breaking news
Divvala Madhuri
-
Bigg Boss 9 : నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది.. మాధురి కామెంట్స్
ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా.. అని ఓ సినిమాలో మహేశ్బాబు చెప్పిన డైలాగ్ ఇప్పుడు దివ్వెల మాధురికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. బిగ్బాస్(Bigg Boss 9 Telugu) హౌస్లోకి ఎప్పుడొచ్చాం..ఎప్పుడు పోయామని కాదు.. మనదైన ముద్ర వేశామా లేదా అనేది ముఖ్యం. ఆ విషయంలో మాధురి సక్సెస్ అయినట్లే. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆలస్యంగా హౌస్లోకి వెళ్లి.. మూడు వారాలకే బయటకు వచ్చినా.. తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఫైర్బ్రాండ్గానే హౌస్లోకి వెళ్లి..ఆట కూడా అలాగే ఆడింది. గొడవలు, అరుపులతో కావాల్సినంత కంటెంట్ ఇవ్వడమే కాదు..టాస్కులు కూడా బాగానే ఆడింది. కానీ మూడోవారం ఓటింగ్ తక్కువ రావడంతో ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.తాను కావాలనుకొనే బయటకు వచ్చానని మాధురి చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే బిగ్బాస్ షో ద్వారా మాధురి భారీగానే సంపాదించిదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మూడు వారాలకు గాను ఏకంగా రూ. 9లక్షల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు.డబ్బుల కోసం వెళ్లలేదు.. బిగ్బాస్ షోకి చాలామంది ఫేమ్ కోసమో లేదా మనీ కోసం వెళ్తుంటారు. కానీ మాధురి మాత్రం ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్లారట. డబ్బుల కోసం అయితే తాను బిగ్బాస్ షోకి వెళ్లలేదని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పైవిధంగా చెప్పింది. ‘నేను డబ్బులకు టెంప్ట్ అయి బిగ్బాస్ షోకి వెళ్లలేదు. నాకు బయటే రోజు 2-3 లక్షలు వస్తాయి. బిగ్బాస్ షో మొత్తం ఆడితే కోటి వరకు వస్తాయేమో కానీ..నేను నెలకే రూ. కోటి సంపాదిస్తాను. అసలు నేను రెమ్యూనరేషన్ విషయంలో డిమాండే చేయలేదు. దేవుడిచ్చిన వరకూ మాకు డబ్బులు బానే ఉన్నాయి.. ఫేమ్ కూడా బానే ఉంది.. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి.. లైఫ్లో ఇది కూడా ఒక అవకాశం వచ్చిందని వెళ్లా’ అని మాధురి చెప్పింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. -
బిగ్బాస్లో పిక్నిక్ పూర్తి.. దువ్వాడ కోసమే బయటకు! ఏమన్న ప్లానా?
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) నుంచి ఎలిమినేట్ అయితే ఎవరైనా బాధపడతారు. కానీ మాధురి మాత్రం సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నవంబర్ 4న ఆమె పార్ట్నర్ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజట! ఆయన పుట్టినరోజునాడు పక్కనలేకపోతే ఏం బాగుంటుంది? అందుకే.. అలా పిక్నిక్కు వెళ్లినట్లు బిగ్బాస్కు వెళ్లి ఇలా బర్త్డే సమయానికి బయటకు వచ్చేసింది. బిగ్బాస్ బజ్లో కూడా అదే విషయాన్ని నొక్కి చెప్తోంది.ఎంట్రీ, ఎలిమినేషన్ అంతా మాధురి చేతిలోనే..తాజాగా రిలీజైన బిగ్బాస్ బజ్ ప్రోమోలో యాంకర్ శివాజీ మాట్లాడుతూ.. 100% తెలుగు ఇళ్లలోకి వెళ్లాలనుకున్నారు. నిజంగా వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు? అని ముఖం మీదే అడిగేశాడు. అందుకు మాధురి (Divvala Madhuri).. నేను రావాలనుకున్నాను, కాబట్టే బయటకు వచ్చాను. నాకు యాక్టింగ్ రాదు, మాస్కులు లేనే లేవు, నేను బయట ఎలా ఉన్నానో లోపల కూడా అలాగే ఉన్నాను. బిగ్బాస్కు వెళ్లాలనుకున్నాను కాబట్టి వెళ్లాను, రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను అని చాలా క్లారిటీగా బదులిచ్చింది.భయం నా బ్లడ్డులోనే లేదుఒకానొక దశలో శ్రీజకు భయపడినట్లు అనిపించింది అని శివాజీ అడగ్గా.. భయమనేది నా బ్లడ్డులోనే లేదని మాధురి డైలాగ్ పేల్చింది. మీరు తోపు అని ఎవరూ అనలేదంటూ శివాజీ కూడా ఆమెకు కౌంటరిచ్చాడు. మాధురి బిగ్బాస్ నుంచి వచ్చేముందు కూడా నాగార్జునతో నవంబర్ 4న మా ఆయన బర్త్డే.. ఆ పుట్టినరోజుకల్లా రావాలనుకున్నాను, వచ్చేశాను అన్నట్లుగా మాట్లాడింది. ఇప్పుడీ బజ్ ప్రోమో చూస్తుంటే మాధురి పిక్నిక్కు వెళ్లినట్లే కనిపిస్తోంది. మూడు వారాలు హౌస్లో ఉన్న మాధురితనపై ఉన్న నెగెటివిటీ పోగొట్టుకోవడానికి బిగ్బాస్ను ఎంచుకుంది. అక్టోబర్ 12 వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్లో లేదు. రెండో వారం తననెవరూ నామినేట్ చేయలేదు. కానీ ఆ వారంలో ఆమె రీతూను బండకేసి కొడ్తా.. జుట్టుపట్టుకుని ఈడ్చి కొడ్తా.. అంటూ హద్దులు మీరి మాట్లాడింది. హౌస్మేట్స్ కూడా ఫేక్ బాండ్స్, ఇన్సెక్యూర్ అంటూ ఆమె మెడలో ఎక్కువ బోర్డులు వేశారు. దీంతో తనకు డైరెక్ట్ నామినేషన్ అనే పనిష్మెంట్ ఇచ్చింది తనూజ. పిక్నిక్ పూర్తయిందిమాధురి కూడా ఇదే కోరుకుంది. అందుకే తనూజ దగ్గర గోల్డెన్ బజర్ ఉన్నప్పటికీ దాన్ని తనకోసం వాడొద్దని మరీమరీ చెప్పింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం భర్త/ పార్ట్నర్ బర్త్డే సమయానికి బయటకు వచ్చేసింది. ఆమె అరుపులు, కేకలు, హద్దులు మీరి మాట్లాడటం చాలామందికి చిరాకు పుట్టించింది. అదే సమయంలో ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నదున్నట్లు చెప్పడంతో తనపై పాజిటివిటీ కూడా వచ్చింది. మొత్తానికి మాధురి ఎలిమినేషన్కు పెద్దగా కారణాలంటూ ఏమీ లేదు. తనే వచ్చింది.. తనే దర్జాగా వెళ్లిపోయింది.చదవండి: తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్తో మాధురి కంటతడి -
తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్తో మాధురి కంటతడి
సరిపోదా శనివారం అన్నట్లు నాగార్జున.. తనూజకు ఒక్కదానికే స్పెషల్గా సండేరోజు క్లాస్ పీకారు. దాన్ని క్లాస్ పీకడం అని కూడా అనరు. ఎక్కువగా కోప్పడకు, చెప్పే విధానం మార్చుకో, సహనంగా ఉండటానికి ప్రయత్నించు అని తనూజను బుజ్జగించినట్లే ఉంది. ఎలిమినేషన్ను మలుపు తిప్పే అస్త్రం తనూజ దగ్గర ఉన్నప్పటికీ దాన్ని వాడకుండా భద్రంగా కాపాడుకుంది. మరి ఆదివారం (నవంబర్ 2వ) ఎపిసోడ్లో ఏం జరిగాయో చూసేద్దాం..పర్ఫామెన్స్ ఇరగదీశారుది గర్ల్ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రష్మిక, దీక్షిత్ శెట్టి బిగ్బాస్ షోకి వచ్చారు. వీళ్ల ఎదుటే హౌస్మేట్స్తో కొన్ని సీన్స్ రీక్రియేట్ చేయించారు. వాళ్ల యాక్టింగ్ చూసి రష్మిక కొన్నిసార్లు నోరెళ్లబెట్టేసింది. యాక్టింగ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇమ్మాన్యుయేల్ ఎగరేసుకుపోయాడు. ఇక నామినేషన్స్లో ఉన్న అందరినీ నాగార్జున సేవ్ చేసుకుంటూ రాగా చివరకు గౌరవ్, మాధురి మిగిలారు. గౌరవ్, మాధురి.. ఇద్దర్నీ గేటు బయటకు తీసుకొచ్చాక హౌస్మేట్స్తో ఓ విషయం చెప్పాడు నాగ్. కాళ్లు పట్టుకున్న రాముఓట్ల పరంగా మాధురి చిట్టచివరి స్థానంలో ఉందన్నాడు. అయితే తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడని వెల్లడించాడు. అప్పటికే గౌరవ్ను నామినేట్ చేసి కుంగిపోతున్న రాము.. అతడ్ని కాపాడమని తనూజ కాళ్లావేళ్లా పడ్డాడు. చివరకు తనూజ గోల్డెన్ బజర్ ఉపయోగించకపోయేసరికి మాధురి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి గౌరవ్ను ఇంట్లోకి పంపారు. ఈ సంతోషం పట్టలేక రాము.. తనూజ కాళ్లు మొక్కడం గమనార్హం. మాధురి సంతోషంగానే బయటకు వచ్చేసింది.నా బంగారం తనూజ: మాధురిఎలిమినేట్ అవుతారనుకున్నారా? అని నాగ్ అడగ్గా.. బయటకు రావాలనే కోరుకున్నా.. ఎందుకంటే నవంబర్ 4న మా ఆయన బర్త్డే సార్.. అంటూ మాధురి అసలు విషయం చెప్పింది. తన ఏవీ చూసుకుని లైఫ్లాంగ్ మెమొరీ అని ఎమోషనలైంది. ముగ్గురికి గులాబీలు, ముగ్గురికి ముళ్లు ఇవ్వమని మాధురికి టాస్క్ ఇచ్చారు. మొదటి గులాబీ.. నా బంగారం తనూజకి ఇస్తా.. తను చాలా స్వీట్, నేను బయట ఉన్నప్పుడు తనూజ మాస్క్తో ఆడుతుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుందన్నారు. అంతా అబద్ధం, తను తనలాగే ఉంది అని కంటతడి పెట్టుకుంది. డిమాన్ పవన్, పవన్ కల్యాణ్కు సైతం రోజాలు ఇచ్చింది.100%ఫేక్ముళ్ల గురించి అడగ్గానే మొదటిది భరణికి ఇస్తానంది. 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి గారే.. హౌస్లో ఉండటానికి తనకు అర్హత లేదు అని కుండబద్ధలు కొట్టి చెప్పింది. దివ్య కూడా అంతే.. తన గేమ్ కంటే పక్కవాళ్ల గేమ్పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. వాళ్ల గొంతు కూడా తనే అయిపోతుంది. అవి తగ్గించుకుని ఆడితే బెటర్ అని పేర్కొంది. వెళ్లిపోయేముందు.. తనూజ, నేనొక్కటే కోరుకుంటున్నా.. నువ్వు స్ట్రాంగ్గా, నవ్వుతూ ఉండాలి. విన్నర్గా చూడాలి.. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే అని చెప్పి వీడ్కోలు తీసుకుంది.చదవండి: బిగ్బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్ -
బిగ్బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu) నుంచి 8వ వారంలో మాధురి ( Madhuri) ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అందరికంటే ఆమెకు తక్కువ రావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. నామినేషన్స్లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. అయితే, వీరిలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్ మధ్య లాస్ట్ వరకు గట్టి పోటీ నెలకొంది.. కానీ, ఫైనల్గా మాధురి ఎలిమినేట్ అయ్యారు. అయితే, బిగ్బాస్ నుంచి మాధురికి భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది.సేవా కార్యక్రమాలకు రెమ్యునరేషన్బిగ్ బాస్ హౌస్లో మాధురి కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు. కానీ, చాలా బలంగానే తన మార్క్ వేశారు. అసలైన ఫైర్ బ్రాండ్గా హౌస్లో పేరు పొందారు. తన మాటలతో పాటు ఆటలోనూ సత్తా చాటారు. మాధురికి ఉన్న ఇమేజ్ వల్ల బిగ్బాస్ కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం మూడు వారాలకే రూ. 9 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఆమె నిలిచారు. అయితే, ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు. వికలాంగులు, క్యాన్సర్ రోగుల కోసం తమ వంతు సాయంగా ఈ డబ్బులు వితరణ చేస్తామన్నారు. ఇదే విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటించారు.మాధురికి హౌస్లోకి వెళ్లక ముందే చాలా ట్రోలింగ్కు గురయ్యారు. తన వ్యక్తిగత కారణాల వల్ల ఆమె చుట్టూ అనేక వివాదాలు ఉండటంతో నెటిజన్లు ఆమెను ఇష్టపడలేదు. ఆమెను ఎందుకు సెలక్ట్ చేశారంటూ బిగ్బాస్ టీమ్ను కూడా తప్పుబట్టారు. అయితే, హౌస్లోకి వచ్చిన తర్వాత ఆమె చాలా ముక్కుసూటి మనిషి అంటూ చాలామంది కామెంట్లు చేయడం విశేషం. తనకు అనిపించిన విషయం ఏదైనా సరే బహిరంగంగానే చెబుతారని పేరు పొందారు. తన గేమ్లో ఎప్పుడూ కూడా నిజాయితీ కోల్పోలేదని చాలామంది కామెంట్ల రూపంలో తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె పట్ల మిశ్రమ స్పందనలు కూడా కనిపించాయి. ఆమె నిజాయితీకి, ధైర్యానికి కొందరు మద్దతు ఇస్తే.. మరికొందరు ఆమె అగ్రెసివ్ తీరు వల్లే బయటకు వచ్చారని అభిప్రాయపడ్డారు. విపరీతమైన నెగటివిటీతో హౌస్లోకి అడుగుపెట్టిన మాధురి.. బిగ్బాస్ షో వల్ల దానిని కాస్త తగ్గించుకున్నారని చెప్పవచ్చు. ఈ సీజన్లో చాలా పాపులర్ కంటెస్టెంట్గా మాధురి పేరు ఎప్పటికీ ఉండిపోయేలా తన గేమ్తో చూపించారని ఎక్కువ మంది చెప్పడం విశేషం.నాకు ముందే తెలుసు: మాధురిహౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అవుతానని తాను ముందే అనుకున్నట్లు స్టేజీపై నాగార్జునతో మాధురి పంచుకున్నారు. నవంబరు 4 తన భర్త పుట్టినరోజు కాబట్టి ఆయన వద్ద ఉండటం తనకు సంతోషంగా ఉందన్నారు. అయితే, తనకు బిగ్బాస్ ఎంతో నేర్పిందని మాధురి పేర్కొన్నారు. హౌస్లో తనకు తనూజ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆమె చాలా స్వీట్ అంటూ కితాబు ఇచ్చారు. తనూజ సీరియల్లో చేసినట్లు నటిస్తోందని అందరూ అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తరువాత కల్యాణ్ ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయతీగా ఆడుతున్నాడని చెప్పిన మాధురి.. డిమోన్ పవన్ కూడా చాలా స్వీట్ అంటూనే మంచి అబ్బాయని పేర్కొన్నారు. హౌస్లో 100శాతం ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి మాత్రమేనని చివరిగా తెలిపారు. -
పవన్కి రెడ్ కార్డ్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?
గతంతో పోలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్బాస్ హౌసులో కాస్త డ్రామా కనిపిస్తోంది. ఈ వారమంతా కూడా భరణి, శ్రీజ మధ్యలో పోటీ పెట్టి రీఎంట్రీ ఎవరు ఇవ్వబోతున్నారనేది తేల్చారు. చివరకు గెలిచిన భరణి.. హౌసులోకి మళ్లీ వచ్చేశాడు. ఇక వీకెండ్ వచ్చిందంటే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి కూడా అలానే ఒకరు బయటకెళ్లిపోయారు. కానీ ఒకరు అనుకుంటే మరొకరు ఔట్ అయ్యారట.8వ వారం నామినేషన్స్లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. వీళ్లలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్.. తొలిసారి నామినేషన్స్లోకి వచ్చారు. దీంతో వీకెండ్ అయ్యేసరికి వీళ్లకే తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చిన్న టెన్షన్ ఏర్పడింది. తొలుత గౌరవ్ బయటకొచ్చేశాడని రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్గా మాధురి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: హీరోగా లోకేశ్ కనగరాజ్.. మూవీ టీజర్ రిలీజ్)మరోవైపు లేటెస్ట్ ప్రోమోలో మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. రీతూ-పవన్కి సంబంధించిన ఓ వీడియో చూపించిన హోస్ట్ నాగార్జున.. పవన్పై సీరియస్ అయ్యారు. ఈ వీడియోలో పవన్.. రీతూని బెడ్పైకి తోస్తూ కనిపించాడు. బిగ్బాస్ నిబంధనల ప్రకారం.. తోసేయడం, తన్నడం లాంటివి చేయకూడదు. వీడియో ప్లే చేసిన తర్వాత.. 'ఇలాంటి ప్రవర్తన మీ ఇంట్లో ఆడపిల్లలపై చేస్తే బెల్ట్ పెట్టి కొట్టేవారా కాదా ఆడియెన్స్' అని నాగ్ అడిగాడు. అలా తోయడం కరెక్ట్ కాదని ఆడియెన్స్ అనేసరికి.. 'సారీ సర్' అని పవన్ అన్నాడు.సారీ చెబితే బిగ్బాస్ క్షమించడు. నీకు రెడ్ ఫ్లాగ్ తప్పదు. నీ బ్యాగ్ సర్దుకే. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ అని నాగార్జున అన్నాడు. దీంతో పవన్ దీనంగా ముఖం పెట్టి కనిపించాడు. మరోవైపు రీతూ.. 'సార్ సార్ వద్దుసార్' అని నాగార్జునని ప్రాధేయపడుతూ కనిపించింది. అయితే ఇదంతా డ్రామా నడిపించడమే కోసమే అనిపిస్తుంది. ఎందుకంటే గత సీజన్లలో ఇలాంటి హంగామా చాలాసార్లు చూపించారు. దీంతో పవన్ బయటకెళ్లడం జరగదులే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్) -
మాధురి నోటికాడి కూడు లాక్కుంటారా? దివ్య ఓవరాక్షన్ ఏంటో?
బిగ్బాస్ హౌస్ (Bigg Boss Telugu 9)లో ఏది జరిగినా ఒకరోజు ఆలస్యంగా చూపిస్తారు. అలా శుక్రవారం రోజు జరిగినదాన్ని నేడు ఎపిసోడ్లో చూపించనున్నారు. ఇక ఫ్రైడే అంటే పెద్దగా టాస్కులేవీ ఉండవు. కేవలం ఫన్ గేమ్స్ మాత్రమే ఉంటాయి. ఇటువంటి ఫన్ గేమ్స్ దగ్గరా గొడవ పడొచ్చని నిరూపించారు తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ కంటెస్టెంట్స్.తిండి దగ్గర లొల్లితాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిర్యానీ టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ పూర్తయ్యాక అందరూ ప్లేటులో బిర్యానీ వేసుకుని ఆవురావురుమని ఆరగించారు. ఓపక్క అందరూ తింటుంటే మాధురి అప్పుడే వచ్చి ప్లేటులో బిర్యానీ వేసుకోబోయింది. అది చూసిన భరణి, దివ్య వెంటనే ఆపేశారు. వేరే టీమ్కు ఇంకా పీసులు వెయ్యలేదు, వారికి వేశాక మీకు పెడతాను అని భరణి అడ్డుకున్నాడు. దీంతో మాధురి హర్టయిపోయింది. నీళ్లు తాగి కడుపు నింపుకుంది. ఆయనకు నోరు లేదా?చిన్నచిన్నవాటికెందుకిలా.. అని భరణి (Bharani Shankar) వివరించబోయాడు. ఇంతలో దివ్య.. మధ్యలో కలగజేసుకుని మాట్లాడటంతో మాధురి అక్కడినుంచి లేచి వెళ్లిపోయింది. ప్లేటు పట్టుకున్నప్పుడు అలా అనేస్తే ఎలా తింటాం? అతడు అడుగుతున్నదానికి సమాధానం చెప్తున్నా.. మధ్యలో ఈమె (దివ్య) వివరణ ఇవ్వడం దేనికి? ఆయనకు నోరు లేదా? మాట్లాడలేడా? అని మాధురి.. కల్యాణ్ ఎదుట తన కడుపులో ఉన్నదంతా కక్కేసింది.మీ గేమ్ మీరు ఆడండిఇక ఈ గొడవయ్యాక తనూజ.. భరణితో ఇది మీ గేమ్ మీరు ఆడండి.. మధ్యలో దివ్య ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు అంది. నిజమే.. దివ్య ఇలా భరణిపై పెత్తనం చెలాయిస్తే అది అతడికే నెగెటివ్ అయి మళ్లీ ఎలిమినేట్ అవడం ఖాయం. మరి భరణి ఏం చేస్తాడో చూడాలి! చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన -
శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9)లో రీఎంట్రీ ఇచ్చిన భరణి, శ్రీజలలో ఆడియన్స్ భరణికే ఓట్లు గుద్దిపడేశారు. దీంతో శ్రీజ మరోసారి హౌస్ నుంచి నిష్క్రమించింది. పర్మినెంట్ హౌస్మేట్ అయిన భరణికి బిగ్బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. అదేంటో శుక్రవారం (అక్టోబర్ 31వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేయండి..భరణి చేతిలో పవర్ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగుర్ని సెలక్ట్ చేయమని భరణి (Bharani Shankar)కి పవర్ ఇచ్చాడు బిగ్బాస్. దీంతో అతడు ఈ వారం తనకు సపోర్ట్ చేసినవారికే ఛాన్స్ ఇస్తానన్నాడు. మాధురి మాత్రం అమ్మాయిలందరికీ ఛాన్స్ ఇవ్వమంది. భరణి మాత్రం ఇప్పటివరకు కెప్టెన్ అవలేని వారికే ఛాన్స్ ఇస్తానంటూ.. అతడి పేరుతో పాటు తనూజ, దివ్య, సాయి, నిఖిల్ను సెలక్ట్ చేశాడు. రీతూను సెలక్ట్ చేయకపోవడంతో ఆమె కాస్త హర్టయింది.తనూజ వర్సెస్ కల్యాణ్రేషన్ మేనేజర్గా ఉన్న తనూజ (Thanuja Puttaswamy).. బెండకాయలు పాడైపోయేలా ఉన్నాయని, వాటితో కూర వండాలంది. చపాతీలోకి బెండకాయ బాగోదు, ఆలూ కుర్మా కావాలని కల్యాణ్ అడిగాడు. అడిగినవన్నీ చేసిపెట్టేందుకు సర్వెంట్లం కాదు, అన్నిట్లో వేలు పెట్టకు.. అంటూ కల్యాణ్పై రెచ్చిపోయింది తనూజ. అతడు కూడా వెనక్కు తగ్గలేదు. అన్నీ నీకు నచ్చినట్లే చేయాలంటే కుదరదంటూ కౌంటరిచ్చాడు. ఇలా కాసేపు వీరిద్దరూ గొడవపడ్డారు. తర్వాత కెప్టెన్సీ కంటెండర్లకు డీజే టాస్క్ పెట్టాడు. డీజే డ్యాన్స్ఈ టాస్కులో భాగంగా పాటలు ప్లే అవుతూ ఉంటే ఒక్కో కంటెండర్ డ్యాన్స్ చేయాలి. వారికి సపోర్ట్ చేసేవారు మరో ప్లాట్ఫామ్పై డ్యాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి ప్లాట్ఫామ్పై ఎక్కువమంది సపోర్టర్స్ ఉంటే వారే గెలిచినట్లు. రాము సంచాలక్గా వ్యవహరించాడు. ఎలాగో అందరూ ఊహించినట్లే నిఖిల్, సాయికి ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయలేదు. భరణిని కూడా లైట్ తీసుకున్నారు. దివ్య, తనూజకు మాత్రం పోటాపోటీగా మద్దతు పలికారు. బొమ్మలా నిల్చున్న భరణిదీంతో వీళ్లిద్దరూ రెండో రౌండ్లో పాల్గొన్నారు. అయితే ఈ రౌండ్ ప్రారంభమవడానికి ముందే దివ్య తెలివిగా.. భరణికి సపోర్ట్ చేసేవారి దగ్గరికెళ్లి సాయం చేయమని అడిగింది. దీంతో రాము, సుమన్, సంజన.. ఇలా చాలామంది ఆమెకు మాటిచ్చి ఆ మాటపై నిలబడ్డారు. రెండో రౌండ్లో తనూజ కోసం మాధురి, రీతూ, డిమాన్, కల్యాణ్ నిలబడ్డారు. దివ్య కోసం ఇమ్మూ, గౌరవ్, సుమన్, సాయి, సంజన నిల్చున్నారు. ఒక్క ఓటు తేడాతో దివ్య గెలిచి కెప్టెన్ అయింది. ఈ గేమ్లో భరణి.. ఎటూ తేల్చుకోలేక మధ్యలో నిలబడి సినిమా చూడటం విశేషం!కెప్టెన్గా దివ్యతనూజ.. గతవారం కూడా టాప్ 2దాకా వచ్చి కెప్టెన్సీ చేజార్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ కావడంతో తనకు దుఃఖం ఆగలేదు. రీతూ ఓదారుస్తుంటే మాధురి మాత్రం తన దుమ్ము దులిపేసింది. అందరినీ నమ్ము.. అది ఏడిస్తేనే బాగుంటుంది. ఏడవినవ్వవే.. ఎంత దారుణం.. నాన్న నాన్న అని వెళ్లిపట్టుకో అంటూ ఫైర్ అయింది. తనూజ మాత్రం ఏడుస్తూనే.. ఇప్పుడైనా నమ్ముతావా? నా గేమ్ నేను ఆడుతున్నా.. మాటలకు వస్తారు, కానీ సపోర్ట్ చేయరు అంటూ బాధపడింది. అందరినీ బతిమాలుకోవడం అలవాటైన రీతూ.. అదే పని చేసి రేషన్ మేనేజర్ పోస్ట్ దక్కించుకుంది. ఈ మధ్య అరుపులు, ఆజమాయిషీతో ఓవర్ చేస్తున్న దివ్య.. కెప్టెన్గా ఎలా ఉంటుందో చూడాలి!చదవండి: ప్రపంచకప్ ఫైనల్.. టీమిండియా కోసం నటి ఆండ్రియా గిఫ్ట్ -
మాధురితో గుంజీలు తీయించిన మహానుభావుడు.. కల్యాణ్తో తనూజ లొల్లి
హౌస్లో ఒక్కొక్కర్ని చెడుగుడు ఆడేసుకుంటోంది దివ్వెల మాధురి (Divvala Madhuri). తనకు ఎదురు తిరిగినవారిని మాటల ప్రవాహంతోనే దడదడలాడిస్తోంది. ఆమె నోట్లో నోరు పెట్టడమంటే సింహం బోనులో వెళ్లి కూర్చోవడమే అవుఉతంది! అలాంటి మాధురిని పిల్లిని చేశాడో కంటెస్టెంట్. అతడెవరో కాదు, కామెడీ కింగ్, టాస్కుల వీరుడు ఇమ్మాన్యుయేల్..మాధురితో గుంజీలు తీయించిన ఇమ్మూమాధురి సైలెంట్ అయిపోయిందంటే ఏదో తప్పు చేసే ఉంటుంది. లేకపోతే పిల్లిలా ఎందుకు మారిపోతుంది! ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలో ఆమె తప్పుల్ని, ఆమెకిచ్చిన పనిష్మెంట్స్ను చూచాయగా చూపించారు. అందులో ఆమె పొద్దెక్కినా కూడా నిద్రపోతోంది. దీంతో కుక్కలు మొరిగాయి. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ ఆమెతో 20 గుంజీలు తీయించాడు. అయినా మాధురికి నిద్ర ఆగితే కదా.. మళ్లీ కునుకు తీస్తూనే ఉంది. దీంతో ఆమెతో పచ్చిమిర్చి తినిపించాడు.మరీ ఓవర్ చేస్తున్నారుఇక మరో ప్రోమోలో తనూజ, పవన్ గొడవపడ్డారు. రాత్రి బెండకాయ వద్దని పవన్.. నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకు, నువ్వెవరు చెప్పడానికి.. నీలాగా ఎవరూ చేయట్లేదు అని ఒంటికాలిపై లేచింది. అటు దివ్య కూడా కాఫీ విషయంలో రీతూపై అరిచింది. ఈ గొడవలు చూస్తున్న జనాలు.. భరణి నాన్న వచ్చాక వీళ్లిద్దరూ మరీ ఓవర్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అసలు తనూజను రేషన్ మేనేజర్గా తీసేయండ్రా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. చదవండి: వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు -
ప్లేటు తిప్పేసిన మాధురి.. రీతూ తల్లి ఏడుస్తూ ఫోన్ చేసిందా?
సెకండ్ ఛాన్స్ కోసం భరణి, శ్రీజ బిగ్బాస్ హౌస్లో పోటీపడుతున్నారు. వీరిలో ఒక్కరికే స్థానం ఉంటుందన్న బిగ్బాస్.. రకరకాల టాస్కులిచ్చాడు. అందులో భరణి గాయాలపాలై ఆస్పత్రికి కూడా వెళ్లొచ్చాడు. అటు రేషన్ మేనేజర్గా ఉన్న తనూజకు గొడవలు తప్పడం లేదు. ఏకంగా రాజు (మాధురి)తో కూడా గొడవ జరిగింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..ఫెయిలైన సంచాలకులుశ్రీజ- భరణి కోసం మొదటగా కట్టు- పడగొట్టు టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో భరణి, ఇమ్మాన్యుయేల్ను ఒక్కటే కట్టడి చేసి శెభాష్ అనిపించుకున్నాడు డిమాన్ పవన్. కానీ, అతడి కష్టాన్ని ప్రేక్షకులకు కనిపించకుండా ఎపిసోడ్లో సరిగా వేయనేలేదు. ఫస్ట్ రౌండ్లో శ్రీజ గెలిచిందని కల్యాణ్.. కాదు, భరణి గెలిచాడని సుమన్ వాదించారు. దీంతో బిగ్బాస్.. ఈ ఇద్దర్నీ సంచాలకులిగా తప్పించాడు. కొత్త సంచాలక్ మాధురి.. శ్రీజ గెలిచినట్లు ప్రకటించింది.మాధురి వర్సెస్ తనూజరెండో రౌండ్లో భరణి (Bharani Shankar) గాయాలపాలవడంతో పాటు ఎవరూ గెలవలేదు. భరణిని ఆస్పత్రికి తీసుకెళ్లి మళ్లీ హౌస్లోకి పంపించారు. ఇక కిచెన్లో గొడవ మొదలైంది. చపాతీలు లావుగా వస్తున్నాయని తనూజ అంది. పక్కనే చపాతీ చేస్తున్న మాధురి.. మేమేమీ హోటల్ సర్వర్లము కాము.. మాకు రాదు అంటూ అక్కడ పడేసి వెళ్లిపోయింది. మేము కూడా హోటల్లో పని చేసి రాలేదు, అయినా పని చేస్తున్నాం. రాకపోతే చెప్పండి, వేరేవాళ్లు చేసుకుంటారని తనూజ కౌంటరిచ్చింది.అన్నంపై అలిగిన సంజనాతగ్గుతుంటే ఏదో అనుకుంటున్నావేమో.. ప్రేమకి తగ్గుతున్నా.. నువ్వు అరుస్తుంటే తగ్గట్లేదు. నేను మాటలు పడటానికి రాలేదు. మీకు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది. న్యాయం వైపుంటే నచ్చదు అంటూ మాధురి (Divvala Madhuri) సెటైర్లు వేసింది. మీరు టాపిక్ ఎక్కడికో తీసుకెళ్లకండి.. నాన్నను సేవ్ చేయమని అడిగానా? అంటూ తనూజ వాదించగా కాసేపు గొడవ జరిగింది. అటు అన్నం కొద్దిగానే ఉండటంతో.. అన్నం పెట్టుకునేముందు చెప్పాలిగా అని తనూజ సంజనాను ప్రశ్నించింది. దీంతో ఆమె తినే ప్లేటు మీద నుంచి అలిగి వెళ్లిపోయింది. అందుకే మాధురిపై కోపం లేదుమరోవైపు రీతూ-పవన్ల గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్స్ రోజు మాధురి.. నీకోసం నన్ను అన్ని మాటలు అంటుంటే ఎందుకు స్పందించలేదు? ఎందుకు కోపం రాలేదు? అని గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉండేసరికి డిమాన్ పవన్కు తిక్క రేగింది. ఆమెను అక్కా అని పిలుస్తున్నా, అందుకే కోపం రాలేదన్నాడు. దీంతో రీతూ మరింత అరిచింది. ఆవేశంలో పవన్ ఓ మాట జారాడు. ఇక చాలు, గుడ్బై అని రీతూ అక్కడినుంచి వెళ్లబోతుంటే పవన్ తనను తోసేశాడు.మాధురికి రీతూ తల్లి ఫోన్ఈ గొడవలతో పిచ్చెక్కిపోతున్న మాధురి.. పవన్తో ఒక్కమాట అడుగుతా.. మీది హెల్తీ రిలేషన్ అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు నాకు ఫోన్ చేస్తారా? నీతో మాట్లాడుతుంటే ఆమె తల్లి ఏడుస్తుందని నాకు చెప్తారా? నేను మాట్లాడినదాంట్లో తప్పుంటే సారీ అనేసింది. ఆ తర్వాత కూడా వీళ్లు గొడవపడటం.. కాసేపటికి రీతూ ఎప్పటిలాగే డిమాన్కు తినిపించడం జరిగిపోయింది. ఇదంతా వాళ్లకెలా ఉందోకానీ, చూసేవారికి మాత్రం తల బొప్పికడుతోంది.చదవండి: కల్కి క్రెడిట్ నుంచి దీపికా పదుకొనే పేరు తొలగింపు -
బాడీ షేమింగ్, తిట్లు.. ఇదేం బుద్ధి? సంజన, మాధురికి గడ్డిపెట్టిన నాగ్
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్ క్యాండిడేట్ అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది. కల్యాణ్ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ అసలు నామినేషన్స్లోకే రాకపోవడం మైనస్గా మారనుంది.తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో ఏడు వారాలు గడిచాయి. రానురాను కంటెస్టెంట్లు రాటుదేలతారనుకుంటే మరీ వరస్ట్గా తయారవుతున్నారు. సంజనా నోటికి హద్దే లేకుండా పోయింది. తొక్కిపడేస్తా, నేలకేసి కొడతా అంటూ మాధురి మరీ నీచంగా మాట్లాడుతోంది. వీళ్లకు సరైన కోటింగ్ ఇచ్చాడు నాగార్జున. మరి ఇంకా ఏమేం జరిగాయో శనివారం (అక్టోబర్ 25వ) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..రాజాతో రీప్లేస్ చేశావా?ఇమ్మాన్యుయేల్.. కల్యాణ్తో తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేయించాలనుకున్నాడు. అది నేరుగా చెప్పకుండా ఏదేదో వాగాడు. ఈ టాపిక్ను నాగ్ ప్రస్తావిస్తూ అది సేఫ్ గేమ్, డైరెక్ట్గా నువ్వు చేయొచ్చుగా? అని ఇమ్మాన్యుయేల్కు క్లాస్ పీకాడు. తనూజ-మాధురిని బంధాల గురించి అడిగాడు. నాన్నని రాజాతో రీప్లేస్ చేశావా? అని నిలదీశాడు. అందుకు తనూజ.. మాది ఫేక్ బాండ్ కాదు సర్. నేను ఆవిడపై అరిచేస్తున్నా, తిట్టేస్తున్నా.. కానీ ఆవిడ నాతో ఎక్కువ కనెక్ట్ అయ్యారు. తోసేసినా వెళ్లనంటోందివచ్చినప్పుడు నాన్న నాన్న అని నాపై చాలా చెప్పారు.. మరిప్పుడెందుకు క్లోజ్ అవుతున్నారు? ఇది నాకు నెగెటివ్ అవుతుంని చెప్పినా ఆవిడ ఒప్పుకోలేదు. నీతో జెన్యూన్గా ఉన్నా.. నువ్వు తోసేసినా వెళ్లనని నాతో అంది సార్. ఒకవేళ నాకంటే ముందే నువ్వు ఎలిమినేట్ అయితే నేను హ్యాపీగా ఫీలవుతా అని కూడా చెప్పాను అని పేర్కొంది. మాధురికి క్లాస్ఇక తనూజ-సాయి మాట్లాడుతుంటే మధ్యలో రాము వచ్చి కూర్చోగా.. తనూజ చిరాకుతో మాటలనేసి వెళ్లిపోయిన వీడియో వేసి క్లాస్ పీకాడు. అయితే అది మాకు అలవాటే అని రాము అనడం గమనార్హం. ఇక దివ్యను రోడ్ రోలర్, లావు అని మాటలనడం, సంజ్ఞలు చేయడం తప్పని సంజనాకు క్లాస్ పీకాడు. రీతూపై మాటలు తూలిన మాధురికి కూడా క్లాస్ పడింది. గేమ్లో రీతూ.. తన డబ్బులన్నీ పవన్కు ఇవ్వడం.. కంటెండర్షిప్ కోసం తనను సైడ్ చేయడం జీర్ణించుకోలేకపోయింది. అది కడుపులో పెట్టుకుని రీతూను నానామాటలంది. బయట తోపు.. ఇక్కడ కాదు!బయట ఇలా చేసుంటే నేలకేసి తొక్కుతా.. నీ బిహేవియర్ బాలేదు, నీ నోరే చెత్త.. ఇలా చాలానే వాగింది. దీనిపై నాగ్ స్పందిస్తూ.. మీరు బయట తోపైతే బయట చూసుకోండి. బిగ్బాస్ హౌస్లో కాదు అని కాస్త సాఫ్ట్గానే హెచ్చరించాడు. ఇక ఈ ఎపిసోడ్లో ఫేక్ బాండ్స్, ఇన్సెక్యూర్.. అంటూ ఎక్కువ బోర్డులు మాధురి మెడలోనే పడ్డాయి. దీంతో ఆమెకు ఓ పనిష్మెంట్ ఇవ్వనున్నారు. అది డైరెక్ట్ నామినేషన్ అని తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్లో కల్యాణ్ను మాత్రమే సేవ్ చేశారు. సేవ్ అయితే ఏదో చెప్తానన్నావ్.. అని నాగార్జున కూపీ లాగే ప్రయత్నం చేశాడు. కానీ కల్యాణ్ మెలికలు తిరుగుతూ తర్వాత చెప్తానంటూ దాటేశాడు.చదవండి: బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్! -
'జట్టు పట్టుకుని నేలకేసి'.. మాధురికి క్లాస్ పీకిన నాగార్జున
బిగ్బాస్ హౌస్లో వీకెండ్ వచ్చిందంటే చాలు మిగతా రోజుల కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. ఆ వారమంతా చేసిన తప్పులు, గొడవల గురించి మాట్లాడుతూ ఆయా కంటెస్టెంట్స్కి ఇచ్చి పడేస్తుంటాడు. ఈసారి అలా మాధురికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?ఈ వారం టాస్క్ల్లో భాగంగా ఇలా గనక బయట ప్రవర్తించుంటే జట్టు పట్టుకుని నేలకేసి కొడతా అని రీతూపై మాధురి కామెంట్ చేసింది. అనుకున్నట్లుగానే ఈవారం ఆ మాటలకు సంబంధించిన పంచాయతీ నాగార్జున దగ్గరకు వచ్చింది. అయితే ఈసారి హౌస్లో పక్కనే బోర్డుపై ఉన్న ట్యాగ్స్లో ఏది సూట్ అవుతుందో చెప్పాలని నాగార్జున సూచించాడు. తొలుత రమ్య.. 'ఫేక్ బాస్' అనే ట్యాగ్ తీసుకొచ్చి మాధురి మెడలో వేసింది. అందుకు గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది. హౌస్లోకి అడుగుపెట్టినప్పుడు బంధాలేంటి అని కామెంట్ చేసి ఇప్పుడు బంధాల్లోకి వెళ్తున్నట్లు అనిపించిందని రమ్య చెప్పింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!)రీతూ అయితే మాధురి గురించి నాగార్జున దగ్గర చెప్పింది. జుట్టు పట్టుకుని నేలకేసి కొడతాను, నీ బిహేవియర్(ప్రవర్తన) బాగోదు అది ఇదీ అని చాలామాటలు అన్నారు సర్ అని తన బాధని బయటపెట్టింది. దీనిపై స్పందించిన మాధురి.. డబ్బులివ్వమని సుమన్, రీతూని అడిగారు సర్, సుమన్కి ఇవ్వకుండా మళ్లీ తీసుకెళ్లి పవన్కి ఇచ్చి అతడిని గెలిపించి కంటెండర్ని చేసింది. ఇలాంటివన్నీ బిగ్బాస్ హౌస్లో కాకుండా బయట చేసుంటే జుట్టు పట్టి నేలకేసి కొట్టేదాన్ని అని అన్నానని మాధురి వివరణ ఇచ్చుకుంది.అయితే మాధురి మాటలపై సీరియస్ అయిన నాగార్జున.. మాధురి ఆఖరిసారి చెబుతున్నాను. నేలకేసి కొడతా, తొక్కుతా, తాటతీస్తా అనొద్దు. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండమ్మా. బిగ్బాస్ హౌస్లో కాదు అని చాలా స్మూత్గానే క్లాస్ పీకారు. శనివారం ఎపిసోడ్లో ఇదే హైలైట్ కానుందని అనిపిస్తుంది. మాధురి ఇంకేం మాట్లాడిందనేది పూర్తి ఎపిసోడ్లో చూడాలి.(ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్) -
సంజనా నోటి దురుసు.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమన్న మాధురి
పాములు పట్టేవాడు పాముకాటుకే బలైనట్లు దొంగతనాలు చేసే సంజనానే దొంగదెబ్బ తీశారు సుమన్, తనూజ. బిగ్బాస్ ఇంటిని వాంటెడ్ పేట అని దొంగలనివాసంగా మార్చేశారు. బిగ్బాసే చెప్పాక కంటెస్టెంట్లు ఆగుతారా? ఏముంది, దొరికిన డబ్బు దోచేసుకున్నారు. కానీ, ఒక్క చోరీకే రుసరుసలాడింది సంజన.. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 22వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..మాస్ మాధురి Vs సంజన సైలెన్సర్బిగ్బాస్ హౌస్ గ్యాంగ్స్టర్ అడ్డాగా మారింది. మాస్ మాధురి, సంజన సైలెన్సర్ గ్యాంగుల మధ్య పోటీ జరుగుతోంది. సంజన (Sanjana Galrani) డబ్బులు పోవడంతో అందరిపైనా గరమైంది. హౌస్మేట్స్ అసలే గజదొంగల వేషాల్లో ఉన్నారు. అయ్యోపాపం.. అని డబ్బు తిరిగిస్తారా? ఛాన్సే లేదు. అవతలి టీమ్లో ఉన్న తనూజ, సుమన్లు ఆ డబ్బు ఎప్పుడో పంచేసుకున్నారు. కానీ అది జీర్ణించుకోలేని సంజనా.. లాక్కోవడం గీక్కోవడం మన క్లాస్ కాదు. బయట ఆర్టిస్టులం.. అంటూ సంబంధం లేని డైలాగులు వల్లె వేసింది.అమ్ముకోమంటే పూటుగా లాగించేశారుదాన్ని దివ్య మోసుకెళ్లి మాధురి (Divvala Madhuri) చెవిలో పడేసింది. అందుకామె ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమని చెప్పు అని సంజనాపై అసహనం వ్యక్తం చేసింది. తర్వాత రెండు గ్యాంగ్ లీడర్లకు కాఫీ షాప్, పానీపూర్ స్టాల్స్ ఇచ్చాడు బిగ్బాస్. దీని ద్వారా డబ్బు సంపాదించుకోమన్నాడు. కానీ, అమ్మడంపై ఫోకస్ పెట్టడం మానేసి.. తేరగా వచ్చిందని తినడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారంతా! దీంతో బిగ్బాస్ ఆ స్టాల్ టాస్క్ ఎత్తేశాడు.గెలిచిన మాధురికి జేజేలుతర్వాత ధమాకా కిక్.. కాళ్లలో దమ్ము ఉండటం అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో కాలును ఉపయోగించి చెప్పును గోడపై వీలైనంత ఎక్కువ ఎత్తులో అతికించాలి. ఇందులో అందరికంటే రీతూ చౌదరి బాగా ఆడింది. ఈ గేమ్లో మాధురి టీమ్ గెలవడంతో ఓడిపోయిన సంజనా టీమ్ మెంబర్స్ ఆమెను ఎత్తుకుని జై కొడుతూ ఇల్లంతా ఊరేగించారు.చదవండి: బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా -
తనూజను వదిలేశానన్న కల్యాణ్.. సంజనాను ముంచేశారు!
నామినేషన్స్ అయిపోయినా కంటెస్టెంట్ల కోపతాపాలు మాత్రం తగ్గలేదు. సంజనా.. కల్యాణ్పై, తనూజ.. ఇమ్మాన్యుయేల్పై బుసలు కొడుతూనే ఉన్నారు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో అక్టోబర్ 21వ ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..నామినేషన్స్ లొల్లితనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేస్తా.. ఈ మాట అన్నందుకే నామినేషన్ చేసే పవర్ను కల్యాణ్కు ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. కట్ చేస్తే అది ఇమ్మూ మెడకే చుట్టుకుంది. అతడు తనూజకు బదులుగా ఇమ్మూ తల్లి సంజనాను నామినేట్ చేశాడు. నమ్మించి మోసం చేశాడంటూ ఇమ్మూ గొడవపడ్డాడు. రమ్య ఆల్రెడీ తనూజను నామినేట్ చేసింది. నాకు ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదు అని కల్యాణ్ వివరణ ఇచ్చాడు.తనూజను ఎప్పుడో వదిలేశా!అప్పటికీ అసహనంతో ఊగిపోతున్న ఇమ్మూ (Emmanuel).. సరే, ఈ వారం గమనించు, తను జెన్యూన్గా ఉందో, లేదో! అని తనూజ గురించి అన్నాడు. అందుకు కల్యాణ్ ఇచ్చిన ఆన్సర్కు దిమ్మ తిరగాల్సిందే! నేను ఎప్పుడో వదిలేశా అన్నా.. తన(తనూజ)ను పట్టించుకోవట్లేదు! అన్నాడు. ఈ వారం కూడా తను సేఫ్ గేమ్ ఆడితే తర్వాతి వారం నామినేట్ చేస్తానని మాధురితో చెప్పాడు కల్యాణ్.ఇమ్మాన్యుయేల్పై రంకెలేసిన తనూజమరోవైపు తనూజ.. అరుస్తూనే ఉంది. తల్లీ కొడుకులైన సంజనా, ఇమ్మాన్యుయేల్పై చిందులు తొక్కింది. తనూజను బుజ్జగించబోతే మాధురిపైనా అరిచేయడం గమనార్హం! ఆయేషా.. గౌరవ్తో రాత్రిపూట ముచ్చట్లాడింది. రమ్య హౌస్లోకి వచ్చేటప్పుడే తనూజను ఎలిమినేట్ చేయాలని బలంగా డిసైడ్ అయింది. ఆమె ఎలిమినేట్ అయ్యేవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంది. తన ఫోకస్ అంతా ఒక్కదగ్గరే ఉందని అభిప్రాయపడింది.దొంగలుగా హౌస్మేట్స్బిగ్బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మాస్ మాధురి, సంజనా సైలెన్సర్ అంటూ టీమ్ లీడర్స్ను ప్రకటించాడు. గేమ్స్ ముగిసే సమయానికి ఎవరి గ్యాంగ్లో ఎక్కువమంది ఉంటే వారు కంటెండర్స్ అవుతారన్నాడు. మొదటి గేమ్లో మాధురి టీమ్ గెలిచింది. ఓడిపోయిన సంజనాను స్విమ్మింగ్ పూల్లో ముంచేశారు.చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్..
నిన్నటి ప్రోమోలో మాధురికి చీవాట్లు పెట్టాడు నాగార్జున (Nagarjuna Akkineni). కానీ ఎపిసోడ్లో మాత్రం ఆమెను బుజ్జగిస్తూ.. ఏకంగా రేషన్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేశాడు. అటు పవన్ కల్యాణ్- తనూజలకు బయట ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 18వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..నా బుజ్జి తమ్ముడు(Bigg Boss Telugu 9)నాగార్జున ఎక్కువగా వైల్డ్కార్డులతోనే మాట్లాడాడు. తమిళ బిగ్బాస్ బాగుందా? ఇక్కడ బాగుందా? అని అడగ్గా ఆయేషా.. తమిళ్ కంటే ఇక్కడే బాగుంది అని నవ్వింది. పచ్చళ్ల పాప రమ్యను సైతం హౌస్ బాగుందా? అని అడగ్గా చాలా బాగుందని మెలికలు తిరిగిపోయింది. బాగుందా? లేదంటే చాలా బాగున్నాడా? అని పంచ్ వేశాడు నాగ్. దీంతో రమ్య వెంటనే.. డిమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని తడుముకోకుండా చెప్పేసరికి హౌస్మేట్స్ షాకైపోయారు.మాధురి పవర్ పాయే..వైల్డ్కార్డ్స్ బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టేముందు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా.. దానికి వాళ్లు అర్హులా? కాదా? అని ఆడియన్స్తో ఓటింగ్ వేయించాడు నాగ్. ముందుగా మాధురి వంతు వచ్చింది. ఆమెకు సంజనా డప్పు కొడితే దివ్య మాత్రం.. ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమనేది పెద్ద పవర్.. దానికి ఈమె అర్హురాలు కాదని అభిప్రాయపడింది. ఆడియన్స్కు దివ్య మాటకే జై కొట్టారు. 88% మంది మాధురిని తప్పుపట్టారు. దీంతో ఆమెకున్న స్పెషల్ పవర్ పీకేశాడు నాగ్.మాధురి.. 200% కరెక్ట్అలాగే మాధురి.. పవన్ కల్యాణ్తో గొడవపడిన క్లిప్పింగ్ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని, దాన్ని సరిచేసుకోవాలన్నాడు. రాత్రి లైట్లు ఆఫ్ చేశాక గుసగుసలు పెట్టొద్దన్నావ్. నువ్వు 200% కరెక్ట్.. నీ స్థానంలో నేనున్నా అదే చేస్తా.. కానీ చెప్పే విధానం మార్చుకోవాలని సముదాయించాడు. ఇప్పటివరకు కమాండింగే తెలుసు.. కానీ బతిమాలడం తెలీదు.. సరే ఇకపై నేర్చుకుంటానంది మాధురి. కల్యాణ్-తనూజల బంధంపై అందరూ ఏమనుకుంటున్నారు? ఏంటనేది వీడియోలతో వారికి క్లారిటీ వచ్చేలా చేశాడు నాగ్.కన్ఫ్యూజన్లో పవన్- రీతూఅయితే తనూజకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. కల్యాణ్ చిన్నపిల్లోడు సర్ అనేసింది. అటు అతడు కూడా జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పాడు. కల్యాణ్ను అమ్మాయిల పిచ్చి అనడం తప్పని రమ్యను హెచ్చరించాడు. ఇక డిమాన్- పవన్ల బంధంపై వారికే సరిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుని ఆటపై ఫోకస్ చేయమన్నాడు నాగ్. అలా ఈ ఎపిసోడ్లో మాధురి, నిఖిల్ పవర్ పోగా.. రమ్య, ఆయేషా, శ్రీనివాస్ సాయిల పవర్ మాత్రం అలాగే ఉంది. చివర్లో ఇమ్మాన్యుయేల్కు కళ్లు నెత్తికెక్కాయి, పొగరు పెరిగిపోయిందంటూ కాసేపు ఆడుకున్న నాగ్ చివరకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు ఫుడ్ పార్టీ ఉంటుందన్నాడు. అనంతరం మాధురిని కొత్త రేషన్ మేనేజర్ చేశాడు.చదవండి: బిగ్బాస్లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్ -
మాధురికి క్లాస్ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక!
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లున్నారు. వీరిలో ఆరుగురు కొత్తగా వచ్చిన వైల్డ్కార్డ్స్ ఉన్నారు. వారిలో ఎక్కువ హైలైట్ అవుతుంది ఇద్దరే ఇద్దరు. ఒకరు మాధురి, మరొకరు ఆయేషా! అరుపులు, ఏడుపులు తప్ప ఏదీ కనిపించడం లేదంటూ తనూజను నామినేట్ చేసిన ఆయేషా.. వచ్చినప్పటినుంచి అరుస్తూనే కనిపించింది. నిన్న ఒక్క గేమ్ ఓడిపోయేసరికి బోరుమని ఏడ్చింది. వాయించేసిన నాగ్మాధురి (Divvala Madhuri).. హౌస్కు రెండో బిగ్బాస్లా ఫీలవుతోంది. అందరిపై ఆజమాయిషీ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్తో ఓ గొడవ కూడా జరిగింది. ఆ గొడవలో తప్పెవరిది? అని కెప్టెన్ సుమన్ను అడిగాడు నాగ్. అందుకు సుమన్ తడుముకోకుండా మాధురిదే తప్పన్నాడు. ఆరోజు ఏం జరిగిందో వీడియో క్లిప్పింగ్ వేసి మరీ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పు లేదు.. కానీ, మాట్లాడిన తీరు తప్పు అని మాధురికి క్లాస్ పీకాడు. నా గొంతే అలా ఉంటుందని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించుకోగా దాన్ని నాగ్ ఖండించాడు.సూపర్ పవర్ నిర్వీర్యంమరిప్పుడు నీ గొంతు అలా లేదు కదా.. మాట తీరే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందని హెచ్చరించాడు. మాధురికి ఉన్న సూపర్ పవర్ ఉంచాలా? తీసేయాలా? అని స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్ని అడగ్గా వారు తీసేయడమే మంచిదన్నారు. వైల్డ్కార్డ్గా ఎంట్రీ ఇచ్చినరోజు ఆమెకు ఎలిమినేషన్ను రద్దు చేసే పవర్ ఇచ్చారు. ప్రేక్షకుల తిరస్కారంతో ఆ పవర్ ఇప్పుడు నిర్వీర్యమైపోయింది. చదవండి: ఒక్క టాస్క్కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం -
బిగ్బాస్లో మాధురి కొత్త రూల్స్.. నచ్చకపోతే వెళ్లిపోమని వార్నింగ్!
(Bigg Boss Telugu 9) వైల్డ్కార్డులు తమ ప్రతాపం చూపించాలనుకుంటున్నారో, ఏమో కానీ గొడవలు పడుతూనే ఉన్నారు. మాధురి తగ్గేదేలే అన్న లెవల్లో కొట్లాటకు సిద్ధం అవుతుంటే ఆయేషా కావాలని కొందరిని టార్గెట్ చేసి మరీ తిడుతోంది. మరి నిన్నటి (అక్టోబర్ 15వ) ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం...ప్రాంక్ పేరుతో..సంజనాతో కలిసి ప్రాంక్ గొడవ ప్లాన్ చేసింది మాధురి (Divvala Madhuri). ప్రాంక్ పేరుతో మనసులో ఉన్న కోపం, అక్కసునంతా సంజనాపై కక్కేసింది. ఆమె తిట్ల దండకానికి జడుసుకున్న సంజనా.. వెంటనే కట్ చెప్పేసి ఇదంతా ఊరికనే చేశామని చెప్పి ఊపిరి పీల్చుకుంది. మాధురి.. దివ్యను టార్గెట్ చేసిందో ఏంటోకానీ, మరోసారి ఆమెతో గొడవపడింది. దివ్య సాధారణంగా మాట్లాడుతుంటే కూడా నువ్వెంత? అని చీప్గా తీసిపడేసే ప్రయత్నం చేసింది. రూల్స్ పాటించనని, తనకు నచ్చినట్లుగానే ఉంటానని, అది నచ్చకపోతే హౌస్ నుంచి వెళ్లిపోమని దివ్యకు ఆర్డర్ వేసింది. లైవ్లో హౌస్మేట్స్ అందరికీ ఇంకా చాలానే ఆంక్షలు పెట్టింది.నా రూల్స్ నచ్చకపోతే వెళ్లిపోరాత్రి ఇకఇకలు పకపకలు ఉండొద్దని, లైట్స్ ఆఫ్ అయ్యాక అంతా సైలెంట్గా ఉండాలంది. మీ అల్లరి వల్ల తన నిద్ర చెడిపోతే క్షమించను అని వార్నింగ్ ఇచ్చింది. పొద్దున పాట వచ్చేవరకు మాట్లాడొద్దని కండీషన్ పెట్టింది. అంతగా మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాకి వెళ్లి సైలెంట్గా మాట్లాడుకోమంది. ఈ రూల్స్కు రీతూ ఒప్పుకోలేదు. మీరు చెప్పిన మాట వినేందుకు ఇక్కడికి రాలేదు. బిగ్బాస్ రూల్స్ మాత్రమే పాటిస్తా అని కరాఖండిగా చెప్పింది. నా రూల్స్ నచ్చకపోతే బిగ్బాస్ హౌస్ నుంచి వెళ్లిపోమనగా.. నేనెందుకు వెళ్తా.. కావాలంటే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది రీతూ. మాధురి రూల్స్ పెడుతుంటే కెప్టెన్ ఏం చేస్తున్నాడో మరి!ఓవరాక్షన్ ఆపవే..కిచెన్లో గిన్నెలు తోమే దగ్గర ఆయేషా, రీతూకి పంచాయితీ అయింది. రాత్రి గిన్నె కడగనని ఆయేషా.. అది అర్ధరాత్రి సింక్లో వేశారని రీతూ గొడవపడ్డారు. నీ పని నువ్వు చేయకపోతేనే కదా అడుగుతున్నాను.. ఫస్ట్ కరెక్ట్గా ఉండు.. అని కోప్పడింది ఆయేషా. నువ్వు కూడా ఉండని రీతూ అనగా.. నువ్వు ఊరుకోవే.. ఏం పని చేయవు, అడిగితే న్యన్యన్య అంటావ్ అని ఆయేషా వెక్కిరించింది. మధ్యలో మాధురి కూడా దూరిపోయి రీతూపై రెచ్చిపోయింది. ఏయ్.. నీకో స్టాండ్ లేదా? అబద్ధాలు ఆడుతున్నావ్ అంటూ మండిపడింది. రీతూ కూడా తగ్గకుండా ఆమెకు కౌంటర్లిచ్చింది. ఇక గిన్నెలు తోముతున్న ఆయేషా.. ఆపవే ఓవరాక్షన్.. మాటలు ఆపేయ్ ఫస్ట్.. అంటూ రీతూను వాయించేసింది.పెద్ద లిస్ట్ చదివిన పచ్చళ్ల రమ్యమరోవైపు పచ్చళ్లపాప రమ్య మోక్ష తన సూపర్ పవర్ ఉపయోగించేసింది. ఈరోజు కోసం నిన్న ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ అంటే ఏదో బిర్యానీ, ఐస్క్రీమ్ అంతేగా అనుకునేరు.. కాదుకాదు! టిఫిన్లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్ బజ్జీ.. లంచ్లోకి ఎగ్ బిర్యానీ, చికెన్ జాయింట్స్, వెజ్ టిక్కా పిజ్జా.. సాయంత్రం బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు, మిక్చర్, ఫ్యామిలీ ప్యాక్ ఐస్క్రీమ్, చాక్లెట్స్.. డిన్నర్కు చికెన్, వెజ్ పికిల్స్, నాన్వెజ్ పికిల్స్.. ఇలా పేద్ద లిస్ట్ చదువుకుంటూ పోయింది. ఈ ఫుడ్ను హౌస్మేట్స్ అందరూ ఆస్వాదించేందుకు వీల్లేదు. కేవలం రమ్య.. ఆమె సెలక్ట్ చేసిన సుమన్ మాత్రమే కలిసి షేర్ చేసుకోవాలి.చదవండి: దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు.. -
మాధురి వస్తువు దొంగతనం.. గొడవ పడాలని చూస్తున్నావా?
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మంచి ఊపు మీద ఉన్నట్లున్నారు. గొడవలు పెట్టుకోవడమే పనిగా ప్రతిదానికి రచ్చ రచ్చ చేస్తున్నారు. మాధురి అయితే ఇప్పుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారిపోయింది. బుధవారం అటు సంజనతో ఇటు దివ్యతో గొడవలు పెట్టేసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. చూస్తుంటే 38వ రోజు గట్టిగానే డ్రామా ఉండబోతుందనిపిస్తోంది.ఉదయం లేవడం లేవడమే.. వంటగదిలోకి వచ్చిన మాధురి, బాత్రూమ్లో ఉంచిన తన స్టిక్కర్స్ని ఎవరు తీశారని సీరియస్ అయింది. సంజననే అవి తీసి పడేశానని అనడంతో.. నావి ఎందుకు తీస్తున్నావ్? అయినా నీకు దొంగతనం అలవాటేగా అని రెచ్చిపోయింది. మరోచోట కెప్టెన్ కల్యాణ్తో దివ్య మాట్లాడుతూ.. వీళ్లంతా మెంటల్ గాళ్లు అని రెండు మూడు రోజుల క్రితం వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి నోరు జారింది. స్మార్ట్, మెంటలో కాదు ఏదోటి కనిపించేయాలి, కంటెంట్ ఇచ్చేయాలి అన్నట్లు చేస్తున్నారని చెప్పుకొచ్చంది.(ఇదీ చదవండి: తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!)దీని తర్వాత కిచెన్లో ఉన్న ఎగ్ దోశలు వేసుకున్న మాధురి, కొంత కూర కూడా ప్లేటులో వేసుకుంది. నన్ను అడగకుండా ఎందుకు వేసుకున్నారని దివ్య అడిగేసరికి.. కొద్దిగా వేసుకున్నాను అని మాధురి సమాధానమిచ్చింది. ఒక్క సెకన్ అరవకండి అని దివ్య అనేసరికి.. వచ్చిన నుంచి గొడవ పడాలని చూస్తున్నావా అంటూ మాధురి సీరియస్ అయింది. నాకు ఈ ఫుడ్ మానిటర్ నచ్చలేదు మార్చేయండి అని చెప్పింది.పర్సనల్గా నాకు మీకు బాండింగ్ అవసరం లేదు అని దివ్య అనగానే.. నాకు అస్సలు అవసరం లేదమ్మా, మీ బాండింగ్లు నాకెందుకు వాట్ ఏ జోక్, మేం బాండింగ్స్ కోసం వచ్చామనుకున్నారా? గేమ్ కోసం వచ్చామనుకున్నారా? నాన్న నాన్న అనుకుంటూ అని దివ్యని ఎగతాళి చేస్తున్నట్లు మాధురి మాట్లాడింది. ఎవరన్నారు అని దివ్య అనగానే.. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారట అని మాధురి సామెత చెబుతూ తనూజవైపు చూసింది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?) -
వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఈసారి నామినేషన్స్లో ఎవరంటే?
ఆదివారం ఎపిసోడ్తో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో మాధురి, రమ్య మోక్ష, ఆయేషా, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస సాయి ఉన్నారు. వస్తూవస్తూనే వీళ్లకు పవర్స్ ఇచ్చిన బిగ్బాస్.. ఈ వారం నామినేషన్లోనూ అదిరిపోయే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఈసారి గట్టిగానే వాదోపవాదనలు జరిగాయి. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇంతకీ ఆరోవారం ఎవరెవరు నామినేట్ అయ్యారు?(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన 'జగద్ధాత్రి' సీరియల్ నటి)వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని ఈ వారం నామినేట్ చేసే అవకాశం లేదు. అయితే 'ఫైర్ బాల్' అనేది ఏర్పాటు చేసిన పైపు నుంచి పడుతుంది. బజర్ మోగే సమయానికి అది ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్లు.. ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లలో ఒకరికి ఇవ్వొచ్చు. అలా బాల్ అందుకున్న కంటెస్టెంట్.. పాతవాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా తనూజ.. సుమన్ శెట్టి, రాము.. పవన్ని నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు.అయితే 'ఫైర్ బాల్' పోటీలో పికెల్స్ పాప రమ్య గట్టిగానే పోరాడింది. అలానే నిఖిల్ కూడా బాల్ అందుకున్నాడు. అలా ఈసారి భరణి, తనూజ, పవన్, దివ్య, రాము, సుమన్ శెట్టి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వీళ్లలో సుమన్ శెట్టి గతవారం డేంజర్ జోన్లో ఉన్నాడు. చివరవరకు వచ్చినప్పటికీ శ్రీజ ఎలిమినేట్ కావడంతో సేవ్ అయిపోయాడు. ఈసారైనా గేమ్స్ ఆడి సేఫ్ జోన్లోకి వస్తాడా? లేదంటే బయటకొచ్చేస్తాడా అనేది చూడాలి. లేదంటే మాత్రం దివ్యపై వేటు పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు.ఈ వారం నామినేట్ అయినోళ్లుభరణిపవన్దివ్యరాముసుమన్తనూజ(ఇదీ చదవండి: ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!) -
ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9)లో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు దివ్వెల మాధురి (Madhuri Divvala). ఒకరు నాకెదురొచ్చినా వారికే రిస్క్.. నేను వారికి ఎదురెళ్లినా వారికే రిస్క్ అంటూ హౌస్మేట్స్కు వార్నింగ్ ఇస్తూనే ఇంట్లో అడుగుపెట్టింది. అంతేగాకుండా ఇకపై తన పేరు దివ్వెల కాదు దువ్వాడ మాధురి అని ప్రకటించింది. హౌస్లో అడుగుపెట్టి ఒక పూటయిందో, లేదో.. అప్పుడే గొడవలు మొదలుపెట్టేసింది.కెప్టెన్తో గొడవకిచెన్లో పని చేస్తున్న మాధురిని కూర్చోమన్నాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు కూర్చోమంటూ గౌరవంతో కుర్చీ ఆమెవైపుకు జరిపాడు. అందులోనూ పెడార్థం వెతికింది మాధురి. నేను వెళ్లాలి.. కూర్చోకపోతే ఊరుకోరా? అని అడిగింది. అప్పటికీ కల్యాణ్ ఎంతో ఓపికగా.. ఈరోజు వంట చాలా లేట్ అయింది.. రేపటినుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని సుతిమెత్తగా హెచ్చరించాడు. ఎవర్నీ లెక్క చేయని మాధురినేను అరగంట కూర్చున్నాను. అప్పుడు లేట్ అవుతుందని తెలియదా? అప్పుడేం చేశారు? అని తిరిగి కెప్టెన్నే తప్పుపట్టింది మాధురి. మీరిలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా అని వార్నింగ్ ఇచ్చాడు కల్యాణ్. దీంతో దివ్య మధ్యలో కలగజేసుకుని వంట ఆలస్యమవుతుందని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె వినిపించుకుంటేగా! అస్సలు లెక్కచేయలేదు. నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందన్న కల్యాణ్ మాటల్ని మాత్రం బలంగా పట్టుకుంది. ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్?అందుకు కల్యాణ్.. నేను గౌరవంతో కూర్చోమని చెప్పాను.. అందుకామె వెటకారంగా మాట్లాడటం అవసరమా? అని వాదించాడు. ఏయ్.. వాయిస్ ఎందుకు లేస్తుంది? ఎందుకు అరుస్తున్నావ్? అని మాధురి కల్యాణ్పై కోప్పడింది. అందరిపై అరిచేసిన మాధురి చివర్లో మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. అనాల్సిన మాటలన్నీ అనేసి లాస్ట్లో ఏడవడం దేనికని కల్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. ఫైర్ బ్రాండ్ అనుకున్న మాధురి అప్పుడే కన్నీటి కుళాయి తిప్పడం.. చూసేవారికి కాస్త విడ్డూరంగానే కనిపిస్తోంది. చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్: రికార్డు సృష్టించిన లాపతా లేడీస్.. ఏకంగా -
నాలుగేళ్లుగా శ్రీనివాస్తోనే బతుకుతున్నా.. నరకం చూడని రోజంటూ లేదు!
బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో దివ్వెల మాధురి (Madhuri Divvala) వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే బంధాలు, బంధుత్వాలు జాన్తానై.. ఆడేందుకు వచ్చా, గెలిచే పోతా అని ధీమాగా చెప్తోంది. అంతేకాదు, తన పేరును దువ్వాడ మాధురిగా మార్చేసుకుంది. తన ఇంట్రో వీడియోలో ఇంకా ఏమందంటే.. నాది ముక్కుసూటిగా ఉండేతత్వం.. అందుకే ఫైర్బ్రాండ్ అని పిలుస్తుంటారు. నాకు ఇంటర్లోనే పెళ్లి చేశారు. ఆరాధ్య, అర్హ, అఖిల.. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వీళ్లే నా ప్రపంచం.కలిసుందామని ప్రయత్నించా..మొదటినుంచీ నాకు, నా భర్తకు మధ్య అండర్స్టాండింగ్ తక్కువ. అయినా సరే కలిసుండేందుకు చాలా ఏళ్లు ప్రయత్నించాను. కానీ, అస్సలు కుదురలేదు. చివరకు విడిపోవాల్సి వచ్చింది. కుటుంబ సమస్యల వల్ల ఒంటరిగా మిగిలినప్పుడు అదే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ గారు ఒంటరిగా కనిపించారు. తనతో నా జర్నీ మొదలైంది. మాధురి అంటే శ్రీనివాస్.. శ్రీనివాస్ అంటే మాధురిగా నాలుగేళ్లుగా కలిసి బతుకుతున్నాం.అర్థమైందా రాజాఅయితే ఈ నాలుగేళ్లలో నేను నరకం చూడని రోజంటూ లేదు. ప్రతిరోజు సోషల్ మీడియాలో నాపై నెగెటివ్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉన్నారు. ఆడపిల్లలని చూడకుండా నా కూతుర్లని ట్రోల్ చేశారు. నిజంగా నేనేంటో మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడు దువ్వాడ మాధురి 2.0ని బిగ్బాస్ హౌస్లో చూస్తారు, అర్థమైందా రాజా.. అని ఇంట్రో వీడియోలో పేర్కొంది. ఆయన వద్దంటే షోకి రాకపోయేదాన్నినాగార్జున దగ్గర కూడా మాట్లాడుతూ.. సమాజమంతా ఒకవైపు నిలబడితే.. నేనొకవైపు నిలబడ్డాను. నా జీవితం నాకు నచ్చితే చాలు, ఎవరికీ నచ్చాల్సిన అవసరం లేదు. దాదాపు 80% మంది నన్ను అర్థం చేసుకున్నారు. ఇంకా 20% మంది ఎందుకు నాకు నెగెటివ్గా ఉండాలి. వారిని కూడా నావైపు తిప్పుకోవడానికే బిగ్బాస్ హౌస్కు వెళ్తున్నా.. దువ్వాడ శ్రీనివాస్ గారి కోసం ఏదైనా వదులుకుంటాను. ఆయన చెప్పారు కాబట్టే ఈ షోకి వచ్చాను. ఆయన వద్దని అభ్యంతరం చెప్పుంటే రాకుండా ఉండిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. మరి దువ్వాడ మాధురి హౌస్లో ఎలా ఉంటుంది? వైల్డ్ ఫైర్లా అగ్గి రాజేస్తుందా? అనేది చూడాలి!చదవండి: పవన్ను వదల్లేనంటూ రీతూ ఏడుపు.. పోయి హగ్ చేసుకోమన్న ఫ్లోరా -
హీరో ప్రదీప్ డేంజర్ అన్న బ్యూటీ.. బిగ్బాస్ స్టేజీపై దివ్వెల మాధురి డ్యాన్స్
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై నెల రోజులవుతోంది. మొదట్లో ఊపు మీదున్న షో తర్వాత కాస్త గాడితప్పింది. దీంతో బిగ్బాస్ షోకు సరికొత్త హంగామా తీసుకొచ్చేందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను దింపుతున్నారు. ఈ రోజు రాత్రి ఆరుగురు సెలబ్రిటీలు హౌస్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్గా ఉంటాయని హెచ్చరించాడు నాగ్. తమిళ, కన్నడ, మలయాళ బిగ్బాస్ల హోస్ట్లతోనూ నాగ్ ముచ్చటించాడు. డ్యూడ్ సినిమా హీరోహీరోయిన్ ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు స్టేజీపైకి అతిథులుగా విచ్చేశారు. ప్రదీప్ చాలా డేంజర్పనిలో పనిగా రెండు స్టెప్పులు కూడా వేశారు. ఈ సందర్భంగా.. ప్రదీప్ ప్రమాదకరమైన వ్యక్తి అని నాగార్జునకు కంప్లైంట్ చేసింది మమిత. అది విని అవాక్కైన ప్రదీప్.. నేనేం చేశాను? అని నోరెళ్లబెట్టాడు. అందుకు మమిత చిరునవ్వుతోనే అయినా నువ్వు కొంచెం డేంజరసే అని మరోసారి నొక్కి చెప్పింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్లు హౌస్లో అడుగుపెట్టనున్నారు. దివ్వెల మాధురి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మరి మిగతావాళ్ల ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి! చదవండి: బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి -
బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి
బిగ్బాస్ 9వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఆరుగురు హౌస్లోకి వెళ్లబోతున్నారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ మాధురి అనే కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియాలో గట్టిగానే డిస్కషన్ నడుస్తోంది. దానికి తోడు ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే తన ఎంట్రీ గురించి ఈమె బయటపెట్టేసింది. వైల్డ్గా ఉండేవాళ్లే వైల్డ్ కార్డ్గా వెళ్తారని, హౌస్లోకి వెళ్లిన తర్వాత నేనేంటో చూపిస్తానని ఛాలెంజ్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!)'వైల్డ్గా ఉండేవాళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఇలా వెళ్తున్నా. బిగ్బాస్ నుంచి కాల్ రాగానే ముందు వద్దని అనుకున్నా, కానీ చాలామంది ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్లు వచ్చాయి. ప్లీజ్ మేడమ్ మిమ్మల్ని షోలో చూడాలనుకుంటున్నాం అని చాలామంది అనడం వల్ల వెళ్దామని నిర్ణయం తీసుకున్నాను. అనుభవం, జనాలకు ఇంకా చేరువ కావాలి అనే ఉద్దేశం కూడా నాకు ఉంది' అని మాధురి చెప్పుకొచ్చింది.'హౌస్లో ఉన్నవాళ్లందరూ మాస్క్లు వేసుకుని ఉన్నారు. అందరూ యాక్టింగ్ చేస్తున్నారు. ఫేక్ రిలేషన్స్ మెంటైన్ చేస్తూ ఫేక్గా ఉంటున్నారు. కొద్దోగొప్పో ఇమ్మాన్యుయేల్ బెటర్గా అనిపిస్తున్నాడు. ఉన్నవాళ్లలో ఎవరూ నాకు టఫ్ ఫైట్ ఇస్తారని అనుకోవట్లేదు. ఇకపోతే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కామనర్స్ ఓవరాక్షన్ చేస్తున్నారు. అందుకే ఎలిమినేట్ అయి బయటకొచ్చేస్తున్నారు. ఎన్నిరోజులు ఉంటారనే ప్రశ్నకు బదులిస్తూ.. 'ఒక రోజులో బయటకొచ్చేసినా పశ్చాత్తపపడను. టాప్-5కి వెళ్లినా ఏం అనుకోను. కప్ గెలుచుకున్నా సరే పొంగిపోను. అన్ని టాస్కులు ఆడగలను నేను. నా ఆట నచ్చితే ఓట్లు వేయండి లేదంటే వద్దు' అని షోపై మాధురి తన అభిప్రాయాన్ని చెప్పింది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
బిగ్బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!
ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఆదివారం ఎపిసోడ్లో మొత్తం ఆరుగురు రాబోతున్నట్లు లీకులు వచ్చేశాయి. వీళ్లకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసి షాకిచ్చినట్లు తెలుస్తోంది.లక్స్ పాప ఫ్లోరాతో పాటు కామనర్ శ్రీజ.. ఐదో వారం ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేశారట. మరోవైపు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా ఆరుగురు రాబోతున్నారట. వీళ్లలో ముగ్గురు సీరియల్ నటులే కావడం విశేషం. ఇంతకీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఎవరెవరు వస్తున్నారు? వీళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది చూద్దాం.రమ్య మోక్షసోషల్ మీడియాలో పికెల్స్ (ఊరగాయలు) బిజినెస్తో పాపులారిటీ తెచ్చుకున్న రమ్య మోక్ష.. వైల్డ్ కార్డ్గా రాబోతుందట. చెప్పాలంటే రమ్యతో పాటు ఈమెకు మరో ఇద్దరు అక్కలు ఉన్నారు. వీళ్లంతా కలిసి ఆన్లైన్లో పికెల్స్ బిజినెస్ చేస్తుంటారు. అయితే ఈమె ఫిజికల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. గొడవల విషయంలో ఎక్కడా తగ్గదు. ఈమెని ఇన్ స్టాలో ఫాలో అయ్యేవాళ్లకు ఈ విషయం తెలిసే ఉంటుంది. హౌస్లోకి వస్తే చాలామందికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశముంది.శ్రీనివాస్ సాయి'గోల్కోండ స్కూల్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ సాయి.. తర్వాత కాలంలో హీరోగా పలు చిత్రాలు చేశాడు. కానీ అవి ఏ మాత్రం ఇతడి కెరీర్కి ఉపయోగపడలేదు. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్టులేం లేనట్లు ఉన్నాయి. దీంతో బిగ్బాస్ వాళ్లు అప్రోచ్ అయితే వెంటనే ఓకే చెప్పేసినట్లున్నాడు. కుర్రాడు కాబట్టి హౌసులోకి వచ్చిన తర్వాత లవ్ ట్రాక్స్ లాంటివి ఉండొచ్చు.నిఖిల్ నాయర్'గృహలక్ష్మి' సీరియల్తో తెలుగు ప్రేక్షకులు తెలిసిన ఇతడు.. 'పలుకే బంగారమాయెనా' సీరియల్లోనూ హీరోగా నటించాడు. ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు. సిక్స్ ప్యాక్ కూడా ఉంది. హౌస్లోకి వచ్చిన తర్వాత ఫిజికల్ టాస్కుల్లో మిగతా వాళ్లకు పోటీ ఇవ్వడం గ్యారంటీ. సీరియల్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు కాబట్టి బాగా ఆడితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్సులున్నాయి.గౌరవ్ గుప్తాప్రస్తుతం 'గీత ఎల్ఎల్బీ' అనే సీరియల్ చేస్తున్నారు. ఇతడు కూడా సిక్స్ ప్యాక్ మెంటైన్ చేస్తున్నాడు. హౌసులోకి వెళ్లిన తర్వాత అటు లవ్ ట్రాక్స్తో పాటు ఫిజికల్గానూ మంచి పోటీ ఇచ్చే ఛాన్సుంది. చూడాలి మరి ఏం చేస్తాడో?ఆయేషా జీనత్వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఈమె చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. 'సావిత్రి గారి అబ్బాయి' సీరియల్తో ఇక్కడ కాస్త పాపులరే. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ రెండో సీజన్లోనూ పాల్గొంది. గతంలో తమిళ బిగ్బాస్ షోలో పాల్గొని రచ్చ రచ్చ చేసిన అనుభవం ఈమెకుంది. ఈమె వైల్డ్ కంటెస్టెంట్గా వైల్డ్ ఫైర్ చూపించే ఛాన్సులు గట్టిగానే ఉన్నాయి. ఆటనే కాదు గ్లామర్ పరంగానూ హౌసులోకి చాలామందికి పోటీ ఇవ్వడం గ్యారంటీ.దివ్వల మాధురిసోషల్ మీడియాలో రీల్స్తో పాపులారిటీ తెచ్చుకున్న దివ్వల మాధురి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిన్నటి వరకు సందేహంగానే ఉంది. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోంది. గతంలో ఆఫర్ వచ్చినా సరే రిజెక్ట్ చేసినట్లు చెప్పింది కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్.


