సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్లకు పచ్చ జెండా

Railway Board Green Signal for superfast railway lines - Sakshi

ఆరు నెలల్లో సర్వే పూర్తిచేయాలని రైల్వేబోర్డు నిర్ణయం

విశాఖపట్నం–విజయవాడ–శంషాబాద్, విశాఖపట్నం–­విజయవాడ–కర్నూలు మార్గాల సర్వేకు గ్రీన్‌ సిగ్నల్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు బీజం పడింది. ఇరు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్‌ ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం – విజయవాడ – తెలంగాణలోని శంషాబాద్‌ మధ్య మొదటిది,  విశాఖపట్నం – విజయవాడ – కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్‌ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది.

ఈ మార్గాల్లో సూపర్‌ ఫాస్ట్‌ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్‌ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 కేఎంపీహెచ్‌ వేగంతో ప్రయాణించేలా) రైల్వే లైన్‌ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు.

ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. ఈ సూపర్‌­ఫాస్ట్‌ రైల్వేలైన్‌ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్‌ ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top