అరుణాచల్‌కు చేరువలో చైనా మరో రైల్వేలైన్ | China to construct new rail line in Tibet close to Arunachal | Sakshi
Sakshi News home page

అరుణాచల్‌కు చేరువలో చైనా మరో రైల్వేలైన్

Nov 1 2014 12:48 AM | Updated on Aug 20 2018 5:23 PM

టిబెట్ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చేరువలోని భారతీయ సరిహద్దుకు సమీపంలో కొత్తగా ఒక రైలు మార్గాన్ని చైనా నిర్మించబోతోంది.

బీజింగ్: టిబెట్ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చేరువలోని భారతీయ సరిహద్దుకు సమీపంలో కొత్తగా ఒక రైలు మార్గాన్ని చైనా నిర్మించబోతోంది. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ఈ రైలుమార్గం నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదిక ఇప్పటికే ఆమోదం పొందినట్టు చైనా అధికారిక వార్తా సంస్థ ‘జిన్హువా’ తెలిపింది. టిబెట్‌లోని లాసా ప్రాంతాన్ని, ఎన్ రుుంగ్చీ ప్రాంతంతో అనుసంధానం చేస్తూ ఈ రైలుమార్గం నిర్మాణాన్ని ప్రతిపాదించినట్టు ‘జిన్హువా’ పేర్కొంది. 402కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణానికి రూ. 6వేలకోట్లకు పైగా వ్యయవువుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తిచేయుడానికి ఏడేళ్లు పడుతుందని భావిస్తున్నారు.

 

చైనా సరిహద్దు వెంబడి ఉన్న అరుణాచల్‌లోని వివిధ ప్రాంతాల మీదుగా రహదారి వ్యవస్థను మెరుగుపరచాలని భారత్ సంకల్పించిన నేపథ్యంలో చైనా ఈ కొత్త రైల్వే నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఇది, ఎత్తైన టిబెట్ పీఠభూమి ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రెండవ రైలువూర్గం అవుతుంది. ఇప్పటికే క్వింగాయ్ ప్రావిన్స్‌లోని జినింగ్‌నుంచి టిబెట్ ప్రావిన్స్ రాజధాని అయిన లాసా వరకు నిర్మించిన రైలుమార్గం 2006నుంచి వినియోగంలో ఉంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement