-
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
అద్భుతంగా రూపుదిద్దుకున్న ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్
సాక్షి ప్రతినిధి కడప: రాయలసీమ–కోస్తా జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ పెరిగేందుకు అరుదైన రైల్వే మార్గం..ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద టన్నెల్ ఏర్పాటు చేసి దీనిని నిర్మించారు. న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్తో సాంకేతిక పనులు పూర్తి చేశారు. వెలుగొండ అడవుల్లో 7.560 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ను ఈ మార్గం కోసం ఏర్పాటు చేశారు. దీంతో ఓబులవారిపల్లె–కృష్ణపట్నం మార్గంలో గూడ్స్ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అద్భుతమైన ఈ లైన్లో ప్రయాణికుల కోసం రైళ్లు నడిపితే విజయవాడ, విశాఖపట్నం తదితర కోస్తా జిల్లాలకు కనెక్టివిటీ బాగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి అందాల నడుమ కాశ్మీర్ తరహాలో ఏర్పాటు చేసిన ఈ మార్గం గుండా ప్రయాణం మరుపురాని అనుభూతినిస్తుంది. ఎగుమతుల కోసం.. ఈ రైలు మార్గాన్ని ఎస్ఆర్ఎస్పీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు నుంచి పలు రకాలైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఏర్పాటు చేశారు. ఏపీఎండీసీ పరిధిలో మంగంపేట నుంచి బైరెటీస్, బళ్లారి నుంచి ఐరన్ ఓర్ కూడా ఇదే మార్గంలో వెళుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో నూతనంగా ఈ మార్గంలో 35 కిలోమీటర్లు, నెల్లూరుజిల్లాలో 58 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ నడుమ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మంగంపేట, నేతివారిపల్లె, చెర్లోపల్లె రైల్వేస్టేషన్లుండగా..నెల్లూరు జిల్లాలో ఎనిమిది స్టేషన్ల ద్వారా గూడ్స్ రైళ్లు కృష్ణపట్నం చేరుకుంటున్నాయి. రూ.470 కోట్లతో టన్నెల్.. ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వే లైన్ ఏర్పాటుకు 7.56 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటు చేశారు. న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్తో సాంకేతికపనులు చేపట్టారు. స్కాట్లాండ్ మిషనరీతో నిర్మించారు. పెనుశిల అభయారణ్యం కొండల్లో ఈ నిర్మాణం జరిగింది. 2006లో అప్పటి రైల్వేశాఖ మంత్రి నితీశ్కుమార్ రైల్వేలైన్కు పచ్చ జెండా ఊపారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చొరవ కారణంగా సకాలంలో భూసేకరణ, పర్యావరణ అనుమతులు లభించాయి. రూ.1646 కోట్లతో ఈమార్గం రూపుదిద్దుకుంది. రెండు గుహల మధ్య పచ్చని లోగిళ్లలో రైల్వే లైన్ వెళుతుంది. చుట్టూ కొండలు, పెనుశిల అభయారణ్యం మధ్యన టన్నెల్లో రైల్వే ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైల్వే మార్గాన్ని ఉప రాష్ట్రపతి హోదాలో 2019 సెప్టెంబర్, 1వ తేదీన ఎం.వెంకయ్యనాయుడు జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి కృష్ణపట్నం పోర్టుకు గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగుతున్నాయి. కనెక్టివిటీకి సులువు కడప–విజయవాడ మధ్య రైల్వే రాకపోకలు చాలా అరుదుగా ఉన్నాయి. కడప నుంచి తిరుమల ఎక్స్ప్రెస్(కడప–విశాఖపట్నం).. యర్రగుంట్ల, ప్రొద్దుటూరుల నుంచి ధర్మవరం–విజయవాడ రైళ్ల ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంది. లేకపోతే తిరుపతి, రేణిగుంటల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే నేరుగా కడప నుంచి విజయవాడకు ప్రత్యేకించి రైళ్లు లేవు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి నిత్యం వేలాది మంది విజయవాడకు వెళ్తున్నారు. ప్రత్యేకించి అక్కడి ప్రాంతాల్లోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఇక్కడి విద్యార్థులు దాదాపు 20వేల మంది వరకు విద్యను అభ్యసిస్తున్నారు. పేరెంట్స్ రాకపోకలు సాగించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. కడప, రాజంపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వెళ్లేందుకు ఈ మార్గం సులభతరంగా ఉంటుందని రైల్వే నిపుణులు వివరిస్తున్నారు. ఎంతో ఉపయోగకరం ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వే మార్గం గుండా రైళ్ల రాకపోకలు నిర్వహిస్తే ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు ఎంతో ఉపయోగకరం. రైల్వే బోర్డు దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాం. – తల్లం భరత్కుమార్రెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ పంట ఉత్పత్తులు రవాణా చేసుకోవచ్చు ఈ రైలు మార్గం గుండా రాక పోకలు నిర్వహిస్తే ప్రయాణికులకు వెసులుబాటు లభి స్తుంది. నిత్యం వేలాది మంది విజయవాడకు ప్రయాణాలు సాగిస్తున్నారు. పంట ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవడానికి ఉపయో గకరమే. – శంకర్రెడ్డి, నాగవరం, చిట్వేలి -
బెంగళూరు–వాడీ లైన్ల అనుసంధానం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వే ప్రాజెక్టు ఎట్టకేలకు జాతికి అంకితం కాబోతోంది. ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంత సరిహద్దు వరకు పనులు పూర్తి కావడంతో సమాంతరంగా ఉన్న రెండు ప్రధాన రైలు మార్గాల అనుసంధానానికి అవకాశం ఏర్పడింది. మహబూబ్నగర్–కర్ణాటకలోని మునీరాబాద్ మధ్య 243 కి.మీ. మేర జరుగుతున్న రైల్వే లైన్ పనుల్లో భాగంగా దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల అనుసంధానంతో ఈ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో పూర్తయింది. ఇది ఇటు సికింద్రాబాద్ (మహబూబ్నగర్)–బెంగళూరు లైను, అటు సికింద్రాబాద్–వాడీ–ముంబై లైన్లను అనుసంధానిస్తుంది. బెంగళూరు లైన్లో దేవరకద్ర నుంచి మొదలయ్యే ఈ ప్రాజెక్టు, వాడీ మార్గంలోని కృష్ణా స్టేషన్ వద్ద తెలంగాణ పరిధిలో ముగుస్తుంది. ఇక్కడి వరకు పనులు పూర్తి కావడంతో ఈ అనుసంధాన లైన్ను ఇప్పుడు ప్రధాని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బెంగళూరు సహా కొన్ని ఇతర ప్రాంతాలకు వాడీ మీదుగా రైళ్లు తిరుగుతున్నాయి. దీని బదులు ఆ రైళ్లు ఇకపై దేవరకద్ర మీదుగా బెంగళూరుకు చేరుకోవచ్చు. దీనివల్ల రైల్వేకు దూరాభారం తగ్గుతుంది. సరుకు రవాణా రైళ్లకూ ఇది దగ్గరి దారి కానుంది. అలాగే జక్టేర్, మరికల్, మక్తల్, మాగనూరు లాంటి ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రధాని చేతులమీదుగా కాచిగూడ–సిద్దిపేట డెమూ ప్రారంభం? మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు రైల్వేలైన్ సిద్ధమై రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆమోదముద్ర కూడా రావడంతో రైళ్లను నడిపేందుకు అవకాశం కలిగింది. ఇందులో భాగంగా కాచిగూడ–సిద్దిపేట మధ్య రోజువారీ నడిచేలా డెమూ సర్వీసును ప్రారంభించాలని రైల్వే శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించే రెండు రోజుల్లో ఏదో ఒక రోజు డెమూ రైలు సర్విసును ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ప్రధాని చేతుల మీదుగా రైలును ప్రారంభించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించనుందో చూడాల్సి ఉంది. ఇక ముద్ఖేడ్–డోన్ మార్గంలో డబ్లింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు లైన్లు వినియోగానికి సిద్ధమైన నేపథ్యంలో ఆ పనులను కూడా ప్రధాని జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు: మహబూబ్నగర్–మునీరాబాద్ మంజూరు: 1997–98 నిడివి: 243 కి.మీ. ప్రాజెక్టు వ్యయం: రూ. 3,473 కోట్లు తెలంగాణ పరిధి: 66 కి.మీ. వ్యయం: రూ.943 కోట్లు విద్యుదీకరణ: పూర్తి -
యువర్ అటెన్షన్ ప్లీజ్.. ‘పెద్దపల్లి బైపాస్’కు
సాక్షి ప్రతినిధి,కరీంనగర్: ఎన్నో దశాబ్దాలుగా కరీంనగర్ నుంచి హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు రైలులో వెళ్లాలన్న పాత కరీంనగర్ వాసుల కల త్వరలో సాకారం కానుంది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్–కాజీపేట–బల్లార్షా సెక్షన్ను పెద్దపల్లి–కరీంనగర్–ముంబై సెక్షన్ లైన్తో కలపనుంది. ఇటీవల పెద్దపల్లి–కరీంనగర్ మార్గాన్ని డబ్లింగ్ లైన్గా అప్గ్రేడ్ చేసేందుకు ముందుకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా.. కాజీపేట–బల్లార్షా, కరీంనగర్–పెద్దపల్లి లైన్లను కలపడం ద్వారా ఈ సెక్షన్లోని రైల్వే ప్రయాణంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం పెద్దపల్లి జిల్లాలోని చీకురాయి–పెద్దబొంకూరు గ్రామాల మధ్య పెద్దపల్లి బైపాస్ పేరుతో కొత్త రైల్వేస్టేషన్ నిర్మించతలపెట్టారు. ఇందుకోసం ఇటీవల రెండు గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. దాదాపు 20 ఎకరాల వరకు భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. వారికి పరిహారం ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. రైల్వేస్టేషన్ నిర్మాణంలో భాగంగా ముందుగా ఎలక్ట్రిక్ లైన్ నిర్మించేందుకు ఇటీవల టెండర్లు పిలిచింది. త్వరలోనే స్టేషన్ నిర్మాణం కోసం టెండర్లు పిలవనుంది. చీకురాయి–పెద్దబొంకూరుల మధ్య పాయింట్ను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. ఇది కాజీపేట–బల్లార్షా లైన్తో కరీంనగర్–పెద్దపల్లి లైన్ కలిసే ప్రాంతం. ఇంతకాలం ఒక రైలు కరీంనగర్ మీదుగా కాజీపేట/సికింద్రాబాద్ వైపు వెళ్లాలంటే ముందు పెద్దపల్లి జంక్షన్ చేరాలి. అక్కడ బోగీల ముందు ఉన్న ఇంజిన్ విడిపించుకొని, ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి కాజీపేట వైపు ఉన్న బోగీలను లింక్ చేసుకొని వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పెద్దపల్లి బైపాస్ రైల్వేస్టేషన్ పూర్తయితే కాజీపేట వైపు వెళ్లే రైళ్లన్నీ కొత్త స్టేషన్ మీదుగా ఎలాంటి ఇంజిన్ మార్పులు అవసరం లేకుండా సాఫీగా సాగిపోతాయి. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్వాసులకు కాజీపేట/వరంగల్/సికింద్రాబాద్ వైపు ప్రయాణం మరింత సులువు కానుంది. గణనీయంగా పెరిగిన ఫ్రీక్వెన్సీ కరోనాకు ముందు ఇది కేవలం సింగిల్ లైన్ మార్గం. నిజామాబాద్ వరకు కనెక్టివిటీ ఉండటం, ఈ మార్గాన్ని వందే భారత్ వంటి రైళ్లు సైతం నడిచేలా ఇటీవల 100 కి.మీ. వేగం తట్టుకునేలా ట్రాక్ సామర్థ్యం పెంచారు. గతంలో ఖాజీపేట–బల్లార్షా సెక్షన్లోని రైళ్లు సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర వెళ్లేవి. దీనివల్ల చాలా ఇంధనం, సమయం వృథా అయ్యేవి. ఈ మార్గం పూర్తి కావడంతో కరోనా కాలంలో పెద్దపల్లి–నిజామాబాద్ రూట్కు డిమాండ్ బాగా పెరిగింది. ప్రతీరోజు గ్రానైట్, బొగ్గు, బాయిల్డ్ రైస్, వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే రైళ్ల ఫ్రీక్వెన్సీ గతంలో ఎన్నడూ లేనంతగా గణనీయంగా పెరిగింది. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే జోన్లో సరుకు రవాణా రైళ్ల ద్వారా అత్యధికంగా ఆదాయం తీసుకువచ్చే రైల్వే మార్గాల్లో పెద్దపల్లి–నిజామాబాద్ ఒకటిగా ఆవిర్భవించింది. చెప్పుకోదగ్గ రైళ్లేవీ లేవు కానీ, ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు మాత్రం చెప్పుకోదగ్గవి ఏమీలేవు. ఢిల్లీ, కోల్కతా, విశాఖపట్టణం, వారణాసి, బెంగళూరు, చైన్నె, తిరువనంతపురం నగరాలకు రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్గంలో కేవలం రెండు పుష్పుల్ (డెమూ, మెమూ) ఎక్స్ప్రెస్ రైళ్లు, కాజీపేట నుంచి దాదర్ ముంబై వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్, తిరుపతి నుంచి కరీంనగర్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మార్గంలో కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ లాంటి ఎక్కువ జనాభా కలిగిన పట్టణాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో డబ్లింగ్ పూర్తయితే ఇటు ముంబై వైపు, అటు సికింద్రాబాద్ వైపు రైళ్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ (ఏఎంఆర్యూటీ) పథకం కింద ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్కు రూ.26.6 కోట్లు, రామగుండంకు రూ.26.50 కోట్లు, పెద్దపల్లికి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. అయితే, ఈ పనులను రెండు దఫాల్లో చేపట్టనున్న కేంద్రం.. తొలిదశలో కరీంనగర్, రామగుండం స్టేషన్లను అభివృద్ధి చేసి, మరికొన్ని నెలల్లోనే పెద్దపల్లిలోనూ పనులు ప్రారంభించనుంది. ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉపయుక్తం చీకురాయి వద్ద రైల్వేస్టేషన్ నిర్మించతలపెట్టడం అభినందనీయం. రెండు మార్గాలు కలిసేచోట స్టేషన్ నిర్మించడం వల్ల మా ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక్క పెద్దపల్లి ప్రజలకే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. – మేకల శ్రీనివాస్, చీకురాయి -
రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పీఎం గతిశక్తిలో భాగంగా రైళ్ల రాకపోకలను క్రమబద్ధికరించడంతోపాటు రద్దీని తగ్గించడం కోసం గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్– డోన్ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు సహా దేశంలో ఏడు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు పనులకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ఏడు ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.32,512.39 కోట్ల అంచనాకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్– డోన్ (కర్నూలు జిల్లా) రైల్వే లైన్ల డబ్లింగ్ ప్రాజెక్టులకు మొత్తం రూ.7,539.32 కోట్లు కేటాయించింది. ఇందులో గుంటూరు – బీబీనగర్ మధ్య 239 కి.మీ. రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు రూ.2,853.23 కోట్లు, ముద్ఖేడ్ – డోన్ మధ్య 417.88 కి.మీ. మేర డబ్లింగ్ పనులకు రూ.4,686.09 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే ఈ లైన్లలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతోపాటు గూడ్స్ రైళ్ల ద్వారా సరుకు రవాణా మరింత ఊపందుకుంటుంది. దీంతో ఆ పరిధిలో పారిశ్రామిక, వ్యవసాయోత్పత్తుల వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. కర్నూలు జిల్లా నుంచి సరుకు రవాణాకు మరింత సౌలభ్యం ముద్ఖేడ్ – డోన్ రైల్వే లైన్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాను తెలంగాణలోని పలు జిల్లాలు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాతో మరింతగా అనుసంధానిస్తుంది. దీంతో ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న బలార్షా– ఖాజీపేట– సికింద్రాబాద్ మార్గం, కాజీపేట– విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఈ మార్గంలో బొగ్గు, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల రవాణాకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఖుర్దా రోడ్–విజయనగరం మధ్య మూడో లైన్ కాగా భద్రక్–విజయనగరం సెక్షన్లోని ఖుర్దా రోడ్–విజయనగరం మధ్య 363 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణానికి రూ.5,618 కోట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని భద్రక్, జాజ్పూర్, ఖుర్దా, కటక్, గంజాం జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మూడో లైన్ పనులు జరగనున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాలకు ప్రయోజనం గుంటూరు – బీబీనగర్ మధ్య రైల్వే లైన్ గుంటూరు, పల్నాడు ప్రాంతాలను అటు ఒడిశా, ఇటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో అనుసంధానిస్తుంది. అంతేకాకుండా గుంటూరు– సికింద్రాబాద్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గాన్ని కూడా అందుబాటులోకి తెస్తుంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న గుంటూరు–విజయవాడ–కాజీపేట– సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ప్రయాణ దూరంతో గుంటూరు– సికింద్రాబాద్ లైన్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఈ ప్రాంతం గుండా ఇనుము, సిమెంట్, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తుల రవాణాకు మరింత సౌలభ్యం ఏర్పడుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement