కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్‌కు తొలగిన ప్రధాన అడ్డంకి | High Court lifts stay on alignment re survey | Sakshi
Sakshi News home page

కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్‌కు తొలగిన ప్రధాన అడ్డంకి

Jul 3 2025 3:07 AM | Updated on Jul 3 2025 3:07 AM

High Court lifts stay on alignment re survey

అలైన్‌మెంట్‌ రీ సర్వేపై స్టే ఎత్తివేసిన హైకోర్టు

సాక్షి, అమరావతి: 40 సంవత్సరాలుగా పెండింగ్‌­లో ఉన్న కోటిపల్లి – నరసాపురం రైల్వేలైన్‌ ప్రాజె­క్టుకు ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. రైల్వే లైన్‌ భూ సేకరణ, రీ అలైన్‌మెంట్‌ సర్వే విషయంలో గతంలో విధించిన స్టేని హైకోర్టు ఎత్తేసింది. అలైన్‌­మెంట్‌ సర్వే కొనసాగించవచ్చని రైల్వే అధికారు­లను ఆదేశించింది. అలైన్‌మెంట్‌ మార్పు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపింది. ఫలానా మార్గంలోనే అలైన్‌మెంట్‌ వెళ్లాలని ఆదే­శాలు ఇవ్వలేమని చెప్పింది. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అధి­కారులకు స్పష్టం చేసింది. 

రీ అలైన్‌మెంట్‌ ద్వారా ఎవరైనా రాజకీయ నేతలు, ప్రముఖులు ప్రయోజ­నం పొందుతున్నారా అన్న విషయాన్ని పరిగణన­లో­కి తీసుకోవాలని తేల్చి చెప్పింది. తదుపరి విచా­రణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  అలైన్‌­మెంట్‌ మార్చడం వల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లు­తుందని పిటిషనర్ల తరఫున సీని­యర్‌ న్యాయవాది అప్పారి సత్య­ప్రసాద్‌ ధర్మా­స­నం దృష్టికి తీసుకొ­చ్చారు. కేంద్రం తరఫున సీవీఆర్‌ రుద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్‌జీపీ సింగమనేని ప్రణతి వాద­నలు వినిపించారు.

విజయవాడ వరదల ప్రాణ నష్టానికిబాధ్యత ఎవరిది?
బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: గత ఏడాది సంభవించిన విజ­­య­వాడ వరదల వల్ల 60 మంది ప్రాణాలు కోల్పోయారని, జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత ఎవరిదని హైకోర్టు బుధ­వా­రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎవరూ బాధ్యులు కాదంటే కుదర­దని తేల్చి చెప్పింది. తగిన విచా­రణ జరిపి బాధ్యు­­లను గుర్తించి, వారిపై చర్యలు తీసు­కోవాలని స్పష్టం చేసింది. ఈ విష­యంలో పూర్తి వివరా­లను తమ ముందు­ంచా­ల­ని ప్రభు­త్వాన్ని ఆదే­శించింది. ఈ కేసులో ఇదే తామిచ్చే చివరి అవకాశమని, తదు­పరి విచారణను అక్టోబర్‌ 8కి వాయిదా వేస్తూ.. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

వరదల గురించి ముందే తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పాత్రికేయుడు నా­తా­ని భూపతి­రావు హై­కో­ర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిని మాన­వ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించా­లని అందులో ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement