breaking news
Year Ender 2025
-
Year Ender 2025: వైభవ్, దివ్య, శీతల్.. మరెన్నో విజయాలు
భారత క్రీడా రంగంలో ఈ ఏడాది యువ ప్లేయర్లు దుమ్ములేపారు. ఐపీఎల్-2025లో పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుశ్ మాత్రే సంచలన ప్రదర్శనలు నమోదు చేయగా.. చెస్లో దివ్యా దేశ్ముఖ్ మహిళల వరల్డ్కప్ విజేతగా నిలిచి సత్తా చాటింది. వీరితో పాటు 2025లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న భారత యువ ఆటగాళ్లు, వారి విజయాలను నెమరు వేసుకుందాం!దూసుకొచ్చిన యువ కెరటంభారత క్రికెట్లో నయా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). హర్యానాకు చెందిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ వేలంలో రాజస్తాన్ రాయల్స్ అతడిని ఏకంగా 1.10 కోట్లకు కొనుగోలు చేసింది.ఈ క్రమంలో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించాడు. తద్వారా అత్యంత పిన్న వయసులో ఐపీఎల్లో శతక్కొట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. అదే విధంగా క్యాష్ రిచ్ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డు సాధించాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా యూత్ వన్డే, టెస్టుల్లో సెంచరీలతో చెలరేగాడు.ఆయుశ్ మాత్రేమహారాష్ట్రకు చెందిన ఆయుశ్ మాత్రే ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. గుజరాత్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో 28 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వైభవ్ మాదిరే సెంచరీ బాదాలని చూసిన ఆయుశ్ ఆర్సీబీతో మ్యాచ్లో 48 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నాడు.ఇక వైభవ్ బ్యాటర్గా భారత అండర్-19 జట్టు తరఫున సత్తా చాటుతుండగా.. పదిహేడేళ్ల ఆయుశ్ అతడికి ఓపెనింగ్ జోడీగా ఉంటూనే కెప్టెన్గానూ కీలక బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తున్నాడు.దివ్య దేశ్ముఖ్భారత చెస్ రంగంలో సరికొత్త సంచలన దివ్య దేశ్ముఖ్. ఫిడే మహిళల వరల్డ్కప్-2025లో ఈ మహారాష్ట్ర అమ్మాయి అద్భుత విజయం సాధించింది. సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.తద్వారా అత్యంత పిన్నవయసులోనే (19 ఏళ్లు) ఈ ఘనత సాధించిన చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. గ్రాండ్ మాస్టర్ హోదా పొందడానికి ముందే ఈ ఫీట్ అందుకున్న ప్లేయర్గానూ రికార్డు సాధించింది. వరల్డ్కప్ విజయంతోనే దివ్యకు గ్రాండ్ మాస్టర్ హోదా దక్కింది. ఓవరాల్గా ఇండియాలో 88వ, మహిళలలో 44వ గ్రాండ్ మాస్టర్గా దివ్య నిలిచింది.ఇక వరల్డ్కప్ చాంపియన్గా నిలవడంతో పాటు ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్-2026కు కూడా దివ్య దేశ్ముఖ్ అర్హత సాధించింది.డి. గుకేశ్గతేడాది వరల్డ్చెస్ చాంపియన్గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ ఈ ఏడాదిని ఫిడే గ్రాండ్ స్విస్-2025లో విజయం సాధించాడు. అంతేకాదు.. తొలిసారిగా తన కెరీర్లో అత్యుత్తమంగా ఫిడే క్లాసికల్ రేటింగ్ లిస్టులో వరల్డ్ నంబర్ 3గా ఈ చెన్నై చిన్నోడు నిలిచాడు. ఆర్. ప్రజ్ఞానంద, వైశాలి రమేశ్బాబుచెన్నైకి చెందిన అక్కాతమ్ముళ్లైన ఈ చెస్ గ్రాండ్మాస్టర్లు ఈ ఏడాది కూడా తమ హవా కొనసాగించారు. ప్రజ్ఞానంద టాటా స్టీల్ చెస్-2025లో గుకేశ్ను టై బ్రేకర్లో ఓడించి టైటిల్ సాధించాడు.తద్వారా ఫిడే రేటింగ్స్లో అత్యుత్తమంగా వరల్డ్ నంబర్ 8 ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనతో అతడు ఆకట్టుకున్నాడు.ఇక వైశాలి రమేశ్ బాబు వరుసగా రెండో ఏడాది ఫిడే గ్రాండ్ స్విస్ 2025 టైటిల్ గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా చెస్ ప్లేయర్గా నిలిచింది. ఈ ప్రదర్శన నేపథ్యంలో వుమెన్స్ క్యాండిడేట్స్కు అర్హత సాధించింది. ఆమె కంటే ముందు హంపి, దివ్య ఈ క్వాలిఫై అయ్యారు.టాటా స్టీల్ చాలెంజర్స్లోనూ సత్తా చాటిన వైశాలి రమేశ్బాబు మహిళల రేటింగ్స్లో ఇండియా నంబర్ 2గా నిలిచింది. వీరితో పాటు తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేసి కూడా ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.మరెన్నో విజయాలుఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో మాగ్నస్ కార్ల్సన్నే ఓడించి నాకౌట్కు చేరాడు. అంతేకాదు.. రాపిడ్ రౌండ్ రాబిన్ స్టేజ్లోనూ మరోసారి అతడికి ఓటమిని రుచి చూపించాడు. అయితే, క్వార్టర్ఫైనల్స్లో విన్సెంట్ కెమెర్ చేతిలో ఓడిపోవడంతో అర్జున్ సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయాడు.ఇక ఇతరులలో పారా ఆర్చర్ శీతల్ దేవి ఈ ఏడాది వరల్డ్ ఆర్చరీ పారా చాంపియన్షిప్స్ గెలిచింది. మరోవైపు.. షూటర్ సామ్రాట్ రాణా ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్స్షిప్స్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో టైటిల్ గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచాడు.వీరితో పాటు పారా అథ్లెట్ సుమిత్ ఆంటిల్, అథ్లెట్ అనిమేశ్ కుజూర్ చెప్పుకోదగ్గ విజయాలు సాధించారు. మరోవైపు.. టీమ్ ఈవెంట్లలో భారత్ తొలిసారి మహిళల క్రికెట్ వన్డే వరల్డ్కప్ గెలవగా.. ఖో-ఖో పురుషుల, మహిళలు.. కబడ్డీ పురుషులు, మహిళా జట్లు చాంపియన్లుగా నిలిచి సత్తా చాటాయి. మహిళల అంధుల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్కప్ గెలిచింది. చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వరకు.. -
Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వరకు..
2025 ఏడాదిలో క్రీడల్లో ఒక శకం ముగిసింది. మైదానంలో తమ అసాధారణ ప్రతిభతో అభిమానులను మంత్రముగ్ధులను చేసిన ఎందరో సూపర్ స్టార్లు ఈ ఏడాది (2025) తమ కెరీర్ను ముగించారు. ఈ క్రమంలో ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడా దిగ్గజాలపై ఓ లుక్కేద్దాం.రోహిత్ శర్మ..టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ ఏడాది మేలో టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన రోహిత్.. ఇంగ్లండ్ టూర్కు ముందు రెడ్బాల్ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. తన టెస్టు కెరీర్లో 67 టెస్టు మ్యాచ్లు ఆడిన రోహిత్ 40.58 సగటుతో 4301 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు.విరాట్ కోహ్లి..క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన విరాట్ కోహ్లి కూడా రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం రోజులకే కింగ్ కూడా టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. టెస్ట్ క్రికెట్ అంటే తనకు అమితమైన ఇష్టమని, భారత్ తరపున ఆడినంత కాలం ఈ ఫార్మాట్లో కొనసాగుతానని కోహ్లి ఎన్నోసార్లు చెప్పారు. కానీ సడన్గా రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి కోహ్లి తప్పుకోవడంతో భారత టెస్ట్ క్రికెట్లో 'రో-కో' శకం ముగిసింది. విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్లో 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 31 ఆర్ధ శతకాలు ఉన్నాయి. విరాట్ కూడా ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.ఛతేశ్వర్ పుజారాభారత టెస్ట్ క్రికెట్ లో 'నయా వాల్' గా పేరుగాంచిన ఛతేశ్వర్ పుజారా.. ఈ ఏడాది ఆగస్టులో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి తప్పుకొన్నాడు. గత కొన్నేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి.. దేశవాళీ క్రికెట్లో మాత్రం పుజారా అద్భుతంగా రాణిస్తుండేవాడు. కానీ యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు తన కెరీర్ను ఛతేశ్వర్ ముగించాడు. పుజారా తన కెరీర్లో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయ.స్టీవ్ స్మిత్, మాక్సీ గుడ్బైఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకొని అందరికి షాకిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. మాక్సీ ఈ ఏడాది జూన్లో తన రిటైర్మెంట్ను ప్రకటించాడు.హెన్రీచ్ క్లాసెన్సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్కు సడన్గా వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు. బోర్డుతో విభేదాల కారణంగా క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్లాసెన్ తన అంతర్జాతీయ కెరీర్లో 3245 పరుగులు చేశాడు.నికోలస్ పూరన్: వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకొని అందరినీ షాక్కు గురిచేశాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ల మోజులో పడి పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.జాన్ సీనా..స్టార్ రెజ్లర్, WWE దిగ్గజం జాన్ సీనా ఈ ఏడాది డిసెంబర్లో ప్రొఫెషనల్ రెజ్లింగ్కు వీడ్కోలు పలికారు. జాన్ సీనా తన చివరి మ్యాచ్లో ఓడిపోయినప్పటికి.. ప్రపంచ రెజ్లింగ్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. జాన్ సీనా తన కెరీర్లో మొత్తం 17 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ను సొంతం చేసుకున్నాడు.ఈ లెజెండరీ రెజ్లర్ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించారు. ఇప్పటికే 'పీస్మేకర్' (Peacemaker) వంటి సిరీస్లతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జాన్సీనా.సెర్గియో బుస్కెట్స్ (ఫుట్బాల్)స్పెయిన్ మిడ్ఫీల్డ్ మాంత్రికుడు సెర్గియో బుస్కెట్స్ మేజర్ లీగ్ సాకర్ సీజన్ ముగిసిన తర్వాత ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మయామి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్ తరపున లియోనెల్ మెస్సీతో కలిసి సెర్గియో ఆడాడు.పర్దీప్ నర్వాల్ (కబడ్డీ)కబడ్డీ లెజెండ్, 'డూ ఆర్ డై' స్పెషలిస్ట్ పర్దీప్ నర్వాల్ 2025 ప్రో కబడ్డీ లీగ్ (PKL) వేలంలో అమ్ముడుపోకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. అయితే కోచ్గా పనిచేసేందుకు తన సిద్దంగా ఉన్నట్లు నర్వాల్ తెలిపాడు.


