-
ఆసీస్ పర్యటనకు ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా: రిషబ్
న్యూఢిల్లీ: ధోనీ వారసుడిగా అప్పటి వరకు సాఫీగా సాగిన అతని ప్రయాణం.. అధిక అంచనాలు, బ్యాటింగ్లో నిలకడలేమీ, వికెట్ల వెనుక వైఫల్యం, ఫిట్నెస్ సమస్యల కారణంగా ఏకంగా జట్టులో స్థానం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడి, కుదుపునకు లోనైంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో(14 మ్యాచ్ల్లో 343 పరుగులు) బ్యాట్తో పర్వాలేదనిపించినా, వికెట్ కీపింగ్లో వైఫల్యాలు, అధిక బరువు కారణంగా.. సోషల్ మీడియాలో అతని అభిమానులకే టార్గెట్గా మారిపోయాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆసీస్ పర్యటనలో టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన అతను.. ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులకు ఆరాధ్యుడయ్యాడు. సోషల్ మీడియాలో తనను అవమానించిన వాళ్లకు ఇప్పుడతను డార్లింగ్ క్రికెటర్గా మారిపోయాడు. అతడే రిషబ్ పంత్. ఆసీస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్న రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలను పట్టించుకోకుండా ఆటపై దృష్టి సారించినందుకే తాను పూర్వవైభవాన్ని సాధించగలిగానని పేర్కొన్నాడు. ఆసీస్ పర్యటనకు ముందు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని, అయినప్పటికీ తాను ఏమాత్రం కుంగిపోలేదని, తన బలాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు సాగానని వివరించాడు. ఆటలో వైఫల్యాలు ఎదురైనప్పుడు విమర్శలు మామూలేనని, వాటిని ఆటతీరుతోనే తిప్పికొట్టాలని నిర్ణయించుకొన్నట్లు ఆయన పేర్కొన్నాడు. విమర్శలను పట్టించుకోకుండా ఉండేందుకు తాను సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నట్లు వెల్లడించాడు. ఆసీస్ పర్యటనలో అత్యధిక పరుగులు(3 టెస్టుల్లో 68.50 సగటుతో 274 పరుగులు) సాధించిన భారత క్రికెటర్గా నిలిచిన ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు.. తన ఆటతీరుతో విమర్శకుల నోళ్లు మూయించాడు. సిడ్నీ టెస్టులో అతను సాధించిన 97 పరుగులు, బ్రిస్బేన్ టెస్టులో అతని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్(89 నాటౌట్) టీమిండియా అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ క్రమంలో అతను అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ధోనీ పేరిట నమోదైవుంది. ఆసీస్ పర్యటనకు కేవలం టెస్టు జట్టు సభ్యుడిగా ఎంపికైన పంత్.. నిలకడలేమి, అధిక బరువు సమస్యల కారణంగా తుది జట్టులో ఆడతాడా లేదా అన్న అనుమానం ప్రతి భారతీయుడిలో ఉండింది. అయితే అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న పంత్ తన ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలనందుకున్నాడు. -
ఇక అగస్త్య డ్యూటీ...
ముంబై: నాలుగు నెలల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఆస్ట్రేలియా సిరీస్ అంటూ క్రికెట్లో తలమునకలై ఉన్న హార్దిక్ పాండ్యా శనివారం కొత్త బాధ్యతల్ని స్వీకరించాడు. తన నాలుగు నెలల కొడుకు అగస్త్య బాగోగుల్ని పాండ్యా భుజానికెత్తుకున్నాడు. ఆసీస్తో పరిమిత ఓవర్ల సిరీస్కే ఎంపికైన హార్దిక్ భారత్కు తిరిగి వచ్చేశాడు. ఇంటికి చేరుకోగానే తన బుజ్జాయి అగస్త్యకు పాలు పట్టిస్తూ సేదతీరాడు. ఆ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్న పాండ్యా ‘జాతీయ విధుల నుంచి తండ్రి బాధ్యతల్లోకి’ అనే వ్యాఖ్యను జతచేశాడు. ఆసీస్తో వన్డేలు, టి20ల్లో అదరగొట్టిన పాండ్యాకు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ‘వన్డే, టి20 సిరీస్ ముగియగానే ఇంటికి వెళ్లేందుకే ప్రణాళికలు వేసుకున్నా. నేను వదిలి వచ్చినప్పుడు అగస్త్య 15 రోజుల పసికందు. ఇప్పుడు 4 నెలల చిన్నారి. అతన్ని చాలా మిస్ అయ్యా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని ఎదురు చూశా’ అని పాండ్యా పేర్కొన్నాడు. -
‘మ్యాట్’పై విహారి సాధన...
సాక్షి, హైదరాబాద్ : భారత ఆటగాళ్లు, పలువురు దేశవాళీ క్రికెటర్లు ఐపీఎల్ 2020 కోసం యూఏఈలో సన్నద్ధమవుతుండగా... తెలుగు కుర్రాడు, టెస్టు జట్టు సభ్యుడు హనుమ విహారి ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటన కోసం భిన్నమైన కసరత్తులు చేస్తున్నాడు. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్ అయిన విహారి క్లిష్టమైన కంగారు పర్యటన కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాడు. ‘ఐపీఎల్లో అవకాశం దక్కి ఉంటే బావుండేది. అయితే ఆడే చాన్స్ లేకపోవడంపై ఎక్కువగా ఆలోచించడం లేదు. ఇప్పుడు నేను ప్రాక్టీస్పైనే దృష్టి సారించాను. కోచ్ శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో నా సాధన కొనసాగుతోంది’ అని విహారి అన్నాడు. లాక్డౌన్ వల్ల బయటికి వెళ్లి ప్రాక్టీస్ చేసే అవకాశం లేకపోవడంతో తన ఇంటి పరిసరాల్లోనే మ్యాటింగ్ వికెట్పై ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెట్ సెషన్ కోసం కోచ్ సలహా మేరకు ఈ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాడు. ఆసీస్లోని బౌన్సీ వికెట్లపై ఆడేందుకు ఈ విధమైన మ్యాటింగ్ వికెట్ ప్రాక్టీస్ దోహదం చేస్తుందని విహారి తెలిపాడు. భారత దిగ్గజాలుగా ఎదిగిన అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్లు కూడా ఇలాంటి మ్యాట్ పిచ్లపైనే ప్రాక్టీసే చేశారు. ఐపీఎల్లో ఆడని భారత క్రికెటర్ల సన్నాహాల్ని ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పర్యవేక్షిస్తున్నారు. నిజానికి విహారి ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వల్ల అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో అక్కడికి వెళ్లలేకపోయాడు. -
టీమిండియాకు అదో హెచ్చరిక
ముంబై: ప్రపంచకప్ సులువుగా గెలుస్తుందనుకున్న టీమిండియాకు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ఓ హెచ్చరిక వంటిదని మాజీ దిగ్గజ క్రికెటర్, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. తొలి రెండు మ్యాచ్లు గెలిచి ఆధిక్యంలో ఉన్నప్పటికీ 2-3తో సిరీస్ కోల్పోవడం దారుణమన్నాడు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో సంజయ్ మంజ్రేకరతో కలిసి పాల్గొన్న ద్రవిడ్ పలు విషయాలపై చర్చించారు. రెండేళ్లుగా టీమిండియా అద్భుత ఫామ్లో ఉందని.. దీంతో ప్రపంచకప్ సులువుగా గెలుస్తుందని అందరూ భావించారన్నారు. ఇలాంటి సమయంలో ఆసీస్తో సిరీస్ ఓటమి ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. అయితే ప్రపంచకప్కు ముందు ఈ ఓటమి కోహ్లి సేనకు ఎంతో మంచి చేస్తుందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమితో ఆటగాళ్లు మరింత క్రమశిక్షణతో కష్టపడాలని సూచించాడు. ఆసీస్పై అనూహ్యంగా ఓడిపోయినప్పటికీ కోహ్లి సేననే ప్రపంచకప్లో ఫేవరేట్ అంటూ ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే అక్కడి పరిస్థితులు, ఒత్తిళ్లను ఎంత తొందరగా జయిస్తే అంతమంచిదన్నాడు. ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తున్న ఐపీఎల్లో ఆటగాళ్ల పనిభారంపై కూడా స్పందించాడు. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని బోర్డు ఫ్రాంచైజీలకు సూచించాల్సిన అవసరం లేదన్నాడు. తమ శరీరం, ఫిట్నెస్పై ఆటగాళ్లకు ఓ అవగాహను ఉంటుందన్నారు. క్రమం తప్పకుండా బౌలింగ్ చేయడం వలన లయ తప్పకుండా ఉంటుందని కమిన్స్ చెప్పిన మాటలను ద్రవిడ్ గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తరుచూ గాయపడుతున్నాడని.. ఈ విషయాన్ని అతడే గమనించుకోవాలన్నాడు. ఐపీఎల్లో ఆడాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆటగాళ్లకే వదిలేయాలని ద్రవిడ్ సూచించాడు. -
అశ్విన్పై హర్భజన్ విమర్శలు
ముంబై: ఆస్ట్రేలియా సిరీస్లో భారత ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిట్నెస్ తీరును మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా తప్పు పట్టాడు. జట్టు ప్రధాన స్పిన్నర్ సొంతగడ్డపై మాత్రమే వికెట్లు తీస్తూ విదేశాల్లో గాయాలకు గురవుతున్నా డంటే ఆందోళన చెందాల్సిన అంశమని అతను అన్నాడు. ‘ఇంగ్లండ్లో తొలి టెస్టులో మాత్రమే అశ్విన్ రాణించాడు. ఆ తర్వాత అతను పదును కోల్పోవడంతో పాటు గాయాలపాలయ్యాడు. అడిలైడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన అశ్విన్కు మరో 3 వికెట్లు తీసేందుకు ఏకంగా 52 ఓవర్లు అవసరమయ్యాయంటే విదేశాల్లో అతని పేలవ రికార్డు ఏమిటో తెలుస్తుంది’ అని భజ్జీ విరుచుకు పడ్డాడు. జడేజా, కుల్దీప్లనే మున్ముందు అశ్విన్కు బదులుగా ప్రధాన స్పిన్నర్లుగా తుది జట్టులోకి తీసుకోవాలని అతను సూచించాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement