పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫమలైందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. గతేడాది పొగాకు కిలోకు రూ.174 ఉంటే ఈ ఏడాది రూ.110-117 ఉందని ఆయన అన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పొగాకు రైతులను పరామర్శించి, గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేసినా ప్రభుత్వానికి చలనం లేదని ఆయన మండిపడ్డారు.