-
Russia-Ukraine war: రష్యాపై డ్రోన్లతో దాడి
కీవ్: రష్యా భూభాగంపై ప్రతి దాడులను ఉక్రెయిన్ ముమ్మరం చేసింది. శుక్రవారం సరిహద్దుల్లోని రష్యాకు చెందిన రోస్టోవ్ ప్రాంతంపైకి ఉక్రెయిన్ పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మొరొజొవ్స్కీ ఎయిర్ ఫీల్డ్లోని ఆరు సైనిక విమానాలు ధ్వంసం కాగా, మరో ఎనిమిదింటికి నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ తెలిపింది. 20 మంది సిబ్బంది చనిపోయినట్లు ప్రకటించుకుంది. మొరొజొవ్స్కీ ప్రాంతంపైకి వచ్చిన 44 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరంపై దాడి, యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై రష్యా స్పందించలేదు. దాడుల్లో ఒక విద్యుత్ ఉపకేంద్రం మాత్రం ధ్వంసమైందని పేర్కొంది. సరటోవ్, కుర్స్క్, బెల్గొరోడ్, క్రాస్నోడార్లపైకి వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా ఆర్మీ తెలిపింది. -
Russia Ukrain War: అణుయుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మాస్కో: దేశంలో సాధారణ ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్కు అమెరికా గనుక తన సేనలను పంపితే తాము అణు యుద్ధానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. మార్చ్ 15 నుంచి 17 వరకు దేశంలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడారు. ప్రస్తుతానికి అణుయుద్ధం చేయాల్సిన పరిస్థితులు లేవని, ఉక్రెయిన్పై అణ్వాయుధాలు వాడాల్సిన అవసరం తనకు కనిపించడం లేదన్నారు. అయితే మిలిటరీ, సాంకేతిక కోణంలో తాము అణుయుద్ధం చేసేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని పుతిన్ బాంబు పేల్చారు. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో చర్చలకు పుతిన్ సిద్ధంగా లేరని అమెరికా ప్రకటించిన తర్వాత అణుయుద్ధంపై రష్యా అధ్యక్షుడు స్పందించడం గమనార్హం. 1962 క్యూబన్ మిసైల్ సంక్షోభం తర్వాత మళ్లీ ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధం తర్వాతే రష్యా, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2022 ఫిబ్రవరిలో వేలాది మంది రష్యా సైనికులను ఉక్రెయిన్కు పంపి ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధానికి పుతిన్ తెరలేపారు. కాగా, అమెరికా సేనలు ఉక్రెయిన్లోకి ప్రవేశిస్తే యుద్ధం తీవ్రస్థాయికి చేరుతుందని, తాము అణ్వాయుధాలు వాడాల్సి వస్తుందని పుతిన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇదీ చదవండి.. దాదాపు 70 ఏళ్ల తర్వాత రీ మ్యాచ్ -
US: మళ్లీ నాలుక మడతబెట్టిన బైడెన్
వాషింగ్టన్: బైడెన్ మళ్లీ నాలుక మడతేశారు. ఒకటి చెప్పాలనుకుని మరొకటి చెప్పి ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థులకు మళ్లీ దొరికిపోయారు. నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీ బ్యాలెట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెమొక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్ ముందున్నారు. అయితే బైడెన్ వయసు చాలా ఎక్కువని, రెండోసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆయన పనికిరారని ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ డెమొక్రాట్లలో కూడా కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ తన మతిమరుపు, వృద్ధాప్యాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకోవడం ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతోంది. తాజాగా శుక్రవారం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో వైట్హౌజ్లో బైడెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా ఇక నుంచి పాలస్తీనాలోని గాజాలో ఆహారపొట్లాలు విమానాల ద్వారా జారవిడుస్తుందని చెప్పబోయి ఉక్రెయిన్కు ఆహారం సప్లై చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అది ఉక్రెయిన్ కాదని, గాజా అని కొద్దిసేపటి తర్వాత వైట్హౌజ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. గత నెల మొదటి వారంలో కూడా ఈజిప్ట్ ప్రధాని అబ్దిల్ ఫట్టా పేరును ప్రస్తావిస్తూ ఆయనను మెక్సికో అధ్యక్షుడిగా పేర్కొనడం విమర్శలకు దారి తీసింది. అయితే బైడెన్ డాక్టర్లు మాత్రం ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు అవసరమైన ఫిట్నెస్తో ఉన్నారని స్పష్టం చేయడం గమనార్హం. ఇదీ చదవండి.. కరువు కోరల్లో గాజా.. బైడెన్ కీలక ప్రకటన -
రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచన
న్యూఢిల్లీ: రష్యాలోని భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి దూరంగా ఉండాలని కేంద్ర విదేశాంగశాఖ సూచించింది. ఈ మేరకు ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఈ విషయమై శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొందరు భారతీయులు రష్యాలో సైనికులకు సహాయకులుగా ఉండేందుకు అంగీకరిస్తూ కాంట్రాక్టులపై తెలియక సంతకాలు చేశారని జైస్వాల్ చెప్పారు. తాము ఈ విషయమై రష్యా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రష్యాలో ఆర్మీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. కాగా, ఇప్పటికే ఎంఐఎం చీఫ్,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ అంశాన్ని ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకొచ్చారు. భారత్ నుంచి మొత్తం 12 మంది యువకులు దళారుల మాటలు విని మోసపోయి రష్యాకు వెళ్లారని తెలిపారు. వీరిలో తెలంగాణ వాసులు ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. మిగిలినవారు కర్ణాటక, గుజరాత్, కశ్మీర్, యూపీలకు చెందినవారన్నారు. రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరందరినీ ఏజెంట్లు మోసం చేశారని ఆరోపించారు. బాధిత కుటుంబాలు తనకు మొరపెట్టుకోవడంతో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్తో పాటు రష్యాలో భారత రాయబారికి కూడా లేఖలు రాశానన్నారు. ప్రభుత్వం చొరవ చూపి వారిని స్వస్థలాలకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీపై గూగుల్ జెమిని వివాదాస్పద సమాధానం -
కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది మృతి
మాస్కో: రష్యా యుద్ధ విమానం కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖను వెల్లడించింది. ప్రమాదానికి కారణాలు ఇంకా సమాచారం లేదు. Video | Russian Military Plane Carrying 65 Ukrainian Prisoners Of War Crashes Read More: https://t.co/87kc55f1PP pic.twitter.com/8gFgajhX5C — NDTV (@ndtv) January 24, 2024 రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక రవాణా విమానంగా అధికారులు గుర్తించారు. బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన సంభవించిందని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడారు. తాను ఆ స్థలాన్ని పరిశీలించబోతున్నానని చెప్పారు. అత్యవసర సహాయ సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement