breaking news
-
కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కీలక బాధ్యత అప్పగిస్తారా?సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు.రాజకీయ వర్గాల్లో ఉత్కంఠఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు! -
మేం కొత్తగా పెట్టిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత 22ఏ జాబితాలో పెట్టిన భూములేవీ లేవు. మేం అధికారంలోకి వచ్చాక ఈ జాబితాను కొత్తగా తయారు చేయలేదు. 1999లో ఘట్కేసర్ రైల్వే స్టేషన్ను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ జాబితా అవసరం వచ్చింది. అప్పటి నుంచి కొనసాగుతోంది. 2009లో కోర్టు ఆదేశానుసారం ఈ జాబితా తయారు చేశారు. 2009–15 వరకు ఈ జాబితాపై హైకోర్టులో రెండువేల కేసులు పడ్డాయి. ఆ సమయంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 22ఏ జాబితా భూములను ఐదు కేటగిరీల్లో వర్గీకరించాలని చెప్పింది. కానీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో 2017–25 వరకు హైకోర్టులో 28,611 కేసులు పడ్డాయి. దీంతో 45 రోజుల్లో ఈ జాబితా పబ్లిక్డొమైన్లో పెట్టాలని, కోర్టుకు కూడా కాపీ ఇవ్వాలని, అన్ని జిల్లాల్లో ఇవ్వాలని, 22ఏ జాబితా నుంచి భూములను తొలగించాలంటే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. దీంతో కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా డిసెంబర్ 3, 2025న ఈ జాబితాను పబ్లిక్ డొమైన్లో పెట్టాం. అయితే, తక్కువ సమయం ఉన్నందున జీవో 121, ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన సమయంలో ఏ భూములు ఈ జాబితాలో ఉన్నాయో వాటిని అప్డేట్ చేయకుండా అదే కాపీని అప్లోడ్ చేశాం. స్వార్థం, స్వలాభం కోసం చేసింది కాదు. తప్పు జరిగిన మాట వాస్తవం. దీనిపై నేను విచారం వ్యక్తం చేశాను. అయితే, యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దుతున్నాం’ అని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. శనివారం అసెంబ్లీలో 22ఏ భూములపై స్వల్పకాలిక చర్చను పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడున్నర గంటల పాటు ప్రసంగించారు. చేయాల్సింది చేసి, కొల్లగొట్టాల్సింది కొల్లగొట్టి నంగనాచిల్లా మాట్లాడుతున్నారని, దొంగే పోలీసును దొంగా దొంగా అన్నట్టుగా బీఆర్ఎస్ వైఖరి ఉందని ధ్వజమెత్తారు. 47,400 ఎకరాలు తగ్గింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి 220 జాబితాలో 1,02,52,690 ఎకరాల భూమి ఉంటే, 2026 ఆగస్టు 31 నాటికి 1,02,05,250 ఎకరాలు ఉందని చెప్పారు. అంటే 47,400 ఎకరాలు తగ్గిందని, ఇంకా తాము లక్షల ఎకరాలు కొత్తగా ఈ జాబితాలో చేర్చింది ఎక్కడని నిలదీశారు. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 1,95,812 ఎకరాల వ్యవసాయేతర భూములు 22ఏ జాబితాలో ఉంటే ఇప్పుడు 1,94,543 ఎకరాలున్నాయని, దాదాపు 800 ఎకరాలు తగ్గితే తాము కొత్తగా ఏం చేరుస్తామని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితా నుంచి తొలగించిన ప్రతి అంగుళం భూమికి కాగితాలున్నాయని, టీఎం–15 మాడ్యూల్ ద్వారా ప్రజల పట్టా భూములైన 23వేల ఎకరాలను వారికి ఇచ్చేశామని, జీవోలు, మెమోల లద్వారా మరో 20వేల ఎకరాలు ప్రజలకే ఇచ్చామన్నారు. అయితే, బీఆర్ఎస్ హయాంలో ఈ జాబితా నుంచి తొలగించిన 23వేల ఎకరాల భూమికి కాగితాల్లేవని కమిటీ చెప్పిందన్నారు. 22ఏ జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గాయని అనడంలో వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఇక్కడ పలికే చిలుకలు మాత్రమే వేరని, కానీ పలుకులు మాత్రం ఒకటేనన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు, ఏలేటి మహేశ్వర్రెడ్డిలు ఒకే తరహాలో మాట్లాడిన మాటలను స్పీకర్ అనుమతితో సభకు వీడియో ద్వారా వినిపించారు. శకుని మామ చేసి ఉంటే.. ‘అగిపెట్టెల అబద్ధాల రావు, శకుని మామ తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నారు. అప్పుడే వారు ఈ జాబితాను సరిచేసి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదు. వారు తెచ్చిన ధరణి కారణంగా ఎంతో మంది ఆత్మహత్యల పాలయ్యారు. ఇప్పుడేదో మాట్లాడుతున్నారు. మనిషి రక్తం మరిగిన పులి మళ్లీ మళ్లీ తిరిగినట్టు అధికారం కోసం దోచుకోవడం కోసం నోరు తెరిస్తే అబద్ధాలాడుతున్నారు. కానీ ఆ పులికి తెలియదు.. వచ్చి రేవంత్రెడ్డి అనే బోనులో పడతాడని. ముక్కుతాడు వేసి కట్టేస్తాడని తెలియదు. నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ రోడ్డెక్కి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. 22ఏ జాబితాతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నప్పుడు పిల్లకాకులు అరవడమెందుకు? ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చి మాట్లాడొచ్చు కదా? సలహాలు ఇవ్వచ్చు కదా? వసతులు, ఏర్పాట్లు కావాలి కానీ ప్రజలకు సమస్య వచ్చినప్పుడు కనుచూపు మేరలో కనిపించవా? నువ్వున్నప్పుడు నేను మాట్లాడాలనే కోరిక అలానే మిగిలిపోయేట్టుంది’ అని పొంగులేటి చెప్పారు. మొహం చాటేయడం అలవాటే.. 22ఏ జాబితాలో ఉన్న భూములను చూపెట్టి పేదల కడుపుకొట్టారని, అందుకే సమాధానం చెప్పాల్సి వస్తుందని సభలో గందరగోళం సృష్టించి ప్లాన్ ప్రకారం పారిపోయారని పొంగులేటి అన్నారు. అయితే, చర్చకు మొహం చాటేయడం వారికి అలవాటేనని, సభ నుంచి వారు పారిపోయినా ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇప్పుడు 22ఏ జాబితా కారణంగా అక్కడక్కడా ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అని, కానీ ధరణిని అమల్లోకి తెచ్చినప్పుడు మూడు నెలల పాటు అసలు రిజిస్ట్రేషన్లనే నిలిపివేశారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి 387 గ్రామాలకు నక్షాల్లేవని, ఆయా గ్రామాల్లో సర్వే చేసి భూముల సమస్యలు తీరుస్తున్నామని చెప్పారు. ఇందుకోసం మొదటి దశలో భాగంగా 70 రోవర్లు కొనుగోలు చేశామని, 32 జిల్లాల్లోని 70 చొప్పున గ్రామాల్లో తొలిదశలో పైలట్ సర్వే చేస్తున్నామన్నారు. నవంబర్ చివరికల్లా ఈ సర్వే పూర్తవుతుందని అన్నారు. 23వేల ఎకరాలు అక్రమంగా బదిలీ ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని వారు చేసిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తే అనేక భయంకర విషయాలు వెలుగులోనికి వచ్చాయని పొంగులేటి చెప్పారు. పైలట్లో భాగంగా సిద్ధిపేట, సిరిసిల్లలో ఆడిట్ చేస్తే 23వేల ఎకరాల భూమిని 13వేల ఖాతాలకు బదిలీ చేసినట్టు తేలిందన్నారు. ఏ భూమి ఎవరి ఖాతాలోకి వెళ్లింది.. విదేశాల్లో జరిగిన లావాదేవీలేంటి? అక్కడ కట్టుకున్న హోటళ్ల వివరాలను ప్రత్యేక విచారణ బృందం (సెట్)కు పంపామని తెలిపారు. అధికారం పోయిన తర్వాత కూడా అధికారంలోనే ఉన్నామని భ్రమపడుతూ, పాత వ్యవస్థలను ఉపయోగించుకుని పేదల భూములను కొల్లగొట్టాలనే ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు. అసలు 22ఏ భూముల విషయంలో కొన్ని సమస్యలను గుర్తించామని, వాటిపై సభ సూచన మేరకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పొంగులేటి వెల్లడించారు. యూఎల్సీ భూములు, జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ, డీటీసీపీలు అనుమతిలిచ్చిన లేఅవుట్లు, జీవో 59, జీవో 118, అసైన్డ్ భూముల్లో కట్టుకున్న ఇళ్లు, ఇందిరమ్మ హౌసింగ్ కింద కేటాయించిన ఇంటి స్థలాలు, నాలా మార్పిడి కాని భూములు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లేఅవుట్ల విషయంలో సమస్యలున్నాయని, వీటిని సభ నిర్ణయం మేరకు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని పొంగులేటి స్పష్టం చేశారు. ధరణి దందాతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారు... –ఎన్నికల్లో ఖర్చుకు వాడారు –హరీశ్రావు సొంత మామకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టించారు –ఇలా పొందినవారిలో పల్లా రాజేశ్వరరెడ్డి, గంగుల కమలాకర్ ఉన్నారు ధరణి పోర్టల్ను అట్టుపెట్టుకుని బీఆర్ఎస్ పెద్దలు రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అలా వచ్చిన డబ్బును గత ఎన్నికల్లో ఖర్చు కోసం వాడుకున్నారన్నారు. ఎకరాల కొద్దీ భూమిని నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టా భూములుగా మార్చి విక్రయించి భారీగా డబ్బు పోగు చేసుకున్నారన్నారు. అలాంటి లావాదేవీలకు సంబంధించి తమ ప్రభుత్వం గుర్తించిన భూములను తిరిగి నిషేధిత జాబితాలోకి చేరుస్తూ, అవి పేదలకు దక్కేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 22ఏకు సంబంధించి శాసనససభలో జరిగిన స్వల్పకాలిక చర్చను ప్రారంభిస్తూ ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్రావులను ప్రధాన పాత్రధారులుగా పేర్కొంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ను శకుని మామ అని, హరీశ్రావును అగ్గిపెట్టెల అబద్ధాల రావు, అని కేటీఆర్ను డ్రామాల వ్యక్తి అంటూ పదేపదే సంబోధించారు. ఉదాహరణలతో సభ ముందు... ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని అసైన్మెంట్, భూదాన్ భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టా భూములుగా మార్చి ప్రైవేట్ పరం చేశారంటూ మచ్చుకు కొన్ని ఉదంతాలుగా సభ దృష్టికి తెచ్చారు. పొంగులేటి మాటల్లోనే... ⇒ ‘సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సర్వే నెం.271లో 327.09 ఎకరాల ప్రభుత్వం భూమిని గతంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల కోసం కేటాయించింది. ఇందులో 6.18 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీశ్రావు తన సొంత మామ (భార్య తండ్రి) హన్మంతరావుకు కట్టబెట్టించారు. ఇందులో కొంత భూమికి సంబంధించి మిషన్ భగీరథ పరిహారం కూడా పొందారు. ⇒ మెదక్ జిల్లా శివంపేట మండలం సిక్లిందాపూర్ గ్రామంలో సర్వే నెం.33 నుంచి 87 వరకు ఉన్న 569.05 ప్రభుత్వ భూమిలో 2023 అక్టోబరు 5న 372.32 ఎకరాలకు సంబంధించి ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) జారీ చేశారు. దాన్ని మొత్తంగా స్వాహా చేశారు. ఆ రూపంలో పోగుచేసుకున్న రూ.కోట్ల మొత్తాన్ని ఎన్నికల ఖర్చుగా వినియోగించారు. ⇒ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామ సర్వే నం.58, 59లో ఉన్న 476.30 ఎకరాలు ప్రభుత్వం భూమిలో.... 112.21 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుంచి తప్పించి ఓ కుటుంబంలోని సభ్యుల పేర్లతో ఓఆర్సీ జారీ చేశారు. ఇక్కడే 195.25 ఎకరాలను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు జారీ చేసే సమయంలో కొందరు పసిగట్టి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాగోతం వికటించి తిరిగి ఆ భూములు నిషేధిత జాబితాలోకి చేరాయి. ⇒ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగుల పల్లి గ్రామంలో సర్వే నం. 186 నుంచి 189లో ఉన్న 29.27 ఎకరాల భూదాన్ భూమి ఉండగా, దాన్ని పట్టా భూమిగా కన్వర్ట్ చేయించారు. ఇందులో 24.27 ఎకరాలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మరో ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూమి ప్రస్తుత విలువ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మేము తిరిగి నిషేధిత జాబితాలో చేర్చాం. ⇒ ఇదే గ్రామం శంకర్హిల్స్ ఏరియాలోని సర్వే నం. 111–191 లోని 460 ఎకరాల భూమికి పట్టాదారులు గతంలో ఓ ప్రైవేటు సంస్థకు జీపీఏ ఇచ్చారు. దాన్ని ఆ సంస్థ 3,333 ప్లాట్లుగా విడదీసి విక్రయిస్తోంది. మరోవైపు ఆ భూమిని మరో సంస్థకు మరోసారి జీపీఏ చేశారు. ఆ సంస్థ ఎకరాల రూపంలో విక్రయిస్తోంది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా స్టేటస్కో జారీ అయింది. 2022లో నాటి ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టింది. తర్వాత 226.06 ఎకరాలను ఆ తర్వాత నిషేధిత జాబితా నుంచి తప్పించి ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. అలా పొందినవారిలో బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ కూడా ఉన్నారు’ -
దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారా? బండి సంజయ్
హైదరాబాద్: ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసుల వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్లపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తారా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన ఏబీవీపీ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని కారణంగానే ఏబీవీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన చేస్తే కాళ్ళు చేతులు విరగ్గొడతారా? అని నిలదీశారు. ‘కాంగ్రెస్ సర్కార్కు పోయే కాలం దాపురించింది. ప్రశ్నించే వాళ్లపై దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నేతలను విడిచిపెట్టాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. జీవో నంబర్-9ను రద్దు చేయాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, విద్యార్థి సంఘాలపై అమానుషంగా ప్రవర్తించడం దుర్మార్గం. విద్యార్థులని చూడకుండా ఇష్టరీతిన గొడ్డున బాదినట్లు చావగొడతారా?, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్యాల రాకేష్ తీవ్ర అస్వస్థత కాగా తోటి నాయకులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. విద్యార్థి నాయకుడు అస్వస్థకు గురికాడారానికి కారణం పోలీసులు కాదా?, ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది పోరాడే విద్యార్థులపై ఏ రకంగా దాడి చేస్తున్నారో అనే విషయం. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తే.. హైడ్రా కూలగొడుతుందా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే -
సీఎంగా తలసాని.. ఉత్తమ్గా పల్లా.. మాక్ అసెంబ్లీలో నవ్వులే నవ్వులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ వర్షాకాల సెషన్ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెన్షన్కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆ పార్టీ ప్రదాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించింది. బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో స్పీకర్ పాత్రను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావ్ పోషించారు. అలాగే సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర వేశారు. మంత్రి పొంగులేటి పాత్రలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మంత్రి ఉత్తమ్ పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అలరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కేటీఆర్, హరీష్రావు.. మిగతా ఎమ్మెల్యేలు కనిపించారు.ఈ చర్చలో మాజీ మంత్రి జగదీశ్ ప్రశ్నలు వేయగా.. అవతలి నుంచి సమాధానాలు వచ్చాయి. సీఎం, మంత్రుల్ని ఇమిటేట్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన సందడి నవ్వులు తెప్పించాయి. కాంగ్రెస్ సర్కార్కు సెటైరిక్గా చివరి వరకు నడిచింది మాక్ అసెంబ్లీ. LIVE: తెలంగాణ భవన్ లో ''మాక్ అసెంబ్లీ'' కార్యక్రమంhttps://t.co/2C1qZvGBQB— BRS Party (@BRSparty) September 12, 2026సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుపడుతున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుల్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అయితే కీలక హామీలు నెరవేర్చకపోవడం, ప్రజా సమస్యలు, పలు కీలక అంశాలపై చర్చకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం తమను సభలో లేకుండా చేసిందని బీఆర్ఎస్ అంటోంది. ఈ క్రమంలోనే మాక్ అసెంబ్లీ నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: ఇంతకీ ఆమెకు ఏమైంది?.. ఎక్కడ? -
కొండా సురేఖ బర్తరఫ్పై కేటీఆర్ రియాక్షన్ ఇదే
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ కేబినెట్ బర్తరఫ్, రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన 22-ఏ (22-A) నిబంధన అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో అమలవుతున్న 22-ఏ నిబంధన కేవలం ఒక ఆంక్ష మాత్రమే కాదని, కోటి ఎకరాల భూమిని మాయం చేసే ఒక పెద్ద మహా కుంభకోణమని కేటీఆర్ ఆరోపించారు.22ఏ నిషేధిత భూముల స్కాం పేరుతో నిర్వహించిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ నాయకులు సామాన్యుల ఆస్తులను టార్గెట్ చేసి భూ దందాలకు పాల్పడుతున్నారు. మంత్రి పదవి నుంచి కొండా సురేఖ తొలగించడానికి 22-ఏ భూముల వివాదమే. ఈ భారీ భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాన సూత్రధారి అని, రెవెన్యూ శాఖ మంత్రి పాత్రధారిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ మంత్రి కేవలం సారీ చెబితే సరిపోదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.రాష్ట్రంలో సంక్షేమం పక్కనపెట్టి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూ ఆక్రమణలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ఎండగడతామని’ స్పష్టం చేశారు. 👉ఇదీ చదవండి : మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ ఔట్ -
మీ కోసం.. ఎనీ టైమ్
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆఫీసు రచ్చబండ లాంటిది. నా కార్యాలయ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. ఉద్యోగ సంఘాల నేతలు నన్ను ఎప్పుడైనా కలవచ్చు. ఉదయమే కాదు... రాత్రిపూట కూడా వచ్చి కలవచ్చు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది’అని సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితర ప్రతినిధి బృందం సీఎంతో సమావేశమైంది. ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలను టీజీఈజేఏసీ ప్రతినిధులు వివరించారు. ఇందుకు సంబంధించి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా ఆరు అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు. రెండవ పీఆర్సీ నివేదిక, 51% ఫిట్మెంట్, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు, రూ.10,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు–ఓపీఎస్ అమలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఉద్యోగ సంఘాల గుర్తింపు తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఉద్యోగుల సమస్యలను ఆలకించిన అనంతరం సీఎం పైవిధంగా స్పందించారు. నివేదిక పరిశీలిస్తాం...తుది నిర్ణయం తీసుకుంటాం జేఏసీ ప్రతినిధులతో సీఎం మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక సమర్పించేందుకు ఇప్పటికే కమిషన్కు ప్రభుత్వం లేఖ పంపిందని, నివేదిక అందిన అనంతరం దానిని పరిశీలించి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి పీఆర్సీ, డీఏలపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ.10వేల కోట్లు విడుదల చేసిందని, ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని సీఎం తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అనేక అంశాలు తన ముందున్నాయని, వాటితో పాటు ఇతర పరిపాలనా కార్యక్రమాల వల్ల సమయం కేటాయించడం కష్టంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆర్థిక శాఖతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి సమావేశమై అన్ని అంశాలపై చర్చించి పరిష్కార మార్గాలను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో జేఏసీ ప్రతినిధులు దామోదర్ రెడ్డి, చావ రవి, సదానంద గౌడ్, గౌతమ్ కుమార్, కటకం రమేష్, ముజీబ్ హుస్సేన్, బి.శ్యామ్, వెంకట్, రమణారెడ్డి, భిక్షం గౌడ్ తదితరులున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు, డిప్యూటీ కలెక్టర్ల సంఘంవ్యవస్థాపక అధ్యక్షులు వి.లచి్చరెడ్డి, జేఏసీ నేత వడ్నాల రాజశేఖర్ కూడా సీఎంను కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం టీజీఈజేఏసీ ప్రతినిధి బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి ఉద్యోగుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. -
‘సర్’తో.. ఏదో ప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న ఆంతర్యాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు గ్రహించాలని చెప్పారు. ఎస్ఐఆర్ను చాలా సీరియస్గా తీసుకోవాలని అన్నారు. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు చెప్పానని, ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలని, అర్హులైన వారి ఓటు హక్కును కాపాడాలని సూచించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిది నరసింహారెడ్డి, వంగా సుబ్బారావు, జి.సిద్ధయ్యల మృతికి సీఎల్పీ సంతాపం తెలిపింది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర ‘ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా చూపెడుతున్నారు. కానీ ఓటర్ల సంఖ్య మాత్రం 88 కోట్లే అంటున్నారు. అంటే దాదాపు 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ 15 కోట్ల ఓట్ల తొలగింపు కారణంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేయగలగాలి. ఆ ప్రమాదం మన దరిదాపులకు రానీయకుండా మీరే జాగ్రత్త పడాలి. మీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుంది. మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. ఎస్ఐఆర్ కోసం నేను రెండు రోజులు కొడంగల్లోనే ఉన్నా. ఎమ్మెల్యేలందరూ అలానే ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో జరిగిన జనగణన దేశానికి రోల్మోడల్. రాష్ట్ర నమూనాను దేశ వ్యాప్తంగా జనగణనలో చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అధికారం పోయినా అహంకారం పోలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాలి. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే ఫామ్హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన సభ జరగకుండా కుట్ర చేశారు. అధికారం పోయినా వారికి అహంకారం పోలేదు. పోలీసులు, ప్రజాప్రతినిధులను దూషించి మూడు రోజుల పాటు సభ సజావుగా జరగకుండా చేశారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించారు. మహిళా అధికారుల ముందు టీ షర్టులు విప్పి ఇబ్బంది కలిగించారు. సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. దళితులు నిరసన తెలిపేందుకు వెళ్లిన నేలను శుద్ధి చేసి అవమానపర్చారు. అయినా ప్రతిపక్షం కుట్రలను బలంగా తిప్పికొట్టడంతో పాటు ఆ కుట్రను ప్రజలకు తెలియజేయగలిగాం..’అని సీఎం అన్నారు. కుట్రను తిప్పికొట్టారంటూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అభినందించారు. సీఎల్పీ భేటీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, రాజనర్సింహ, ఉత్తమ్, మహేశ్ గౌడ్, శ్రీధర్బాబు, ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో పనితీరు ఆధారంగానే పదోన్నతులు ‘అసెంబ్లీలో జరిగిన ఘటనల గురించి ఫ్లాష్ సర్వే చేయించా. అందులో కాంగ్రెస్కు చాలా పాజిటివ్గా వచ్చింది. మనం ఏం చేస్తున్నామో ప్రజలు గమనిస్తుంటారు. కాంగ్రెస్ సభ్యులు లాబీల్లో తిరగడం కాదు. అసెంబ్లీలో హాజరు తగ్గకుండా చూసుకోవాలి. సభ జరిగినన్ని రోజులు ఖచ్చితంగా హాజరు కావాలి. చర్చల్లో పాల్గొనాలి. నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించాలి. ప్రజలిచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా రాణించలేరు. అసెంబ్లీలో పనితీరు ఆధారంగానే పదోన్నతులు వస్తాయి. సభలో అందరికీ వెసులుబాటుగా ఉండడం కోసం అత్యంత చారిత్రక భవనంలో శాసనమండలి నిర్వహిస్తున్నాం. అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీపాదరావు పేరిట సెంట్రల్ హాల్ ఏర్పాటు చేశాం. 22ఏలో కోటి ఎకరాలు అవాస్తవం 22ఏ అనేది అభూత కల్పన మాత్రమే. ఈ జాబితాలో కోటి ఎకరాలు ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న భూములే ఇప్పుడూ ఉన్నాయి. ప్రైవేటు వివాదాలున్నవి కేవలం 3 లక్షల ఎకరాలు మాత్రమే. ధరణిలో భారీ ఎత్తున అరాచకాలు చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ నేత ఒకరి పేరిట వెయ్యి ఎకరాలు ఎక్కించుకున్నారు. వీటన్నింటిపైనా విచారణ చేయిస్తున్నాం. అన్నీ ఒకొక్కటిగా బయటకు వస్తాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఎల్నినో కారణంగా వచ్చే 10 నెలలు కూడా ఇబ్బంది ఉంటుంది. కరువు వచ్చే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేలు సాగునీటిపై కాకుండా తాగునీటిపై ఫోకస్ చేయాలి. కొందరు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి అదే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగేవారా?’అని సీఎం ప్రశ్నించారు. వెయ్యి రోజుల పాలనకు సహకరించిన సీఎల్పీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికీ పథకాల ప్రచారం జరగాలి: భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరం కలిసి పనిచేస్తే కుట్రలను ఎలా ఛేదించగలమో చేసి చూపించామని అన్నారు. బీఆర్ఎస్ నేతల తీరు, వారి భాష, వివక్ష పూరిత కార్యకలాపాల గురించి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసి కట్టడి చేయగలిగామని అన్నారు. అందరం ఒకటే మాట, ఒకటే బాటగా ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడంలో వెనుకబడుతున్నామన్నారు. సరైన విధంగా ప్రచారం చేసుకుంటే ఆ ప్రవాహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేసిన పనులను ప్రతి గ్రామంలో ఇంటింటికీ ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణలోనే సామాజిక న్యాయం: పీసీసీ చీఫ్ సామాజిక న్యాయం తెలంగాణలోనే అమలవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ బీసీ కాకపోయినా బీసీలకు రిజర్వేషన్ల కోసం ముందుకొచ్చారని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. కాగా రాష్ట్రంలో పరిస్థితులను పలువురు మంత్రులు సీఎల్పీకి వివరించారు. ఎల్నినో ప్రభావం, నీటి సమస్యపై మంత్రి ఉత్తమ్, జనగణనలో బీసీ కాలమ్ గురించి పొన్నం, 22ఏ భూముల జాబితా గురించి పొంగులేటి, పాలిటెక్నిక్ విద్యార్థుల అంశంపై మంత్రి వివేక్లు వివరించారు. యాష్కీకి సీఎం శుభాకాంక్షలు ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్గా ఎంపికైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్కు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం సీఎల్పీ సమావేశం అనంతరం.. అసెంబ్లీ కమిటీ హాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాష్కీకి శుభాకాంక్షలు తెలియజేశారు. -
రేవంత్ సర్కార్ ‘ఫ్లాష్ సర్వే’.. తేలింది ఇదే..!
సాక్షి, హైదరాబాద్: సీఎల్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల ఘటనలపై ఫ్లాష్ సర్వే చేయించానని.. బీఆర్ఎస్ గ్రాఫ్ చాలా పడిపోయిందన్నారు. ప్రజలు.. బీఆర్ఎస్ నేతల తీరునే తప్పుపట్టినట్లు సర్వేలో తేలిందన్న రేవంత్.. ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీకి అండగా నిలబడ్డారు. మొన్నటి ఘటనలో పోలీసులు చాలా ఓర్పుతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.‘‘కోటి ఎకరాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కానీ 3.06 లక్షల ఎకరాలు మాత్రమే 22ఏలో ఉంది. మిగతాది అంతా ప్రభుత్వ, అటవీ భూములే. నేను ‘సర్’ కోసం రెండు రోజులు కొడంగల్లో ఉన్నాను. అందరూ అదే విధంగా ఫోకస్ చేయాలి. ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సభను నిర్వహిస్తున్నాం’’ అని రేవంత్ చెప్పారు.శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా. జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టాం. సభ్యులు తప్పనిసరిగా సభలో చర్చల్లో పాల్గొనండి. సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందరికీ వెసులుబాటుగా ఉండాలని అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ పరిపాలనా వైఫల్యం’
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చేందుకు పవర్ లేదని, ప్రతి పక్షాల పీక నొక్కేందుకు మాత్రం కాంగ్రెస్కు పవర్ ఉందా? అని నిలదీశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు. రాష్ట్ర రైతులకు కనీసం ఇప్పుడు 7 నుంచి 8 గంటల కరెంట్ కూడా రావడం లేదని హరీష్రావు విమర్శించారు. ఈ రోజు(గురువారం, సెప్టెంబర్ 10వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మాట్లాడిన హరీష్రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో తెలంగాణ రైతాంగ కష్టాలు చూడాల్సి వస్తుందన్నారు. ‘ఒకవైపు నీళ్లు ఇవ్వలేవు.. కరెంట్ ఇవ్వలేవు.. ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా?’ అని ప్రశ్నించారు. అసలు రైతులకు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారని సూటిగా నిలదీశారు. భద్రాద్రి, కొత్తగూడెం పవర్ ప్లాంట్ ఎందుకు బంద్ చేశావ్ రేవంత్ అని ప్రశ్నించారు. ఇక యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నడపలేకపోతుంది ఈ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ పరిపాలనా వైఫల్యమని హరీష్ మండిపడ్డారు. ఇదీ చదవండి: ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు సరిపోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి -
బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపనుంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఎదురైన పరిణామాలను జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయించబోతోంది.సభ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ ఈ అసెంబ్లీ సమావేశాల సెషన్ నుంచి 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గురువారం ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో వాళ్లంతా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపాలని నిర్ణయించారు. అసెంబ్లీ వద్ద పోలీసులు దాడి చేశారని.. తమతో అనుచితంగా ప్రవర్తించారని ఎన్హెచ్ఆర్సీతో పాటు జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయయనున్నారు. అలాగే హోం శాఖపైనా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. తెలంగాణ హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ పరిణామాలకు సంబంధించిన ఫొటో, వీడియో ఫుటేజీలను ఇప్పటికే ఆ పార్టీ బహిరంగంగా ప్రదర్శించింది. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫొటోలు నకిలీవంటూ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ సాయంత్రానికే సబిత, సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో మహిళా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్మార్ట్ రేషన్ కార్డ్లో అన్నీ తప్పులే! -
అంతా ‘రాజకీయమే’!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు వరుసగా మూడోరోజు కూడా రాజకీయం కోణంలో కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. ఇటు అసెంబ్లీ, అటు కౌన్సిల్లో సోమవారం బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ గేటు బయట చేసిన ఆందోళన కేంద్రంగానే దుమారం కొనసాగింది. అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టగా, కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సెషన్ మాత్రమే జరిగింది. అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లకు చెందిన సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలు, సస్పెన్షన్లు జరగ్గా, అసెంబ్లీ బయట అధికార, విపక్ష సభ్యులు రాష్ట్ర గవర్నర్ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు. సభ ప్రారంభం కాగానే.. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగా నే మళ్లీ గొడవ మొదలైంది. తమ ఆందోళన సందర్భంగా మహిళా సభ్యులపై పోలీసుల దురుసు ప్రవర్తన గురించి బీఆర్ఎస్ సభ్యు లు సభలో లేవనెత్తారు. శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో సహా పలువురు మంత్రులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ సభ్యుల వ్యవహరశైలిని తప్పుపట్టారు. గందరగోళం మధ్య సభకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులందరినీ సెషన్ మొతానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రకటించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్భవన్కు వెళ్లి గవర్నర్ శివపత్రాప్ శుక్లాను కలిశారు. తమ హక్కులను పరిరక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. మంత్రులతో సీఎం భేటీ అసెంబ్లీలోని తన చాంబర్లో సీఎం రేవంత్రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబుతో పాటు ఇతర మంత్రులతో బుధవారం నాటి పరిణామాలపై చర్చించారు. బీఆర్ఎస్ నేతల సస్పెన్షన్, సభ నిర్వహణపై మంత్రులతో సమాలోచనలు జరిపారు. సభ జరిగినన్ని రోజులు ప్రధానంగా ఏయే అంశాలపై చర్చించాలన్న దానిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విరామం తర్వాత కూడా అసెంబ్లీ రాజకీయ అంశాలపైనే కొనసాగింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద దళిత సంఘాలు చావు డప్పు కార్యక్రమం నిర్వహించగా, ఆ ప్రదేశాన్ని బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పుపట్టింది. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి కూడా అటు కేసీఆర్, ఇటు బీఆర్ఎస్లను టార్గెట్ చేశారు. మండలిలో ప్రకంపనలు మండలిలోనూ రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. మండలి ప్రారంభం కాగానే సస్పెన్షన్కు గురైన తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలను సభకు అనుమతించి వారి వివరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ అనుమతించకపోవడంతో వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభలో ప్రశ్నోత్తరాలను ముగించిన తర్వాత ప్రత్యేక ప్రస్తావనలను ప్రవేశపెట్టిన అనంతరం గురువారం నాటికి వాయిదా వేశారు. కాగా తాతామధు, నవీన్రెడ్డిలపై ఎలాంటి చర్య లు తీసుకోవాలనే అంశాన్ని మండలి చైర్మన్ గుత్తా, మహేశ్గౌడ్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీకి పంపించారు. దళితులు, మహిళల గౌరవం కాపాడాలి బుధవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి దళితులు, మహిళల గౌర వం, భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, అజహరుద్దీన్, వివేక్, లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే లు కవ్వంపల్లి సత్యనారాయణ, వెడ్మ»ొజ్జులు గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలు అసెంబ్లీ స్పీకర్ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశా రని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తన చొక్కాను విప్పారని, తదితర సోమవారం జరిగిన ఘటనల గురించి గవర్నర్కు వారు వివరించారు. దళితులు నడిచిన రహదారులను పసుపు నీళ్లు, పాలతో శుద్ధి చేయడం ద్వారా నిషేధిత, చట్టవిరుద్ధమైన, అమానవీయమైన, అనై తికమైన అంటరానితన ఆచరణను బీఆర్ఎస్ ప్రదర్శించిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ఘటనలకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిపైనే కాకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంలో ఉన్న అసలు కుట్రదారులపై అ త్యంత కఠినమైన శిక్షలు విధించేలా చర్య లు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. -
మా హక్కులు పరిరక్షించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులు, కేసులు, వారి అరెస్టులు సస్పెన్షన్లపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఈ మేరకు 13 పేజీల వినతిపత్రాన్ని సమర్పించింది. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు జరిగాయి. పోలీసులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులపై పోలీసులు, మార్షల్స్ దాడి చేశారు. కేసీఆర్ ఇంటిపై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేతృత్వం వహించారు. పోలీసులు వారికి ఎస్కార్ట్ ఇవ్వడంతో పాటు రోప్ పార్టీలు ఏర్పాటు చేసి వేలాది మందిని అక్కడికి అనుమతించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 167, 355 తదితర నిబంధనల మేరకు మా హక్కులు కాపాడండి. మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి భద్రత కల్పించాలి..’అని ఆ వినతిపత్రంలో బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. గవర్నర్తో భేటీ అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లోక్భవన్ బయట మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని వివరించాం.. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గవర్నర్ను కలిసినట్లు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ప్రజలకు ఇ చ్చిన హామీల అమల్లో వైఫల్యంతో పాటు పాలనా వైఫల్యాన్ని గవర్నర్కు వివరించినట్లు తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, యువత, పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అసెంబ్లీ వద్ద తమపై జరిగిన దాడులు, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు, ఆధారాలను అందజేశామని చెప్పారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన ఘటనను కూడా వివరించామన్నారు. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ నివాసంపై దాడి యత్నం, తమపై దాడి చేసిన పోలీసులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని తీరును వివరించినట్లు కేటీఆర్ తెలిపారు.హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. అసెంబ్లీ, శాసనమండలిలోకి రానివ్వకుండా తమను ప్రభుత్వం అడ్డుకుందని, హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్కు వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. శాసనమండలి సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని వివరించామని, ప్రభుత్వం విడుదల చేసిన ఏఐ ఫొటోలు, వీడియోలపైనా ఫిర్యాదు చేశామని చెప్పారు. తప్పుడు చిత్రాలు, ఫిర్యాదులు ఉపయోగించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో న్యాయం జరగకుంటే జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయిస్తామని చెప్పారు. కాగా శాసనసభ వ్యవహారాలతో పాటు బయట జరిగిన అన్ని ఘటనలపై విచారణ జరిపిస్తామని, సీఎస్, డీజీపీని పిలిపించి వివరాలు తెలుసుకుంటానని గవర్నర్ తమకు హామీ ఇ చ్చినట్లు తెలిపారు. -
ఆ రెండూ కుట్రలే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను, ఆయన మాతృమూర్తిని కించపరిచి అవమానించటం, అనంతరం ఆయనకు మద్దతుగా నిరసన తెలిపిన దళితులు నడిచిన ప్రాంతాన్ని శుద్ధి చేయటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలను కుట్రలుగానే పరిగణిస్తున్నామని చెప్పారు. ఇందుకు వ్యూహకర్తలు, ప్రత్యక్షంగా అమలు చేసిన వారిపై ఆయా సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, విచారణ జరిపి జైలుకు పంపే ఏర్పాటు చేస్తామని అన్నారు. ముంబయిపై దాడి చేసిన కసబ్ లాంటి ఉగ్రవాదులకు కొన్ని అంశాలను నూరిపోసి ఉన్మాదులుగా మార్చి మన దేశంపైకి పంపిన తరహాలోనే, కేసీఆర్ కూడా తన అనుచరులకు ఇలాగే నూరిపోసి ఉన్మాదులుగా మార్చి ఉసిగొల్పారని ఆరోపించారు. దాంతో పేట్రేగిన నేతలు ఆ రోజు దళిత స్పీకర్ను కించపరచటమే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆ కార్యక్రమానికి ముందురోజు ఫామ్హౌస్లో జరిగిన భేటీలో చేసిన కుట్ర మొదలు ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న ఘటనలపై సంపూర్ణ విచారణ చేపడతామన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు జాయింట్ కమిషనర్ విజయకుమార్ను విచారణాధికారిగా నియమిస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం శాసనసభలో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. కేసీఆర్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన దళితులను అవమానించేలా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసినట్టుగా చెబుతున్న వ్యవహారంపై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చను ముగిస్తూ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. కోర్టులు బెయిల్ ఇచ్చినా ప్రజలు బెయిల్ ఇవ్వరు ‘చట్టాలు, సెక్షన్లను అడ్డుపెట్టుకుని కొంతమంది కోర్టుల నుంచి బెయిల్ పొందవచ్చు. కానీ తెలంగాణ సమాజం మాత్రం వారికి బెయిల్ ఇవ్వదు. జరిగిన తప్పును అంగీకరించి క్షమాపణ చెబితే కిరీటం ఊడిపోతుందా? స్థాయి తగ్గుతుందా? సభాపతిని అవమానించిన విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుంది. చట్టపరంగా శిక్షించే వరకు వెనక్కి తగ్గబోదు. సభాపతి పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్కుమార్ మనసుకు గాయం చేసేలా ఉన్మాదంతో వ్యవహరించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. వ్యక్తినే కాకుండా తల్లిని కూడా అవమానించే స్థాయికి వెళ్లారు. మహిళలను శక్తిగా కొలిచే సమాజంలో ఇలాంటి చర్యలకు చోటుంటుందా? సభలో అధికారులపై దాడులు చేయడంతోపాటు స్పీకర్ కుర్చీని అవమానించేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. దళితులపై అవమానకర చర్యలు స్పీకర్ను అవమానించిన ఘటనకు నిరసనగా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఫామ్హౌస్ వద్ద డప్పు దరువులతో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారే తప్ప ఎలాంటి ఉన్మాదానికీ పాల్పడలేదు. దళిత సోదరులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేసేందుకు డప్పును ఒక సాధనంగా ఉపయోగిస్తారు. నిరసన తెలిపిన దళిత ప్రతినిధులను పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉంది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించి, దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించడం ద్వారా దళితనులను తీవ్రంగా అవమానించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తే.. మరి దొరతనం, ఆహంకారంతో ఉన్న ఆ నేతల మనసుల్లో పేరుకుపోయిన అంటరానితన భావజాలాన్ని ఎలా శుద్ధి చేస్తారు? యాసిడ్తో కడగాలా? దళితుడు దుక్కి దున్ని పంట పండిస్తేనే అందరి కడుపులు నిండుతున్నాయి. మనకు అన్నం పెడుతున్న వారిని ఇంతగా అవమానిస్తారా? దళితులను అవమానపరుస్తూ వారిని కించపరిచిన ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలి. అప్పుడే వారికి దళితులు ఎదుర్కొంటున్న వివక్ష ఎలాంటిదో తెలిసొస్తుంది. ఖర్గేనూ అవమానించారు.. సమాజంలో అశాంతిని ప్రోత్సహించి రెండు వర్గాల మధ్య వైరాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు ధనబలంతో వ్యవస్థలను లొంగదీసుకోవాలని చూస్తున్నారు. మేము మాత్రం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దేశంలోని కోట్లాది ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించింది. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో పుట్టి, రజాకార్ల దాడుల్లో తల్లిని కోల్పోయి, కార్మిక నాయకుడిగా ఎదిగి జాతీయ స్థాయికి చేరుకున్న నేత మల్లికార్జున ఖర్గేను అవమానించడం బాధాకరం. ఉత్తరాఖండ్లోని ఓ మైదానంలో ఖర్గే సభలో పాల్గొన్న అనంతరం ఆగస్టు 10న బీజేపీ అనుబంధ సంస్థ అదే మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం హేయమైన చర్య. ఆ ఘటనను ఈ సభ ముక్తకంఠంతో ఖండిస్తోంది. తాజాగా తెలంగాణ వేదికగా బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వ్యవహారానికి తెరలేపింది. వారిని వదిలే ప్రసక్తే లేదు.. విద్యా రంగంలోని అక్రమాలు, ధరణి అక్రమాలు, 22ఏ రాద్ధాంతంపై శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం భావించింది. ఈ అంశాలపై చర్చ జరిగితే గత పదేళ్లలో జరిగిన దురాగతాలు, రాష్ట్రంపై పేరుకుపోయిన అప్పుల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుందనే భయంతోనే చర్చను అడ్డుకునేందుకు ఈ కుట్రలు పన్నారు. సభను అడ్డుకోవడమే కాకుండా స్పీకర్ను అవమానించే స్థాయికి వెళ్లడం అత్యంత దురదష్టకరం. కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయానికి బాటలు వేసింది. కాంగ్రెస్ విధానం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడమే..’ అని సీఎం స్పష్టం చేశారు. స్పీకర్ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తి లేదని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే విషయంలో ప్రభుత్వం స్పీకర్కు పూర్తిగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
గవర్నర్ ఇవే అడిగారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇవాళ (బుధవారం) లోక్భవన్లో గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీ ఘటనలో పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతుందన్నారు.‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, యూరియా కొరత, రైతు బీమా, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు గవర్నర్కు ఫిర్యాదు చేశాం. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యపై ఫిర్యాదు చేశామని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్స్ వేసుకున్నట్టే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ టీ షర్ట్స్ వేసుకున్నాము. బ్లాక్ టీ షర్ట్ తో అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. దాడి చేసి మా పైనే ఉల్టా కేసులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కోరుకున్నారు. వేముల వీరేశం, కుంభం అనిల్రెడ్డి, నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారు. వేల మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫాం హౌస్పై దాడి చేసేందుకు ఉసిగొల్పారు. మేము అనని మాటలను అన్నట్టు స్పీకర్కు ఆపాదించారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్ను అవమానిస్తున్నారు...శాసన సభ కాదు.. దుశ్శాసన సభలా మార్చారు. చావు డప్పు ఎప్పుడు కొడతారో.. మనందరికీ తెలుసు. ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గర చావు డప్పు కొట్టారు. అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై సీఎస్ డీజీపీని పిలిపించి మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మంచివి కాదని గవర్నర్ మాతో చెప్పారు.’’ అని కేటీఆర్ వివరించారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్ -
బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తానికి ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని ప్రకటించారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడడమే ఇందుకు కారణంగా ఆయన తెలిపారు.బుధవారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. సభా కార్యకలాపాలకు బీఆర్ఎస్ సభ్యులు అడ్డుపడ్డారు. మంత్రులు మాట్లాడుతున్న టైంలో.. స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి నినాదాలు చేశారు. నిన్న కేసీఆర్ ఫామ్హౌజ్ ముట్టడికి కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రయత్నించిన క్రమంలో.. తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ (We Want Justice) నినాదాలు చేశారు.ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్.. వెళ్లి సీట్లలో కూర్చోవాలని బీఆర్ఎస్ సభ్యుల్ని కోరారు. అయితే వాళ్లు ఆ మాట వినలేదు. దీంతో వాళ్లను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పీకర్ను కోరారు. ఆ వెంటనే వాళ్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. సస్పెండ్ అయిన వాళ్లలో.. కేటీఆర్, హరీష్రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, అనిల్ జాదవ్, కోవాలక్ష్మీ మాణిక్రావు, గంగుల కమలాకర్, సంజయ్ కుమార్, సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని, చింత ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు 22 మంది ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత సభ కాసేపు వాయిదా పడింది. ఆ సమయంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ ఛాంబర్ వద్ద మార్షల్స్ కేటీఆర్, హరీశ్రావును అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మండలి నుంచి వాకౌట్ఇటు శాసనమండలిలో తమ ఇద్దరు సభ్యుల సస్పెన్షన్పై ఓటింగ్ నిర్వహించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని కోరింది. అందుకు ఆయన అనుమతించలేదు. తమను మాట్లాడేందుకు అనుమతించకపోవడం దారుణమంటూ మండలి విపక్ష నేత మధుసూధనాచారి నిరసన వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం తన తప్పును అర్థం చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. సభ ఉన్నత విలువలు పాటించాలి. మా అధినేత కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కోడతారట. ఎక్కడైనా ఇలా ఉంటుందా?. తెలంగాణకు అనేక సేవలు అందించిన మహానుభావుని చావు కోరుతారా?. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి...మా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు. నిన్న సభలోకి వస్తె వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలి. మా సభ్యులు సభలోకి వచ్చేవరకు మా నిరసన కొనసాగుతుంది. మా సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలి. మమల్ని ఎత్తివేస్తారా?. ఇది ప్రీ ప్లాన్డ్ కుట్ర. నిన్న పెట్టిన తీర్మానం పై చర్చ జరగాలి అని డిమాండ్ చేశారు. అయినా చైర్మన్ అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.ఇదీ చదవండి: ఇది ఫామ్హౌజ్లో జరిగిన కుట్రే! -
లోక్భవన్కు బీఆర్ఎస్.. కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల వేడి కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. బీఆర్ఎస్ నేతలు నేడు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవాలని నిర్ణయించింది. గత రెండు రోజులుగా కొనసాగిన పరిణామాలపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటు అధికార కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్కు సిద్దమైంది. ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు లోక్భవన్కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్లాల్సి ఉంది. అయితే అనుకున్న టైం కంటే అరగంట ముందుగానే గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. పది మంది ఎమ్మెల్యేల బృందం ఆయన్ని కలవనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా పోలీసుల జులుం.. మహిళా ఎమ్మెల్యేలతో ప్రవర్తించిన తీరు, ఎమ్మెల్సీల అరెస్టులు.. నిన్న ఎర్రవల్లికి వెళ్తుండగా అడ్డగింతలు.. ఇలా ఇటీవల చోటుచేసుకున్న దాడుల ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్కు సిద్ధమవుతోంది. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారాన్ని రేవంత్ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. మధుతో పాటు నవీన్కుమార్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయించే దిశగా.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇటు ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరై క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే.. అప్పటిదాకా బీఆర్ఎస్ నేతలకు మైక్ ఇవ్వకూడదని స్పీకర్ను కోరాలని చూస్తోంది. నేడు మండలిలో కీలక చర్చమరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజుకు చేరుకోనున్నాయి. శాసనమండలిలో తాతామధు వ్యవహారంపై చర్చ జరగనుంది. ఈ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన శాసనసభలో ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి.. తాతా మధు, నవీన్కుమార్ రెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకుగానూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలిసి దాడుల ఘటనలపై ఫిర్యాదు చేయనుండగా.. మరోవైపు అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి అవకాశం ఉండటంతో తెలంగాణ రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏం తమాషా చేస్తున్నారా? లోపలేస్తా.. -
కేటీఆర్ అరెస్టు.. ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఎర్రవల్లికి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను హకీంపేట వద్ద పోలీసులు అరెస్టు చేసి బోయిన్పల్లి పీఎస్కు తరలించడంతో బోయిన్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు తరలివచ్చారు.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేటీఆర్ను బోయిన్పల్లికి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్లు పెద్ద సంఖ్యలో అనుచరులతో పీఎస్ వద్దకు చేరుకున్నారు. కేటీఆర్ను పోలీసు స్టేషన్లోపలికి తీసుకెళ్లకుండా వాహనాలకు అడ్డుపడ్డారు.సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు అసెంబ్లీ నుంచి నేరుగా బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఇంతలోనే స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడటంతోపాటు వారిని పోలీసు స్టేషన్ ఆవరణ నుంచి తరిమేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. కేటీఆర్ను సాయంత్రం 4 గంటల వరకు పోలీసు స్టేషన్లోనే నిర్బంధించారు. చివరకు ఆయనను సొంతపూచీకత్తుపై విడుదల చేయగా, అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీశ్రావుపై క్రిమినల్ కేసు సాక్షి, హైదరాబాద్: శాసనసభ గేట్ నంబర్–3 వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఇందులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనభాపక్ష ఉప నేత టి.హరీశ్రావు సహా 14 మంది ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నారు.పోలీసులపై తోపులాట, దాడి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సైఫాబాద్ పోలీసులకు ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు. వీరిలో ఎవరిపాత్ర ఏమిటో తేల్చ డానికి వివిధ వీడియోలు, ఫొటోలు అధ్యయనం చేస్తున్నారు. గేట్–3 వద్ద జరిగిన మొత్తం ఘటన వీడియో ఫుటేజీలో నమోదై ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.సీసీ కెమెరా దృశ్యాలు, అసలు వీడియో రి కార్డింగుల ఆధారాలను సేకరించి ప్రతి ఒక్కరి పాత్ర ను నిర్ధారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్, హరీశ్రావుతోపాటు డి.సు«దీర్రెడ్డి, గంగుల, పాడి కౌశిక్రెడ్డి, జి.జగదీశ్వర్రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మీ, సబిత, సంజయ్, విజయు డు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తాతా మధు, నవీన్ కుమార్రెడ్డిని నిందితులుగా పేర్కొన్నారు.ఇవి కూడా చదవండి: తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి -
తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతామధుతోపాటు మరో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డిలపై కఠిన చర్యలు తీ సుకోవాలని పలువురు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. స్పీకర్ను అవమానించడం బీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని వారు ఆరోపించారు.మరోవైపు నల్లబ్యాడ్జీలతో మండలికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. సభ జరుగుతున్నంత సేపు వెల్లోకి దూసుకొచ్చి ‘వీ వాంట్ జస్టిస్.. పోలీసుల దౌర్జన్యం నశించాలి.. అక్రమ కేసులు ఎత్తివేయాలి’అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో సభను చైర్మన్ పలుసార్లు వాయిదా వేశారు. మంగళవారం చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభను ప్రారంభిస్తూ..సోమవారం సభ బయట జరిగిన ఘటనల్లో ఇద్దరు ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేసిన విషయాన్ని సభ్యుల దృష్టికి తెచ్చారు. అనంతరం ఈ అంశంపై చర్చను ప్రారంభించారు.కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘నిన్న జరిగిన సంఘటన బాధాకరం. స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైనదని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై కులపరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. తాతా మధు వ్యాఖ్యలతో ప్రజల్లో సభ పట్ల ఉన్న గౌరవం సన్నగిల్లే అవకాశం ఉంది’మహేశ్గౌడ్ అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా ప్రకటించారు.అనంతరం సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, తాతా మధు, నవీన్కుమార్లు తనపై పుస్తకాలు చించి విసిరారని, ఆ పుస్తకాల్లోని పిన్నులు గుచ్చుకుంటే గాయం అయ్యేదని..పెద్దల సభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని పదేపదే సూచిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చుంటే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు కొనసాగించారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్పీకర్పై పరుషపదజాలం వాడడం నిమ్న జాతులను అవమానించడమేనని, ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ది దళిత వ్యతిరేక స్వభావమని విమర్శించారు. మహిళా పోలీసులపైనా బీఆర్ఎస్ సభ్యులు దాడి చేశారని, ఈ విషయంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల విషయంలో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, స్పీకర్పై అవమానకరమైన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ స్పీకర్ను ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య పదజాలంతో దూషించడం దురదృష్టకరమన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, స్పీకర్ అంటే పారీ్టలకతీతంగా గౌరవం ఇవ్వాలని, అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ళీ అంతకు ముందు ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, శంకర్నాయక్, ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ దళితులపట్ల బీఆర్ఎస్ ఈ ధోరణి సరికాదన్నారు. అనంతరం టీ బ్రేక్ ఇస్తూ చైర్మన్ సభను వాయిదా వేశారు.ఇవి కూడా చదవండి: ఫామ్హౌస్లో జరిగిన కుట్రే -
ఫామ్హౌస్లో జరిగిన కుట్రే
సాక్షి, హైదరాబాద్: శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు యావత్ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని, ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని, మొత్తం చట్టసభకు జరిగిన ఘోర అవమానమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో రచ్చ ఆషామాషీగా జరిగింది కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్పారు. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే..ఒక రోజు ముందు 6వ తేదీన ఫామ్హౌస్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం పెట్టి కుట్రకు తెరలేపారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఉగ్రవాద సంస్థలు తమ భావజాలాన్ని నూరిపోసి పంపించిన తరహాలో బీఆర్ఎస్ సభ్యులను ప్రేరేపించి పంపించారని విమర్శించారు. కుట్రదారుల డైరెక్షన్లో కొందరు బీఆర్ఎస్ సభ్యులు పాత్రధారులుగా సభలో ప్రవర్తించారని, ప్రధాన సూత్రధారులు బీఆర్ఎస్ అత్యున్నత నాయకత్వమేనని విమర్శించారు. స్పీకర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదించిన తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ డిప్యూటీ సీఎం మాట్లాడారు. సభాపతి తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. తెలంగాణ సమాజం సంస్కారం, సంస్కృతి, మహిళల గౌరవానికి సంబంధించిన సమస్య అని భట్టి విక్రమార్క అన్నారు.రూపుమాపని మానసిక అస్పృశ్యత: దామోదర స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మానసిక అస్పృశ్యత రూపుమాపలేదని మంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాకు అవమానాలు, పోరాటాలు కొత్తకాదు. దళితుల చరిత్ర అంటే పోరాటాల చరిత్ర. ఆత్మగౌరవ చరిత్ర. ఆత్మగౌరవమే మా అలంకారం. ఆత్మగౌరవమే మా స్ఫూర్తి. ఆ ఆత్మగౌరవంతోనే ఈ స్థాయికి వచ్చాం’అని మంత్రి అన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే యువత తిరగబడుతుందని, ముఖ్యంగా దళిత సమాజాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి, ఎన్నో కష్టాలను అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ స్పీకర్గా ఉన్నత స్థానానికి చేరుకున్న గడ్డం ప్రసాద్కుమార్ను అవమానించడం బాధాకరమన్నారు.ఇవీ చదవండి: తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు -
తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు
సాక్షి, హైదరాబాద్: రెండోరోజూ శాసనసభ అట్టుడికింది. మంగళవారం జరిగిన సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య, స్పీకర్–హరీశ్రావు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే సోమవారం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ.. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. అదే సమయంలో సభాపతి గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం సభను కుదిపేసింది.సభలో సభ్యులను ఉద్దేశించి అంతగా మాట్లాడని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై హరీశ్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. హరీశ్రావు లేచి సోమవారం జరిగిన ఘటనను ప్రస్తావించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. ‘మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగింది. వారిపై కేసులు పెట్టారు. మరి వారిపై దాడి చేసిన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు.ఆగ్రహించిన స్పీకర్– హరీశ్పై ఆగ్రహంహరీశ్ మాటలపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ వెంటనే స్పందించారు. మహిళా సభ్యుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. జరిగిన ఘటనపై ఇప్పటికే పోలీసుల నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. స్పీకర్ సమాధానంతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ బెదిరింపులకు నేను భయపడను. మీరు చేస్తున్నది తప్పు’అంటూ ప్రతిపక్ష సభ్యులను హెచ్చరించారు. అంతలోనే అసెంబ్లీ బయట తనపై, తన తల్లిపై చేసిన వ్యాఖ్యల అంశాన్ని స్పీకర్ ప్రస్తావించారు. ‘మీరెందుకు ఆవేశపడుతున్నారు హరీశ్ ? నా సంగతేంటో చెప్పు? మీ తల్లిని ఎవరూ తిట్టలేదు. నా తల్లిని తిట్టారు. మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆవేశపడాల్సింది నేను. బీఆర్ఎస్ నాయకులు మీ తల్లి గురించి మాట్లాడలేదు.. నా తల్లి గురించి మాట్లాడారు. దీనిపై ఏం చేద్దామో ముందు చెప్పండి’అని స్పీకర్ తీవ్ర భావోద్వేగానికి గురవడంతో సభలో కొద్దిసేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.స్పీకర్ను అవమానిస్తే ఊరుకుంటారా : మంత్రి శ్రీధర్బాబుఈ సమయంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు జోక్యం చేసుకున్నారు. మహిళా ఎమ్మెల్యేల ఘటనపై ప్రభుత్వం కూడా నివేదిక కోరిందని, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు. అదే సమయంలో సభాపతిని అవమానించేలా వ్యవహరించడం, బెదిరించడం సరికాదన్నారు. సభ్యుడు రాంచంద్ర నాయక్ కూడా బీఆర్ఎస్పై తీవ్రంగా మండిపడ్డారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ స్పీకర్ స్థానంలో దళితుడిని కూర్చోబెట్టడం ఇష్టం లేకనే కేసీఆర్ సభకు రావడం లేదని ధ్వజమెత్తారు. గతంలో దళితులను అవమానించిన చరిత్ర కేసీఆర్దని, స్పీకర్పై కాగితాలు విసిరారని దళితుడైన సంపత్కుమార్ను, కోమటిరెడ్డిని సభ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు.మహిళలను ముందు పెట్టి.. మీరు వెనుకా: సీతక్కఅసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. సబితా ఇంద్రారెడ్డిని ఎవరు తోశారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి మీరు వెనుక ఉండటం ఏమిటని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిపై బీఆర్ఎస్ నేతలు చేయిచేసుకున్నారని, దీనికి సంబంధించిన దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.వెల్లోకి బీఆర్ఎస్ సభ్యులుఇరువర్గాల వాదనలు కొనసాగుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా వెల్లోకి వెళ్లారు. కొందరు సభ్యుల చేతుల్లో ఉన్న ప్లకా ర్డులను చీఫ్ మార్షల్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడి యం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం మరింత పెరిగింది. బీఆర్ఎస్ మహిళా సభ్యులపై జరిగిన దౌర్జన్యం. అవమానంపై ప్లకార్డులు పెట్టుకొని పోడియంలోకి సభ్యులు మళ్లీ దూసుకెళ్లారు.22ఏపై బీజేపీ ఆందోళనబీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి 22ఏ నిషేధిత జాబితా అంశంపై చర్చకు పట్టుబట్టా రు. బీజేపీ సభ్యులు కూడా ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో సభలో ఒకవైపు బీఆర్ఎస్–కాంగ్రె స్ మధ్య వాగ్వాదం, మరోవైపు 22ఏ అంశంపై బీజే పీ నిరసనతో పరిస్థితి మరింత గందరగోళంగా మా రింది. బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో సభను కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో స్పీకర్ సభను ఉదయం 10.45 గంటలకు వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పీకర్ చాంబర్కు వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత సభ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరిగి ప్రారంభమై కొనసాగింది. క్షమాపణ చెప్పాడు.. మళ్లీ ఎందుకు: హరీశ్రావుహరీశ్రావు మరోసారి జోక్యం చేసుకొని.. స్పీకర్ పట్ల తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఇప్పటికే క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలపై కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. ‘స్పీకర్ గారంటే మాకు గౌరవం ఉంది. వ్యక్తిగతంగా కూడా మీ పట్ల గౌరవం ఉంది. అయితే మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారు’అని ప్రశ్నించారు.ఇవి కూడా చదవండి: అసలు హరీశ్రావుకు మైక్ ఇవ్వొద్దు.. కానీ ఇచ్చా -
అసలు హరీశ్రావుకు మైక్ ఇవ్వొద్దు.. కానీ ఇచ్చా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మొదటిసారి మీడియా ముందుకొచ్చారు. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మంగళవారం సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్కు చెందిన హరీశ్రావుకు మైక్ ఇవ్వకూడదని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తుంది కాబట్టి మైక్ ఇచ్చానని చెప్పారు. అయితే, సోమవారం అసెంబ్లీ గేటు బయట జరిగింది అనుకోకుండా అయితే, హరీశ్రావు సభలో మాట్లాడింది మాత్రం తనను మనస్తాపానికి గురిచేసిందన్నారు. జరిగిన దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో క్షమాపణలు చెబుతారేమో అనుకున్నానని, కానీ హరీశ్రావు అందుకు విరుద్ధంగా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అందుకే మొదటిసారి కోపానికి వచ్చానని, మనస్తాపం చెందానని, సభలో కూర్చోవాలని అనిపించలేదని, మంగళవారం ఒక్కరోజు ప్యానెల్ స్పీకర్తో సభను నడిపించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పదేళ్లు మంత్రిగా హరీశ్రావు ఉన్నాడని, ఆయన కూడా ఇలా మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. 1987 నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. తననుద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడిన మాటలకు రాష్ట్రమంతా ఊగిపోతోందని, దళిత సంఘాలు కోపంగా ఉన్నాయని చెప్పారు. తాతా మధు మాట్లాడిన ప్రదేశం అసెంబ్లీ పరిధిలోనే ఉంటుందని, ఆ విషయం బీఆర్ఎస్ వారికి తెలియదనుకుంటా అని వ్యాఖ్యానించారు. తాము కేసీఆర్లాగా చేయాలనుకుంటే అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లను చేసినట్టు తాతా మధు, కౌశిక్రెడ్డిలను కూడా సభ నుంచి బయటకు పంపించేవారమన్నారు. అక్కడ కనపడుతోంది అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనకు సంబంధించి విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ ప్రసాద్కుమార్ స్పష్టం చేశారు. అయితే, అసెంబ్లీ గేటు బయట కేటీఆర్, హరీశ్రావు, నవీన్రెడ్డిలు పోలీసులు కొట్లాడింది, తాతా మధు మాట్లాడింది ప్రత్యక్షంగా కనపడుతోందని చెప్పారు. కానీ, మహిళా ఎమ్మెల్యేల విషయంలో ఎప్పుడు ఏం జరిగిందో అర్థం కావడం లేదని, అందుకే విచారణ చేయమని చెప్పానన్నారు. బీఆర్ఎస్ సభ్యులు పైనుంచి కింది వరకు నల్ల దుస్తులు వేసుకొని వచ్చినా అభ్యంతరం లేదని, కానీ ఆ దుస్తులపై ఉన్న రాతలు అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమన్నారు. అయితే, 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో ఉన్న నిబంధనలను తొలగించి తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ కొత్తగా అసెంబ్లీ రూల్స్ తెచ్చాడని, ఆ నిబంధనలనే తాము అమలు చేస్తున్నామని, ఆ నిబంధనల ప్రకారమే చెబుతున్నామన్నారు. రాహుల్గాంధీ నల్లటీషర్టుపై ఆదానీ అని రాసుకొని వెళ్లలేదని, కేవలం నల్ల టీషర్టు వేసుకొని మాత్రమే పార్లమెంటులోకి వెళ్లారని చెప్పారు. ప్రభుత్వమే అడిగింది తాజా పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని సభలో ప్రభుత్వమే డిమాండ్ చేసిందని స్పీకర్ చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో తనకు కేసీఆర్ ఫోన్ చేయలేదన్నారు. సభ ప్రారంభానికి ముందు తానే కేసీఆర్కు ఫోన్ చేశానని, సభకు రావాలని అడిగానని చెప్పారు. ఆరోగ్యం సహకరిస్తే వస్తానని కేసీఆర్ తనతో చెప్పారన్నారు. తాను ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేసి సభకు రావాలని కోరుతానని వెల్లడించారు. తాతా మధు, నవీన్రెడ్డిలు అసెంబ్లీలో సభ్యులు కానప్పటికీ చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని, కానీ అలా చేయడం లేదని, చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసి మండలి చైర్మన్కు పంపుతామని స్పీకర్ ప్రసాద్కుమార్ చెప్పారు. -
తెలంగాణలో హీటెక్కిన రాజకీయ వాతావరణం
తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ఆందోళనలతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. మంగళవారం ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో వివాదం మరింత ముదిరింది. హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎర్రవల్లికి తరలిరావడంతో వాతావరణం మరింత హీటెక్కింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీ నిరసనలు కొనసాగుతున్నాయి. చెన్నూర్ పట్టణంలో హైటెన్షన్కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నిరసనలకు దిగడంతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్, కేటీఆర్, తాతా మధు చిత్ర పటాలకు చెప్పుల దండలు వేసి నిరసన తెల్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. ఒకే ప్రాంతంలో రెండు పార్టీల నిరసనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమై అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్- సిద్ధిపేట రహదారిలో ట్రాఫిక్ జామ్బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో హైదరాబాద్- సిద్ధిపేట రహదారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ కేత్రం వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో షామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేయడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరదరాజ్పూర్లో పరస్పర దాడులుసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం వరదరాజ్ పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటీపోటా నిరసనలకు దిగారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ దగ్ధం చేయగా, మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణ చోటు చేసుకున్నాయి. చెప్పులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. జమ్మికుంటలో తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తాతా మధు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. నకిరేకల్లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీతమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో అసెంబ్లీ వద్ద వ్యవహరించిన తీరుకు నిరసనగా నల్లగొండ జిల్లా నకిరేకల్లో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. చదవండి: ఎర్రవల్లిలో టెన్షన్.. టెన్షన్ఐలయ్య నివాసం వద్ద డప్పు కొట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలుకేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట చావుడప్పు కొడతానన్న ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఆయన నివాసం వద్ద డప్పులు కొట్టి నిరసన తెలిపారు. బీర్ల ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలిజగిత్యాల జిల్లాలోని కోరుట్ల, కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన తెలిపారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా నాయకులపై అనుచిత ప్రవర్తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రోడుపై బైఠాయించి నిరసన తెలపడంతో వాహన రాకపోకలు అంతరాయం కలిగి, ట్రాఫిక్ స్తంభించింది. ఇదీ చదవండి: 'కేసీఆర్ ఇంటిని టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే'తాతా మధును బర్తరఫ్ చేయాలికామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే ఆ పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గంప గోవర్ధన్ అరెస్ట్కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే కమాన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వినతిపత్రం సమర్పించి రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రైల్వే కమాన్ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవరకొండలో కాంగ్రెస్ బైక్ ర్యాలీబీఆర్ఎస్ అధినేత పోకడలను వ్యతిరేకిస్తూ నల్లగొండ జిల్లా దేవరకొండలో ఎమ్మెల్యే బాలూ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా బాలూ నాయక్ మాట్లాడుతూ.. అసెంబ్లీకి రాకుండా ఫాంహౌస్కే పరిమితమైన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు మోసానికి గురయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్న సైకో రేవంత్! 😡🚨 రేవంత్ రెడ్డి ఆదేశాలతో..కాంగ్రెస్ గూండాలకు బందోబస్తు ఇస్తూ ఎర్రవెల్లిలో కేసీఆర్ గారి ఇంటి మీద దాడికి తీసుకెళ్తున్న పోలీసులు!శాంతిభద్రతలు కాపాడాల్సిన సీఎం, హోం మంత్రి.. రేవంత్ రెడ్డి స్వయంగా దాడులను ప్రోత్సహిస్తావా? ఇదేనా… pic.twitter.com/sO60gB1SWP— BRS Party (@BRSparty) September 8, 2026 -
‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్ను ఓదార్చిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభాపతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయించే దిశగానూ ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మంగళవారం అసెంబ్లీ సమావేశాల బ్రేక్ టైంలో.. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరూ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఆయన చాంబర్లో కలిశారు. నిన్నటి పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని స్పీకర్కు భరోసా ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని.. ఎవరినీ వదిలపెట్టబోమని స్పష్టం చేశారు.సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఈ పరిణామంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో నిన్న కంటతడి పెట్టారు. అయితే స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నేతల తీరు అమానుషమని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది చీకటి రోజు అని.. బాధ్యులపై చర్యలు తప్పవంటూ సభలో మాట్లాడారు. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలపై ఈ ఉదయం సీఎం రేవంత్రెడ్డి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యవహారశైలిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న అంశంపై న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీలో తీర్మానం చేసి మండలికి పంపాలని.. ఇద్దరి సభ్యత్వాన్ని రద్దు చేయించే అంశాల్ని ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిలను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. మరోవైపు.. అసెంబ్లీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఆందోళన సందర్భంగా మహిళా పోలీసులతో బీఆర్ఎస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహిళా కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, వారితో అనుచితంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: తిట్టింది నీ తల్లిని కాదు.. హరీశ్రావుపై స్పీకర్ ఆగ్రహం -
అసెంబ్లీలో స్పీకర్-హరీశ్రావు-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల రెండో రోజు.. నిన్నటి పరిణామాల నేపథ్యంగా హాట్ హాట్గా మొదలైంది. నల్ల బ్యాడ్జీలతో సెషన్కు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం దారుణం. నిన్న మా పట్ల పోలీసులు దురుసుగా పవ్రర్తించారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు. సునీతా లక్ష్మారెడ్డి చీరలాగి అవమానించారు. కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ వ్యవహరించారు. అసెంబ్లీ కౌరవసభగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నా తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులు నా తల్లిని అసభ్యంగా దూషించారు. సునీత, సబితా, కోవా లక్ష్మి అంటే నాకు గౌరవం. వాళ్లు నాకు తోబుట్టువులతో సమానం. సబితమ్మకు జరిగిన దానిపై నేనే విచారణ చేయమని చెప్పా. మీ తల్లిని అనలేదు హరీశ్.. నా సంగతి ఏంటి?. ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడూ.. అంటూ స్పీకర్ మాట్లాడారు. ఆ సమయంలో.. చర్చ జరగకుండా డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. దళిత స్పీకర్ పట్ల అమానుషంగా వ్యవహరించారని.. జరిగిన దానిపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని చూడకుండా.. చొక్కాలు విప్పి ముందుకు రావడం ఏంటని? సీతక్క మండిపడ్డారు. నిన్నటి పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని స్పీకర్ను కోరారామె. ఆ సమయంలో హరీశ్ రావు మరోసారి జోక్యం చేసుకుని.. స్పీకర్గా మీపై మాకు గౌరవం ఉంది. మీ పట్ల వ్యాఖ్యలపై మా ఎమ్మెల్సీ నిన్ననే విచారం వ్యక్తం చేశారు. మేం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. విచారం వ్యక్తం చేశాక.. దీనిపై రాద్ధాంతం అవసరమే లేదు. కాంగ్రెస్కు నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే..ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ఎందుకు చేయలేదు?.. అని హరీశ్ రావు అన్నారు. అయితే హరీశ్రావు వైఖరి స్పీకర్నే బెదిరించినట్లు ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్పై జరిగిన దానిని పక్కన పెట్టాలట. స్పీకర్ను డిక్టేట్ చేయడం ఏంటి?. స్పీకర్ ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని చెప్పడానికి వాళ్లెవరూ? అంటూ బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి పరిణామాలపై దర్యాప్తు జరుగుతోందని.. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారాయన. -
కేసీఆర్ ఫామ్హౌజ్ చుట్టూ పోలీసుల చక్కర్లు
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యల నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిరసనలకు దిగింది. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌజ్ ముట్టడికి పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ విధించి.. పోలీసులు భారీగా భద్రతను మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో కేసీఆర్ ఫామ్హౌజ్ వైపు ఎవరినీ అనుమతించడం లేదు. అటు వైపు అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేసి, చుట్టుపక్కల పోలీసు వాహనాలతో నిరంతరం పహారా కాస్తున్నారు. ఇటు మర్కుక్ పోలీస్స్టేషన్ వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు డీసీఎంలను సైతం పోలీసులు సిద్ధంగా ఉంచారు. మరోవైపు ఎర్రవెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ధర్నా శిబిరాన్ని పోలీసులు ఎత్తివేయడంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.ఇదీ చదవండి: రేవంత్ సర్కార్పై హరీష్రావు ఫైర్


