Top Stories
ప్రధాన వార్తలు
ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
జూన్ 4.. సరిగ్గా ఇంకో ఆరో రోజులు మాత్రమే. లోక్సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే రోజది. అదే సమయంలో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు.. ఎలాంటి తీర్పు వెలువడనుందో అని రాజకీయ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.ఏపీలోనూ ఈ రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు పైన రాజకీయ వర్గాల్లో, మరోవైపు ఓట్లేసిన ప్రజల్లోనూ టెన్షన్ మొదలైంది. ఇదే అదనుగా గెలుపొటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. కవైపు తమ రాజకీయ భవితవ్యాన్ని తేల్చేవిగా కూటమి ఈ ఎన్నికలు భావిస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్సీపీ మాత్రం మొదటి నుంచి గెలుపు ధీమా ప్రదర్శిస్తోంది. అయితే.. ప్రధాన పార్టీల మధ్య గెలుపు పైన ఉత్కంఠ కొనసాగుతుంటే.. పోలింగ్ అనంతర పరిణామాలతో ఏర్పడిన ఉద్రిక్తత మరో టెన్షన్ కు కారణమవుతోంది.ఎన్నికల పోలింగ్ టైంలో జరిగిన హింసాత్మక ఘటనలు, తమ పార్టీ నేతలను.. కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, తదనంతర పరిణామాలపై వైఎస్సార్సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీలో పోలీసులు, ఎన్నికల సంఘం తీరును ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కౌంటింగ్ రోజున అవాంఛనీయ ఘటనలు జరగవచ్చనే అనుమానాలతో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో.. ఈసీ అలర్ట్ అయ్యింది. మరింత విమర్శలు వెల్లువెత్తకుడా ముందస్తు చర్యలు చేపట్టింది.శాంతి భద్రతలను విఘాతం కల్గకుండా.. ఏపీ ఎలక్షన్ కౌంటింగ్ కోసం అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీసు ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్కు సీఐడీ డీఎస్పీ సోమన్నను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా పల్నాడు గురించి చర్చించారు. ఏకంగా ఎనిమిది మంది పోలీసు అధికారులను ప్రత్యేకంగా అక్కడ మోహరించారు.మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. కౌంటింగ్ రోజున భద్రత కోసం ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్రబలగాల నిఘా నీఢలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటోంది. మొత్తంగా.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెబుతోంది.ఇదీ చదవండి: ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో! పార్టీల తీరు ఇలా..ఏపీలో వైఎస్సార్సీపీలో జోష్ కనిపిస్తోంది. మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఓ అడుగు ముందుకు వేసి జూన్ 9న కాబోయే పాలనా రాజధాని విశాఖలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెబుతున్నారు. అయితే.. గత ఐదేళ్ల కాలంలో నిత్యం ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ మాత్రం.. ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయింది. కూటమికి బాకా ఊదిన ఎల్లో మీడియా ఒకట్రెండు రోజులు విజయం కూటమిదే అంటూ హడావిడి చేసినప్పటికీ.. తర్వాత చల్లబడి పోయింది. బీజేపీ, కాంగ్రెస్ల గురించి ప్రస్తావించుకోవడం కూడా అనవసరమేమో!.ఇక.. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్ అధికారికంగా లండన్పర్యటనకు వెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అత్యంత గోప్యంగా పర్యటనకు వెళ్లడమూ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి పురందేశ్వరి, షర్మిల సంగతి సరేసరి. ఫలితాలను ముందే ఊహించి వాళ్లు ఇలా మౌనంగా ఉండిపోతున్నారా? అనే చర్చా ఏపీలో నడుస్తోంది ఇప్పుడు.
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా పేరెంట్స్!
పాపం పసివాళ్లు. అభం శుభం తెలియని పసి మనసులు.. అటు కన్నవారికి ఇప్పుడు ఇటు పెంచిన మమకారానికి దూరం కావడంతో తల్లడిల్లిపోతున్నాయి. ఇంతకాలం తమ బిడ్డలేనని మురిసిపోయిన ఆ తల్లులు బరువెక్కిన హృదయంతో కంటతడి పెడుతున్నారు. పోలీసులు ఆ చిన్నారుల్ని తీసుకెళ్తుంటే వాహనాల వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు బాధ కలిగిస్తున్నాయి. హైదరాబాద్, సాక్షి: నగరంలో కలకలం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన రాచకొండ కమిషనరేట్ బృందాలు.. విక్రయ ముఠా కోసం గాలింపు చేపట్టాయి. పోలీసుల అదుపులో ఉన్న ముఠా సభ్యులు అందించిన సమాచారం ప్రకారం.. కిరణ్, ప్రీతిలను కీలక సూత్రధారులుగా నిర్ధారించుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు 50 మందికి విక్రయించినట్లు తేలింది. గుంటూరు, విజయవాడ, కరీంనగర్.. తెలుగు రాష్ట్రాల్లో ఆ పిల్లల్ని అమ్మేసినట్లు గుర్తించింది. అయితే.. ఇప్పటివరకు 16 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు.. ఇటు నిందితులతో పాటు అటు మిగిలిన 34 మంది చిన్నారుల ఆచూకీ కోసం, ఇంకోవైపు ఈ పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరు? అనే అంశాలపై విడివిడిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో 13 మంది పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ఆ పేరెంట్స్ను నిందితులుగా ఈ కేసులో చేర్చారు. దీంతో వాళ్లంతా లబోదిబోమంటున్నారు.ఇదీ చదవండి: వాట్సాప్లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ..
సినబాబుకి మరోసారి మంగళమేనా!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు శాఖల మాజీ మంత్రి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు పరీక్షా సమయమిది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఈసారైనా గట్టెక్కగలిగితే ఊపిరి పీల్చుకున్నట్లే. లేదంటే రాజకీయంగా అధోగతే అనే అనుమానాలు స్వపక్షీయుల్లోని సీనియర్లు, శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. పోలింగ్ అనంతరం విభిన్న కోణాల్లో వేసుకుంటున్న అంచనాలలో అంతర్గత అనుమానాలు అనేకం ఉన్నప్పటికీ బయటకు మాత్రం టీడీపీ గెలుపుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తొలి అడుగులే తడబాటుతో.. రాష్ట్ర విభజనానంతరం అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధాని కేంద్రంగా ప్రకటించి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తతపరచిన నాటి పాలకపక్షానికి గుంటూరు, కష్ణా జిల్లా ప్రజలు తగురీతినే బుద్ధి చెప్పారు. 2019 సాధారణ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి కర్రుకాల్చి వాతపెట్టారు. కరకట్ట వెంట అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండానే ఎమ్మెల్సీగా ఎంపికై మూడు శాఖల మంత్రిగా కొనసాగిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీలేదనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో పరాజయం పాలైన లోకేష్ ఆ తరువాత అయినా రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేశారా అంటే అదీ లేదు. టీడీపీ ఆవిర్భావ సమయంలో 1983, 1985 ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు మినహా గెలిచిన దాఖలాలు లేవు. 1994లో సీపీఎం నుంచి రామ్మోహన్రావు గెలుపొందారు. బీసీ సామాజికవర్గం నుంచి గోలి వీరాంజనేయులు, మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల విజయం సాధించారు. ఆళ్ల రామకష్ణారెడ్డి రెండు పర్యాయాలు గెలుపొందడానికి పెదకాకాని వాస్తవ్యుడు కావడం, వ్యక్తిగతంగా మంచి గుర్తింపు ఉండటం, అన్నిటికన్నా మించి వై.ఎస్. కుటుంబానికి సన్నిహితులు కావడం. బీసీలకు చెందిన నియోజకవర్గంగా గుర్తింపున్న మంగళగిరి నుంచి తాను పోటీ చేయడమంటే సాహసించినట్లేనని లోకేష్ అభిప్రాయపడ్డారే తప్ప అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో దష్టి సారించిన దాఖలాలు లేవు. వైఎస్సార్ సీపీ వ్యూహాత్మక అడుగులు.. వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన ఆళ్ల స్థానంలో స్థానికురాలు, విద్యావంతురాలైన మురుగుడు లావణ్యను పోటీకి దింపడమే వైఎస్సార్ సీపీ విజయానికి తొలిమెట్టుగా పరిశీలకుల అభిప్రాయం. నియోజకవర్గంలో మెండుగా ఓటర్లు కలిగిన సామాజికవర్గానికి చెందిన లావణ్యది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తల్లి కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే, మామ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా. వీటికితోడు ఆ సామాజికవర్గానికి చెందిన స్థానిక సీనియర్ నాయకులైన చిల్లపల్లి మోహన్రావు, గంజి చిరంజీవి తదితరులకు వైఎస్సార్ సీపీ రాష్ట్రస్థాయి పదవులు కట్టబెట్టింది. కార్పొరేషన్ల డైరెక్టర్లుగా, దుర్గగుడి పాలకమండలి సభ్యులుగాను నియమించింది. ఎమ్మెల్యే ఆళ్ల ముందుచూపుతో దుగ్గిరాల (పసుపు) మార్కెట్ యార్డు చైర్మెన్ పదవిని ఎస్సీ, మైనార్టీలకు, మంగళగిరి ఏఎంసీని యాదవ, పద్మశాలి వర్గీయులకు అప్పగించారు. ఇక పార్టీ నాయకత్వం సోషల్ ఇంజినీరింగ్లో ఆచితూచి అడుగులేసింది. ఈ విషయంలో టీడీపీ ఎక్కడా సరితూగలేదు. అభివృద్ధికి దిక్సూచిగా.. మంగళగిరి, తాడేపల్లి మండలాలను కలిపి కార్పొరేషన్గా చేయడం, ప్రత్యేక గ్రాంటుగా రూ.130 కోట్లను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేటాయించడం, ఎవరూ ఊహించని రీతిలో గౌతమబుద్ధ రోడ్డును అభివద్ధి చేయడం, తొమ్మిది అర్బన్ హెల్త్ సెంటర్లు, సర్వ హంగులతో వై.ఎస్.ఆర్ క్రీడాప్రాంగణాన్ని తీర్చిదిద్దడం, అంతర్గత రహదారుల విస్తరణ, అభివద్ధి, విభిన్న సామాజికవర్గాల వారికి భవనాలు, కల్యాణ మండపాలను నిర్మించడం, ప్రధానమంత్రి దష్టికి తీసుకెళ్లి అభినందనలు అందుకునేలా పద్మశాలీయులకు మగ్గంలో శిక్షణ ఏర్పాట్లు నెలకొల్పడం తదితరాలు నియోజకవర్గ అభివద్ధికి దిక్సూచిగా నిలిచాయి. పల్లెల్లో డొంకరోడ్లు, సిమెంటు రోడ్లు, అంబేడ్కర్, జగ్జీవన్ రామ్, జ్యోతిరావుపూలే, సర్ధార్ వల్లభాయ్ పటేల్ తదితర ప్రముఖుల విగ్రహాల ఏర్పాట్లు నియోజకవర్గానికి అదనపు హంగులుగా మారాయి. ఆర్కే సొంతంగా నిధులు సమకూర్చడం, అవినీతికి తావు లేకుండా పనులు చేయడం, తరతమ భేదం లేకుండా అన్ని సామాజికవర్గాలకు చేరువగా ఉండటం పార్టీకి అన్నివిధాలా కలిసొచ్చింది. కార్పొరేట్ తరహాలో లోకేష్ బృందం.. మంగళగిరి నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్న లోకేష్ అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లలేదని స్వపక్షీయులే అంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో కాని, ఆ తరువాతైనా వ్యూహం కొరవడిందంటున్నారు. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా రావడం, అతితక్కువ మందిని కలవడం, స్థానికేతరుడు కావడం, ఆయన బందం కార్పొరేట్ తరహాలో వ్యవహారాలు నడపడం ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయాయనే విమర్శలు తొలి నుంచే ఉన్నాయి. తోపుడుబండ్లు, బడ్డీ కొట్లు ఇవ్వడం, పెళ్లికానుక పేరుతో రూ.5,000, సుమారు ఓ ఏడాదిపాటు రెండు చోట్ల అన్న క్యాంటీన్లను నడపడం వలన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఉండటాన్ని, లోకేష్ అందుబాటులో లేకపోవడాన్ని ప్రజలు బేరీజు వేసుకునే స్థితి. కూటమి నేతలతో అంటీముట్టనట్లు.. ఎన్నికలకు కూటమి కట్టినప్పటికీ నియోజకవర్గంలో జనసేన, బీజేపీలతో అంటీముట్టనట్లే పార్టీ వ్యవహరించిందని టీడీపీ ముఖ్యులే అభిప్రాయపడుతూ వచ్చారు. సమన్వయ సమావేశం కూడా జరగకపోవడం గమనార్హం. ముస్లిం, క్రిస్టియ¯Œ ఓటర్లు దూరమవుతారనే భయంతో బీజేపీ వారిని దరిజేరనిచ్చిన దాఖలాలు దాదాపు లేవు. బీజేపీ, జనసేనలకు చెందిన యడ్లపాటి రఘునాథబాబు, పాతూరి నాగభూషణం, జగ్గారపు శ్రీనివాసరావు, పంచుమర్తి ప్రసాదరావు, పూర్ణచంద్రరావు, శివన్నారాయణ, చిల్లపల్లి శ్రీనివాసరావు, గాదె వెంకటేశ్వరరావు తదితర నాయకులు నియోజకవర్గం వారైనప్పటికీ వారితో కలిసి పనిచేసిన సందర్భాలు తక్కువే. వీరిలో జనసేనకు చెందిన ఒకరిద్దరికి కాస్త ప్రాధాన్యం ఇచ్చారే తప్ప బీజేపీని పట్టించుకోలేదు. సీనియర్ నాయకులకే లోకేష్ అందుబాటులో ఉండరని, సెక్యూరిటీ వారిని దాటుకుని వెళ్లలేమని, కార్పొరేట్ తరహా రాజకీయాలు కొనసాగుతున్నప్పుడు తమలాంటి వారి సంగతి ఏంటనే ప్రశ్న సామాన్య ఓటర్ల మధ్య చర్చకు దారితీయడం నష్టదాయకంగా మారిందని అంచనా వేస్తున్నారు. లోకేష్ చుట్టూ ఆయన సామాజికవర్గం నేతలు చేరడం, తమ వాడైనందున ఓట్లు వేయండని హెచ్చరిక ధోరణిలో చెప్పడం, పెత్తందారీ పోకడలతో వ్యవహరించడం, మా మాట వినకపోతే మీకు ఉపాధి ఉండదని, కౌలుకు భూములు కూడా ఇచ్చేది లేదని కొందరు భయపెట్టే రీతిలో మాట్లాడటం కూడా ఓట్లకు చేటు తెచ్చేవే అనే వ్యాఖ్యానాలు పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.:::సాక్షి, ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణలో ప్రభుత్వం ఉందా? లేదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?.. లేదా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్పా? అని ప్రశ్నించారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..?విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు?పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది?ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..!నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు..ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా?తెల్లవారుజామున 4 గంటలకు లైన్లో నిలబడితే..సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా?గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు..10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా?రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా..రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు..దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా ?బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్నిఅధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా?ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి..!బ్లాక్ మార్కెట్కు తరలించకుండా కళ్లెం వేయండి..!!కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం అంటున్న.. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి..!!లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని..కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు..!!’ అని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..?విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ??పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ??ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ??నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు… pic.twitter.com/f22DOOMMDM— KTR (@KTRBRS) May 29, 2024
May 29th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 29th AP Elections 2024 News Political Updates..10:20 AM, May 29th, 2024ఈసీకి పేర్ని ప్రశ్నల వర్షం..పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల చెల్లుబాటుపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు..ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల చెల్లుబాటుపై పేర్ని నాని కామెంట్స్..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ రాష్ట్రంలోని ఆర్వోలు అందరికీ ఆదేశాలు జారీ చేశారు.వీటిపై వైఎస్సార్సీపీ తరపున మేము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాం.దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని వెసులు బాట్లు ఏపీలో ఎందుకు? ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ రాష్ట్రంలోని ఆర్వోలు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. వీటిపై వైయస్సార్సీపీ తరపున మేము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని వెసులు బాట్లు ఏపీలో ఎందుకు?-పేర్ని… pic.twitter.com/Kvl8KQW1s1— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 9:30 AM, May 29th, 2024హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు..పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబునేడు హైదరాబాద్కు చేరిన బాబు.అమెరికా నుంచి వచ్చినట్టు పచ్చ బ్యాచ్ లీక్లు. కానీ, చంద్రబాబు మాత్రం మౌనం.8:20 AM, May 29th, 2024నేడు హైదరాబాద్కు చంద్రబాబుఎన్నికల పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు.నేడు తిరిగి హైదరాబాద్కు రానున్న చంద్రబాబుఇన్నాళ్లు ఎక్కడున్నారో చెప్పని బాబు. 7:30 AM, May 29th, 2024అల్లర్లకు ప్లాన్ చేస్తున్నా టీడీపీ..మంత్రి మేరుగు నాగార్జున కామెంట్స్..కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలుఅయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఎన్నికల సంఘంచివరకు ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటని ప్రశ్నించిన మేరుగు నాగార్జున కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర! పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?-మంత్రి మేరుగు నాగార్జున#TDPLosing#YSRCPWinningBig pic.twitter.com/FLV1NZcVbf— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 ఆగని ‘సంక్షేమం’రాష్ట్రంలో పోలింగ్ తర్వాత కూడా ఆగని ‘చేయూత’లబ్ధిదారుల ఖాతాల్లో కొనసాగుతున్న డబ్బుల జమ పోలింగ్ అనంతరం 18న రూ. 1,513 కోట్లు24న మరో రూ. 200 కోట్లు, 27న ఇంకో రూ. 400 కోట్లు20న ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 629 కోట్లుఎన్నికలతో సంబంధం లేకుండా పథకాల లబ్ధి పొందిన మహిళలు 6:50 AM, May 29th, 2024ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో!పోస్టల్ బ్యాలెట్ ఆమోదంపై గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలుదేశవ్యాప్తంగా అవే అమలు కూడా..కానీ, డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ అధికారి స్టాంప్ లేకపోయినా.. సంతకం ఉంటే చాలు ఆమోదించాలని టీడీపీ విజ్ఞప్తిఆ మేరకు సడలింపు ఇస్తూ ఈనెల 25న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులుఅటెస్టింగ్ ఆఫీసర్ సంతకంపై అనుమానం వస్తే ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి వద్ద సంతకంతో సరిపోల్చుకోవాలని ఆదేశాలుఇది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో వివాదాలకు దారితీస్తుందంటున్న రాజకీయ పక్షాలు.. శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తుందంటూ ఆందోళనరాష్ట్ర ఎన్నికల సంఘం మరీ ఇంత ‘పచ్చ’పాతంపై విస్మయం 6:40 AM, May 29th, 2024ఈసీ అంపైర్లా లేదుదానికి చంద్రబాబు వైరస్ సోకింది.. వారంలో టీడీపీ పీడ విరగడఅధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీనేగీత దాటిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదువైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరికసీఈసీ మార్గదర్శకాలు దేశమంతా ఒకేలా ఉండాలి..పోలీసుల ద్వారా పిన్నెల్లిని అంతమొందించేందుకు బాబు కుట్రఅందుకే ఏడుగురి హత్య కేసులో నిందితుడైన బ్రహ్మారెడ్డికి మాచర్ల టికెట్చంద్రబాబు, ఎల్లో మీడియా కంటే ఉగ్రవాదులే నయంగోబెల్స్ ప్రచారం చేసి.. వ్యక్తిత్వహననంతో అధికారులను లొంగదీసుకునే యత్నంఅందులో భాగమే సీఎస్పై అభూతకల్పనలతో కథనాలు 6:30 AM, May 29th, 2024కౌంటింగ్లో అప్రమత్తత అవసరం ఫలితాలు వెలువడే వరకు ఏమరుపాటు పనికిరాదుఅనుమానాలు నివృత్తి చేసుకోవాలి.. కౌంటింగ్ ఏజెంట్ల జాబితా 31లోగా అందివ్వాలి వైఎస్సార్సీపీ అభ్యర్థులకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచన
T20 World Cup 2024: లంకేయులకు షాక్.. పసికూన చేతిలో పరాభవం
శ్రీలంక క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో వీరు చిత్తుగా ఓడారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. మైఖేల్ లెవిట్ (28 బంతుల్లో 55 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లెవిట్తో పాటు తేజ నిడమనూరు (27), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (12 బంతుల్లో 27 నాటౌట్) సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్ మధుషంక (4-0-39-2) రాణించగా.. నువాన్ తుషార, దునిత్ వెల్లలగే, ఏంజెలో మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. Excellent success 🤩 Our first T20 World Cup Warm-up Match ends with a 𝘄𝗶𝗻 🆚🇱🇰Thanks for your enthusiasm 🦁#kncbcricket #nordek #t20worldcup #cricket #srivned #outofthisworld pic.twitter.com/eFKtpiY5V6— Cricket🏏Netherlands (@KNCBcricket) May 28, 2024అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే తడబడింది. ఆ జట్టు పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. ఆతర్వాత కూడా లంక బ్యాటర్లు లయను అందుకోలేకపోయారు. ఏ దశలో గెలుపు దిశగా సాగలేకపోయారు. 18.5 ఓవర్లలో 161 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా నెదర్లాండ్స్ సంచలన విజయం నమోదు చేసింది. లంక ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ హసరంగ బ్యాట్ ఝులిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హసరంగ 15 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు వరుస సిక్సర్లు ఉండటం విశేషం. లంక ఇన్నింగ్స్లో హసరంగతో పాటు ధనంజయ డిసిల్వ (31), దసున్ షనక (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్యన్ దత్ 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టగా.. కైల్ క్లెయిన్ 2, లొగాన్ వాన్ బీక్ ఓ వికెట్ పడగొట్టారు. నెదర్లాండ్స్ తమ రెండో వార్మప్ మ్యాచ్ను మే 30న ఆడనుంది. డల్లాస్లో జరిగే ఈ మ్యాచ్లో ఆ జట్టు కెనడాను ఢీకొట్టనుంది. శ్రీలంక తమ రెండో వార్మప్ మ్యాచ్ను మే 31న ఆడనుంది. ఫ్లోరిడాలో జరిగే ఆ మ్యాచ్లో లంకేయులు ఐర్లాండ్తో తలపడతారు. ప్రపంచకప్లో శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు గ్రూప్-డిలో పోటీపడనున్నాయి. వీటితో పాటు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు గ్రూప్-డిలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. ఈ రెండు జట్ల మధ్య సమరం జూన్ 9న న్యూయార్క్లో జరుగనుంది.
రాజ్కోట్ గేమ్జోన్: మిస్సింగ్ అనుకున్నారు.. ప్రకాశ్ కూడా మృతి
గాంధీనగర్: రాజ్కోట్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో టీఆర్పీ గేమ్జోన్కు చెందిన ఒక సహ యజమాని మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. శనివారం టీఆర్పీ గేమ్జోన్లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి టీఆర్పీ గేమ్జోన్ ఓనర్లపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యజమానుల్లో ఒకరైన ప్రకాశ్ హిరాన్ అదే అగ్ని ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి తన సోదరుడు కనిపించడం లేదని ప్రకాశ్ హిరాన్ సోదరుడు జితేంద్ర హిరాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్లు కూడా స్వీచ్ ఆఫ్ వస్తున్నాయిని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలోనే ప్రకాశ్ కారు ఉన్నట్లు జితేంద్ర పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ప్రకాశ్ ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో డీఎన్ఏ టెస్ట్ చేసిన అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారిలో తన సోదరుడిని కనిపెట్టాలని జీతేంద్ర పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్ తల్లి డీఎన్ఏను తీసుకుని మృతదేహాలతో పోల్చి ప్రకాశ్ హిరాన్ మృతి చెందినట్లు ప్రకటించారు. టీఆర్పీ గేమ్జోన్లో ప్రకాశ్ హిరాన్ ప్రధానమైన షేర్ హోల్డర్గా ఉన్నారు. టీఆర్పీ గేమ్జోన్ను నిర్వహిస్తున్న ధావల్ ఠాకూర్తోపాటు మరో ఐదుగురిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో రేస్వే ఎంటర్ప్రైజెస్ పార్ట్నర్లు యువరాజసింగ్, రాహుల్ రాథోడ్, టీఆర్పీ గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్ ఉన్నారు.
లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించటం పాక్ తప్పే: నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ భారత్తో చేసుకున్న ఒప్పదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను,అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతకాలు చేసిన ‘లాహోర్ డిక్లరేషన్’ఒప్పందం ఉల్లంఘించామని తెలిపారు. ఆయన మంగళవారం పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) పార్టీ సమావేశంలో మాట్లాడారు.‘మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణుబాంబు పరీక్షలు చేపట్టింది. అనంతరం భారత్ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి లాహోర్కు వచ్చారు. ఆయన మాతో లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మేం ఉల్లంఘించాము. అది మా తప్పే. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉద్దేశపూర్వకంగా అగ్రిమెంట్ను అతిక్రమించారు’ అని అన్నారు.మార్చి,1999లో ముషారఫ్ పాక్ ఆర్మీకి ఫోర్ స్టార్ జనరల్గా ఉన్నారు. లడ్డాక్లోని కార్గీల్లో రహస్యంగా చొరబాడటానికి ఆదేశించారు. ఈ విషయంతో అప్రమత్తమైన ఇండియా యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయంలోనే తాను ప్రధానిగా ఉన్నానని నవాజ్ షరీఫ్ గుర్తుచేశారు. పాకిస్తాన్ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని తెలిపారు.‘అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆనాడు పాక్.. అణుపరీక్ష ఆపేందుకు 5 బిలియన్ డాలర్లను ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ, నేను అమెరికా అఫర్ను తిరస్కరించాను. ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇమ్రాన్ ఉండి ఉంటే క్లింటన్ ఆఫర్కు అంగీకరించేవాడు’అని ఇమ్రాన్పై విమర్శలు గుప్పించారు.లాహోర్ డిక్లరేషన్ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు 21, ఫిబ్రవరి 1999లో సంతాకాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జమ్ము కశ్మీర్లోని కార్గిల్లోకి చొరబడటంతో యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇక..ద తాజాగా మంగళవారం నవాజ్ షరీష్ మరోసారి పీఎంఎల్-ఎన్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు
ఒకప్పటి తెలుగు హీరో జగపతిబాబు మోసపోయాడు. స్వయంగా తానే ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇన్ స్టాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియోని స్టోరీగా పోస్ట్ చేశాడు. తనని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసిందని అన్నాడు. కానీ ఆ సంస్థ పేరు మాత్రం త్వరలో చెబుతానని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: 'హనుమాన్' నటి వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి డేట్ ఫిక్సయిందా? ఎప్పుడంటే?)జగపతిబాబు ఏం చెప్పాడు?'రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రీసెంట్గా హెచ్చరించారు. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ యాడ్లో నేను నటించాను. అయితే నన్ను వాళ్లు మోసం చేశారు. వాళ్లు ఎవరు? అసలు ఏం జరిగింది? అనే వివరాలన్నీ త్వరలో చెబుతా. భూమి కొనే ముందు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి' అని జగపతిబాబు చెప్పుకొచ్చాడు.హీరోగా కొన్నేళ్ల పాటు అలరించిన జగపతిబాబు.. 'లెజెండ్' మూవీతో విలన్గా మారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అలా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేశాడు. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చాడు. ప్రస్తుతం 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు సడన్గా తనని మోసం చేశారని చెప్పి షాకిచ్చాడు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?
2024 లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఏడో దశకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది. దేశంలో హిందువుల జనాభా 80 శాతం. ముస్లిం జనాభా 14 శాతం. అసోం, పశ్చిమ బెంగాల్లలో అత్యధిక ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. ఈ సారి జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావం ఏ మేరకు ఉండనుంది?గత మూడు లోక్సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు సంబంధించిన సీఎస్డీఎస్ లోక్నీతి అందించిన డేటా ప్రకారం 2009 ఎన్నికలలో బీజేపీకి నాలుగు శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 38 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 58 శాతం ముస్లిం ఓటర్లు ఇతర పార్టీలకు ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 38శాతం ముస్లిం ఓట్లు, ఇతర పార్టీలకు 54 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 33 శాతం, ఇతరులకు 59 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి.2014 ఎన్నికల్లో 882 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 23 మంది మాత్రమే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 819 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 28 మంది మాత్రమే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 27 మంది ముస్లిం ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు.ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అమితాబ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే ముస్లిం ఓటర్లు తటస్థంగా మారిపోతున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. 2014కు ముందు అసోంలో ముస్లిం ఓట్లు కేంద్రీకృతమై ఉండేవి. హిందూ ఓట్లు కులాల ప్రాతిపదికన చెల్లాచెదురయ్యాయి. ఫలితంగా అసోం, యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. 2014, 2019 ఎన్నికలను పరిశీలిస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి తొమ్మది సీట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే మైనారిటీ ఆధిపత్య స్థానాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉందని తివారీ పేర్కొన్నారు.
తప్పక చదవండి
- రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
- స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
- ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
- JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
- ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
- ఆకాశం నుంచి పడిన వింత వస్తువు
- స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
- బ్యాంకాక్లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
- ఆగని ‘సంక్షేమం’
సినిమా
ఇండస్ట్రీ నుంచి పంపించేస్తారు అన్నారు: విశ్వక్ సేన్
‘‘నిజాయతీగా పని చేసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లాంటి మంచి సినిమా తీశాం. అందుకే ఈ మూవీపై చాలా నమ్మకంగా ఉన్నాం. అందరూ కుటుంబంతో కలిసి రావొచ్చు. సినిమా చూశాక రెండు మూడు రోజుల పాటు ప్రేక్షకుల మనసుల్లోనే ఉంటుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఐదేళ్ల క్రితం మార్చి 31వ తేదీనే నా ‘ఫలక్నుమా దాస్’ రిలీజ్ అయ్యింది. నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆ సినిమా.. ఆదరించిన ప్రేక్షకులే. నా కెరీర్ ఆరంభంలో ‘ఇలాంటి యాటిట్యూడ్ ఇండస్ట్రీలో పనికి రాదు.. తొక్కేస్తారు.. పంపించేస్తారు’ అన్నారు. అయినా నా క్యారెక్టర్ మార్చుకోలేదు. ఐదేళ్లుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ఇండస్ట్రీకి, దర్శక–నిర్మాతలకు, ముఖ్యంగా నా ఫ్యాన్స్కి థ్యాంక్స్. ఇప్పటికే ఐదేళ్లు గడిచిపోయాయి.మరో ఐదేళ్లు ఫైనల్.. కాల్చిపడేస్తా మొత్తం. రత్నలాంటి పాత్ర చేయాలన్నది నా కల. అలాంటి కథతో వచ్చిన కృష్ణ చైతన్యకి థ్యాంక్స్. నేను ఇప్పటి వరకూ పనిచేసిన నిర్మాతల్లో నాగవంశీ బెస్ట్’’ అన్నారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ– ‘‘మా అమ్మానాన్నల ఆశీస్సుల వల్లే ఇక్కడ ఉన్నాను. మా గురువు త్రివిక్రమ్గారే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి మూలం. ఆయన వల్లే ఈ సినిమా మొదలైంది. నన్ను నమ్మి ఈ సినిమా తీసిన నిర్మాతలు చినబాబు, నాగవంశీ, సాయి సౌజన్యగార్లకు కృతజ్ఞతలు. బుజ్జిగా నేహాశెట్టి, రత్నమాలగా అంజలి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడు. తను చేసిన రత్న పాత్ర ప్రేక్షకుల్ని నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. భయపెడుతుంది’’ అన్నారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 31 తర్వాత విశ్వక్ సేన్ గురించి మాట్లాడుకుంటే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి ముందు, తర్వాత అని మాట్లాడు కుంటారు. నట విశ్వరూపం చూపించాడు. సినిమా చూశాక నిజంగా కృష్ణ చైతన్య తీశాడా? అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఇంటెన్స్ మూవీ రాలేదు’’ అన్నారు. నటి నేహా శెట్టి, నటులు మధునందన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ముఖ్యం: రష్మికా మందన్న
‘‘ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ముఖ్యం. సినిమాల్లోకి వచ్చాక నేను ఈ విషయం తెలుసుకున్నాను. ఆనంద్ నాకు బ్రదర్లాంటి వాడు. అతని మీద నేను చాలా ఆధారపడుతుంటాననే విషయం ఆనంద్కే తెలియదు. ‘గం..గం..గణేశా’ సక్సెస్ సాధిస్తే ఆనంద్ ముఖంలో నవ్వు ఉంటుంది. ఆ విజయం తాలూకు నవ్వుని నేను చూడాలనుకుంటున్నాను’’ అన్నారు.హీరోయిన్ రష్మికా మందన్న. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి రష్మికా మందన్న ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘గం..గం..గణేశా’ సాంగ్స్కు నేను డ్యాన్సులు చేశాను. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ ఉదయ్కి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. వంశీ, కేదార్, అనురాగ్లకు ఈ మూవీ మంచి లాభాలు తీసుకురావాలి’’ అన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి వినోదాత్మకంగా తీసిన చిత్రం ‘గం..గం..గణేశా’. నేను ఈ సినిమాలో కనిపించినంత ఎనర్జిటిక్గా ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించలేదు’’ అన్నారు. ‘‘గం..గం..గణేశా’లో ఒక అతిథి పాత్ర ఉంది. ఆ పాత్రను థియేటర్లో చూసి షాక్ అయ్యేందుకు రెడీగా ఉండండి’’ అన్నారు ఉదయ్ శెట్టి. దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్మాత బన్నీ వాసు, సహనిర్మాత అనురాగ్ పర్వతనేని తదితరులు పాల్గొన్నారు.
మాస్ మల్లి
సిగరెట్ కాల్చుతూ రిక్షాలో మాస్గా కూర్చొన్న అతని పేరు మల్లి. ఇంటిపేరు బచ్చల. చేసేది ట్రాక్టర్ డ్రైవర్గా... ఇంకా అతని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునేవారు థియేటర్స్కు వెళ్లాల్సి ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో సీరియస్ లుక్లో కనిపిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ బచ్చల మల్లి చాలా రోజులు గుర్తిండిపోతాడు. నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్.
డబ్బుల కోసమే నటించా.. నాలా చాలామంది ఉన్నారు: నటి
ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కింది. పాయల్ కపాడియా ఈ చిత్రాన్ని తెరకెకక్కించారు. అయితే ఈ సినిమాలో మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించింది. తాను సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పుడు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించింది. కేన్స్ రెడ్ కార్పెట్పై సందడి చేసిన కని కస్రుతి పుచ్చకాయను పోలి ఉన్న హ్యండ్బ్యాగ్తో కనిపించిన అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా ఇంటర్వ్యూలో తాను పడిన కష్టాలను పంచుకుంది.కని కుస్రుతి మాట్లాడుతూ..'నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. తనకు జీవనోపాధి కోసం మాత్రమే సినిమాల్లో నటించాల్సి వచ్చింది. 2020లో నేను నటించిన మలయాళ చిత్రం "బిరియాని"కి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నా. కానీ అంతకుముందు నా జీవితమంతా కన్నీళ్లతో పోరాటమే. నా దగ్గర డబ్బు లేని సమయంలో సజిన్ (సజిన్ బాబు) నన్ను సంప్రదించాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయనతో ఓకే మాట చెప్పా. ఇందులో నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ క్యారెక్టర్ నేను చేయలేను అని చెప్పా. మరొకరిని వెతకండి సలహా ఇచ్చా. ఆ సమయంలో నాకు డబ్బు అవసరం ఉన్నప్పటికీ సినిమా చేయాలని అనిపించలేదని చెప్పింది. మూడు నెలల తర్వాత చిత్రనిర్మాత మళ్లీ నన్ను సంప్రదించారని' కుస్రుతి తెలిపింది.బిరియానీకి రూ.70,000 ఆఫర్కుస్రుతి మాట్లాడుతూ.. "నాకు ఈ సినిమా చేయడానికి ఆసక్తి లేదు. కానీ నా దగ్గర డబ్బు లేదని చెప్పా. నాకు దాదాపు రూ.70 వేల ఆఫర్ ఇచ్చారు. అది నాకు చాలా పెద్ద మొత్తం. అప్పుడు నా ఖాతాలో కేవలం రూ.3 వేలు మాత్రమే ఉంది.' తన కన్నీళ్ల బాధను పంచుకుంది. కాగా..ఒకవేళ తాను థియేటర్కే పరిమితమైన ఉంటే.. బాగా సంపాదించగలిగితే సినిమాల్లోకి రాకపోవచ్చని ఆమె అన్నారు. భవిష్యత్తులో జీవనోపాధి పొందే పరిస్థితులు లేకుంటే.. నాకు ఇష్టం లేని పనులు చేయవలసి రావొచ్చని.. అలాంటి వారు చాలా మంది ఉన్నారని' ఆమె చెప్పింది.
ఫొటోలు
క్రీడలు
T20 World Cup 2024: ఫీల్డర్ మారిన ఆసీస్ చీఫ్ సెలెక్టర్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఫీల్డర్ అవతారమెత్తాడు. నమీబియాతో జరిగిన టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో బెయిలీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఐపీఎల్ విధుల కారణంగా ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు (కమిన్స్, స్టార్క్, హెడ్, మ్యాక్స్వెల్, గ్రీన్, స్టోయినిస్) మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాలేకపోయారు. అతి త్వరలో వీరు జట్టుతో కలుస్తారని సమాచారం. నబీమియాతో మ్యాచ్లో బెయిలీతో పాటు ఆసీస్ ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ కూడా బరిలోకి దిగాల్సి వచ్చింది. వీరిద్దరే కాక ఆసీస్ బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్, హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ కూడా కాసేపు ఫీల్డింగ్ చేశారు. మిచెల్ మార్ష్, హాజిల్వుడ్ విరామం తీసుకున్న సమయంలో వీరు బరిలోకి దిగారు.ఇదిలా ఉంటే, ఆటగాళ్ల కొరత ఉన్నా నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం.
ఇంగ్లండ్-పాకిస్తాన్ టీ20 మ్యాచ్ రద్దు
కార్డిఫ్ వేదికగా పాకిస్తాన్-ఇంగ్లండ్ మధ్య నిన్న (మే 28) జరగాల్సిన టీ20 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా టాస్ కూడా సాధ్యపడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగానే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో టీ20 ఓవల్ వేదికగా మే 30న జరుగనుంది. ఈ సిరీస్లో జరిగిన ఏకైక మ్యాచ్లో (రెండో టీ20) ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. జోస్ బట్లర్ (84) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. షాహీన్ అఫ్రిది 3, ఇమాద్ వసీం, హరీస్ రౌఫ్ తలో వికెట్ పడగొట్టారు.184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 160 పరుగులకు చాపచుట్టేసింది. రీస్ టాప్లే 3, మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్ చెరో 2 వికెట్లు.. క్రిస్ జోర్డన్, ఆదిల్ రషీద్, లివింగ్స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ సిరీస్ ముగిసిన వెంటనే పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు టీ20 వరల్డ్కప్ 2024 ఆడేందుకు బయల్దేరతాయి. ప్రపంచకప్లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్ను జూన్ 4న (స్కాట్లాండ్తో).. పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ను జూన్ 6న (యూఎస్ఏతో) ఆడనున్నాయి. మెగా టోర్నీలో భారత్-పాక్ సమరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది.
పసికూనపై ప్రతాపం.. రెచ్చిపోయిన హాజిల్వుడ్, వార్నర్
టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా నమీబియాతో నిన్న (మే 28) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. హాజిల్వుడ్తో పాటు ఆడమ్ జంపా (4-0-25-3), నాథన్ ఇల్లిస్ (4-0-17-1), టిమ్ డేవిడ్ (4-0-39-1) కూడా సత్తా చాటడంతో పసికూన నమీబియా విలవిలలాడిపోయింది. నమీబియా ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మార్ష్ 18, ఇంగ్లిస్ 5, టిమ్ డేవిడ్ 23, వేడ్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో బెర్నల్డ్ స్కోల్జ్కు రెండు వికెట్లు దక్కగా.. మార్ష్ రనౌటయ్యాడు. బంగ్లాదేశ్, యూఎస్ఏ మధ్య నిన్ననే జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది.
హంపి శుభారంభం
స్టావెంజర్ (నార్వే): భారత చెస్ స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి నార్వే చెస్ మహిళల ఓపెన్ టోర్నీలో శుభారంభం చేసింది. పియా క్రామ్లింగ్ (స్వీడన్)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి అర్మగెడాన్ గేమ్లో గెలిచింది. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ముందుగా క్లాసికల్ ఫార్మాట్లో గేమ్ జరుగుతుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయితే ఫలితం తేలడానికి అర్మగెడాన్ గేమ్ను నిర్వహిస్తారు. అర్మగెడాన్ గేమ్లో తెల్ల పావులతో ఆడే వారికి 10 నిమిషాలు, నల్ల పావులతో ఆడే వారికి 7 నిమిషాలు కేటాయిస్తారు. అర్మగెడాన్ గేమ్లో తెల్ల పావులతో ఆడే ప్లేయర్ నెగ్గని పక్షంలో... నల్ల పావులతో ఆడిన ప్లేయర్ గేమ్ను ‘డ్రా’ చేసుకుంటే దానిని విజయంగా పరిగణిస్తారు. హంపి, పియా క్రామ్లింగ్ క్లాసికల్ గేమ్ 37 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... ఫలితం తేలడానికి అర్మగెడాన్ గేమ్ నిర్వహించారు. ఇందులో నల్లపావులతో ఆడిన హంపి 51 ఎత్తుల్లో గేమ్ను ‘డ్రా’ చేసుకోవడంతో ఆమెను విజేతగా ప్రకటించారు. భారత్కే చెందిన వైశాలి తొలి రౌండ్ క్లాసికల్ గేమ్లో 43 ఎత్తుల్లో వెన్జున్ జు (చైనా) చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద అర్మగెడాన్ గేమ్లో తెల్ల పావులతో ఆడుతూ 38 ఎత్తుల్లో ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలిచాడు. వీరిద్దరి మధ్య క్లాసికల్ గేమ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది.
బిజినెస్
ఢిల్లీ హైకోర్టులో ఎలోన్ మస్క్ పిటిషన్.. ఎందుకంటే
టెస్లా పవర్ ఇండియా కంపెనీకి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంస్థ పేరు మీద ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఉంటే వాటి అమ్మకాలతో సహా ఇతర వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. గురుగావ్ కేంద్రంగా సేవలందిస్తున్న టెస్లా పవర్ ఇండియాపై అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ట్రేడ్మార్క్ ఉల్లంఘన దావాపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కు ప్రతిస్పందనగా ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. టెస్లా పవర్పై కేసును హైకోర్టు గురువారం విచారించనుంది.టెస్లా కంపెనీ ట్రేడ్ మార్క్తో భారత్లోని స్థానిక సంస్థ టెస్లా పవర్ ఇండియా వినియోగిస్తోందని, దీనిపై గందరగోళం నెలకొందని.. వ్యాపార ప్రయోజనాలకు హాని కలిగిస్తోందని వాదించింది. అంతేకాదు టెస్లా పవర్ బ్యాటరీలపై తమకు (టెస్లా-యూఎస్) ఫిర్యాదులు అందుతున్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో టెస్లా వెల్లడించింది. టెస్లా పవర్ బ్యాటరీలు ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీవేనని ప్రచారం చేయడం, లోగోను వినియోగించుకున్నట్లు హైలెట్ చేసింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మస్క్ తరుపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
రాజకీయాల్లోకి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్?
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారా? 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజన్ కాంగ్రెస్ చేరుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తాజాగా మరోమారు ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. దీనిపైన రాజన్ స్పందించారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కంటే నేను చేయగలిగిన చోట మార్గనిర్దేశం చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్రయత్నిస్తున్నాని తెలిపారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాను. నేను విద్యా వేత్తని. ‘మై బిజినెస్ ఈజ్ నాట్ కిస్సింగ్ బేబీస్’. కానీ ప్రజలు ఇప్పటికీ నా మాటల్ని నమ్మడం లేదు. పాలిటిక్స్ అంటే నా భార్యకు, నాకుటుంబానికి ఇష్టం లేదు. రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్నారు.అనంతరం భారత్, అమెరికా తదితర దేశాల్లోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, చిన్న పరిశ్రమల ముందున్న సవాళ్లు, ఆర్థిక అసమానతలపై రాజన్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో యుద్ధ భయాలతో పాటు ఇతర అంశాలే అందుకు కారణం. దీనికి తోడు అధిక వడ్డీ రేట్ల ప్రభావం ప్రపంచ వృద్ది ఆశించిన స్థాయిలో ఉండదని తెలిపారు.‘మై బిజినెస్ ఈజ్ నాట్ కిస్సింగ్ బేబీస్’ అంటే పరోక్షంగా రాజకీయాల్లో రావడం ఇష్టం లేదు.. సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేందుకు ఇంగ్లీష్లో ఈ పదాన్ని సందర్భాన్ని బట్టి వాడుతుంటారు.
అకౌంట్లపై అదనపు వసూళ్లు.. బ్యాంక్లకు ఆర్బీఐ వార్నింగ్..
ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు విధిస్తున్న బ్యాంక్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది.బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎస్ బ్యాంక్కు రూ. 91 లక్షల జరిమానా విధించింది. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపైజీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై ఛార్జీలు విధించడం, ఫండ్స్ పార్కింగ్, రూటింగ్ ట్రాన్సాక్షన్ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాదారుల పేరిట ఇంటర్నల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఎస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు జీరో బ్యాంక్ అకౌంట్ను ఉపయోగిస్తూ.. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అకౌంట్ బ్యాలెన్స్ జీరోకి పడిపోయి.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదని ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. సంబంధిత బ్యాంక్లు.. బ్యాంక్ అకౌంట్ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనల్ని 2014 నుంచి ఆర్బీఐ అమలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.కోటి జరిమానామరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్కు సైతం ఆర్బీఐ రూ.కోటి జరిమానా విధించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పలు సంస్థలకు ప్రాజెక్ట్ లోన్స్ పేరిట లాంగ్ టర్మ్ రుణాల మంజూరులో ఐసీఐసీఐ అవకతవకలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
ట్యాక్స్ పేయర్స్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలెర్ట్ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్ కార్డ్కు ఆధార్ కార్డ్ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్ ట్యాక్స్ డిడక్ట్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.పన్ను చెల్లింపుదారులు మీ పాన్ను మే 31, 2024లోపు ఆధార్తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్ను మీ ఆధార్తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు. పాన్కు ఆధార్ లింక్ చేయకపోతే నిర్ణీత తేదీలోపు పాన్కు ఆధార్ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Kind Attention Taxpayers, Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024
వీడియోలు
టీడీపీ కోసం సీఈఓ ముకేశ్ కుమార్ కొత్త రూల్
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
విశాఖలో సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు..
బిర్యానీ తిని ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో
వజ్రాల వేట.. 9 వజ్రాలు లభ్యం..
బెంగాల్ లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది: ప్రధాని
స్నేహితుడే..హంతకుడు
రైతు ఖరీఫ్ కష్టాలు..
బాబు సరే.. ఈసీ కూడానా ?
రామ రాజ్యం లాంటి పరిపాలన జగనన్నకే సాధ్యం..
ఫ్యామిలీ
మామిడి బఫే..ఐస్క్రీం నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు అంతా మ్యాంగో మయం..!
మ్యాంగో లవర్స్కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్ల రాజు మ్యాంగో. అలాంటి మామిడి పండ్లతో మ్యాంగో బఫేని అందిస్తోంది ఓ రెస్టారెంట్. కేక్లు దగ్గర నుంచి ఐస్క్రీమం వరకు అన్నింటిలోనూ మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది. ఎక్కడ? ఏ రెస్టారెంట్ ఇలా సర్వ్ చేస్తోందంటే..మామిడి అంటే ఇష్టపడే వాళ్ల కోసం దక్షిణ కొరియాలోని ఒక రెస్టారెంట్ మామిడి పండ్లతో వెరైటీ బఫేని పరిచయం చేసింది. సియోల్లోని లోట్టే అనే హోటల్ ఈ వైరైటీ బఫేట్ని కస్టమర్ల్కు సర్వ్ చేస్తోంది. దీని ధర వచ్చేసి రూ. 8,257లు. ఈ వేసవి మొత్తం ఈ బఫెట్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఆ బఫేలో మామిడి పండ్లతో చేసిన కేక్, మ్యాంగో డ్రింక్, మ్యాంగో ఫుడ్డింగ్, మ్యాంగో డెజర్ట్, మ్యాంగో ఐస్క్రీం, స్పైసీ రైస్ కేక్లతో సహ పది రకాల వెరైటీలను ఈ బఫేలో అందిస్తారు.వవెరైటీ భోజనం కావాలనుకునే వాళ్లకు ఇది అద్భతమైన బఫే సెటప్ అని చెప్పొచ్చు. ఆ రెస్టారెంట్ చుట్టూ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బఫే కస్టమర్లకు ఓ గొప్ప అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉండే సుందరమైన జలపాతం, కళాత్మక అలంకరణల మధ్య ఈ మ్యాంగో బఫేని అధిక ధరకు వెచ్చించి మరీ తినడం కస్టమర్లకు ఓ మధురమైన జ్ఞాపకంలా ఉంటుందట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మామిడి ప్రియులకు ఇది బెస్ట్ ప్లేస్ అని ఒకరు, ఇది స్వర్గానికి మించి..! అని మరోకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: మే పుష్పం' గురించి విన్నారా! ఏడాదిలో ఒకసారి మాత్రమే..) View this post on Instagram A post shared by 포토그래퍼의 공간 탐닉 (@space_tamnik)
ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
వాతావరణంలో జరిగే కాలాల మార్పుల కారణంగా అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ప్రతీ సంవత్సరం కేవలం మే నెలలో మాత్రమే ఈ పువ్వు పూస్తుందట. మరి అదేంటో చూసేద్దామా!ఆదిలాబాద్, సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామంలో మే పుష్పం వికసించింది. ఏటా మే నెలలో మాత్రమే పూసే ఈ పువ్వు గ్రామానికి చెందిన ఎలుగు రాజలింగం ఇంటి ఆవరణలో మంగళవారం వికసించింది. ఒకేసారి మూడు పువ్వులు పూయడం సంతోషంగా ఉందని రాజలింగం కుటుంబ సభ్యులు తెలిపారు. ఈఏడాది మొత్తం ఐదు పువ్వులు పూశాయని పేర్కొన్నారు. ఈ పూలను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నట్లు వారు తెలిపారు.ఇవి చదవండి: కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్డీ..?
కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్డీ..?
కోటి దీపోత్సవంలో దీపాల శిఖలు మిలమిలలాడుతుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటుంది! అలాగే చిదిమి దీపం పెట్టుకోవాల్సిన చిన్నారులు ఆటిజమ్తో చిన్నబోకుండా ఆ అమాయకపు ముఖాలపై చిరునవ్వుల మిలమిలలను అలాగే ఉంచడానికి పూనుకుంది ‘పినాకిల్’ సంస్థ. లక్షణాల్ని బట్టి ఒక్కో ఆటిజమ్ చిన్నారికి ఒక్కో థెరపీ అవసరమవుతుంది. అలాంటి ‘కోటి థెరపీ’లను పూర్తి చేసింది ఈ సంస్థ,‘ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్’ (ఏఎస్డీ) అని పిలిచే ఈ రుగ్మత ఉన్న పిల్లలకు జ్ఞానేంద్రియాల నుంచి మెదడుకు సమాచారం చేరడమూ... అక్కణ్ణుంచి తాము స్పందించాల్సిన రీతిలో స్పందించక΄ోవడమనే సమస్య ఉంటుంది. సెన్సెస్(జ్ఞానేంద్రియాల)కు సంబంధించిన సమస్య కాబట్టి దీన్ని ‘సెన్సోరియల్ సమస్య’గా చెబుతారు. ఆ పిల్లలు తమదైన ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. కళ్లలో కళ్లు కలిపి చూడలేరు. స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకు నేర్చుకున్న ఒకే పదాన్ని పదే పదే అదే ఉచ్చరిస్తూ ఉంటారు. తోటి పిల్లలతో కలవడానికీ, ఆడుకోడానికి పెద్దగా ఆసక్తి చూపరు.అలాంటి పిల్లలకు అవసరమైన చికిత్స (థెరపీలు) అందిస్తోంది పినాకిల్ సంస్థ. లోపాల్ని చక్కదిద్దడానికి అవసరాన్ని బట్టి స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, డాన్స్ థెరపీ... ఇలాంటి అనేక థెరపీలు అందిస్తోంది. లక్షణాలూ, తీవ్రతలను బట్టి ఒక్కో చిన్నారికి నాలుగైదేసి థెరపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కోటి థెరపీలను ఇటీవలే పూర్తి చేసిందీ సంస్థ. తాము ఈ అసిధారా క్రతువు చేపట్టడం వెనక ఓ నేపథ్యముందంటున్నారు ‘పినాకిల్’ వ్యవస్థాపకురాలు శ్రీజారెడ్డి సరిపల్లి.తొలిచూలు పంటగా పుట్టిన పిల్లాడు మొదట్లో అంతా బాగున్నట్టే కనిపించినా... ఏడాదిన్నర గడిచాక కూడా మాటలు రాక΄ోవడం చూసి ఆందోళన పడ్డారు కోటిరెడ్డి, శ్రీజారెడ్డి దంపతులు. డాక్టర్కు చూపిస్తే వినలేక΄ోతున్నాడనీ, బహుశా ఆటిజమ్ కావచ్చని చెప్పారు. చికిత్స కోసం అనేకచోట్ల తిరిగారు. పరిష్కారం దొరకలేదు. వ్యాధి నిర్థారణ సరిగ్గా జరగలేదు.- శ్రీజా రెడ్డి సరిపల్లిపదిహేను రోజులకు అసలు విషయం తెలిసింది. ఆటిజమ్ కాదు, చెవి సమస్య అని తేలింది. అందుకు అవసరమైన శస్త్రచికిత్సలను రెండు చెవులకూ ఒకేసారి చేయించారు. పరిస్థితి పరిష్కారమైందనుకున్నారు. కానీ కేవలం శస్త్రచికిత్స సరి΄ోదు, స్పీచ్ థెరపీ కూడా అవసరమని వైద్యులు చెప్పారు.అన్నీ ఉండి కూడా తమలాంటివారికే ఇంత కష్టంగా ఉంటే, ఏమీ తెలియని వారికి ఇంకెంత కష్టం ఉంటుందన్న ఆలోచన వారిలో రేకెత్తింది. ఆ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న సంస్థే ‘పినాకిల్’. ఆ ఆటిజమ్ సమస్యను ఎదుర్కొనే పిల్లల తల్లిదండ్రుల దుఃఖం తీర్చడానికీ, ఆ పిల్లలు తమ పనులు తామే చేసుకునేలా, దాదాపుగా మిగతా పిల్లల్లాగే ఆడుకునేలా, నడచుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అది!‘‘పినాకిల్ సంస్థకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 70కి పైగా సేవాకేంద్రాలున్నాయి. ఆటిజమ్ పిల్లలకు అవసరమైన రకరకాల థెరపీలను అక్కడ అందిస్తుంటారు. లోపల జరుగుతున్న చికిత్సను తల్లిదండ్రులు బయట ఉండి స్క్రీన్ మీద చూడవచ్చు. కేవలం భారత్లోనే కాదు... యూఎస్ఏ, సింగపూర్, దుబాయ్లలోనూ ఈ సేవలున్నాయి. త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిటేర్స్లోనూ పినాకిల్ సేవలు అందనున్నాయి. ఖర్చు భరించలేనివారికి ‘సేవా’ విభాగం కింద వారు తాము చెల్లించగలిగేంత లేదా కేవలం ఒక్క రూపాయి చెల్లించి సేవలు ΄÷ందవచ్చు. పద్ధెనిమిది భాషల్లో మా హెల్ప్లైన్ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా భాషల్లో సమాచారం తెలుసుకునేలా మా ‘థెరపాటిక్ ఏఐ’ రూ΄÷ందుతోంది. మా హెల్ప్లైన్ 9100 181 181 కు ఏ టైమ్లో ఫోన్ చేసినా ఆటిజమ్ పిల్లల తల్లిదండ్రులకుప్రాథమిక సమాచారం ఎల్లవేళలా అందుతుంది.ఏఐ ఎందుకంటే..?ఇలాంటి ఓ రుగ్మత ఉందని కనుగొన్న నాటినుంచి నేటికి దాదాపు 133 ఏళ్లు. ఇంతటి చరిత్రా, వేర్వేరు థెరపీల నేర్పూ, నైపుణ్యాలు ఒక్కోచోట ఒక్కొక్కరిలో ఇలా పరిమితంగానే దొరుకుతుండవచ్చు. ఆ అంతటినీ సమగ్రంగా సమీకరించడం, ఒక్కచోటే అందేలా క్రోడీకరించడం అవసరం. అది ‘ఏఐ’తోనే సాధ్యం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నాం.’’ అంటూ తమ సేవల గురించి వివరించారు పినాకిల్ సంస్థ ఫౌండర్, చీఫ్ స్ట్రాటజిస్ట్ శ్రీజా సరిపల్లి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: చక్కని ‘ఫాంగ్’కు చాంగు భళా.. ఇదే!
చక్కని ‘ఫాంగ్’కు చాంగు భళా.. ఇదే!
కొడితే ‘ఫాంగ్’ జాబ్ కొట్టాలి అనుకుంటోంది యువతరం. ప్రపంచంలోని ఉత్తమ పనితీరు కనబరిచే దిగ్గజ కంపెనీల సంక్షిప్త నామం–ఫాంగ్ (ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫిక్స్, గూగుల్) ‘ఫాంగ్’ కంపెనీలలో ఉద్యోగం చేయాలనే కలను నెరవేర్చుకోవడానికి స్కిల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్లకు హాజరు కావడం నుంచి సీనియర్ ఉద్యోగులతో మాట్లాడడం వరకు ఎంతో కసరత్తు చేస్తున్నారు. కలను నెరవేర్చుకుంటున్నారు.ప్రతిష్ఠాత్మకమైన ఫాంగ్ (ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్) కంపెనీలలో ఉద్యోగం చేయాలని యువతరం బలంగా అనుకోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే... కాంపిటీటివ్ స్పిరిట్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీపై పనిచేసే అవకాశం అనేవి ముఖ్య కారణాలు.‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేయాలనే కలను నెరవేర్చుకోవడానికి తగిన కసరత్తు చేస్తున్నారు. ‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. ‘ఫాంగ్’ రిక్రూటర్స్, ఎం.ఎల్. ఇంజినీర్స్, రిసెర్చర్లు హాజరయ్యే స్కిల్ లెర్నింగ్ కాన్పరెన్స్లకు హాజరవుతున్నారు. ‘ఫాంగ్’ ఇంటర్వ్యూల గురించి అవగాహన చేసుకోవడానికిప్రొఫెషనల్స్తో మాట్లాడుతున్నారు.‘నా ఫ్రెండ్ ఒకరు మోస్ట్ టాలెంటెడ్. అయితే మొదటి ప్రయత్నంలో ఫాంగ్ కంపెనీలలో ఒకదాంట్లో ఎంపిక కాలేదు. అలా అని డిప్రెస్ కాలేదు. ఏ పొరపాట్ల వల్ల తనకు ఉద్యోగం రాలేదో లోతైన విశ్లేషణ చేసుకుంది. ప్రొఫెషనల్స్తో మాట్లాడింది. పొరపాట్లను సరిదిద్దుకొని రెండో ప్రయత్నంలో విజయం సాధించింది’ అంటుంది బెంగళూరుకు చెందిన షాలిని.‘ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నా ఫాంగ్ కల నెరవేరలేదు. మొదట బాధ అనిపించింది. అయితే ఆ బాధలో నుంచి త్వరగా కోలుకున్నాను. మాస్టర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్పై దృష్టి పెట్టాను. మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్–సాల్వింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాను’ అంటున్న శైలిమ శ్రీవాస్తవ రెండవ ప్రయత్నంలో విజయం సాధించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోవాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఖుష్బు గుప్తా గూగుల్లో ఉద్యోగం చేయాలనే తన కలను నెరవేర్చుకుంది.సవాళ్లను అధిగమిస్తే విజయం ఎప్పుడూ మనదే అవుతుంది. ‘గూగుల్లో చేరిన కొత్తలో చాలా మిస్టేక్స్ చేసేదాన్ని. అయితే సీనియర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా తప్పులు జరగకుండా జాగ్రత్త పడడం నేర్చుకున్నాను’ అంటుంది ఖష్బు గుప్తా.అమెజాన్ పాపులర్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ను మన దేశంలో లాంచ్ చేసిన బృందంలో లీలా సోమశేఖర్ ఒకరు. అమెజాన్లో పనిచేయాలనేది ఆమె కల. కంటెంట్ ఎడిటర్గా అమెజాన్లో అడుగులు మొదలు పెట్టిన లీల ఆ తరువాత ప్రోగ్రామ్ మేనేజ్మెంట్లోకి వచ్చింది. ‘ఆన్ది–జాబ్ లెర్నింగ్ ఎక్స్పీరియెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్న లీల సక్సెస్ మంత్రకు ఇచ్చే నిర్వచనం... కొత్తగా ఆలోచించడం. చిన్న వయసులోనేపోలియో బారిన పడిన రేఖాపోడ్వాల్కు వీల్ చైర్పై ఆధారపడడం తప్పనిసరి అయింది. అయితే ఏదో సాధించాలనే తపన మాత్రం గట్టిగా ఉండేది. ఆ తపనే ఆమెను అమెజాన్ ఇండియా స్టార్ ఉద్యోగులలో ఒకరిగా చేసింది.‘కలను నెరవేర్చుకోవడానికి అదృష్టం, అల్లావుద్దీన్ అద్భుతదీపంతో పనిలేదు. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఆత్మవిశ్వాసం ఉంటే చాలు’ అంటుంది పుణెకు చెందిన రేఖాపోడ్వాల్. సుందర సందేశం..ఇటీవల గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్ని యూట్యూబర్ వరుణ్ మయ్యా ‘ఫాంగ్’కు సంబంధించి యువత కల గురించి అడిగినప్పుడు అమీర్ ఖాన్ బ్లాక్బాస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’లోని ఒక సన్నివేశాన్ని గురించి ప్రస్తావించాడు పిచాయ్. ‘ఆ సీన్లో మోటర్ అంటే ఏమిటో వివరించే వెర్షన్ ఉంది. మోటర్ అంటే ఏమిటో అర్థం చేసుకునే వెర్షన్ ఉంది. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారానే నిజమైన విజయం లభిస్తుంది’ అంటాడు సుందర్ పిచాయ్. సినిమా సీన్ విషయానికి వస్తే ‘మెషిన్ అంటే ఏమిటో నిర్వచనం చెప్పండి’ అనిప్రొఫెసర్ అడిగిన దానికి అమీర్ సింపుల్గా చెప్పిన సమాధానం, ‘మెషిన్స్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ బాడీస్ సో కనెక్టెడ్ దట్ రిలేటివ్ మోషన్స్....’ అంటూ మార్కులు బాగా తెచ్చుకునే స్టూడెంట్ చెప్పిన సుదీర్ఘ, సంక్లిష్ట నిర్వచనం... ఒక విషయాన్ని వివరించడానికి, అర్థం చేసుకోడానికి మధ్య ఉండే తేడాను తెలియజేస్తుంది.ధైర్యమే దారి చూపుతుంది..కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన సోనాక్షి పాండే స్వభావరీత్యా సిగ్గరి. ఇంట్రావర్ట్. నలుగురిలో ధైర్యంగా మాట్లాడేది కాదు. డేటాబేస్ గురించి ఒక చర్చాకార్యక్రమంలో టెక్ ఎక్స్పర్ట్ ఒకరు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న, చర్చిస్తు్తన్న యూట్యూబ్ వీడియోను చూసింది పాండే. ఈ వీడియో ఆమె కెరీర్ గమనాన్ని మార్చేసింది. ఈ వీడియోతో ఇన్స్పైర్ అయిన పాండే నలుగురిలో ధైర్యంగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయింది. ఆ తరువాత అమెజాన్ వెబ్ సర్వీసెస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి సొల్యూషన్ ఆర్కిటెక్చర్లోకి వచ్చింది. ఇందులో పబ్లిక్ స్పీకింగ్, క్లయింట్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అయిదు సంవత్సరాలు అమెజాన్లో పనిచేసిన తరువాత మైక్రోసాఫ్ట్, గూగుల్కు అప్లై చేసింది. రెజ్యూమ్లోని కీ ఎలిమెంట్స్ వల్ల రెండు దిగ్గజ సంస్థల్లోనూ పాండేకు ఉద్యోగం వచ్చింది.
న్యూస్ పాడ్కాస్ట్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
శివాజీనగర: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసు పంపగా, జ్వరం వచ్చినందున రాలేనని హేమ తెలిపారు. మంగళవారం రెండో నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్ధికి, నాగబాబుతో పాటుగా ఐదుగురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం నుంచి వారిని సీసీబీ విచారణ చేపట్టింది. రేవ్ పార్టీ, డ్రగ్స్ సరఫరా వెనక ఉన్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు.
వాట్సాప్లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ..
సాక్షి, హైదరాబాద్: పాలుతాగే పసికందులను అపహరించి, విమానాలు, రైళ్లలో రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఫెర్టిలిటీ సెంటర్లు, ఆస్పత్రులు, క్లినిక్లలో పనిచేసే ఫోర్త్క్లాస్ ఉద్యోగులను ఏజెంట్లుగా పెట్టుకొని, దంపతుల సమాచారం సేకరించి, మధ్యవర్తుల సహాయంతో ఐదేళ్లుగా ఈ అక్రమ దందా సాగుతోంది. ఢిల్లీ, పుణే నగరాల్లో రోజుల శిశువులను ఎత్తుకొచ్చి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. డిమాండ్ను బట్టి ఒక్క పసికందును రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన 11 మంది మధ్యవర్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను మల్కాజ్గిరి డీసీపీ పీవీ.పద్మజ, శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులతో కలిసి రాచకొండ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు.👉ఈనెల 22న పీర్జాదిగూడలో మూడు నెలల పాపను విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు స్థానిక ఆర్ఎంపీ శోభారాణితోపాటు స్వప్న, షేక్ సలీంలను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులను విచారించగా వీరి తరహాలోనే ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 8 మంది మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసును రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అన్నోజిగూడకు చెందిన బండారి హరిహర చేతన్– బండారి పద్మ, కుషాయిగూడకు చెందిన యాట మమత, ఉప్పుగూడకు చెందిన ముధావత్ రాజు, విజయవాడకు చెందిన బలగం సరోజ, ముధావత్ శారద, ముంతాజ్, జగన్నాథం అనురాధలను పట్టుకున్నారు. ఈ మధ్యవర్తుల సహాయంతో ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంతానం లేని దంపతులకు పిల్లలను విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో 60 మంది శిశువులను విక్రయించారు. తాజా కేసులో 16 మంది పిల్లలను విక్రయానికి పెట్టగా.. ఏడుగురిని ఏపీ, 9 మందిని తెలంగాణకు చెందిన దంపతులు కొనుగోలు చేశారు. మధ్యవర్తులను విచారించిన పోలీసులు 16 మంది చిన్నారులను కాపాడారు. శిశువిహార్కు తరలించారు. వీరిలో 12 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలున్నారు. ప్రతి శిశువు అమ్మకంపై ఒక్క ఏజెంట్కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లాభం పొందేవారు. పరారీలో ఉన్న నిందితులు కిరణ్, ప్రీతి, కన్నయ్యల కోసం పోలీసులు గాలిస్తున్నారు.ముహూర్తం చెబితే పిల్లాడు డెలివరీవాట్సాప్, టెలిగ్రాం వంటి సామాజిక మాధ్యమాలలో పిల్లల ఫొటోలు పంపిస్తారు. శిశువుల రంగు, ముఖ కవలికలను బట్టి ఎంపిక చేసుకుంటారు. ఫలానా ముహూర్తానికి పిల్లాడు కావాలని చెబితే చాలు ఆ సమయానికే పిల్లాడిని తీసుకొచ్చి అప్పగిస్తారు. రోజుల వయస్సున శిశువులనే దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ వయసులో అయితేనే తనకు పుట్టిన బిడ్డగా, పిల్లలకు కూడా వీరే సొంత తల్లిదండ్రులని భావిస్తారు.పిల్లలకు దూరం చేయకండి పిల్లలను రెస్క్యూ హోంకు తరలిస్తుండగా అప్పటివరకు పెంచి పోషించిన తల్లిదండ్రులు తమ పిల్లలను దూరం చేయొద్దంటూ రాచకొండ కమిషనరేట్ ముందు అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తల్లిదండ్రులను మేడిపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు. ఓ దంపతులను ‘సాక్షి’ పలకరించగా.. పెళ్లై 12 ఏళ్లు అయినా పిల్లలు కలగలేదని, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో ఆఖరికి దిక్కుతోచని స్థితిలో రెండున్నర ఏళ్ల క్రితం ఆరు రోజుల పసికందును కొనుగోలు చేశామని రావులపాలెంకు చెందిన ఓ జంట తెలిపారు. రూ.3.5 లక్షలు ఖర్చు చేసి 21వ రోజును ఘనంగా చేశామన్నారు. రూ.కోట్లాది ఆస్తిపాస్తులను వారసుడి పేరు మీద రాసేందుకూ సిద్ధమయ్యామని చెప్పారు. ఇలాంటి సమయంలో పిల్లాడిని పోలీసులు తమ నుంచి దూరం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు.
ట్యాపింగ్లో కదలిక!
నిజామాబాద్, కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో జిల్లాలోనూ ప్రకంపనలు వస్తున్నాయి. ప్రతిపక్షాల కదలికలను పసిగట్టి, చెక్ పెట్టడానికి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటెలిజెన్స్ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ట్యాపింగ్కు సహకరించిన జిల్లాకు చెందిన అధికారులు, నాయకుల్లో గుబులు మొదలైంది.అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి కూడా ఇక్కడినుంచి బరిలో నిలిచారు. రేవంత్రెడ్డి తరఫున ఆయన సోదరుడు కొండల్రెడ్డి ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకున్నారు. మరోవైపు బీజేపీ అభ్యరి్థగా కె.వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో వెంకటరమణారెడ్డి వైపు ఓటర్ల మొగ్గు ఉన్నట్లు సర్వేల ద్వారా తెలుసుకుని బీజేపీతోపాటు కాంగ్రెస్లపైనా అప్పటి ప్రభుత్వం నిఘా పెట్టింది.వెంకటరమణారెడ్డి, కొండల్రెడ్డిల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించింది. కాగా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఏఎస్పీ భుజంగరావు వాగ్మూలాన్ని సిట్ ఇటీవల రికార్డు చేసింది. బీఆర్ఎస్ను వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ పనిచేసినట్లు ఆయన అంగీకరించడం గమనార్హం. ఆయన కామారెడ్డి నియోజకవర్గంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వివరాలనూ వెల్లడించినట్లు తెలిసింది.హోటల్లో వార్ రూం.. ప్రత్యర్థుల కదలికలను తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ను కామారెడ్డికి పంపారని, ప్రతిపక్షాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేశారని ప్రాథమిక విచారణలో సిట్ గుర్తించింది. వార్ రూంను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరి పాత్ర ఏమిటనే పూర్తి వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించి రెండు నెలల క్రితమే నివేదికను ‘సిట్’కు అందించినట్లు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యవహారాలపై నిఘా పెట్టడం కోసం కామారెడ్డికి వచ్చిన ట్యాపింగ్ గ్యాంగ్ జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో నాలుగు గదులను అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.అక్కడే వార్ రూంను ఏర్పాటు చేసి తమ కార్యకలాపాలను నడిపించారు. అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం, ఆర్థిక మూలాలు, ఇతర విలువైన సమాచారాన్ని తెలుసుకుని అధికార పక్ష నేతలకు అందించడం లాంటివి చేశారని తెలుస్తోంది. వార్ రూం ఇన్చార్జీగా వ్వవహరిస్తూ, ఇక్కడకు వచ్చిన గ్యాంగ్కు అన్ని రకాలుగా సౌకర్యాలు కలి్పంచిన ముఖ్య నేతలు ఎవరు, ఇక్కడి అధికారులు ఎవరైనా సహకారం అందించారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని బీఆర్ఎస్ నేతలు, వారికి సహకరించిన అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.ఆరోపణలకు బలం..ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు బలం చేకూరేలా ఎన్నికల సమయంలో పలు సంఘటనలు చో టు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మూడు రోజుల ముందు జిల్లా కాంగ్రెస్లో ముఖ్య నాయుకుడైన గూడెం శ్రీనివాస్రెడ్డికి చెందిన వ్యాపార కార్యాలయంపై అధికారులు దాడులు చేశారు. ఇందులో రూ.58 లక్షలు ప ట్టుబడ్డాయి. దేవునిపల్లి ప్రాంతంలో సీఎం రే వంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి నివాసం ఉన్న ఇంట్లో కూడా ఆకస్మిక తనిఖీలు జరిగాయి.ఆయనను గృహ నిర్భంధం కూడా చేశారు. అంతే కాకుండా విద్యానగర్కాలనీలో నివసించే ప్ర స్తుత మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ ఇంటిపై కూడా దాడులు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వా గ్వాదం కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్తోనే వివరాలు తెలుసుకుని దాడులు చేశారని సిట్ విచారణలో తేలినట్లు సమాచారం.
ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం మంచుకొండ – పంగిడి రోడ్డులో హరియాతండా సమీపాన చెట్టును ఢీకొట్టిన ఘటనలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు కన్నుమూశారు. ఈ ఘటనలో కారు నడుపుతున్న భర్త తీవ్రగాయాలతో బయటపడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా.. తమ అల్లుడే ముగ్గురిని హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం గమనార్హం. స్థానికుల కథనం ప్రకారం ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బావోజీ తండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్లో ఫిజియోథెరపీ డాక్టర్గా పని చేస్తున్నాడు. ఆయనకు ఏన్కూరు మండలం రంగాపురం తండాకు చెందిన కుమారి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరగగా, నాలుగు, మూడేళ్ల కుమార్తెలు కృషిక, తనిష్క ఉన్నారు. వీరంతా హైదరాబాద్లో నివసిస్తున్నారు. అయితే, ప్రవీణ్ తల్లికి అనారోగ్యంగా ఉండడంతో పది రోజుల పాటు సెలవు పెట్టిన ప్రవీణ్ భార్యాపిల్లలతో సహా బావోజీ తండాకు వచ్చాడు. ఆధార్ కార్డులో మార్పుల కోసం..ప్రవీణ్ – కుమారి దంపతుల చిన్నకుమార్తె ఆధార్ కార్డులో మార్పులు చేయించేందుకు మంగళవారం నలుగురు కలిసి కారులో మంచుకొండ వెళ్లారు. అక్కడి నుంచి వస్తుండగా హరియాతండా సమీపాన మూల మలుపు వద్ద చెట్టును కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కుమారి, ఇద్దరు కుమార్తెలు కృషిక, తనిష్క అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ప్రవీణ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అయితే, కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొనగా.. ఆ మార్గంలో ఎవరూ రాకపోవడంతో గంటకు పైగా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం అటువైపుగా వెళ్తున్న వారు రోడ్డు పక్కగా దూసుకెళ్లిన కారులో లైట్లు వెలుగుతుండడంతో చూసి బయటకు తీసేసరికే కుమారి, ఆమె పిల్లలు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ను ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు సమాచారం అందుకున్న ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి, రఘునాథపాలెం సీఐ శ్రీహరి ఘటనాస్థలికి వెళ్లి అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రమాదం కాదు.. అల్లుడే చంపేశాడురోడ్డు ప్రమాదంలో కుమారి, ఆమె కుమార్తెలు కన్నుమూశారనే సమాచారంతో కుమారి తల్లిదండ్రులు, బంధువులు ఏన్కూరు మండలం రంగాపురం తండా నుంచి పెద్దసంఖ్యలో పెద్దాస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుమార్తె, మనవరాళ్ల మృతదేహాలను చూసి వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, ఇది రోడ్డు ప్రమాదం కాదని తమ అల్లుడే ముగ్గురిని హత్య చేశారని కుమారి తల్లిదండ్రులు హరిసింగ్ – పద్మ ఆరోపించారు. ముగ్గురి మృతదేహాలపై ఎక్కడా రక్తం వచ్చిన దాఖలు లేవని వారు పేర్కొన్నారు. అంతేకాక డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ మాత్రమే గాయాలతో బయటపడడం ఏమిటని ప్రశ్నించారు. ప్రవీణ్ డాక్టర్ కావడంతో ఐదేళ్ల క్రితం రూ.24 లక్షల కట్నంగా ఇచ్చి వివాహం జరిపించామని, కానీ ఇద్దరు అమ్మాయిలే జన్మించడంతో మగపిల్లాడు లేడని తరచుగా తమ కుమార్తెను వేధించేవాడని ఆరోపించారు. అంతేకాక వివాహేతర సంబంధాలతో నిత్యం వేధించేవాడని వాపోయారు. గత 20 రోజుల క్రితం కూడా ఓ యువతితో కేరళ వెళ్లొచ్చాడని, ఈనెల 25న వివాహ వార్షికోత్సవానికి కేక్ తీసుకురావాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈమేరకు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కుమారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. అలాగే, ప్రమాదంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. మృతుల కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.