ఫలితాల తర్వాత నితీష్‌ ఏదైనా చేయొచ్చు: తేజస్వి | Nitish Kumar May Switch Sides Once Again Tejaswiyadav | Sakshi
Sakshi News home page

ఫలితాల తర్వాత నితీష్‌ ఏదైనా చేయొచ్చు: తేజస్వి

May 28 2024 7:11 PM | Updated on May 28 2024 7:44 PM

Nitish Kumar May Switch Sides Once Again Tejaswiyadav

పాట్నా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిహార్‌ సీఎం మరోసారి కూటమి మారడానికి రెడీ అవుతారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)  నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై మంగళవారం(మే28)న తేజస్వి మీడియాతో మాట్లాడారు. జూన్ 4 తర్వాత సీఎం నితీష్‌ తన పార్టీని కాపాడుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పారు.

కాగా  గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు వేర్వేరు  పార్టీలో పొత్తులు పెట్టుకుని అధికారంలో కొనసాగారు. అయితే ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో నితీష్‌ మాట్లాడుతూ ఇక మీదట తాను బీజేపీతో తప్ప మరే పార్టీతో పొత్తు పెట్టుకోనని హామీ ఇచ్చారు.  తాను ప్లేటు ఫిరాయించడం ఇదే చివరిసారన్నారు. కాగా  గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు బీజేపీ, ఆర్జేడీలతో పొత్తులు మార్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement