్షం కురిసింది. గత సీజన్లో సీఎస్కే నుంచి రూ.13 కోట్లు అందుకున్న పతిరానా.. ఇప్పుడు కేకేఆర్ నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు. కాగా పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరుగాంచాడు. పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరుగాంచాడు. పతిరానా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికి.. సీఎస్కే లెజెండ్ ధోని సారథ్యంలో ఎంతగానో రాటుదేలాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన పేస్ బౌలింగ్ బ్యాటర్లను కట్టడి చేయగలడు. అంతేకాకుండా ఈ జూనియర్ మలింగా యార్కర్లను కూడా అద్భుతంగా సంధించగలడు. ఈ కారణంతోనే అతడిపై కేకేఆర్ కోట్ల వర్షం కురిపించింది. మతీషా పతిరానా ఐపీఎల్లో ఇప్పటివరకు 32 మ్యాచ్లు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: కామెరూన్ గ్రీన్కు భారీ ధర.. ఐపీఎల్ చరిత్రలోనే! ఎన్ని కోట్లంటే? -
కామెరూన్ గ్రీన్కు భారీ ధర.. ఐపీఎల్ చరిత్రలోనే! ఎన్ని కోట్లంటే?
అంతా ఊహించిందే జరిగింది. ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్పై కాసుల వర్షం కురిసింది. ఈ విధ్వంసకర ఆటగాడిని రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బెస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన ముంబై ఇండియన్స్, కేకేఆర్ పోటీ పడ్డాయి. రూ. 2.75 కోట్లతో ముంబై బిడ్ను ప్రారంభించింది. కానీ రాజస్తాన్ రాయల్స్ ఎంట్రీ ఇవ్వడంతో ముంబై పోటీ నుంచి తప్పుకోంది. ఆ తర్వాత కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మధ్య పోటీ నెలకొంది. అనంతరం రాజస్తాన్ కూడా రేసు నుంచి వైదొలగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. గ్రీన్ కోసం సీఎస్కే కూడా తీవ్రంగా శ్రమించింది. కానీ కేకేఆర్తో పోటీ పడలేక సీఎస్కే వెనక్కి తగ్గింది. దీంతో గ్రీన్ కేకేఆర్ సొంతమయ్యాడు.గ్రీన్ రికార్డు..ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డులలెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (రూ.24.75) పేరిట ఉండేది. తాజా వేలంతో స్టార్క్ను గ్రీన్ వెనక్కి నెట్టాడు. అదేవిధంగా ఓవరాల్గా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పొందిన మూడో ప్లేయర్గా గ్రీన్ నిలిచాడు. ఈ జాబితాలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(రూ.27 కోట్లు) అగ్రస్ధానంలో ఉండగా.. శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు) ఉన్నాడు.గ్రీన్కు వచ్చేది ఎన్ని కోట్లంటే?అయితే గ్రీన్ దక్కించుకున్న రూ. 25.20 కోట్లలో బీసీసీఐ కోత విధించనుంది. , ఐపీఎల్ గత సీజన్లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం.. విదేశీ ప్లేయర్ 18 కోట్ల కంటే ఎక్కువ పలికితే, ఆపై మిగిలిన మొత్తాన్ని బీసీసీఐ ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఖర్చు చేయనుంది. దీంతో గ్రీన్ పలికిన ధరలో 7.20 కోట్లు బీసీసీఐకి వెళ్లనున్నాయి.చదవండి: దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ.. -
ముగిసిన ఐపీఎల్-2026 మినీ వేలం
IPL 2026 Auction LIVE Updates And Highlights: అబుదాబి వేదికగా ఐపీఎల్-2026 మినీ వేలం ముగిసింది. మొత్తం పది ఫ్రాంచైజీలు 77 స్ధానాలను భర్తీ చేశాయి. ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ నిలిచాడు. రూ.25.20 కోట్ల భారీ ధరకు అతడిని కేకేఆర్ సొంతం చేసుకుంది. అన్ క్యాప్డ్ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను రూ.14.20 కోట్ల రికార్డు ధరకు సీఎస్కే కొనుగోలు చేసుకుంది. వారిద్దరి కోసమే చెన్నై రూ.28 కోట్ల పైగా ఖర్చు చేసింది.👉ఆంధ్ర పేసర్ పృథ్వీ రాజ్ యర్రాను రూ.30 లక్షల కనీస ధరకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.👉పృథ్వీ షాను రూ.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.👉హైదరాబాద్ ఆటగాడు అమన్ రావు పేరాలను రూ.30 లక్షలకు తీసుకున్న రాజస్తాన్ రాయల్స్👉ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ను రూ.8.60 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.👉లుంగీ ఎంగిడిని రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.👉రాహుల్ చాహర్ను రూ.5.20 కోట్లకు సీఎస్కే సొంతం చేసుకుంది.👉ఆసీస్ బౌలర్ బెన్ దుర్హనియస్ను రూ.4.40 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.👉ఆకాష్ దీప్ను, మాట్ హెన్రిలను కేకేఆర్, సీఎస్కే కొనుగోలు చేశాయి. రూ.2 కోట్ల కనీస ధరకే దక్కించుకున్నాయి.👉కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రను రూ.2 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది.👉ఇంగ్లండ్ ఆల్రౌండర్ లైమ్ లివింగ్స్టోన్ను రూ.13 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.👉పృథ్వీషా, దీపక్ హుడా వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోయారు.👉టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను రూ.75 లక్షలకు సీఎస్కే సొంతం చేసుకుంది. తొలి రౌండ్లో అమ్ముడుపోని సర్ఫరాజ్ను.. ఆఖరి రౌండ్లో చెన్నై దక్కించుకుంది.👉అమిత్ కుమార్ను రూ. 30 లక్షలకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.👉భారత అన్క్యాప్డ్ ప్లేయర్ మంగేష్ యాదవ్ను రూ.5.20 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ దక్కించుకుంది.👉సైల్ ఆరోరాను రూ. 1.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది.👉రవిసింగ్ను రూ.30 లక్షలకు రాజస్తాన్ కైవసం చేసుకుంది.👉డానిష్ మలేవార్ రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.👉 భారత అన్క్యాప్డ్ అక్షత్ రఘువంశీని రూ.2.20 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.👉బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ను రూ.9.20 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.👉వెస్టిండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ను రూ.7 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అదేవిధంగా ఆసీస్ ప్లేయర్ మాథ్యూ షార్ట్ను సీఎస్కే రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.👉రాహుల్ త్రిపాఠీని రూ.75 లక్షల కనీస ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది.👉శ్రీలంక స్టార్ ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంకను రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.👉నమన్ తివారీని కోటిరూపయాలకు లక్నో సొంతం చేసుకుంది.👉అన్క్యాప్డ్ ప్లేయర్లు ముకుల్ చౌదరిని రూ. 2.60 కోట్లకు లక్నో, తేజస్వీ సింగ్ను రూ.3 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.కార్తీక్ శర్మకు రూ. 14. 25 కోట్లుఐపీఎల్-2026 వేలంలో మరో అన్క్యాప్డ్ ప్లేయర్ పంట పండింది. రాజస్తాన్కు చెందిన కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.యూపీ ఆటగాడికి జాక్ పాట్.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన అన్క్యాప్డ్ ఆటగాడు ప్రశాంత్ వీర్పై కాసుల వర్షం కురిసింది. రూ.14.20 కోట్ల భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. 20 ఏళ్ల ప్రశాంత్ కోసం సీఎస్కేతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. కానీ చివరికి ఈ యువ ఆటగాడు సీఎస్కే సొంతమయ్యాడు.భారత వెటరన్ ప్లేయర్ విజయ్ శంకర్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు.అన్క్యాప్డ్ ప్లేయర్కు భారీ ధర..జమ్ముకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీకి ఊహించని ధర దక్కింది. రూ.30 లక్షల బేస్ప్రైస్తో వేలంలోకి వచ్చిన నబీని రూ.8.4 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.👉విండీస్ స్పిన్నర్ అకిల్ హోస్సేన్ను రూ.2 కోట్ల కనీస ధరకు సీఎస్కే సొంతం చేసుకుంది.బిష్ణోయ్కు భారీ ధర..భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ను రూ. 7.20 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.👉సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జేను రూ. 2 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.పతిరానాకు జాక్పాట్..శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానాను రూ. 18 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఆర్సీబీలోకి కివీ స్టార్ పేసర్న్యూజిలాండ్ స్టార్ పేసర్ జాకబ్ డఫీని రూ.2 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్లోకి డకెట్..బెన్ డకెట్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా.. అలెన్ను కేకేఆర్ దక్కించుకుంది. వీరిద్దరూ రూ. 2 కోట్ల బెస్ ప్రైస్కు అమ్ముడుపోయారు.ముంబైలోకి డికాక్..సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ను రూ. కోటి రూపాయల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.👉దీపక్ హుడా, కేఎస్ భరత్ అన్సోల్డ్గా మిగిలిపోయారు.ఆర్సీబీలోకి వెంకటేశ్ అయ్యర్..భారత ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ను రూ.7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడ్డాయి. కేకేఆర్, లక్నో పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్ బెంగళూరు ఫ్రాంచైజీలోకి చేరాడు.లక్నోలోకి హసరంగశ్రీలంక ఆల్రౌండర్ వనిందు హసరంగాను రూ. 2 కోట్ల బెస్ప్రెస్కు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.👉ఇంగ్లండ్ క్రికెటర్ గస్ అట్కిన్సన్, కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్, లైమ్ లివింగ్ స్టోన్, అమ్ముడుపోలేదు.సర్ఫరాజ్ ఖాన్ అన్సోల్డ్భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. కనీస ధర రూ.75లక్షలతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు.గ్రీన్కు కళ్లు చెదిరే ధర.. రూ. 25.20 కోట్లకు కేకేఆర్ సొంతంఊహించినట్లుగానే ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్పై కాసులు వర్షం కురిసింది. గ్రీన్ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్కతానైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అతడిని దక్కించుకునేందుకు మొదటిలో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత రాయల్స్ పోటీ నుంచి తప్పుకోవడంతో సీఎస్కే ఎంట్రీ ఇచ్చింది. సీఎస్కే, కేకేఆర్ మధ్య తీవ్రమైన బిడ్డింగ్ వార్ జరిగింది. ఆఖరిలో సీఎస్కే రేసు నుంచి తప్పుకోవడంతో గ్రీన్ కేకేఆర్ సొంతమయ్యాడు.పృథ్వీ షా అన్సోల్డ్..టీమిండియా ప్లేయర్ పృథ్వీ షాకు మరోసారి నిరాశే ఎదురైంది. రూ.75 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన షాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుందుకు ముందుకు రాలేదు. దీంతో అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అతడితో పాటు కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే సైతం అమ్ముడు పోలేదు.ఢిల్లీకి డేవిడ్ మిల్లర్ఐపీఎల్-2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన తొలి ప్లేయర్గా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. మిల్లర్ను రూ.2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.మెక్గర్క్కు షాక్..ఐపీఎల్-2026 మినీ వేలం ప్రారంభమైంది. ఈ వేలంలోకి వచ్చిన తొలి ప్లేయర్గా ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ నిలిచాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.మరి కాసేపట్లో ఐపీఎల్ వేలం..ఐపీఎల్-2026 మినీ వేలం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 77 స్ధానాలను గాను ఈ వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 369 ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ తర్వాత స్ధానంలో చెన్నై సూపర్ కింగ్స్(43.4 కోట్లు) నిలిచింది. పది ఫ్రాంఛైజీల్లో రూ.2.75 కోట్ల పర్స్తో ముంబై ఇండియన్స్ చివరిస్థానంలో ఉంది. గ్రీన్పై అందరి కళ్లు?ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. గతేడాది సీజన్కు దూరంగా ఉన్న గ్రీన్ను ఈసారి తమ జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ముఖ్యంగా కేకేఆర్, సీఎస్కే మధ్య పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. అతడితో రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్స్టోన్ వంటి ఆటగాళ్లకు భారీ ధర దక్కనున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
IPL: అసలు ఎందుకీ వేలం?.. పన్నెండు ఆసక్తికర అంశాలు
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలమే హాట్టాపిక్. అబుదాబి వేదికగా మంగళవారం వేలం పాటకు రంగం సిద్ధమైంది. అన్ని ఫ్రాంఛైజీలలో కలిపి మొత్తం 77 ఖాళీలు ఉండగా.. 359 మంది క్రికెటర్లు పోటీలో ఉన్నారు.ఇంతకీ అసలు ఈ వేలంపాట ఎందుకు నిర్వహిస్తారు? ఆటగాళ్లను మార్చుకోకుండా.. ఆక్షన్ ద్వారానే ఎందుకు కొనుగోలు చేస్తారు? బిడ్డింగ్ ఎలా జరుగుతుంది? తదితర పన్నెండు ఆసక్తికర అంశాలు ఈ సందర్భంగా తెలుసుకుందాం!ఎందుకీ ఐపీఎల్ వేలం?లీగ్లో భాగమైన పది ఫ్రాంఛైజీలు.. వచ్చే సీజన్కు గానూ తమ జట్లను నిర్మించుకోవడం, పటిష్టం చేసుకోవడం కోసం బిడ్లు వేస్తాయి. తమ పర్సులో ఉన్న మొత్తం ద్వారా వేలంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి.వేలం ఎవరు నిర్వహిస్తారు?భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ వేలాన్ని నిర్వహిస్తుంది. ఇండిపెండెంట్ ఆక్షనీర్ వేలంపాట పాడతారు. నిబంధనలకు అనుగుణంగా బిడ్లను పూర్తి చేసేలా చూసుకుంటారు. తొలుత పురుషులు మాత్రమే ఐపీఎల్ ఆక్షనీర్లుగా ఉండగా.. గత కొంతకాలంగా మల్లికా సాగర్ ఆక్షనీర్గా సత్తా చాటుతున్నారు.వేలానికి బదులు సింపుల్గా ఆటగాళ్లను మార్చుకోవచ్చా?ఫ్రాంఛైజీ మధ్య పోటీతత్వం, సమాన అవకాశాలు దక్కాలంటే వేలం నిర్వహణ తప్పనిసరి. పర్సులో అధిక మొత్తం కలిగిన ఫ్రాంఛైజీలు తొలుత టాప్ ప్లేయర్లందరినీ సొంతం చేసుకుంటే.. మిగతా ఫ్రాంఛైజీల జట్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.అందుకే వేలం ద్వారానే ఆటగాళ్లను సొంతం చేసుకోవడం జరుగుతుంది. అయితే, ట్రేడింగ్ ద్వారా వేలానికి ముందు ఆటగాళ్లను మార్చుకునే వెసలుబాటు కూడా ఉంటుంది.ఐపీఎల్ వేలంలోకి ఆటగాళ్లు ఎలా వస్తారు?తమ దేశ క్రికెట్ బోర్డుల అనుమతితో ఆయా దేశాల ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో కనీస ధరతో తమ పేరును నమోదు చేసుకుంటారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు తమకు ఆసక్తి ఉన్న ప్లేయర్ల జాబితాను సమర్పించిన తర్వాత.. అధికారికంగా ఆటగాళ్లు వేలం బరిలో నిలుస్తారు. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఆక్షన్ పూల్లోకి రాలేరు.కనీస ధర అంటే ఏమిటి?ఓ ఆటగాడు తన స్థాయికి తగిన రీతిలో కనీస ధరతో వేలంలో నమోదు చేసుకుంటాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లు సాధారణంగా రూ. 20 లక్షలతో వేలంలోకి వస్తారు.నిజానికి వేలంలో వివిధ స్లాబులు ఉంటాయి. అయితే, కనీస ధర ఎక్కువగా ఉన్న ఆటగాళ్లు (సాధారణంగా రూ. 2 కోట్లతో స్టార్లు మాత్రమే ఉంటారు) సెలక్షన్ గ్యారెంటీ అనేమీ ఉండదు. ఫామ్ దృష్ట్యా ఫ్రాంఛైజీలు ఒక్కోసారి కనీస ధర అత్యంత తక్కువగా ఉన్న ఆటగాళ్లను కూడా కొనుగోలు చేస్తాయి.అదే విధంగా తమ జట్టుకు అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తాయి. అంతేకాదు ఆటగాడి వయసు కూడా ఇక్కడ కీలకమే.బిడ్డింగ్ వర్క్ ఎలా జరుగుతుంది?ఆక్షనీర్ ఆటగాడి పేరు చదవగానే.. సదరు ప్లేయర్పై ఆసక్తి ఉన్న ఫ్రాంఛైజీలు తమ పెడల్స్ను ఎత్తుతాయి. ఆటగాడిని దక్కించుకోవాలని భావిస్తే ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడుతూ ధరను పెంచుతూ పోతాయి. ఆఖరికి మిగతా వారితో పోలిస్తే అధిక ధర పలికిన ఫ్రాంఛైజీకే ప్లేయర్ దక్కుతాడు.పర్సు విలువ సమానమేనా?లీగ్లోని ప్రతి ఫ్రాంఛైజీ పర్సు విలువ సమానంగానే ఉంటుంది. తమకు కేటాయించిన మొత్తం నుంచే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అదే విధంగా విదేశీ ప్లేయర్ల సంఖ్యకు కూడా ఓ పరిమితి ఉంటుంది.రిటెన్షన్, రిలీజ్లు!వేలానికి ముందు తాము అట్టిపెట్టుకోవాలనుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు నిర్ణీత గడువులోగా సమర్పిస్తాయి. అదే విధంగా.. తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదులుతాయి. ఈ క్రమంలో పర్సులో మిగిలిన మొత్తం ఆధారంగా వేలంలో తమ వ్యూహాలను అమలు చేస్తాయి.అయితే, రిలీజ్ చేసిన ఆటగాడిని తిరిగి దక్కించుకునేందుకు రైట్ టు మ్యాచ్ (RTM) నిబంధన ద్వారా ఫ్రాంఛైజీలకు వెసలుబాటు ఉంటుంది. అంటే.. తాము వదిలేసిన ఆటగాడు సరసమైన ధరకే తిరిగి తమకు దొరికే క్రమంలో.. ఇతర ఫ్రాంఛైజీ ఎంత మొత్తమైతే చెల్లిస్తుందో అదే ధరకు అతడిని తిరిగి తాము కొనుగోలు చేసుకోవచ్చు.మినీ వేలం అంటే?జట్లలో స్వల్ప మార్పుల నిమిత్తం నిర్వహించేదే మినీ వేలం. రీషఫిల్లో భాగంగా ఫ్రాంఛైజీలు డెత్ ఓవర్ బౌలర్లు, పవర్ హిట్టర్లు, మణికట్టు స్పిన్నర్లు.. వంటి కచ్చితమైన నైపుణ్యాలున్న కొంతమంది ఆటగాళ్ల కోసం పోటీపడతాయి.అన్క్యాప్డ్ ప్లేయర్లకు కూడా భారీ మొత్తం ఎలా?అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉండి.. తమ జట్టులో ఇమిడిపోతాడనుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్లను సైతం ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించేందుకు వెనుకాడవు. ముఖ్యంగా ఇలాంటి యువ ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తాయి. తద్వారా వారిని తమ జట్టులో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం భాగం చేసుకునే వీలు కలుగుతుంది. ఇందుకు రాజస్తాన్ రాయల్స్ గతేడాది మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీ అనే పద్నాలుగేళ్ల పిల్లాడిని రూ. 1.10 కోట్లకు కొనడం నిదర్శనం. అందుకు తగ్గట్లే విధ్వంసకర శతకంతో ఈ చిచ్చరపిడుగు సత్తా చాటాడు.అమ్ముడుపోకుండా ఉంటారెందుకు?ఫామ్లేమి, ఆటలో నిలకడలేకపోడం.. కనీస ధర అర్హత కంటే అధికంగా ఉందని ఫ్రాంఛైజీలు భావించడం వల్ల కొంతమంది ఆటగాళ్లు అమ్ముడుపోకుండా మిగిలిపోతారు. ఆటగాడి వయసు, వర్క్లోడ్ మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్ల కొనుగోలు అంశాన్ని ప్రభావితం చేశాయి.మరి ఆ ఆటగాడి పరిస్థితి ఏమిటి?తొలి రౌండ్లలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన ఆటగాడు.. ఫ్రాంఛైజీల ఆసక్తి దృష్ట్యా తదుపరి ఆక్సిలెరేటెడ్ రౌండ్లో వేలంలోకి వస్తారు. అప్పటికీ అమ్ముడుపోకుండా ఉంటే.. ఎవరైనా ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో వీరిని ఏ ఫ్రాంఛైజీ అయినా రీప్లేస్మెంట్గా తీసుకుంటుంది. అదీ జరగదలేదంటే.. ఆసారికి సదరు ప్లేయర్ ఐపీఎల్లో భాగం కాడు.ఇక ఐపీఎల్ మ్యాచ్లకు ఎంత క్రేజ్ ఉందో.. వేలానికి కూడా అంతే ఆదరణ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన ఆటగాడు, జట్ల కూర్పు తదితర అంశాల దృష్ట్యా క్రికెట్ ప్రేమికులు వేలం పూర్తయ్యేవరకు స్క్రీన్లకే అతుక్కుపోతారనడంలో అతిశయోక్తిలేదు.చదవండి: IPL 2026 Auction: ఐపీఎల్ వేలంలో మనోళ్లు 17 మంది.. అదృష్టం వరించేనా -
IPL 2026: రచిన్కు షాక్.. అత్యధిక ధర పలికింది వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలానికి రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా మంగళవారం ఆక్షన్ జరుగనుంది. ఈ నేపథ్యంలో బ్రాడ్కాస్టర్ జియోస్టార్ సోమవారం మాక్ వేలం (Mock Auction) నిర్వహించగా.. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డు ధర పలికాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున మాక్ వేలంలో పాల్గొన్న రాబిన్ ఊతప్ప గ్రీన్ కోసం ఏకంగా రూ. 30.50 కోట్లు వెచ్చించాడు.అతడికి కళ్లు చెదిరే మొత్తంఅదే విధంగా.. ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 19 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఐపీఎల్-2025లో పేలవ ప్రదర్శన కారణంగా లివింగ్స్టోన్ను ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) వదిలేసిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా ఆటగాళ్లలో పృథ్వీ షా నామమాత్రపు ధరకు అమ్ముడుపోగా.. రాహుల్ చహర్ (Rahul Chahar)కు కళ్లు చెదిరే మొత్తం దక్కింది.భారత స్పిన్నర్ రవి బిష్ణోయి కూడా భారీ ధర దక్కించుకున్నాడు. మరి వీరందరితో పాటు మాక్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు, అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా!మాక్ వేలంలో అమ్ముడు పోయిన ఆటగాళ్లు💰కామెరాన్ గ్రీన్- రూ. 30.50 కోట్లు- కోల్కతా నైట్ రైడర్స్💰పృథ్వీ షా- రూ. 2.75 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్💰వెంకటేశ్ అయ్యర్- రూ. 6 కోట్లు- ఆర్సీబీ 💰సర్ఫరాజ్ ఖాన్- రూ. 7 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్ 💰లియామ్ లివింగ్స్టోన్- రూ. 19 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్💰మతీశ పతిరణ- రూ. 13 కోట్లు- కోల్కతా నైట్ రైడర్స్💰రవి బిష్ణోయి- రూ. 11.50 కోట్లు- రాజస్తాన్ రాయల్స్💰రాహుల్ చహర్- రూ. 10 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్💰గెరాల్డ్ కోయెట్జి- రూ. 8 కోట్లు- సన్రైజర్స్ హైదరాబాద్💰అన్రిచ్ నోర్జే- రూ. 7.50 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్💰డేవిడ్ మిల్లర్- రూ. 9.50 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్💰లుంగి ఎంగిడి- రూ. 6.50 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్💰ఆకాశ్ దీప్- రూ. 5 కోట్లు- సన్రైజర్స్ హైదరాబాద్💰చేతన్ సకారియా- రూ. 6.5 కోట్లు- గుజరాత్ టైటాన్స్💰జానీ బెయిర్ స్టో- రూ. 2.5 కోట్లు- కోల్కతా నైట్ రైడర్స్💰జేక్ ఫ్రేజర్-మెగర్క్- రూ. 2 కోట్లు- పంజాబ్ కింగ్స్💰వనిందు హసరంగ- రూ. 2 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్💰జేమీ స్మిత్- రూ. 2 కోట్లు- గుజరాత్ టైటాన్స్💰విజయ్ శంకర్- రూ. 2 కోట్లు- గుజరాత్ టైటాన్స్💰డారిల్ మిచెల్- రూ. 2 కోట్లు- గుజరాత్ టైటాన్స్💰క్వింటన్ డికాక్- రూ. కోటి- ఢిల్లీ క్యాపిటల్స్💰మహీశ్ తీక్షణ- రూ. 2 కోట్లు- సన్రైజర్స్ హైదరాబాద్💰రాహుల్ త్రిపాఠి- రూ. 75 లక్షలు- కోల్కతా నైట్ రైడర్స్💰శివం మావి- రూ. 2.50 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్మాక్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరేబెన్ డకెట్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేకాగా మాక్ వేలంలో కేకేఆర్ తరఫున ఊతప్ప, సన్రైజర్స్ తరఫున ఎస్.బద్రీనాథ్, చెన్నై తరఫున సురేశ్ రైనా, ఆర్సీబీ తరఫున అనిల్ కుంబ్లే, గుజరాత్ తరఫున ఛతేశ్వర్ పుజారా, ముంబై ఇండియన్స్ తరఫున అభినవ్ ముకుంద్, ఢిల్లీ తరఫున మొహమ్మద్ కైఫ్, లక్నో తరఫున ఇర్ఫాన్ పఠాన్, పంజాబ్ తరఫున సంజయ్ బంగర్, రాజస్తాన్ తరఫున ఆకాశ్ చోప్రా పాల్గొన్నారు.చదవండి: IND vs SA: అక్షర్ పటేల్ స్థానంలో అతడే.. బీసీసీఐ ప్రకటన -
నేడు ఐపీఎల్–2026 ‘మినీ’ వేలం.. 77 స్థానాలు.. 359 మంది ఆటగాళ్లు
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2026కు సంబంధించి మినీ వేలానికి రంగం సిద్ధమైంది. తమ జట్టులో మిగిలిన స్థానాలు పూరించుకునేందుకు లీగ్లో 10 జట్లు పోటీ పడనున్నాయి. అబుదాబి వేదికగా నేడు జరిగే ఈ వేలంలో మొత్తం 77 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 359 క్రికెటర్లు వేలానికి అందుబాటులో ఉండగా... ఖాళీల్లో గరిష్టంగా 31 మంది విదేశీ ఆటగాళ్ళను తీసుకునేందుకు అవకాశం ఉంది. వేలం మంగళవారం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. అన్ని జట్లలోకి గరిష్టంగా కోల్కతా నైట్రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉండగా, వారికే అందరికంటే ఎక్కువగా 13 మంది ఆటగాళ్ల అవసరం ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో 10 ఖాళీలు ఉండగా, చేతిలో మొత్తం రూ. 25.50 కోట్లు ఉన్నాయి. అత్యధిక కనీస ధర రూ.2 కోట్లతో ఏకంగా 40 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఎంత మంది విలువ పైపైకి వెళుతుందనేది ఆసక్తికరం. అయితే విదేశీ ఆటగాడికి ఎవరికైనా గరిష్టంగా రూ. 18 కోట్లు మాత్రమే దక్కుతాయి. వేలంలో అంతకంటే ఎక్కువ మొత్తానికి అతడిని సొంతం చేసుకున్నా... ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల గరిష్ట రిటెన్షన్ విలువ (రూ.18 కోట్లు), మెగా వేలంలో ఒక ఆటగాడికి దక్కిన మొత్తం (పంత్కు రూ. 27 కోట్లు)కంటే ఇది ఎక్కువగా ఉండరాదు. వేలంలో అంతకంటే ఎక్కువగా వచ్చినా మిగిలిన మొత్తం బీసీసీఐకే వెళుతుంది. గ్రీన్పై భారీ అంచనాలు! మినీ వేలంలో కొందరు ఆటగాళ్లపై ప్రధానంగా అందరి దృష్టీ నిలిచింది. ఆ్రస్టేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్కు అందరికంటే ఎక్కువ విలువ పలికే అవకాశం కనిపిస్తోంది. 2023లో ముంబై ఇండియన్స్ తరఫున చక్కటి ప్రదర్శన కనబర్చిన గ్రీన్... 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఫర్వాలేదనిపించాడు. గాయం కారణంగా గత సీజన్కు అతను దూరమయ్యాడు. రసెల్ రిటైర్ రావడంతో కేకేఆర్కు అలాంటి ఆటగాడి అవసరం ఉండగా, మిడిలార్డర్లో ఆల్రౌండర్ కోసం చెన్నై చూస్తోంది. భారీ హిట్టర్, గత ఏడాది ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన లివింగ్స్టోన్ కూడా ఎక్కువ మొత్తం ఆకర్షించవచ్చు. ఇతర విదేశీ ఆటగాళ్లలో డికాక్, పతిరణ, జేమీ స్మిత్పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నారు. కాన్వే, మిల్లర్, హసరంగ, ముల్డర్, నోర్జే తదితరులు కూడా వేలంలో అందుబాటులో ఉన్నారు. భారత క్రికెటర్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పెద్ద మొత్తం అందుకోవచ్చు. వెంకటేశ్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, ఆకాశ్దీప్, రాహుల్ చహర్ తదితరులు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాది వరకు ఐపీఎల్లో తమదైన ముద్ర వేసిన మ్యాక్స్వెల్, డుప్లెసిస్ ఈసారి వేలానికి అందుబాటులోకి లేకపోగా, రసెల్ ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించాడు. -
IPL 2026: గ్రీన్ ధర రూ. 30.50 కోట్లు.. ఎవరు కొన్నారంటే?
క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంపైనే కేంద్రీకృతమై ఉంది. అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబరు 16) వేలంపాట నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, అంతకంటే ముందు టీమిండియా మాజీ స్టార్లతో బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మాక్ వేలాన్ని నిర్వహించింది.ఆ మాక్ ఆక్షన్లో ముప్పై మంది ప్లేయర్లను వేలం వేయనున్నారు. ఇందులో భాగంగా పది ఫ్రాంఛైజీల తరఫున పది మంది భారత మాజీ క్రికెటర్లు మాక్ వేలంలో పాల్గొన్నారు. వీరిలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహించిన రాబిన్ ఊతప్ప తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. క్లారిటీ ఇచ్చిన గ్రీన్వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green)పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, అతడు పూర్తిస్థాయి బ్యాటర్గా పేరు నమోదు చేసుకోవడం గందరగోళానికి గురిచేసింది. ఈ పేస్ ఆల్రౌండర్ బౌలింగ్ సేవలు అందిస్తాడా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి.ఈ విషయంపై గ్రీన్ ఇటీవల స్వయంగా స్పందించాడు. తాను బౌలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని.. తన మేనేజర్ తప్పిదం వల్లే అనుకోకుండా ప్యూర్ బ్యాటర్ బ్యాక్స్ టిక్ చేసినట్లు ఉన్నారని తెలిపాడు. ఈ నేపథ్యంలో మాక్ వేలంలో గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సురేశ్ రైనా, కోల్కతా తరఫున రాబిన్ ఊతప్ప పోటీపడ్డారు.రూ. 30.50 కోట్ల భారీ ధరతోఈ క్రమంలో గ్రీన్ ధర ఏకంగా రూ. 27 కోట్లు దాటింది. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్లు రైనా, ఊతప్ప పట్టువీడలేదు. ఏకంగా రూ. 30.50 కోట్ల భారీ ధరతో గ్రీన్ను కొనుగోలు చేశాడు ఊతప్ప. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. గతేడాది మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ను రూ. 27 కోట్ల అసలైన ధరకు కొనుక్కుంది.ఇక ఈ మాక్ వేలంలో ఊతప్ప గ్రీన్కు ఈ మేర.. పర్సులో దాదాపు సగం మొత్తం గ్రీన్ కోసం కేటాయించడం విశేషంగా నిలిచింది. ఇక గ్రీన్తో పాటు జానీ బెయిర్ స్టో (రూ. 2.5 కోట్లు)ను కూడా కొనుగోలు చేసిన ఊతప్ప.. శ్రీలంక యువ పేసర్, చెన్నై మాజీ బౌలర్ మతీశ పతిరణ కోసం ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించాడు.అత్యధికంగా రూ. 64.3 కోట్లుకాగా ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు)ల రూపంలో ఖరీదైన ఆటగాళ్లను వదిలేసింది. ఈ క్రమంలో కేకేఆర్ పర్సులో అత్యధికంగా రూ. 64.3 కోట్లు చేరింది. అయితే, మాక్ వేలంలో ఒక్క గ్రీన్ కోసమే ఊతప్ప రూ. 30 కోట్లు వెచ్చించడం విశేషం. రసెల్ రిటైర్మెంట్తో ఏర్పడిన ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసే సరైన ఆప్షన్ అని భావించే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కేకేఆర్లో మొత్తంగా 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చదవండి: Ashes: మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
శతక్కొట్టిన యశస్వి జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 సూపర్ లీగ్ మ్యాచ్లో ముంబై అదరగొట్టింది. హర్యానా విధించిన 235 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్మని ఊదేసింది. దేశీ టీ20 టోర్నమెంట్ సూపర్ లీగ్లోని గ్రూప్-బిలో భాగంగా పుణెలోని డీవై పాటిల్ అకాడమీలో ముంబై- హర్యానా జట్లు ఆదివారం తలపడ్డాయి. 234 పరుగులుటాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. హర్యానా బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 234 పరుగులు స్కోరు చేసింది.ఓపెనర్లలో కెప్టెన్ అంకిత్ కుమార్ (42 బంతుల్లో 89) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటగా.. వన్డౌన్ బ్యాటర్ నిశాంత్ సంధు (38 బంతుల్లో 63 నాటౌట్) ధనాధన్ దంచికొట్టాడు. మిగిలిన వారిలో సమంత్ జేఖర్ (14 బంతుల్లో 31 రిటైర్డ్ అవుట్), సుమిత్ కుమార్ (4 బంతుల్లో 16 నాటౌట్) మెరుపులు మెరిపించారు.శతక్కొట్టిన జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్ఇక హర్యానాకు ధీటుగా బదులిచ్చే క్రమంలో ముంబై ఓపెనర్, టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శతక్కొట్టాడు. కేవలం యాభై బంతుల్లోనే ఏకంగా 16 ఫోర్లు, ఒక సిక్స్బాది 101 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ అజింక్య రహానే (10 బంతులల్లో 21) ఫర్వాలేదనిపించగా.. మూడో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan) అదరగొట్టాడు.కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన సర్ఫరాజ్.. మొత్తంగా 25 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2026 వేలానికి ముందు ఈ మేరకు సత్తా చాటి.. తానూ రేసులోనే ఉన్నానంటూ ఫ్రాంఛైజీలకు మరోసారి సందేశం ఇచ్చాడు.17.3 ఓవర్లలోనే ఇక మిగిలిన ముంబై ఆటగాళ్లలో అంగ్క్రిష్ రఘువన్షీ (7), సూయాంశ్ షెడ్గే (13), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (2) విఫలం కాగా.. సాయిరాజ్ పాటిల్ (3 బంతుల్లో 8), అథర్వ అంకోలేకర్ (2 బంతుల్లో 10) మెరుపులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. జైసూ, సర్ఫరాజ్ దంచికొట్టగా.. వీరిద్దరు ఆఖర్లో వేగంగా ఆడటంతో 17.3 ఓవర్లలోనే హర్యానా విధించిన లక్ష్యాన్ని ముంబై ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. యశస్వి జైస్వాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: IND Vs PAK: పాక్తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ అట్టర్ఫ్లాప్ -
IPL 2026: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ బౌలర్ల మీదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 వేలంలో దేశీ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, రవి బిష్ణోయి, సర్ఫరాజ్ ఖాన్ తదితరులు ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా.. పాటు విదేశీ ప్లేయర్లు కామెరాన్ గ్రీన్, క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ వంటి వారు హైలైట్ కానున్నారు. స్టార్లను మినహాయించితే ఈ ఐదుగురు భారత అన్క్యాప్డ్ బౌలర్లు కూడా ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది.ఆకిబ్ నబీజమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ. అనుభవం, నైపుణ్యాలు కలిగిన ఈ ఫాస్ట్బౌలర్ కోసం ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపడం ఖాయం. తాజా దేశీ సీజన్లలో అతడు అద్భుత ప్రదర్శన కనబరచడం ఇందుకు కారణం. 2025-26 రంజీ సీజన్లో అదరగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దుమ్ములేపాడు.ఈ సీజన్లో ఏడు మ్యాచ్లు 15 వికెట్లు కూల్చిన ఆకిబ్.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు.. మధ్యప్రదేశ్తో మ్యాచ్లో బ్యాట్తోనూ సత్తా చాటాడు. వేలానికి ముందు అతడి ఈ అత్యుత్తమ ప్రదర్శన ఫ్రాంఛైజీలను ఊరిస్తోంది.ఈడెన్ ఆపిల్ టామ్కేరళకు చెందిన తాజా బౌలింగ్ సంచలనం ఈడెన్ ఆపిల్ టామ్. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటికి ఆడిన ఏడు మ్యాచ్లలో రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు 20 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్. తాజా రంజీ సీజన్లో మధ్యప్రదేశ్పై (4/55 & 2/33) ఉత్తమ గణాంఖాలు నమోదు చేశాడు.ఇక మొత్తంగా ఏడు ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో కలిపి 19 వికెట్లు కూల్చాడు ఆపిల్. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడికి అనుభవం లేదు. అయినప్పటికీ అతడి నైపుణ్యాల కారణంగా కనీస ధర రూ. 20లక్షలకైనా అమ్ముడుపోయే అవకాశం ఉంది.రాజ్ లింబానిఅండర్-19 వరల్డ్కప్లో ఫైనల్ చేరిన భారత జట్టులో రాజ్ లింబాని సభ్యుడు. 2024లో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం పేసర్.. ఇప్పటికి 11 మ్యాచ్లలో కలిపి 16 వికెట్లు కూల్చాడు. కొత్త బంతితో అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో అతడు అదరగొట్టాడు. డెత్ ఓవర్లలోనూ తనదైన శైలిలో రాణించాడు.ఆకాశ్ మధ్వాల్2023లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు ఆకాశ్ మధ్వాల్. ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్ ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటాడు. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్కు మారి అక్కడా తనను తాను నిరూపించుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్లో 17 మ్యాచ్లు ఆడి 23 వికెట్లు తీశాడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో ఈ యార్కర్ల కింగ్ పెద్దగా సత్తా చాటలేకపోయాడు. ఉత్తరాఖండ్ తరపున ఆరు మ్యాచ్లలో మూడు వికెట్లే తీశాడు. అయితే, అతడి అనుభవం దృష్ట్యా ఈసారి మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది.అశోక్ శర్మసయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో రాజస్తాన్ తరఫున సత్తా చాటుతున్నాడు అశోక్ శర్మ. ఇప్పటికి ఏడు మ్యాచ్లలో కలిపి ఏకంగా 19 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లకు నెట్బౌలర్గా పనిచేసిన అశోక్ శర్మ ఈసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు. -
IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ తన విషయంలో స్పష్టత ఇచ్చాడు. ఈసారి క్యాష్ రిచ్ లీగ్లో తాను బౌలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తన మేనేజర్ తప్పిదం వల్లే రిజిస్ట్రేషన్ విషయంలో తప్పు జరిగి ఉండవచ్చని పేర్కొన్నాడు.110 మంది విదేశీ ప్లేయర్లు అబుదాబి వేదికగా డిసెంబరు 16 (మంగళవారం)న మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. మొత్తంగా ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఇందులో 240 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 110 మంది విదేశీ ప్లేయర్లు ఇందులో ఉన్నారు.అయితే, ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) ఈసారి పూర్తిస్థాయి బ్యాటర్ స్లాట్లో తన పేరును నమోదు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో ప్యూర్ బ్యాటర్ స్లాట్లో సెట్ 1లోనే అతడు వేలంలోకి రానున్నాడు. దీంతో గ్రీన్ ఈ సీజన్లో బౌలింగ్ చేయడేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఇది అతడి ధరపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..ఈ నేపథ్యంలో కామెరాన్ గ్రీన్ తన పేరు బ్యాటర్గా మాత్రమే నమోదు కావడంపై స్పందించాడు. యాషెస్ సిరీస్ (Ashes Series)లో భాగంగా అడిలైడ్లో మూడో టెస్టుకు ముందు రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ‘‘నేను బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నన్ను బ్యాటర్గా మాత్రమే రిజిస్టర్ చేశారన్న విషయం మా మేనేజర్కు తెలిసే ఉండదు.పొరపాటున అతడు తప్పుడు ఆప్షన్ ఎంపిక చేసి ఉంటాడు. ఇదెలా జరిగిందో తెలియదు’’ అని గ్రీన్ చెప్పుకొచ్చాడు. కాగా 2023లో రూ. 17.50 కోట్ల ధరతో ఐపీఎల్లో అడుగుపెట్టిన గ్రీన్.. ముంబై ఇండియన్స్ తరఫున 452 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు.గ్రీన్పై భారీ అంచనాలుఈ క్రమంలో 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ పేస్ ఆల్రౌండర్ను ట్రేడ్ చేసుకోగా.. 255 రన్స్ రాబట్టడంతో పాటు.. 10 వికెట్లు కూల్చాడు. అయితే, 2025లో గ్రీన్ గాయపడటంతో ఈ సీజన్లో ఆడలేకపోయాడు. ఈసారి మాత్రం ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లలో ఒకడిగా గ్రీన్పై భారీ అంచనాలు ఉన్నాయి.చదవండి: ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు రెడీ: తిలక్ వర్మ


