-
కేన్సర్ రిస్క్ : ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మేలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి కేన్సర్.ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు రెండో ప్రధాన కారణం కేన్సర్. కేన్సర్ చాలా రకాలు ఉన్నాయి. వంశపారంపర్యం, కాలుష్యం, జీవనశైలి ఇలా కేన్సర్కు చాలా కారణాలున్నాయి. కానీ దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఈ వ్యాధి మొదటి దశలో గుర్తించడం తోపాటు, కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. కేన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చు. మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, కడుపు, లివర్ కేన్సర్లు వ్యాప్తిస్తుండగా, మహిళలు బ్రెస్ట్, కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ కేన్సర్ బారిన పడుతున్నారు. వయస్సు , మద్యం, పొగాకు, ఎక్కువ కాలం ఇన్ఫెక్షన్లు, రసాయన సహిత ఆహారం, హార్మోన్లు, ఇమ్యునోసప్రెషన్, రేడియేషన్, సన్ రేస్, ఊబకాయం లాంటివి రిస్క్ ఫ్యాక్టర్లుగా ఉన్నాయి. (ఎన్ఆర్ఐ మహిళకు బ్యాంకు మేనేజర్ టోకరా) ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ♦ పొగాకు, పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా ఉండటం ఆరోగ్య కరమైన ఆహారం ♦ బిడ్డకు పాలివ్వడం ద్వారా కొన్ని కేన్సర్లకు దూరంగా ఉండొచ్చు. ♦ పిల్లలకు హెపటైటిస్ బీ, హెచ్పీవీ వ్యాక్సిన్లు అందించడం ♦ ఎక్కువగా సూర్యకాంతికి గురి కాకుండా ఉండటం. హానికరమై సూర్యకిరణాల బారిన పడకుండా రక్షణ పద్ధతులు పాటించాలి. ♦ ఇంటా, బయటా గాలి కాలుష్యానికి దూరంగా ఉండటం ♦ మద్యపానానికి దూరంగా ఉండటం. ఒక వేళ అలవాటు ఉన్నా దాన్ని పరిమితం చేసుకోవడం ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ♦ అనుమానం వచ్చినా, ఫ్యామిలీలో ఎవరికైనా కేన్సర్ సోకి వున్నా, వయసురీత్యా, సమయానుకూలంగా మిగిలినవారు కూడా కేన్సర్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడం. -
‘పొగాకు నియంత్రణ’ అంతంతే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘పొగాకు నియంత్రణ చర్యలు’అంత సంతృప్తిగా లేవని కేంద్రం స్పష్టం చేసింది. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నియంత్రణ, బహిరంగ ప్రదే శాల్లో పొగతాగడం నిషేధంపై 2003లో ‘కోట్తా’చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2020 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల చట్టం ఎలా అమలవుతుందనే దానిపై, ఇంకెలా చేయొచ్చన్న దానిపై పొగాకు వినియోగం, దాని నియంత్రణపై ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది. దాని ఆధారంగా ఓ నివేదిక రూపొందించింది. అమలుపై పాండిచ్చేరిలోని జిప్మర్, చండీగఢ్కు చెందిన పీజీఐఎంఈఆర్లు పరిశోధన చేశా యి. 2020 నవంబర్లో ఒకసారి, అక్టోబర్ 2021 తర్వాత ఒకసారి తెలంగాణ, పాండిచ్ఛేరి, మేఘాలయలో ఈ అధ్యయనం చేశారు. ఒక్కో రాష్ట్రంలో 9 జిల్లాల్లో పరిశీలించారు. అనంతరం వాటి ఫలితాలను ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజీఎంఆర్లో తాజాగా ప్రచురించారు. తెలంగాణలో 2020లో మొదటి విడతలో 2,029 మందిని సర్వే చేశారు. రెండో విడత 2021లో 1,097 మందిపై చేశారు. ‘పొగాకు నియంత్రణ చర్యలు తెలంగాణలో పెరిగాయి. అయితే కొన్నింటిలో మాత్రం తగ్గుదల ఉన్నట్టు నివేదిక చెబుతోంది. పొగాకు ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి ప్రకటనల నిలుపుదలపై పురోగతి ఉందని’డాక్టర్ కిరణ్ మాదల (సైంటిఫిక్ కమిటీ కన్వినర్, ఐఎంఏ) అభిప్రాయపడ్డారు. పొగాకు బాక్సులపై స్థానిక భాషలో హెచ్చరికలు ఏవీ? బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినియోగ నియంత్రణ చర్యల్లో మాత్రమే తెలంగాణలో పురోగతి ఉంది. ఉత్పత్తిదారులను నియంత్రించడంలోనూ...హెచ్చరికల్లోనూ నిర్లక్ష్యం కనిపిస్తుందని తెలిపింది. ♦ పొగాకు ఉత్పత్తుల ప్యాక్పై వార్నింగ్ సింబల్ విషయంలో మొదటి దశలో 75 శాతంగా ఉండగా, రెండో దశలో అది 83 శాతానికి పెరిగింది. ♦ పొగాకు ఉత్పత్తుల బాక్స్పై వార్నింగ్ సింబల్ 85 శాతం కవరయ్యేలా ఉండాలి. ఆ విషయంలో మొదటి విడతలో 75 శాతం ఉండగా, రెండో విడతలో 91 శాతంగా ఉంది. ♦ స్థానిక భాషలో ముద్రించే విషయంలో మొదటి విడత 45 శాతం ఉంటే, రెండో విడత 13 శాతానికి దిగజారింది. ♦ 18 ఏళ్లలోపు వారికి పొగాకు వాడకం, అమ్మకాలపై నిషేధం ఉండాలి. నిషేధం తీరు మొదటి విడతలో 95 శాతం ఉండగా, రెండో విడతలో 99 శాతం పెరిగింది. ♦ 18 ఏళ్లలోపు పిల్లలు పొగాకు ఉత్పత్తులను ఇతరులకు అమ్మటాన్ని నిరోధించడంలో తెలంగాణలో మొదటి విడతలో 97 శాతం ఉండగా, రెండో విడతలో అది ఏకంగా 100 శాతానికి చేరింది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకం తగ్గింది తెలంగాణలో బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగకపోవడం అధ్యయనంలో మొదటి విడత 86.9 శాతం ఉండగా, రెండోసారి 98.5 శాతానికి పెరిగింది. ఆ మేరకు మార్పు కనిపించింది. ♦ బహిరంగ ప్రదేశాల్లో తాగొద్దన్న బోర్డులు పెట్టారు. మొదటి దశలో 45.2 శాతంగా ఉంటే, రెండో విడతలో 54.1 శాతానికి పెరిగింది. అయితే నిబంధనల ప్రకారం బోర్డులు పెట్టలేదని తేలింది. ♦ నిబంధనల ప్రకారం బోర్డులను ఏమేరకు పెట్టారో చూస్తే... మొదటి దశలో రెండు శాతం, రెండో దశలో 15 శాతానికి పెరిగింది. ♦ పొగాకు తాగొద్దని పెట్టే బోర్డుపై సంబంధిత అధికారి ఫోన్ నంబర్ పొందుపరచడం అనేది మొదటి దశలో 1.6 శాతం ఉంటే, రెండో దశలో 1.5 శాతానికి తగ్గింది. పొగాకు తాగకుండా ఉండే పరిస్థితులు కల్పించడంలో మొదటి దశలో 86.9 శాతం ఉండగా, రెండో దశలో 97.7 శాతానికి పెరిగింది. ♦ సగటున చూస్తే బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగకపోవడం అనేది మొదట విడత 53.9 శాతం నుంచి రెండో విడతలో 66 శాతానికి పెరిగింది. -
పొగాకుపైనా వితండవాదమేనా?
సాక్షి, అమరావతి: రామోజీరావు, ఆయన విషపుత్రిక ‘ఈనాడు’కు నిత్యం ఒకటే ఎజెండా.. ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకనర్హం’ అన్నట్టు.. రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడంలో రామోజీరావు వ్యవహారం కూడా ఇంతే. మోకాలికి, బోడి గుండుకు ముడివేసినట్టు ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి అంటగడతారు. తాజాగా పొగాకును ప్రభుత్వం పంటల బీమాలో చేర్చలేదని.. ఈ–క్రాప్లో నమోదు కూడా చేయలేదని ఒక అబద్ధపు కథనంతో ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగారు. ‘పంటల బీమా లేదు.. ఈ–క్రాప్లో నమోదూ కాలేదు’ అంటూ ఒక విష కథనాన్ని సోమవారం ‘ఈనాడు’లో వండివార్చారు. దానిపై అసలు నిజాలు ఇవీ.. సాగు చేయాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి పొగాకు.. వాణిజ్య పంట..పైగా నార్కోటిక్ ప్లాంట్. ఇదేమీ ఆహార పంటో, ఉద్యాన పంటో కాదు. అయినా సరే పొగాకుకు పంటల బీమా ఎందుకు వర్తింప చేయడం లేదంటూ ‘ఈనాడు’ వితండవాదం చేస్తోంది. పోనీ గత చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పొగాకు రైతునైనా ఆదుకుందా అంటే అదీ లేదు. ఈ నాలుగున్నరేళ్లలో పొగాకు రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొని ‘ఈనాడు’ విషప్రచారానికి ఒడిగడుతోంది. రాష్ట్రంలో పొగాకు సాధారణ విస్తీర్ణం 2.10 లక్షల ఎకరాలు. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో సాగవుతోంది. సాధారణంగా ఏటా ఎన్ని మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి చేయాలో? ఆ మేరకు ఎన్ని ఎకరాల్లో పంటసాగు చేయాలో కేంద్ర పొగాకు బోరుŠడ్ నిర్ణయిస్తుంది. అనుమతికి మించి సాగు చేసినా, అదనపు ఉత్పత్తి సాధించినా అమ్ముకోవాలంటే బోర్డు అనుమతులు తప్పనిసరి. అనుమతించిన విస్తీర్ణాన్ని బట్టి ఖరీఫ్లో 50 వేల టన్నులు, రబీలో లక్షన్నర టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వమే కొనుగోలు.. కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా పొగాకు రేట్లు పతనమైన సంగతి తెలిసిందే. పొగాకు వాణిజ్య పంటయినప్పటికీ రైతులెవ్వరూ నష్టపోకూడదని చరిత్రలో తొలిసారి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోళ్లను చేపట్టింది. 2019–20 సీజన్లో ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 1,29,31,590 కిలోలు కొనుగోలు చేసింది. సగటున కిలోకు రూ.81 చొప్పున 29,228 మంది రైతుల నుంచి రూ.128.65 కోట్లతో కొనుగోళ్లు చేపట్టింది. అత్యధికంగా 7.11 మిలియన్ కిలోల ఎన్వోజీ గ్రేడ్, 4.37 మిలియన్ కిలోల ఎఫ్–05 గ్రేడ్ పొగాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. అంతేకాదు..ఈ నాలుగున్నరేళ్లలో వివిధ రకాల వైపరీత్యాల వేళ అన్ని రకాల రైతులతోపాటే పొగాకు రైతులకూ నష్టపరిహారం చెల్లిస్తూనే వచ్చింది. కొనసాగుతున్న ఈ–క్రాప్ నమోదు.. పొగాకు పంటకాలం.. 100–120 రోజులు. రబీ సీజన్లో అక్టోబర్లో సాగు చేస్తారు. అయితే వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడమే కాకుండా చాలా చోట్ల నవంబర్ నాటికి కూడా సాగు ప్రారంభం కాలేదు. సాధారణంగా ఏ పంటయినా సరే పంట వేసిన నెల తర్వాత ఈ–క్రాప్లో నమోదు చేసి ఫొటో అప్లోడ్ చేస్తారు. ఇలా ఏటా నమోదు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో ఇప్పటికే 25 వేల ఎకరాల్లో సాగైన పొగాకు పంటను ఈ–క్రాప్లో నమోదు చేశారు. అయితే పంట నమోదు మొదలు పెట్టిన కొద్ది కాలానికే వచ్చిన మిచాంగ్ తుపాన్తో నీట మునిగిన ప్రాంతాల్లో నమోదు చేయడం కొంత కష్టతరంగా మారింది. దీంతో ఈ పంట బుకింగ్కు మినహాయింపునిచ్చారు. కాగా ఈ–క్రాప్ నమోదనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు సిద్ధం.. కాగా కరువు ప్రభావిత మండలాల్లో 1,600 ఎకరాల్లో పొగాకు పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఆ మేరకు పంట నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) అందించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఇటీవల మిచాంగ్ తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో ప్రాథమికంగా 65 వేల ఎకరాల్లో పొగాకు పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం పంట నష్టం తుది అంచనాల రూపకల్పన కోసం ఎన్యుమరేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఈ అంచనాలు కొలిక్కి వచ్చాక నిర్దేశించిన పరిహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. వాస్తవాలు ఇలా ఉంటే రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా ‘ఈనాడు’ దుష్ప్రచారం చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దేశంలోనే బీమా ఎక్కడా లేదు.. రాష్ట్రంలో రైతులు సాగు చేసే దాదాపు అన్ని ప్రధాన పంటలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఖరీఫ్–2023లో 21 పంటలకు, రబీ–2023–24లో 17 పంటలకు బీమా వర్తింప చేస్తూ పూర్తి మార్గదర్శకాలతో నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే పొగాకు పంట ఆహార భద్రతకు సంబంధించిన పంట కాదు...పైగా వీటి ఉత్పత్తుల వినియోగంతో దుష్పరిణామాల కారణంగా ఈ పంటకు రాష్ట్రంలోనే కాదు..దేశంలోనూ మరెక్కడా బీమా లేదు. నార్కోటిక్ ప్లాంట్గా గుర్తించిన కారణంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంబీఎంవై) ద్వారా నోటిఫై చేసిన పంటల జాబితాలోనూ పొగాకుకు చోటు దక్కలేదు. గతంలో మన రాష్ట్రంలో కూడా ఎప్పుడూ బీమా పథకం ద్వారా నోటిఫై చేసిన దాఖలాలు కూడా లేవు. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో పెనాల్టీ లేకుండా.. 2022–23లో 2.04 లక్షల హెక్టార్లలో సాగుకు, 142 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు కేంద్ర పొగాకు బోర్డు అనుమతినిచ్చింది. అయితే మాండూస్ తుపాన్తో అన్ని పంటలు దెబ్బతినడంతో రైతులంతా రేటు బాగుందని పొగాకు సాగు చేశారు. ఫలితంగా 172 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యింది. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తి అయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనాల్టీతో కొనుగోలుకు కేంద్రం అనుమతినిస్తుంది. అలాంటిది సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపడంతో పెనాల్టీ లేకుండా కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఆ మేరకు రైతులు పొగాకును అమ్ముకోగలిగారు. -
‘వర్జీనియా’కు రికార్డు ధర
జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు రికార్డుస్థాయిలో ధర పలకడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఐదు వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం దశల వారీగా ముగిసింది. గత ఏడాది కంటే కేజీ సరాసరి ధర రూ.50 పైగానే లభించింది. ఎన్ఎల్ఎస్ (ఉత్తర ప్రాంత తేలిక నేలలు) ప్రాంతంలో పండే వర్జీనియాకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ పరిధిలో జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ వేలం కేంద్రాల పరిధిలో మొత్తం రూ.1,422.53 కోట్ల విలువైన పొగాకు అమ్మకాలు జరిగాయి. ఎన్ఎల్ఎస్ పరిధిలో 55 మిలియన్ కిలోల పొగాకును రైతులు అమ్ముకున్నారు. గత ఏడాది ఎన్ఎల్ఎస్ పరిధిలో కేజీ సరాసరి ధర రూ.191.72 లభించగా, ఈ ఏడాది కేజీ సరాసరి ధర రూ.248 లభించింది. అంటే ఈ ఏడాది కేజీకి రూ.56.28 అధికంగా లభించింది. -
ఏంటి బాబాయ్..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..?
ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నా కొందరు తంబాకు అలవాటును మానుకోరు. దాన్ని నోట్లో పెట్టుకుంటే గానీ కొందరికి బుర్ర పనిచేయదు. ఇంట్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఇలా.. ఎక్కడ ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదు అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇక గోడ కనిపిస్తే చాలు ఉమ్మివేస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ అది ఏ ట్రైనో, బస్సో కాదండీ.. ఏకంగా విమానంలోనే.. వీడియోలో చూసిన విధంగా ఓ వృద్ధుడు విమానంలో ప్రయాణిస్తున్నాడు. నాలుక లాగేసిందో.. ఏమో..! గానీ విమానంలో ప్రయాణిస్తుండగానే తంబాకును జేబులో నుంచి తీశాడు. దాన్ని చేతిలో వేసుకునే నలిపి.. అమాంతం పెదవి కింది భాగంలో పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్కరోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. फ्लाइट में हो या ट्रेन में एक खिली खैनी बहुत जरूरी हैं 😂😅 pic.twitter.com/GknxrYtJwY — छपरा जिला 🇮🇳 (@ChapraZila) August 26, 2023 వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 'విమానంలోనే తంబాకు వేశావ్.. సరేగానీ ఎక్కడ ఉమ్మివేస్తావ్ బాబాయ్..!' అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టారు. వీరు మారరురా బాబు.. అంటూ మరో నెటిజన్ స్పందించాడు. నాలుక లాగేస్తుందా..? తాత అంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.''నాకూ కొంచం పెట్టవా..' అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ఇదీ చదవండి: గంజాయి తాగితే వింతగా ఎందుకు ప్రవర్తిస్తారంటే..?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement