Lok Sabha Election 2024: ఆరో విడతలో 63.36 శాతం | Lok Sabha Election 2024: Over 63. 36percent voter turnout recorded on 58 seats | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ఆరో విడతలో 63.36 శాతం

May 27 2024 6:27 AM | Updated on May 27 2024 6:27 AM

Lok Sabha Election 2024: Over 63. 36percent voter turnout recorded on 58 seats

న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, యూటీల్లో శనివారం 58 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తాజా గణాంకాల ప్రకారం పోలింగ్‌ 63.36 శాతానికి పెరిగింది. పశ్చిమబెంగాల్‌ పరిధిలోని ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో 82.71 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారి ఆదివారం వెల్లడించారు. 

ఇప్పటివరకు ముగిసిన ఆరు దశలను పరిశీలిస్తే అన్నింటికన్నా తక్కువగా ఐదో దశలో 62.2 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆరో దశ కింద 2019లో 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 64.4 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రతి దశలోని తుది పోలింగ్‌ శాతాలు ఓట్ల లెక్కింపు తర్వాతే అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్లను లెక్కించడం వల్లే పోలింగ్‌ శాతాలు పెరుగుతాయని గుర్తుచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement