breaking news
Ketan Agarwal
-
ప్లాన్-ఏకి భయపడి.. ప్లాన్-బీతో ఘాతుకం!
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్తో వివాహం ఇష్టం లేకనే సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయం బయటపడింది. ప్లాన్ ఏకు భయపడి.. ప్లాన్ బీను అమలు చేసి సియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. కేతన్, సియాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అయితే చేతన్తో ప్రేమలో ఉన్న సియా మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓవైపు కేతన్తో సన్నిహితంగా ఉంటూనే.. మరోవైపు ప్రియుడితో దారుణమైన స్కెచ్లు గీసింది. ఇందుకోసం వెబ్ సిరీస్లు, క్రైమ్ సినిమాలు చూస్తూ గంటల తరబడి గడిపింది. చివరకు.. చేతన్తో కలిసి ఈ పెళ్లి ఆపడానికి రెండు ప్లాన్లు గీసింది. అందులో.. మొదటిది కేతన్కు యాక్సిడెంట్ చేయడం!. అతడిని గాయపరిచి పెళ్లిని వాయిదా వేయాలని.. ఆ తర్వాత కలిసి పారిపోవడమో లేదంటే ఈ గ్యాప్లో మరేదైనా ప్లాన్ అమలు చేయాలని భావించింది. అయితే ఆ ప్లాన్లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించి డ్రాప్ అయ్యారు. కేతన్ను ఈ విషయం తెలిసిపోతే తమ పని అయిపోయినట్లేనని భయపడ్డారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొట్టి బలవంతంగా పెళ్లి జరిగితే ఆ తర్వాత తమ బంధం కొనసాగదని భావించారు. అందుకే ప్లాన్ బీ అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పక్కా ప్లాన్ గీసి కేతన్ను అంతమొందించారు. సస్పెన్స్ సినిమాలు.. ఆన్లైన్ సెర్చ్లుహత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సస్పెన్స్ సినిమాలు చూసారని, హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో సమాచారం వెతికారని తెలిపారు. సియా ఫోన్ హిస్టరీలో ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు.. కేతన్ను ఎక్కడ హత్య చేస్తే అది ప్రమాదంలా కనిపిస్తుందో తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు. లోనావాలాలోని టైగర్ పాయింట్, విశాపూర్ కోట తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత లోహగఢ్ కోటను ఎంచుకున్నారని చెప్పారు.ముందుగానే రెక్కీ చేసిన సియా?దర్యాప్తులో భాగంగా సియా మే 31న కేతన్తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పర్యటన హత్యకు ముందు చేసిన రెక్కీ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ నుంచి తోసేస్తే కేతన్ మృతి చెందుతాడు.. ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 3న మరోసారి అక్కడికి వెళ్లేందుకు కేతన్ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.బాలి ట్రిప్ కూడా కుట్రలో భాగమేనా?సియా, కేతన్లు జూన్ 6న ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎనిమిది రోజుల పాటు అక్కడ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణం తమ కుట్రకు అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు.. ఎలాగైనా ఆ పర్యటనను ఆపాలని ప్రయత్నించారు. ముంబై పర్యటన సమయంలో సియా కేతన్ పాస్పోర్ట్ను దొంగిలించిందని.. దీంతో బాలి ప్రయాణం రద్దయిందని పోలీసులు తెలిపారు.ముందే ఒకసారి హత్యాయత్నం?లోహగఢ్ కోట వద్ద జూన్ 14న సియా కేతన్ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేతన్ ఓ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ సమయంలో అనుమానం రాకుండా.. పాము నుంచి కాపాడేందుకు తానే తోశానని సియా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత జూన్ 18న మరోసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. చేతన్తో కలిసి కేతన్ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
‘కేతన్ నా హీరో.. చాలా కేరింగ్’.. పొగడ్తలు గుప్పించిన సియా!
ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్గఢ్ కేసులో నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను నెటిజన్లు చూసి నెటిజన్లు.. పాపం కేతన్, అంత మంచోడిని చంపడానికి చేతులెలా వచ్చాయి? అని సియాను తిట్టుకుంటున్నారు. ఆ వీడియో కేతన్-సియా నిశ్చితార్థ వేడుకలోది. వేదికపై కేతన్, సియా కలిసి ఉన్న సమయంలో అక్కడున్న ఒకావిడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అప్పటికే సియా కేతన్ను తన హీరో అని, ఆ హీరో నెంబర్ 1 అని వ్యాఖ్యానించింది. “కాబోయే భర్తగా కేతన్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అతడిని మీ హీరో నంబర్ వన్గా భావించడానికి కారణం?” అని ప్రశ్నించారు. దీనికి సియా చిరునవ్వుతో.. “కేతన్ చాలా కేరింగ్, చాలా మంచివాడు” అంటూ సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న కేతన్ నవ్వుతూ స్పందించగా.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అప్పట్లో ప్రేమగా కనిపించిన ఈ క్షణాలు.. ఇప్పుడు కేతన్ మృతి కేసు నేపథ్యంలో మరో కోణంలో చర్చకు వస్తున్నాయి.'Ketan Agarwal Is Caring & Kind,' Said Siya Goyal During Engagement Ceremony pic.twitter.com/xMy79rhfQg— Pune First (@Pune_First) July 20, 2026పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ.. పుణె రూరల్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వివాహంపై అసంతృప్తితో ఉన్న సియా గోయల్ (20), ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫొటో షూట్ పేరుతో కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. అక్కడి లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అంతకు ముందు(జూన్ 14న) ఇదే ప్రాంతంలో కేతన్ను చంపేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్లు కూడా తెలుస్తోంది. పుణే కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. కాబోయేవాడిని ప్రియుడి సాయంతో హతమార్చడం.. రకరకాల చర్చలకు దారి తీసింది. ఈ తరుణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. కేతన్ను తోసి చంపింది సియానా? లేదంటే చేతనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో పోలీసులును సియా, చేతన్లు ఏ వివరాలు చెప్పుకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీసులు ఆమెను విచారణ కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్తున్న సమయంలోనూ మీడియా ముందు ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ వస్తోంది. సియా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటున్న ఆమె కుటుంబం.. మరోవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే దర్యాప్తు ఆలస్యం అవుతుండడంతో ఆమె బెయిల్ దక్కవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది కేతన్ కుటుంబం. సియా కేతన్ కలిసి దిగిన ఫొటోలు, సరదాగా గడిపిన వీడియోలు.. ఇప్పుడు “కేతన్ మంచోడు.. కేరింగ్” అని చెప్పిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంత మంచోడికి విషయం చెబితే సరిపోయేది కదా.. ఎందుకు చంపేశావ్? అని కామెంట్లలో సియాను తిట్టి పోస్తున్నారు. -
సియా గోయల్ కుటుంబానికి బిగ్ షాక్
యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్న కుటుంబానికి ఇప్పుడు పెద్ద షాకే తగిలింది. సియా కుటుంబం నిర్వహించే మసాలా, డ్రై ఫ్రూట్స్ వ్యాపార సంస్థపై మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం (FDA) చర్యలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనలు, కల్తీ అనుమానాల నేపథ్యంలో దుకాణ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పుణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న బీజీ గోయల్ అండ్ కంపెనీ (M/s BG Goyal and Company) అనే సంస్థను సియా కుటుంబం నిర్వహిస్తోంది. ఈ షాపులో తాజాగా ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ చంక్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా మొత్తం 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.14 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (FSS Act) ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను సంస్థ ఉల్లంఘించిందని ఎఫ్డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. లైసెన్స్ వివరాల్లో అవసరమైన మార్పులు చేయాలని గతంలో సూచించినప్పటికీ.. సంస్థ నుంచి సరైన స్పందన రాకపోవడంతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్పత్తుల లేబులింగ్లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు, కల్తీ జరిగి ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా.. సియా గోయల్ పేరు దేశం అంతటికి తెలిసిందే. తన కాబోయే భర్త కేతన్ (25)ను ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి లోహగఢ్ కోట వద్ద నుంచి తోసి హత్య చేసిన కేసులో ఆమె నిందితురాలిగా ఉంది. జూన్ 18న ఈ ఘటన జరగ్గా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు సియా, చేతన్ అరెస్ట్తో ఓ కొలిక్కి వచ్చింది. అయితే కేతన్ను తోసిందెవరు? అనే మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ఈ విషయంలో నిందితులిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇటు హత్య కేసు విచారణ కొనసాగుతున్న వేళ.. తాజాగా ఆమె కుటుంబ వ్యాపారంపై FDA చర్యలు తీసుకోవడం పుణెలో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఎఫ్డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ తుకారాం ముండే కల్తీపై కొరడా ఝుళిపిస్తున్నారు. కల్తీ ఆహారం, నిషేధిత ఉత్పత్తులు, నాసిరకం మందులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో కఠిన నిర్ణయాలతో గుర్తింపు పొందిన ముండే.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పలు జిల్లాల్లో అక్రమ తయారీ కేంద్రాలు, గుట్కా విక్రయదారులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై కేసులు, సీజ్ చర్యలు కొనసాగుతున్నాయి. -
‘ మోదీ జీ.. నా తనయుడి కేసును కాగితంగానే మిగిలిపోనివ్వకండి’
పూణే: మహారాష్ట్రలోని పూణేలో రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా బాధితుడి తల్లి రాఖీ అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ భావోద్వేగ లేఖ రాశారు. తన కుమారుడి హత్యకు కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూసి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ప్రధానిని వేడుకున్నారు.గత జూన్ 18న కేతన్తో వివాహం జరగాల్సిన సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలసి కేతన్ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి, వారిని అరెస్ట్ చేశారు. కేతన్ మృతిచెందిన 20 రోజులకే, ఆ బాధను తట్టుకోలేక అతని తాత కన్నుమూశారు. దీనిపై రాఖీ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేస్తూ, కొద్దిరోజుల వ్యవధిలోనే తమ కుటుంబం రెండు తరాలను కోల్పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రతిరోజూ తమ ఇల్లు కేతన్ జ్ఞాపకాలతో ప్రతిధ్వనిస్తోందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.తాము ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు ఆశించడం లేదని, కేవలం సత్వర న్యాయం మాత్రమే కావాలని ఆమె ఆ లేఖలో కోరారు. కాగా ఇప్పటికే కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కూడా ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. దోషులకు చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా ప్రధాని వ్యక్తిగతంగా చొరవ చూపాలని బాధితుని తల్లి విజ్ఞప్తి చేశారు. కేతన్ హత్య కేసును కేవలం కాగితంగానే మిగిలిపోనివ్వకండి’ అని లేఖలో విన్నవించారు.ఇది కూడా చదవండి: ‘భోజశాల’పై సుప్రీం తీర్పు.. నమాజ్కు నిరాకరణ -
కేతన్ హత్యకు 4 నెలల ముందే సియా చేతన్ సీక్రెట్ గా పెళ్లి
-
కేతన్ అగర్వాల్ హత్య.. సోనమ్ రఘువంశీయే సియా ఇన్స్పిరేషన్!
పూణే: సాధారణంగా మీకు స్ఫూర్తి ఎవరు? అని అడిగితే కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాకారులు లేదా సినీ ప్రముఖుల పేర్లు చెబుతారు. అయితే తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను లోహ్గఢ్ కోటపై నుంచి తోసి చంపిన సియా గోయల్కు స్ఫూర్తిగా నిలిచింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనమ్ రఘువంశీ అని పూణే పోలీసులు వెల్లడించారు.దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకొక సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తన కాబోయే భర్త కేతన్ను లోహ్గఢ్ కోటపై నుంచి తోసి హత్య చేసిన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పథకం వెనుక విస్తుపోయే నిజాలు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. గతంలో దేశాన్ని కుదిపేసిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనమ్ రఘువంశీని ఆదర్శంగా తీసుకుని ఈ నేరానికి పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు.పెళ్లైన కొద్ది రోజులకే హనీమూన్ పేరుతో భర్త రాజా రఘువంశీని మేఘాలయకు తీసుకెళ్లిన సోనమ్ రఘువంశీ, సోహ్రా జలపాతం సమీపంలో ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో జరిగిన తప్పులను తాను పునరావృతం చేయకూడదని సియా ముందుగానే ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.సోనమ్ తన భర్తపై ఆయుధాలతో దాడి చేయడం వల్ల శరీరంపై గాయాలు కనిపించాయని, అదే పోలీసులకు కేసును ఛేదించడంలో కీలక ఆధారంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా, కేతన్ను లోహ్గఢ్ కోటపై నుంచి లోయలోకి తోసేయడం ద్వారా ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రీకరించాలని సియా ప్రయత్నించింది. ఒక్కరితో అది సాధ్యం కాకపోవచ్చనే ఉద్దేశంతో ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ఇద్దరూ ఒకేసారి కేతన్ను లోయలోకి తోసినట్లు దర్యాప్తులో తేలింది.ఈ కేసును ఛేదించడం పూణే పోలీసులకు అంత సులభం కాలేదు. నిందితులు సృష్టించిన తప్పుడు కథనాలు, తాము సంఘటనా స్థలంలో లేమనే వాదనలు, ఇతర తప్పుడు ఆధారాలను పోలీసులు క్రమంగా ఛేదించారు. సియా గోయల్ మనస్తత్వాన్ని లోతుగా విశ్లేషిస్తూ, నిరంతర విచారణ నిర్వహించిన తర్వాతే నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. వారి వాంగ్మూలాల ఆధారంగా ఇతర కీలక భౌతిక ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు.కేతన్ పడిన ప్రదేశం అత్యంత ప్రమాదకరమైనది కాకపోవడం, కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలు, అలాగే పోలీసులు జరిపిన సుదీర్ఘ విచారణ ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించాయి.సియా గోయల్ మొబైల్ ఫోన్ బ్రౌజింగ్ హిస్టరీని పరిశీలించగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఆమె ఇంటర్నెట్లో విస్తృతంగా శోధించినట్లు గుర్తించారు. అంతేకాకుండా పోలీసు కస్టడీలో మహిళలను కొడతారా?, మహిళా ఖైదీలకు ఉన్న హక్కులు ఏమిటి? వంటి అంశాలపై కూడా ముందుగానే గూగుల్లో వెతికిని డిజిటల్ ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు.ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ న్యాయస్థాన ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇంత ఘోరమైన నేరానికి పాల్పడినప్పటికీ వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా, రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ ఈ ఘటనపై స్పందిస్తూ, ఈ కేసు తన కుమారుడి హత్యను గుర్తుకు తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాల కోసం సియా గోయల్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రెండో మొబైల్ ఫోన్ను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. -
లై డిటెక్టర్ టెస్ట్ లో సియా ఏం చెప్పిందంటే..? అందరూ షాక్!
-
కేతన్ అగర్వాల్ ఇంట మరో విషాదం
పూణే: మహారాష్ట్రలోని పూణే సమీపంలోని లోహగఢ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. తన మనవడి హఠాన్మరణాన్ని తట్టుకోలేక కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ (71) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి పడి కేతన్ మృతి చెందినప్పటి నుంచి దేవీచంద్ తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మొదట ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా భావించిన ఈ ఘటనను, పథకం ప్రకారం జరిగిన హత్యగా పూణే రూరల్ పోలీసులు నిర్ధారించారు. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, పెళ్లి ఇష్టం లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా తన స్నేహితుడు చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇద్దరినీ కోర్టు జూలై 16 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. లోహగఢ్ కోటపై డమ్మీతో సీన్ రీక్రియేషన్ చేసిన పోలీసులు, లల్లానగర్ మైదానంలో హత్యకు ముందు వారు చేసిన రిహార్సల్స్ ఆధారాలను సేకరించారు. సియా తండ్రి ప్రవీణ్ గోయల్ ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. -
‘జరగని పెళ్లికి టికెట్లు ఎందుకో’..
ముంబై: తన కాబోయే భర్త, వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్, ఆమె స్నేహితురాలి మధ్య జరిగినట్లుగా భావిస్తున్న ఒక స్నాప్చాట్ సంభాషణకు సంబంధించిన స్క్రీన్షాట్స్ మహారాష్ట్ర పోలీసులు సంపాదించారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఇక ఆ చాట్లో కేతన్తో తన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగబోదని ఒక స్నేహితురాలితో సియా చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్నాప్ చాట్ యాప్లో స్నేహితురాలు, సియా మధ్య జరిగిన చాటింగ్ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇన్ని రోజులు సియా దాచిపెట్టిన మరో ఫోన్లో డేటాను వెలికితీయగా ఈ చాటింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.పెళ్లి, రిసెప్షన్ వేడుకలకు హాజరయ్యే అతిదులకు విమాన టికెట్లు బుక్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా సియా తన ఫ్రెండ్కు చాటింగ్లో ఒక మెసేజ్ పెట్టింది. 'నీ ఆధార్కార్డ్ ముందువైపు వెనుకవైపు ఫోటో తీసి నాకు పంపు. విమాన టికెట్లు నీరు బుక్ చేయాలి . అయినా జరగని పెళ్లికి ఈ టికెట్ల బుకింగ్ గోల ఏంటో. అయినా ఫర్లేదు. ముందయితే నీ ఆధార్ ఫొటోలు పంపు’ అని అందులో రాసింది. అందుకు ‘సరే. నీకు వాట్సాప్ పంపాను. చూసుకో’ అని స్నేహితురాలు బదులిచ్చింది.ఈ చాటింగ్ మే 25వ తేదీన జరిగింది. ఆ తర్వాత జూన్ 18వ తేదీన కేతన్ హత్య జరిగింది. అంటే చాలా రోజుల ముందు నుంటే కుట్రకు సియా పథక రచన చేసిందని పోలీసులు చెబుతున్నారు.కోట నుంచి కేతన్ పారపాటున పడిపోయాడని అందర్నీ నమ్మించేందుకు సియా ఇలా చివరి నిమిషందాకా విమాన టికెట్ల బుకింగ్ వంటి పెళ్లిపనుల్లో బిజీగా ఉన్నట్లు నటించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సియా, చేతన్లతో పాటు చేతన్ క్లాస్మెట్ ఒకరికి ఈ హత్యకుట్రతో సంబంధం ఉండని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
CODEWORDS, EMOJI లతో సియా సీక్రెట్ చాట్స్
-
కేతన్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. సీన్లోకి మూడో వ్యక్తి!
పుణె: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పుణె పోలీసులు కీలక ఆధారాల్ని సేకరించారు. ఈ కిరాతక హత్యకు సంబంధించి బీడ్ జిల్లాకు చెందిన, బాలేవాడి కంపెనీలో పనిచేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరిలతో ఇతనికి పాత పరిచయం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.విచారణ సంస్థల కథనం ప్రకారం.. నిందితులు ఇద్దరూ కేతన్ను హతమార్చాలనే తమ కుట్రను ఈ మూడో వ్యక్తితో పంచుకున్నారు. అంతేకాకుండా, జూన్ 18న కేతన్ను లోహగఢ్ కోటపై నుండి నెట్టేసిన రోజున, తమతో పాటు రమ్మని అతడిని కోరారు. అయితే, ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడవద్దని వారిని వారించినట్లు తెలుస్తోంది.ఈ నేరపూరిత ప్రణాళిక గురించి అతనికి ఎంతవరకు తెలుసు. ఇందులో అతని పాత్ర ఎంత అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అతని వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ కేసులో మరో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్రణాళికతో హత్య చేసి, సాక్ష్యాలు దొరకకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడానికి నిందితులు ఇద్దరూ టీవీ సిరీస్ ‘క్రైమ్ పెట్రోల్’ఎపిసోడ్లను పదే పదే చూసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.అసభ్య ప్రవర్తన కేసు దర్యాప్తులో భాగంగా గురువారం పుణె రూరల్ పోలీసులు సియా గోయల్ను ఆమె మార్కెట్ యార్డ్ నివాసానికి తీసుకువెళ్లారు. లోహగఢ్ కోటకు వెళ్లిన సమయంలో ఆమె ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అయితే, దర్యాప్తు ముగించుకుని తిరిగి వాహనంలోకి వెళ్తున్న సమయంలో, అక్కడ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల కెమెరాల వైపు సియా గోయల్ మధ్య వేలు చూపిస్తూ తీవ్ర అసభ్యంగా ప్రవర్తించడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.25 ఏళ్ల కేతన్ అగర్వాల్కు, సియా గోయల్కు వచ్చే నవంబర్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, సియాకు చేతన్ చౌదరితో ఉన్న వివాహేతర సంబంధానికి కేతన్ అడ్డుగా మారాడని భావించిన వీరు జూన్ 18న లోహగఢ్ కోటపై నుండి అతడిని లోయలోకి నెట్టి హత్య చేశారు. పక్కాగా రిహార్సల్స్ చేసి మరీ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని కఠినంగా శిక్షించేందుకు పోలీసులు వేగంగా ఆధారాలను సేకరిస్తున్నారు. -
పుణే కేసు: అసభ్య సైగ చేసిన సియా.. వీడియో వైరల్
పుణే: యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. లోహగఢ్ ఫోర్ట్ సమీపంలోని లోయలో అతన్ని ఎవరు తోసి చంపారన్న అంశంపై పోలీసులు ఇప్పటికీ స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, దర్యాప్తులో పరస్పర విరుద్ధమైన వాదనలు బయటపడుతుండటంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.క్రైమ్ రీక్రియేషన్లో భాగంగా.. పోలీసులు ఆమెను తన నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బయటకు తీసుకువస్తున్న సమయంలో మీడియా ఎదుట ఆమె మిడిల్ ఫింగర్(అసభ్య సైగ) చూపింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆమె ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. Pune, Maharashtra: Siya Goyal, accused in the Ketan Agarwal murder case, was taken by Pune Rural Police to her Market Yard residence for investigation. After the investigation was completed, while leaving the house, Siya Goyal allegedly made obscene gestures and showed the middle… pic.twitter.com/mHnQKlfRrq— IANS (@ians_india) July 2, 2026జూన్ 18న పుణే సమీపంలోని లోహ్గఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. మొదట ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసినప్పటికీ.. దర్యాప్తులో ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది. సియా గోయల్, కేతన్ అగర్వాల్ కుటుంబాలు ముందే వివాహాన్ని ఖరారు చేశాయి. నవంబర్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రియుడు చేతన్తో కలిసి కేతన్ను సియా హతమార్చింది. అయితే.. కేసులో ఎవరు నిజంగా కేతన్ను లోయలోకి తోశారన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు లై డిటెక్టర్ పరీక్ష అవసరమని కోర్టును అభ్యర్థించారు. నిందితులు మౌనం వహిస్తున్నందున దర్యాప్తుకు ఇది కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అయితే నిందితురాలి సమ్మతి తప్పనిసరి అని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించబడవని, అవి కేవలం దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది.మరోవైపు దర్యాప్తులో కీలకంగా జనవరి నుంచి జూన్ వరకు సియా–చేతన్ మధ్య 2,000కు పైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. ఘటన అనంతరం కేతన్ మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న సీసీటీవీ దృశ్యాలు కూడా పోలీసులు గుర్తించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు రెండు దశల్లో ఘటన స్థలంలో సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఒకసారి, చేతన్ను తీసుకెళ్లి మరోసారి లోహగఢ్ ఫోర్ట్ వద్ద సంఘటనను పునర్నిర్మించినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో ఫోరెన్సిక్ విశ్లేషణ, డిజిటల్ ఆధారాల రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ కేసును ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103 (హత్య), 61 (కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. ఒకవైపు నిందితురాలి వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా, మరోవైపు లై డిటెక్టర్ టెస్ట్ కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఈ కేసును మరింత కీలక దిశలోకి తీసుకెళ్లింది. -
కేతన్ కేసులో కీలక మలుపు
-
కేసులో బిగ్ ట్విస్ట్.. సియా సోదరుడిపై 10 కోట్ల పరువు నష్టం దావా
-
కేతన్ హత్య తర్వాత.. ఆ కోటకు పోటెత్తిన టూరిస్టులు.. కారణం ఇదే!
-
ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు : సియా సోదరుడిపై అనుమానాలు
పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ పాత్రపై కూడా ఇప్పుడు పోలీసుల నిఘా పెట్టారు. సియా-చేతన్ల ప్రేమ వ్యవహారం సాహిల్కు ముందే తెలుసా? అతను ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే కుటుంబ సభ్యుల నుండి దాచాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై ఇప్పటివరకు నోరు విప్పని సాహిల్, ఒక మీడియా ముఖంగా తొలిసారి స్పందించాడు. అయితే అతని వ్యాఖ్యలకు, పోలీసుల దర్యాప్తునకు మధ్య అనేక వ్యత్యాసాలు కనిపిస్తుండటంతో మరింత గందరగోళం నెలకొంది.సియాకు పెళ్లి ఇష్టమే..కానీతాను కేతన్ అగర్వాల్ను మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని, చేతన్తో సంబంధాన్ని కొనసాగించే ఉద్దేశం తనకు లేదని సియా తనతో చెప్పిందని సాహిల్ తెలిపాడు. తమ మధ్య ఏమీ లేదని, ఇకపై చేతన్తో ఎలాంటి సంబంధం పెట్టుకోనని తనపై ఒట్టు వేసిందని కూడా చెప్పాడు అందుకే, సియా, చేతన్ గురించి తాను ఎవరికీ చెప్పలేదన్నాడు. వాళ్లు స్నేహితులుగా ఉంటారని భావించి, దీనిపై తల్లిదండ్రులకు చెప్పలేదని అతను చెప్పుకొచ్చాడు.కన్ఫ్యూజన్లో ఉంది : సియా తన బంధం విషయంలో కొంత గందరగోళంలో ఉందని, వయసు రీత్యా స్నేహాన్ని ప్రేమగా అనుకోవడం సహజమేనని, అందుకే తాను ఆమెకు నచ్చజెప్పానని సాహిల్ అన్నాడు. ఆమె కేతన్తో పెళ్లికి, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఎంతో సంతోషంగా ప్లాన్ చేసుకుందని చెప్పుకొచ్చాడు.డ్రైవర్ సాక్ష్యంతో అనుమానాలుసాహిల్ చెబుతున్న మాటలకు, పోలీసుల దర్యాప్తులో తేలుతున్న విషయాలకు అస్సలు పొంతన కుదరడం లేదు. సియాకు కేతన్తో పెళ్లి ఇష్టం లేదనే నిజాన్ని ఆమె సాహిల్కు ముందే చెప్పిందని, అయినా అతను సైలెంట్గా ఉన్నాడని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. డ్రైవర్ ఇచ్చిన కీలక సాక్ష్యం సాహిల్పై అనుమానాలను మరింత బలోపేతం చేస్తోంది.ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం బాలికి వెళ్లేందుకుగాను ఎయిర్పోర్ట్కు వెళ్లడానికి సియా నిరాకరించినప్పుడు, సాహిల్ బలవంతంగా ఆమెను కారెక్కించాడని కారు డ్రైవర్ పోలీసులకు సాక్ష్యం ఇచ్చాడు.పాస్పోర్ట్ చింపేసినాబాలి ట్రిప్కు వెళ్లడానికి ముందే కేతన్ పాస్పోర్ట్ను సియా చింపేసిన విషయం సాహిల్కు తెలిసినప్పటికీ, అతను ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఎవరికీ చెప్పకపోవడం పోలీసులలో అనుమానాలను మరింత పెంచింది. ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్సాహిల్ ఎందుకు మౌనంగా ఉన్నాడు?ప్రస్తుతానికి సాహిల్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చకపోయినప్పటికీ, సోమవారం నాడు పోలీసులు అతన్ని దాదాపు 10 గంటల పాటు విచారించి, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసు కేవలం ఒక 'హత్య' మాత్రమే కాకుండా, దీని వెనుక పెద్ద 'ముందస్తు ప్లాన్ (కుట్ర)' ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కుట్రలో సాహిల్ కూడా సియా, చేతన్లకు ఏమైనా సహాయం చేశాడా? లేక అంతా తెలిసి కూడా మౌనంగా ఉన్నాడా? అని పోలీసులు తేల్చనున్నారు.ముందే హెచ్చరించిన కుటుంబ జ్యోతిష్యుడుసియా గోయల్, చేతన్ చౌదరిల జాతకాలను నలుగురు వేర్వేరు జ్యోతిష్యులు ద్వారా పరీక్షించినపుడు, వారిలో ముగ్గురు వారిద్దరికీ అనుకూల ఫలితాలను అందించారట. కేతన్ అగర్వాల్ తల్లిదండ్రుల వివాహానికి పురోహితుడిగా వ్యవహరించిన అగర్వాల్ కుటుంబ పురోహితుడు, వీరి పెళ్లికి సుముఖంగా లేదని చెప్పినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.కుటుంబ పురోహితుడు ఈ సంబంధంపై ఆందోళన వ్యక్తం చేశారని, సియా కేతన్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అతనికి శారీరకంగా హాని కలిగే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. ఇన్ని అభ్యంతరాలున్నప్పటికీ, తన తండ్రి మద్దతుతో కేతన్ సియాను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడని తెలుస్తోంది.(హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు)కాగా జూన్ 18న లోహగడ్ కోటపై కేతన్ అగర్వాల్ను సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కిందకు తోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసు కస్టడీలో ఉన్నారు.ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ -
కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్
పుణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. అనూహ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్కు, ప్రముఖ న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ రూ. 10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. సాహిల్ తనపై చేసిన అబద్ధపు, అవమానకర ఆరోపణలతో తన ప్రతిష్ట దెబ్బతిందని శ్రీవాస్తవ ఆ నోటీసులో పేర్కొన్నారు.కేతన్ అగర్వాల్ హత్య విచారణలో సియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆశుతోష్ శ్రీవాస్తవా లేక విపుల్ దుషింగ్నా? అనే ప్రశ్న ఈ కేసులో కొత్త న్యాయపోరాటానికి దారితీసింది. ఈ హైప్రొఫైల్ మర్డర్ కేసులో సియా తరపున అసలు ఏ న్యాయవాది వాదించాలనే విషయంపై వివాదం చెలరేగిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం సియా ఆమె ప్రియుడు (సహ నిందితుడు) చేతన్ చౌదరిలను వడ్గావ్ మావల్ కోర్టులో హాజరు పరిచారు. విచారణను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కోర్టు వీరి పోలీసు కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది. అయితే, విచారణ సమయంలో కోర్టులో ఒక గందరగోళం నెలకొంది. లాయర్ అశుతోష్ శ్రీవాస్తవ కోర్టుకు హాజరై, తానే సియా తరపున వాదిస్తున్నానని చెబుతూ ఆమె సంతకం ఉన్న వకాలత్నామాను సమర్పించారు. కానీ, సియా మాత్రం శ్రీవాస్తవ తన లాయర్ కాదని, అడ్వకేట్ విపుల్ దుషింగ్ తన లాయర్ అని కోర్టుకు తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా దుషింగ్నే తాము లాయర్గా నియమించుకున్నామని స్పష్టం చేశారు.రూ. 10 కోట్ల పరువు నష్టం కోర్టు విచారణకు ముందే, నిందితురాలి సోదరుడు సాహిల్ గోయల్ బహిరంగంగా లాయర్ శ్రీవాస్తవపై కొన్ని ఆరోపణలు చేశాడు. శ్రీవాస్తవను తాము లాయర్గా నియమించలేదని, మోసపూరితంగా సియా దగ్గర సంతకం తీసుకుని ఉండవచ్చని ఆరోపించాడు. అంతేకాదు శ్రీవాస్తవ తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని కూడా సాహిల్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు : సియా, తల్లి షాకింగ్ రియాక్షన్ఈ ఆరోపణలపై లాయర్ శ్రీవాస్తవ తీవ్రంగా స్పందించారు. తాము నేరుగా సియాను కలిశామని, ఆమె మేజర్ కాబట్టి తన స్వంత నిర్ణయాల ప్రకారం లీగల్ హెల్ప్ కోసం వకాలత్నామాపై స్వచ్ఛందంగా సంతకం చేసిందని శ్రీవాస్తవ తెలిపారు. తాము సాహిల్తో మాట్లాడలేదని, నేరుగా సియాతోనే డీల్ చేశామని స్పష్టం చేశారు. మరోవైపు సాహిల్ నిరాధారమైన ఆరోపణల కారణగా తన ప్రతిష్టకు భంకం కలిగిందంటూ రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ నోటీసు ఇచ్చారు. సాహిల్ వెంటనే తన ఆరోపణలను ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్కాగా ఈ కేసులో పోలీసుల విచారణలో మరికొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కేతన్ను తోసేయడానికి ముందే సియా, చేతన్లు లోహగడ్ కోటను సందర్శించి, ఎక్కడి నుండి తోసేయాలో స్పాట్ ముందే ఫిక్స్ చేసుకున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. సియాకు, కేతన్ అగర్వాల్తో ఇష్టంలేక, పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని భావించి, ప్రియుడు చేతన్తో కలిసి పుణెలోని లోహగడ్ కోట కొండపై నుండి కేతన్ను కిందకు తోసి హత్య చేసిందనే ఆరోపణలెదుర్కొంటోంది. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు.(హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు) -
కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!
-
కోటి ఇవ్వవా.. పెళ్లి షాపింగ్ చేసుకుంటా!
పూణే: కేతన్ అగర్వాల్ మర్డర్ కేస్.. ఇందులో సియా గోయల్, చేతన్ చౌదరిల పాత్ర చూస్తుంటే థ్రిల్లర్ మలయాళం సినిమా క్రైమ్ స్టోరీ కూడా నథింగ్ అనిపిస్తోంది! నిందితురాలు 20 ఏళ్ల సియా గోయల్, తన ప్రియుడు 22 ఏళ్ల చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు ముందే పక్కా స్కెచ్ వేసింది. అంతటితో ఆగకుండా, పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. నేరం జరిగిన కొన్నేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలంటూ తమ భవిష్యత్తును కూడా ముందే ప్లాన్ చేసుకోవడం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల్ని సైతం విస్మయానికి గురిచేస్తోంది.పెద్దలు నిర్ణయించిన వివాహం చేసుకోవడం ఇష్టం లేని సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను పూణే సమీపంలోని లోహ్గఢ్ కోట వద్ద లోయలోకి తోసేసి అత్యంత క్రూరంగా హత్య చేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు పలు కీలక విషయాల్ని వెలికి తీశారు.లోహ్గఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ను ఎలా హత్య చేయాలి?.. హత్య చేసే సమయంలో కేతన్ తప్పించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి?.. కేతన్ను హత్య చేసిన తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా పెళ్లెప్పుడు చేసుకోవాలి?.. పెళ్లి చేసుకోవడంతో పాటు సియా, చేతన్ల జీవితం ఎలా ఉండాలి?.. ఇందుకోసం డబ్బులు ఎలా సంపాదించాలి?.. అని వీరంతా ముందే ప్లాన్ చేసినట్లు తేలింది.కేతన్ అగర్వాల్ హత్య తర్వాత తమ భవిష్యత్ను కలర్ఫుల్గా తీర్చిదిద్దేందుకు సియా గోయల్, చేతన్ చౌదరి ముందే మాట్లాడుకున్నారు. ఇందులో భాగంగానే, అనుమానం రాకుండా ఉండేందుకు నేరం జరిగిన మూడేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలని అనుకున్నారు.ఈ ప్లాన్లో భాగంగా సియా.. పెళ్లి షాపింగ్ చేసే సాకుతో కాబోయే భర్త కేతన్ అగర్వాల్ వద్ద నుంచి ఏకంగా రూ.కోటి రూపాయలు తీసుకుంది. ఆ రూ.కోటి మొత్తాన్ని పెళ్లి షాపింగ్కు ఖర్చు చేయకుండా, సియా తన ప్రియుడైన చేతన్కు ఇచ్చేసింది. చేతన్తో పాటు తన భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశ్యంతో.. ఆ కోటి రూపాయలతో చేతన్ లైఫ్ సెటిల్ చేయడం, కొత్త బిజినెస్ను ప్రారంభించడం, ఆ తర్వాత కేతన్ను హత్య చేసిన మూడేళ్లకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు మరికొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. లోహగడ్ కోట పైనుంచి కేతన్ అగర్వాల్ను లోయలోకి తోసివేయమని ప్రియుడు చేతన్ చౌదరికి సంకేతం ఇవ్వడానికి సియా గోయల్ ఒక వింత ప్లాన్ వేసింది.తాను తోసేసే సమయంలో కింద పడుతూ పడుతూ కేతన్ తనని పట్టుకుంటే.. ఆ కంగారులో సియా కూడా ఎక్కడ లోయలో పడిపోతుందోనని వారు ముందే భయపడ్డారు. అందుకే సియా భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ప్రాణాంతకమైన ఆ తోపుడు సమయంలో కేతన్కు ఆమె ఏమాత్రం అందకుండా ఉండేందుకు, సియా కింద కూర్చోవాలని వారు పక్కాగా స్కెచ్ వేశారు.లోహగడ్ కోటపై నడుస్తున్నప్పుడు.. నీళ్లు తాగడానికో లేదా షూలేసులు కట్టుకునే నెపంతోనో సియా కింద కూర్చోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అలా సియా కింద కూర్చోవడమే చేతన్ చౌదరికి గ్రీన్ సిగ్నల్!ప్లాన్ ప్రకారం.. సియా కింద కూర్చోగానే, వెనుక నుంచి వచ్చిన చేతన్ చౌదరి..కేతన్ అగర్వాల్ను గట్టిగా లోయలోకి తోసి చంపేశాడని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ఇది సియాను ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి వారు బాగా ఆలోచించి వేసిన ఘోరమైన ఎత్తుగడ అని పోలీసులు వెల్లడించారు.మరోవైపు, జూన్ 18న కేతన్, సియాలను అనుసరించిన చేతన్ చౌదరి.. కేసులో ఇరుక్కోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. టోల్ ప్లాజాల వద్ద కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు తనను సులభంగా గుర్తిస్తారనే భయంతో.. అతను కారును వాడలేదు. పూణే నుండి లోహగడ్ కోటకు, సుమారు 90 కిలోమీటర్ల దూరం.. ఒక స్కూటర్పై ప్రయాణించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హత్యకు ఉపయోగించిన ఆ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు వెల్లడించారు. -
లోహగడ్ కోటపై ఏం జరిగింది?.. సీన్ రీక్రియేషన్
పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 10 రోజుల కిత్రం ఈ ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఇవాళ (ఆదివారం) నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను లోహగడ్ కోటపైకి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేశారు. జూన్ 18న జరిగిన ఈ హత్య ఉదంతంలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్ను కొండపై నుండి నెట్టేసిన సంగతి తెలిసిందే.పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. నిందితులను సరిగ్గా ఘటన జరిగిన లోహగఢ్ కోట ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ను రీక్రియేట్ చేశాం. వారు కోటకు ఏ మార్గంలో వచ్చారు, ఎక్కడెక్కడ నిలబడ్డారు? కేతన్ను ఎలా నెట్టేశారు అనే పూర్తి వివరాలను నిందితుల ద్వారా అడిగి తెలుసుకున్నామని తెలిపారు.మరో సీనియర్ పోలీస్ అధికారి పిటిఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. బాధితుడిని ఏ పాయింట్ నుంచి అయితే కిందకు తోసేశారో.. సియా గోయల్ను సరిగ్గా అదే చోటుకి తీసుకెళ్లాం. ఆమె ప్రియుడు చేతన్ను విడిగా కోటపైకి తీసుకెళ్లి విచారించాం. సీన్ రీక్రియేషన్ ద్వారా నిందితులు చెబుతున్న వాదనల్లో నిజమెంత ఉందో తేలనుంది.క్రైమ్ సీన్ రీక్రియేషన్ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. నిందితులు కోటకు ఎలా చేరుకున్నారు? కేతన్ను తోసేయడానికి ముందు సియా తన ప్రియుడికి ఎలాంటి సిగ్నల్ ఇచ్చింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు చేతన్ చౌదరి అసలు టికెట్ తీసుకోకుండానే కోటలోకి ప్రవేశించి, ఈ జంటను వెంబడించాడా అనే కోణాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణ సజావుగా సాగడం కోసం లోహగఢ్ కోటలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సియా పోలీసుల ఎదుట అంగీకరించింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే ప్రియుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. శనివారం.. సియా గోయల్ తల్లిదండ్రులు ప్రవీణ్, పూజలతో పాటు ఆమె సోదరుడు సాహిల్ను లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్లో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అంతకుముందు శుక్రవారం కూడా సాహిల్ను 10 గంటల పాటు ప్రశ్నించారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నివసించే గహుంజే ప్రాంతంలో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
దయచేసి ఇక ఆపండి! కేతన్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి
ఒక కుటుంబం జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వినోదంగా మారింది. చనిపోయిన కొడుకును టెక్నాలజీ సాయంతో మళ్లీ "బతికించినందుకు" సంతోషించాలా? లేక అతని హత్య కేసులో నిందితురాలితో కలిసి నవ్వుతూ, మాట్లాడుతున్నట్లు వీడియోలు సృష్టిస్తున్నందుకు బాధపడాలా? అనే వేదనలో కేతన్ అగర్వాల్ కుటుంబం మునిగిపోయింది. కేవలం వ్యూస్, లైక్స్ కోసం జరుగుతున్న ఈ ఏఐ ట్రెండ్ వారికి మరోసారి తీరని మానసిక వేదనను మిగులుస్తోంది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే లోహగడ్ హత్య కేసు ఇప్పుడు మరో కారణంతో చర్చనీయాంశమైంది. ఇన్స్టాగ్రామ్తో పాటు పలు సోషల్ మీడియా వేదికల్లో కేతన్ అగర్వాల్, నిందితురాలు సియా గోయల్ కలిసి ఉన్నట్లు చూపించే ఏఐ వీడియోలు, ఫోటోలు, రీల్స్ భారీగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు పూర్తిగా కల్పితమైనవే అయినప్పటికీ, లక్షలాది మంది వాటిని వీక్షిస్తూ, షేర్ చేస్తుండటంతో ఈ ట్రెండ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. "దయచేసి ఇలాంటి ఏఐ వీడియోలు చేయడం ఆపండి" అంటూ వారు సోషల్ మీడియా వినియోగదారులను భావోద్వేగంగా వేడుకుంటున్నారు. అలాగే.. కేతన్-సియాల వీడియోలను కూడా వైరల్ చేయడం ఆపమంటున్నారు.People out there are really making AI edits of Ketan and Siya, Instagram is full of it now pic.twitter.com/Rg6yy86Oyq— Shubham2.0 (@bhav_paaji) June 26, 2026పుణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫిబ్రవరిలో సియా గోయల్తో ఆయనకు నిశ్చితార్థం జరిగింది. అయితే సియాకు అప్పటికే చేతన్ చౌదరితో ప్రేమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులకు చెప్పకుండా, కేతన్ను అడ్డంకిగా భావించి హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.'Killing Ketan Was Easier Than Confronting My Family': Siya Goyal's Confession to Pune PoliceThe Ketan Agarwal murder investigation has taken a fresh turn after police claimed that accused Siya Goyal made a startling statement during interrogation.According to investigators,… pic.twitter.com/FZYImt2ZIm— upuknews (@upuknews1) June 26, 2026జూన్ 18వ తేదీన లోహగడ్ కోట వద్ద ఫొటోషూట్ కోసం తీసుకెళ్లి లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటన, తర్వాత పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా మారింది. ఈ కేసులో సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఈ విషాద ఘటనను ఇప్పుడు కొందరు ఏఐ కంటెంట్గా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కేతన్, సియా మళ్లీ కలిసి మాట్లాడుకుంటున్నట్లు, ప్రేమలో ఉన్నట్లు, అలాగే ప్రియుడితో కలిసి కేతన్ను సియా ఎలా చంపిందోనంటూ వీడియోలు విపరీతంగా ప్రచారం పొందుతున్నాయి. కొంతమంది వాటిని నిజమని కూడా భావిస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది. అదే సమయంలో సియాకు సంబంధించినవంటూ కొన్ని వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.Meet Siya Goyal who is accused of murdering her fiancée businessman Ketan AgarwalLook closer story was posted on 2022She is 20 yo nowIt means she was consuming alcohol at 16 yo even before turning on 18This is women empowerment for feminists pic.twitter.com/FCsfL99RJB— aaru (@buttermasale) June 27, 2026ఈ వీడియోలను చూసిన కేతన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొడుకును కోల్పోయిన బాధ నుంచి బయటపడలేకపోతున్నామని, ఇప్పుడు ఇలాంటి ఏఐ వీడియోలు ప్రతిరోజూ ఆ బాధను మళ్లీ గుర్తు చేస్తున్నాయని వాపోయారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ఫాలోవర్ల కోసం ఒక కుటుంబం విషాదాన్ని వినోదంగా మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఆపండి.. Please Stop అంటూ సోషల్ మీడియా వినియోగదారులకు భావోద్వేగ పిలుపునిచ్చారు.ఈ ఘటనతో ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. మరణించిన వ్యక్తుల పేరుతో నకిలీ వీడియోలు తయారు చేయడం బాధిత కుటుంబాల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సృష్టించిన ఫేక్ కంటెంట్ను నియంత్రించేందుకు సోషల్ మీడియా సంస్థలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వీడియోలను ప్రోత్సహించవద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: కొండపై నుంచి తోసేసింది అతడుకాదు! -
కొండపై నుంచి తోసేసింది సియానే!
పుణే: దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్ స్వయంగా అతడిని కొండపై నుంచి తోసివేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ దారుణం వెనుక సియా చౌదరి ప్రియుడు చేతన్ చౌదరి ప్రోద్బలం ఉన్నట్లు బహిర్గతమయ్యింది. కేతన్ అగర్వాల్ను సాధ్యమైనంత త్వరగా అంతం చేయాలంటూ చేతన్ చౌదరి తన ప్రియురాలు సియా చౌదరిపై పదేపదే ఒత్తిడి చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పూర్తిగా అతడి మైకంలో పడిపోయిన సియా చౌదరి మరో ఆలోచన లేకుండా.. కాబోయే భర్తను చేతులారా చంపేసిందని తెలిపారు. ఇద్దరు నిందితులను ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియుడి ఒత్తిడి వల్లే చేతన్ను లోహగఢ్ కోటకు రప్పించి హత్య చేసినట్లు సియా గోయల్ ఒప్పుకుందని స్పష్టంచేశారు. ఆమె సోదరుడిని కూడా ప్రశ్నిస్తున్నామని అన్నారు. మరోవైపు ఈ కేసులో ఫాస్ట్–ట్రాక్ కోర్టు ట్రయల్ నిర్వహించాలంటూ కేతన్ అగర్వాల్ కుటుంబం డిమాండ్ చేయగా, మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రఖ్యాత లాయర్ ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసుతోపాటు మరికొన్ని ముఖ్యమైన కేసుల్లో ఉజ్వల్ నికమ్ వాదించారు. 20 ఏళ్ల సియా గోయల్, 22 ఏళ్ల చేతన్ చౌదరి గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 18న కేతన్ అగర్వాల్(25)ను పుణే సమీపంలోని లోహగఢ్ కోటలో అంతమొందించిన సంగతి తెలిసిందే. హత్యకు పకడ్బందీగా ప్లాన్ కేతన్ అగర్వాల్ హ త్యకు నిందితులు పకడ్బందీగా ప్లాన్ చేశా రు. ఆధారాలు దొర క్కుండా జాగ్రత్తపడ్డా రు. హత్యకు ముందు, తర్వాత తమ సెల్ఫోన్లలో చాటింగ్ హిస్టరీని పూర్తిగా తొలగించారు. రీసైకిల్ బిన్లను కూడా ఖాళీచేశారు. వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. డిలీట్ చేసిన వివరాలను తిరిగి రప్పిస్తే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని అన్నారు. సియా గోయల్, కేతన్ చౌదరి మధ్య ఫోన్లలో 238 గంటలపాటు సంభాషణ జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. వారిద్దరూ గత ఆరు నెలల వ్యవధిలో 2,004 ఫోన్కాల్స్ చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఓ హోటల్లో కలుసుకున్నారు. మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకున్నారు. కేతన్ బట్టతల నచ్చకనే హత్య! కాబోయే భర్త కేతన్ అగర్వాల్కు బట్టతల ఉండడం, అది కనిపించకుండా విగ్గు లాంటిది ధరించడం తనకు నచ్చలేదని, అందుకు అడ్డు తొలగించుకున్నానని సియా చౌదరి చెబుతున్నట్లు సమాచారం. బట్టతల కారణంగానే కేతన్ హత్యకు గురయ్యాడంటూ ప్రచారం సాగుతోంది. అయితే, ఈ విషయాన్ని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఖండించారు. కేతన్కు బట్టతల ఉందన్న విషయంలో ఎంగేజ్మెంట్కు ముందే సియా గోయల్కు, ఆమె కుటుంబానికి తెలుసని అన్నారు. బట్టతల విషయంలో ఆమె ఏనాడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. తన కుమారుడు నిజంగా నచ్చకపోతే ముందే చెప్పాలి తప్ప ఇలా హత్య చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. కేతన్ హత్యకు అతడి బట్టతల అంశం ఒక్కటే కారణం కాదని పోలీసులు తెలిపారు. -
ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు : సియా, తల్లి షాకింగ్ రియాక్షన్
మహారాష్ట్రలోని లోహగఢ్ కోటలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించిన విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్ కాబోయే భార్య సియాకు ఈ పెళ్లి ఇష్టం లేక ప్రియుడు చేతన్ చౌదరితో తన బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సియా, చేతన్ ఇద్దరిపై హత్య, క్రిమినల్ ప్లానింగ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరూ రిమాండ్లో ఉన్నారు. వీరి విచారణలో భాగంగా కీలక విషయాలను పోలీసులు రాబట్టారు.పెళ్లి రద్దుకు ఒప్పుకోలేదు, పారిపోయినా వదలనన్నాడు : సియా పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే విషయాన్ని కేతన్ అగర్వాల్కు ముందే చెప్పానని సియా విచారణాధికారులకు తెలిపింది. చేతన్ చౌదరితో రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పినట్టు వెల్లడించింది. అయితే ఇపుడు పెళ్లి రద్దు చేసుకుంటే, తమ ఫ్యామిలీ పరువు పోతుంతని చెప్పాడని, ఒకవేళ ఆమె పెళ్లి నుంచి తప్పించుకోవడానికి పారిపోవాలని చూసినా, వదిలిపెట్టేది లేదని కేతన్ బెదిరించాడని సియా క్లెయిమ్ చేసింది.అయితే, సియా చేస్తున్నఈ ఆరోపణలు/వాదనలు ఇంకా కోర్టు, పోలీసుల దర్యాప్తులోనే ఉన్నాయి. వీటిపై న్యాయపరమైన విచారణ జరగాల్సి ఉంది.నేరం రుజువైతే ఆమెను ఉరితీయండి!మరోవైపు తన కూతురి వ్యవహారంపై సియా తల్లి స్పందించారు. తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను హత్య చేసినట్లు రుజువైతే, ఆమెకు కఠినమైన శిక్ష పడాలని కూతురు సియా గోయల్ను ఉరితీయాలని ఒక తల్లిగా నేను ఈ మాట చెబుతున్నా అన్నారు.సియా తండ్రి ప్రవీణ్ గోయల్ కూడా ఇదే విధంగా స్పందించారు. నేరం రుజువైతే, తన కూతురైనా సరే, ఉరి తీయాల్సిందే అన్నారు. ఈ ఘటన తర్వాత జూన్ 23న ప్రవీణ్ గోయల్కు గుండెపోటు రావడంతో ప్రస్తుతం ఆయన పూణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇదీ చదవండి: కేతన్ హత్యలో మరో ట్విస్ట్ : మాట మారుస్తున్న కిలాడీలుజరిగిన కథపూణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ బాబూలాల్ చౌదరి కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టేసి హత్య చేశారు. మొదట దీనిని ట్రెకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.పక్కా ప్లాన్తో హత్యకేఫ్ మీటింగ్: జూన్ 18 ఉదయం పూణేలోని ఒక కేఫ్లో సియా, చేతన్ కలిసి కేతన్ను ఎలా చంపాలో ప్లాన్ చేశారు. కోటలో ఏ ప్రాంతం నుండి నెట్టేయాలో కూడా వారు ముందే చర్చించుకున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు పోలీసులకు లభించాయి. ప్లాన్ ప్రకారం మధ్యాహ్నం సియా, కేతన్ను ట్రెకింగ్ కోసం కోటపైకి తీసుకెళ్లగా, చేతన్ వారిని రహస్యంగా వెంబడించాడు. అనుకూలమైన సమయం చూసి ఇద్దరూ కలిసి కేతన్ను లోయలోకి నెట్టేశారు.గత 6 నుండి 7 నెలల్లో సియా, చేతన్ ల మధ్య 2,004 సార్లు ఫోన్ కాల్స్ జరిగాయి. వారు దాదాపు 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు, కొన్ని కాల్స్ 2-3 గంటల పాటు సాగినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ 2025 దీపావళి పార్టీలో మొదటిసారి కలుసుకున్నారు.రూ. 17 కోట్ల ప్యాలెస్, ప్రైవేట్ జెట్స్కేతన్ అగర్వాల్ తమ కుటుంబానికి చెందిన 'సక్సెస్ గ్రూప్' రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్ మరియు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేసేవాడు. సియా గోయల్ కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు 35ఏళ్లుగా సంబంధాలున్న ఇరు కుటుంబాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరికి నిశ్చితార్థం జరిపించారు. నవంబర్లో రాజస్థాన్లోని ఉదయపూర్లో ఒక ప్యాలెస్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరగాల్సి ఉంది. సియా, కేతన్లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో వీరి వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేశాయి. వివాహం కోసం జైపూర్లోని ప్యాలెస్ను రూ. 17 కోట్లకు బుక్ చేశారు. పెళ్లికి వచ్చే అతిథులను తీసుకురావడం కోసం ప్రత్యేకంగా రెండు ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతలోనే కేతన్ హత్యోదంతం ఇరు కుటుంబాల్లో తీవ్ర అలజడి రేపింది. -
కేతన్ హత్యలో మరో ట్విస్ట్ : మాట మారుస్తున్న కిలాడీలు
పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ మృతి చెందిన ఘటనలో అరెస్ట్ అయిన కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి ఎవరో తెలియకుండా, ఇద్దరూ తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు.పోలీసుల సమాచారం ప్రకారం నిందితులిద్దరూ 'బ్లేమ్ గేమ్' ఆడుతున్నారు. సియా, చేతన్ ఇద్దరూ పక్కా ప్లాన్ ప్రకారం కేతన్ను నిర్దాక్షిణ్యంగా హత్య చేసి, ఇపుడు నేరాన్ని ఒకరిపై ఒకరు నెట్టేస్తున్నారు. తాను సియాతో కలిసి పారిపోవాలనుకున్నాను. కానీ కేతన్ను చంపమని సియానే ఒత్తిడి తెచ్చిందని చేతన్ మాట మారుస్తు న్నాడు. అటు సియా కూడా ఏం తక్కువ తినలేదు. అసలు ఈ హత్య ప్లాన్ అంతా చేతన్దే. జూన్ 14న జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు చేతన్ బోరున ఏడ్చాడు అంటూ సియా కొత్త నాటకానికి తీరతీసినట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు!అయితే పోలీసులు మాత్రం వారి ఎత్తులను సరిగ్గానే అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా బ్లేమ్ గేమ్ అనీ, వారి డిఫెన్స్ స్ట్రాటజీ (రక్షణ వ్యూహం) అని, కేతన్ను అంతం చేయాలనే కుట్రలో ఇద్దరూ సమానంగా భాగస్వాములని భావిస్తున్నారు.Pune - Chilling details have emerged in the sensational Lohagad Fort murder case, revealing that the conspiracy to kill 26-year-old Ketan Agarwal was allegedly finalised at a prominent cafe in Pune’s Kondhwa area. According to police investigations, accused Siya Goyal and her… pic.twitter.com/o4vBQVEDhB— NextMinute News (@nextminutenews7) June 25, 2026ఈ హత్యలో దర్యాప్తులో కీలకాంశాలను పోలీసులు సేకరించారు. తద్వారా వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని, కుట్రను తేట తెల్లం చేస్తున్నారు. మే 31 నుండి జూన్ 4 మధ్య పుణేలోని ఒక కేఫ్లో వీరిద్దరూ సమావేశమైనట్లు పోలీసులకు తెలిసింది. ఈ భేటీలోనే హత్యకు సంబంధించిన ప్లాన్ సిద్ధం చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కెఫేలో వారు కలుసుకున్న వీడియో కూడా వెలుగులోకివచ్చింది.సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ రికార్డులు, వారి మధ్య జరిగిన సంభాషణలు ఈ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ధృవీకరిస్తున్నాయి. జూన్ 14న కూడా కేతన్ను చంపడానికి ప్రయత్నించి వారు విఫలమయ్యారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరూ పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కుట్రలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు -
కుట్ర లవర్స్దే.. మరి తోసిందెవరు?
పెళ్లికి పెద్దల అంగీకారం.. ఒకరికొకరు ప్రేమలో మునిగి తేలడం.. బయటకు కనిపించిన కథ ఇదే. కానీ ఆ నవ్వుల వెనుక ఓ చీకటి కుట్ర నడిచింది. రహస్య ప్రేమ, కేఫ్లలో జరిగిన గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు, వేల ఫోన్ కాల్స్, వరుస విఫల హత్యాయత్నాలు... చివరకు లోహగడ్ కోట అంచున ఓ యువ వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. పుణేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కుట్ర వెనుక ఉన్న దాదాపు అన్ని కోణాలను పోలీసులు ఛేదించారు. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తొలుత కనిపించిన దృశ్యం ఒక సాధారణ ప్రమాదం. ట్రెక్కింగ్కు వెళ్లిన యువకుడు లోయలో పడి మృతి చెందాడు. కాబోయే భార్య కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కూడా ప్రమాద మరణంగానే కేసు నమోదు చేశారు. కానీ ఆ కథలో ఏదో తేడా ఉందనే అనుమానం మొదట కేతన్ కుటుంబ సభ్యులకే వచ్చింది. ముఖ్యంగా కేతన్ సోదరి సంజనా అడిగిన కొన్ని ప్రశ్నలకు.. నిందితురాలు సియా గోయల్ ఇచ్చిన సమాధానాలు దర్యాప్తును పూర్తిగా కొత్త దిశలోకి మళ్లించాయి. అక్కడి నుంచే ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు.. ప్రేమ, మోసం, కుట్ర, హత్యతో కూడిన భయంకర కథను వెలుగులోకి తీసుకొచ్చాయి.జూన్ 18న లోహగడ్ కోట వద్ద ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ సమయంలో జరిగిన ఘటన తర్వాత కేతన్ మృతదేహాన్ని వెలికితీశారు. తొలుత ప్రమాద మరణంగా కేసు నమోదైంది. అయితే అంత్యక్రియలు పూర్తైన నాలుగు రోజుల తర్వాత కేతన్ సోదరి సంజనా సియాకు ఫోన్ చేసింది. ఇంటికి రమ్మంటూ పిలిచింది. సోదరుడి గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. అలా.. అసలు ఆ రోజు ఏం జరిగిందని ప్రశ్నించింది. సియా చెప్పిన వివరాల్లో తేడాలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు మళ్లీ మొదలైంది.విచారణలో బయటపడిన అంశాలు ఒక్కొక్కటిగా సియాపై అనుమానాలను పెంచాయి. కేతన్ మరణానికి ముందు ఆమె పలుమార్లు లోహగడ్కు రావాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 31న మొదటిసారి అక్కడికి తీసుకెళ్లింది. ఆ తర్వాత జూన్ 4న కూడా వెళ్లాలని పట్టుబట్టిందని, కానీ కేతన్ తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో అది జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మే 31న ప్రదేశాన్ని ముందుగా పరిశీలించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జూన్ 14న మరోసారి ఇద్దరూ లోహగడ్కు వెళ్లారు. అక్కడే మొదటి హత్యాయత్నం జరిగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. లోయ అంచు వద్ద కేతన్ను నెట్టినప్పుడు అతడు పొదలను పట్టుకుని బయటపడ్డాడని, వెంటనే సియా పాము కనిపించిందంటూ నాటకం ఆడి పరిస్థితిని చక్కబెట్టిందని పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో అది ప్రమాదంగా కనిపించినా.. ఇప్పుడు అదే ఘటన హత్యా కుట్రలో భాగమని భావిస్తున్నారు.ఇదిలా ఉండగా, పెళ్లికి ముందు బాలి ట్రిప్ కూడా కేసులో కీలక అంశంగా మారింది. ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం కేతన్, సియా ఇండోనేషియా వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణానికి ముందు కేతన్ పాస్పోర్ట్ కనిపించకుండా పోయింది. దీంతో ట్రిప్ రద్దయింది. ఈ ఘటన వెనుక కూడా సియా పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేతన్ను బాలి వెళ్లకముందే హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పాస్పోర్ట్ను మాయం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.దర్యాప్తులో మరో కీలక మలుపు సీసీటీవీ ఫుటేజీలతో వచ్చింది. టికెట్ కౌంటర్ వద్ద కేతన్, సియా నడుచుకుంటూ వెళ్తుండగా.. కొంత దూరంలో హుడీ ధరించిన ఓ వ్యక్తి వారిని వెంబడిస్తున్న దృశ్యాలు కనిపించాయి. 33 డిగ్రీల ఉష్ణోగ్రత.. అంతా వేడిలోనూ కూడా ముఖం కనిపించకుండా హుడీ, హెడ్సెట్తో తిరగడం పోలీసులకు అనుమానం కలిగించింది. తర్వాత అతడే చేతన్ చౌదరి అని గుర్తించారు.చేతన్ తన మొబైల్ను ఇంట్లో వదిలేసి, ఒక ఉద్యోగి ఫోన్తో ప్రయాణించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. లోకేషన్ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవడానికే ఈ ప్లాన్ వేసినట్లు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా ఫొటోలు, డిజిటల్ ఆధారాలను సరిపోల్చిన తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని కాల్ రికార్డులు మరింత బలపరిచాయి. జనవరి 1 నుంచి జూన్ 18 వరకు సియా, చేతన్ల మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గంటల తరబడి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వ్యాపార పరిచయంతో మొదలైన సాన్నిహిత్యం ప్రేమగా మారిందని, కేతన్తో పెళ్లి విషయంలో సియా ఆసక్తి చూపకపోవడానికి ఇదే కారణమని దర్యాప్తులో తేలింది.పోలీసుల కథనం ప్రకారం.. సియా, చేతన్లు గత ఏడాది దీపావళి వేడుకల్లో పరిచయమయ్యారు. ఆ తర్వాత తరచూ కేఫ్లలో కలుస్తూ హత్యా ప్రణాళికను రచించినట్లు అనుమానిస్తున్నారు. సియా పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేదని, కుటుంబ ఒత్తిడితో సంబంధాన్ని కొనసాగించిందని విచారణలో వెల్లడైంది. అయితే చేతన్తో పారిపోవడానికి కూడా ఆమె ఇష్టపడలేదని చెబుతున్నారు. నిశ్చితార్థం రద్దు చేసి ప్రేమికుడితో వెళ్లిపోతే కుటుంబ పరువు పోతుందని భావించిందని చేతన్ విచారణలో చెప్పినట్లు సమాచారం.కేతన్, సియా వివాహం నవంబర్లో ఉదయ్పూర్లో జరగాల్సి ఉంది. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ జూన్ 18న జరిగిన ట్రెక్కింగ్ ప్రయాణమే కేతన్ జీవితానికి చివరి ప్రయాణమైంది.పోలీసుల ప్రకారం, ఘటన రోజున చేతన్ ముందుగానే లోహగడ్కు చేరుకుని అక్కడ మాటు వేసి ఉన్నాడు. తర్వాత సియా, కేతన్లను అనుసరిస్తూ ఏకాంత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి కేతన్ను సుమారు 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టే ప్లాన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆపై సియా కేకలు వేస్తూ భద్రతా సిబ్బందిని పిలిచి, అది ప్రమాదంలా కనిపించేలా ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదు చేశారు.ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. చేతన్ స్నేహితుడు నీరజ్ను కూడా అదుపులోకి తీసుకుని అతడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, ఘటనాస్థల పరిశీలన కొనసాగుతోంది.అయితే ఈ కేసులో ఇప్పటికీ ఒక ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కేతన్ను చంపాలన్న కుట్ర ఇద్దరిదేనని పోలీసులు చెబుతున్నారు. కానీ చివరి క్షణంలో లోయ అంచున నిలబడ్డ కేతన్కు నెట్టేసి చంపింది ఎవరు?.. పక్కనే నడుస్తున్న సియానా?.. లేక మాటు వేసి ఎదురుచూస్తున్న చేతనా?.. లేదంటే ఇద్దరూనా?. వీళ్లకు సహకరించిన నీరజా? ఈ విషయంలో నిందితుల నుంచి మౌనమే పోలీసులకు ఎదురవుతోంది. అదే సమయంలో.. వాళ్ల తల్లిదండ్రులు ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. దర్యాప్తు మొత్తం ఇప్పుడు ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగి.. ఆ సమాధానం బయటపడే వరకు ఈ కేసు అతిపెద్ద మిస్టరీ అలాగే కొనసాగనుంది. -
ఫైవ్ స్టార్ హోటల్లో 70 రూములు బుకింగ్!
పుణే: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే కోడలు సియా గోయల్ పుట్టినరోజును ఘనంగా జరపాలని అగర్వాల్ కుటుంబ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, అదే సమయంలో ఆమె మాత్రం కాబోయే భర్తను హత్య చేయడానికి పథకం రచించినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ (Vishal Agarwal), జూన్ 20న సియా గోయల్ పుట్టినరోజును మహారాష్ట్రలోని ప్రముఖ హిల్స్టేషన్ మహాబలేశ్వర్లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఏకంగా 70 గదులను బుక్ చేశారు. రెండు కుటుంబాలు కలిసి వేడుకలు జరుపుకోవాలని భావించాయి. అయితే సియా, ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కేతన్ను ఒప్పించి, పుణే సమీపంలోని లోహగడ్ కోటకు ఇద్దరూ మాత్రమే వెళ్లేలా ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో తేలింది.నిశ్చితార్థం తర్వాత హత్యప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన కేతన్ అగర్వాల్, సియా గోయల్ (Siya Goyal) నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. నవంబరులో ఘన వివాహం జరగాల్సి ఉంది. అయితే జూన్ 18న లోహగడ్ కోట వద్ద ట్రెక్కింగ్ సందర్భంగా కేతన్ లోయలో పడి మరణించాడు. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించారు. సియా కూడా అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ పోలీసుల దర్యాప్తులో ఇది ముందుగానే పన్నిన హత్యగా బయటపడింది.చదవండి: హుడీతో దొరికిపోయారు ఇద్దరు!ప్రేమికుడితో కలిసి కుట్రవిచారణలో సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌధరి (22) కలిసి కేతన్ను చంపినట్టు తేలింది. నేరానికి కొన్ని రోజుల ముందు ఒక కేఫేలో సమావేశమై హత్య ప్రణాళికను ఖరారు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, సియా, చేతన్ను (Chetan Chaudhary) అరెస్ట్ చేసి హత్య, నేరపూరిత కుట్ర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. లోనావాల రూరల్ పోలీసు స్టేషన్లో వీరిని విచారిస్తున్నారు. Pune trekker's death case: Accused Siya Goyal, her lover Chetan Chaudhary taken to Lonavala Rural Police Station. pic.twitter.com/RVRZU8n5sG— News Arena India (@NewsArenaIndia) June 24, 2026 -
కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!
మహారాష్ట్రలోని లోహగఢ్ కోట సమీపంలో జరిగిన కేతన్ అగర్వాల్ (26) మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన.. అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పన్నిన క్రూరమైన హత్య కుట్రగా తేలడం అందర్నీ షాక్కు గురిచేసింది.తన కాబోయే భార్య సియాను ఎంతగానో ప్రేమించిన కేతన్ ఆమె పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆమెతో ఏడు అడుగులు వేయాలని కలలు కంటున్న తరుణంలో జూన్ 18న సియా చేతిలో హత్యకు గురయ్యాడు. మొదట అతడు కాలు జారి పడిపోయాడని అందరూ భావించారు.సోదరి అనుమానంతో గుట్టు రట్టుకానీ, కేతన్ అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా వారి కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చినపుడు అనుమానం మొదటైంది. ఆ సమయంలో ఆమె చెప్పిన వివరాలలో తేడాలు ఉండటాన్ని కేతన్ సోదరి గమనించింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు సియా ఫోన్ రికార్డులను పరిశీలించడంతో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.6 నెలల్లో 2004 కాల్స్సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి గత ఆరు నెలల్లో ఏకంగా 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. మొత్తం 238 గంటలకు పైగా ఫోన్ కాల్స్లో గడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కాల్ డేటానే ఈ హత్య కుట్రను ఛేదించడానికి కీలక ఆధారంగా మారింది.పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంఘటన జరిగిన రోజు చేతన్ చౌదరి తన లొకేషన్ దొరకకూడదని చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:40 గంటల వరకు తన ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ను ఆపివేశాడు. తన మొబైల్ ఫోన్ను ఎవరూ ట్రాక్ చేయకుండా తన దుకాణంలోనే వదిలేశాడు.ఇదీ చదవండి : ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్లోహగఢ్ కోటకు వెళ్లేటప్పుడు తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి మొబైల్ ఫోన్ను తీసుకు వెళ్లాడు. అయితే, పోలీసులు డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ/సర్వైలెన్స్ డేటా ద్వారా అతడు అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరినీ కోర్టు జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.మండుటెండలో హుడీసీసీటీవీ ఫుటేజ్ ప్రకారం 33 డిగ్రీల సెల్సియస్ మండుటెండలో ట్రెకింగ్ చేస్తుండగా హుడీ ధరించిన వ్యక్తి అనుమానాస్పద కదలికలు,ఇంత ఎండలో హైకింగ్కు వెళ్లేటప్పుడు ఎవరైనా హుడీ ఎందుకు ధరిస్తారనే అనుమానమే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. పోలీసుల కథనం ప్రకారం, కోట వద్ద కేతన్, అతని కాబోయే భార్య సియా కలిసి నడుస్తుండగా సీసీటీవీలో కనిపించింది. సియా ప్రియుడైన చేతన్ చౌదరిగా గుర్తించబడిన మరో వ్యక్తి, వారికి సుమారు 20 నుండి 30 అడుగుల దగ్గర నుండి వారిని ఫాలో అయ్యాడు. అతను షార్ట్స్, ముఖాన్ని కప్పివేసే హుడీ ధరించి కనిపించాడు. హుడీపై హెడ్సెట్ కూడా పెట్టుకున్నాడు.మరో సీసీటీవీ ఫుటేజ్లో, సియా అకస్మాత్తుగా హుడీ ధరించిన వ్యక్తి వైపు వెనక్కి తిరిగి చూసి, వెంటనే కూర్చుండిపోయింది. సియా, చేతన్ల మధ్య బలమైన సంబంధం ఉందని, పక్కా ప్రణాళికతో పన్నిన కుట్ర అని కూడా టెక్నికల్ డేటా ద్వారా తేలింది.ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్అపుడే తోసేసింది..కానీ కేతన్, సియాలు మే 31, జూన్ 14 , జూన్ 18 తేదీలలో మూడుసార్లు లోహగడ్ కోటకు ట్రెక్కింగ్కు వెళ్లినట్టు తెలుస్తోంది. కేతన్ హత్యకు కొన్ని రోజుల ముందు, అంటే గత నెలలో, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం కేతన్, సియా బాలికి వెళ్లాల్సి ఉంది. అయితే, ముంబై విమానాశ్రయంలో తన పాస్పోర్ట్ కనిపించడంలేదని డ్రామా ఆడింది. సియా కావాలనే పాస్పోర్ట్ను దాచిపెట్టి ఆ ప్రయాణాన్ని అడ్డుకుందని బాధితుడి తండ్రి ఆరోపించారు.ఆ తర్వాత లోహగడ్ కోటకు వెళ్ళినప్పుడు, జూన్ 14న సియా కేతన్ను హత్యకు తొలిసారి ప్రయత్నించి విఫలమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొండపై నెంచి అతణ్ని నెట్టేసింది. అయితే అతను కొండ అంచున ఉన్న పొదను పట్టుకుని ప్రాణాలు కాపాడుకో గలిగాడు. తన చర్యను కప్పిపుచ్చుకోవడానికి, పాము కనిపించిందని అరుస్తూ అందరి దృష్టి మళ్లించి, ఆపై అతన్ని వాటేసుకుని బావురుమంటూ నాటకం ఆడింది. అలా తొలి ప్రయత్నం విఫలం కావడంతో ఈసారి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసి కేతన్ను మట్టుబెట్టారు. అంతేకాదు ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే, 'ప్లాన్ సి' (మూడో ప్లాన్) కూడా సిద్ధం చేసుకున్నారట.మరోవైపు,చేతన్ తరపు న్యాయవాది రామ్ షహానే ఈ ఆరోపణలను ఖండించారు. ఎఫ్ఐఆర్లో చేతన్కు ఈ మరణంతో సంబంధం ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేవని, ఘటన జరిగిన సమయంలో అతడు లోహగఢ్ ప్రాంతంలో ఉన్నట్లు ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదా పత్రాలను పోలీసులు చూపించలేదని వాదించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో మరిన్ని డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. సియా ఒక బేకరీని నడుపుతుండగా, చేతన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడు.ఇదీ చదవండి: ముగ్గురికి గుడ్బై : వ్యాపారవేత్తతో 62 ఏళ్ల మోడల్ ఎంగేజ్మెంట్కాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖవ్యాపారవేత్త కుమారుడైన కేతన్, సియాల నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలోజరిగింది. ప్రైవేట్ జెట్లు, రాజభవనాల వేదికగా ఈ ఏడాది నవంబర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు కేతన్. కానీ అనూహ్యంగా అనంత లోకాలకు చేరడం విషాదం. -
'లోహగడ్ కోట' కేసులో.. కొత్త కోణం!
మండు వేసవిలో ఉక్కపోస్తుండగా ఎవరైనా హుడీ ధరిస్తారా? ఇదే అనుమానం పుణే పోలీసులకు వచ్చింది. వెంటనే ఈ దిశగా దర్యాప్తు సాగించడంతో అసలు నిజం బయటపడింది. అప్పటి వరకు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పరిగణించబడిన కేసు కొత్త మలుపు తిరిగింది. పథకం ప్రకారం హత్య చేశారని వెల్లడైంది.పుణే: మహారాష్ట్రలో సంచలనం రేపిన పుణే వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 18న లోహగడ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడిపోయి విశాల్ చనిపోయాడు. తనను ఫొటోలు తీస్తూ ప్రమాదవశాత్తు అతడు లోయలో పడిపోయాడని అతడికి కాబోయే భార్య సియా గోయల్ (Siya Goyal).. లూనావాలా రూరల్ పోలీసులకు చెప్పింది. అయితే ప్రియుడితో కలిసి విశాల్ను ఆమె లోయలోకి తోసేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.ఎలా కనిపెట్టారంటే.. ?కాబోయే భార్య సియా గోయల్తో కలిసి కేతన్ అగర్వాల్ (Ketan Agarwal).. ఈనెల 18న చారిత్రక లోహగడ్ కోటకు వెళ్లాడు. వీరిని కొంత దూరం నుంచి ఓ వ్యక్తి వ్యక్తి అనుసరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి షార్ట్, ముఖాన్ని పూర్తిగా కప్పే హుడీ ధరించి.. తలకు హెడ్సెట్ పెట్టుకున్నాడు. ఆ రోజు ఉష్ణోగ్రత సుమారు 33 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఇలాంటి ఉక్కపోత వాతావరణంలో అతడు హుడీ ఎందుకు ధరించాడనే సందేహం పోలీసులకు వచ్చింది. వెంటనే ఈ దిశగా దర్యాప్తు సాగించారు. మరో వీడియోలో సియా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా, వెంటనే హుడీ ధరించిన వ్యక్తి కూర్చోవడం కనిపించింది. దీంతో అనుమానం బలపడింది.మరోవైపు కేతన్ మరణించిన తర్వాత కూడా సియా ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోవడాన్ని పోలీసులు గమనించారు. పెళ్లి ఇష్టం లేనట్టుగా సియా గోయల్ కనిపించిందని కేతన్ మామ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. పెళ్లిని ఏడాది పాటు వాయిదా వేయవచ్చా అని ఒకసారి తనను అడిగిన విషయాన్ని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కుట్ర కోణంలో దర్యాప్తు మొదలుపెట్టడంతో అసలు నిజం బయటకు వచ్చింది. ప్రియుడు చేతన్ చౌధరి (Chetan Choudhary)తో కలిసి సియా గోయల్ తనకు కాబోయే భర్తను హత్య చేసిందని నిర్ధారణయింది.2,004 ఫోన్ కాల్స్ !సాంకేతిక ఆధారాలతో సియా, చేతన్ మధ్య సన్నిహిత సంబంధాలు బయటపడ్డాయి. చేతన్ సోషల్ మీడియా ఫోటోలను సీసీటీవీ దృశ్యాలతో పోల్చి చూడగా, ఫుటేజ్లో కనిపించిన వ్యక్తి అతడేనని పోలీసులు నిర్ధారించారు. ఇక గత ఏడు నెలల్లో సియా, చేతన్ మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు, వాటి మొత్తం వ్యవధి 238 గంటలకుపైగా ఉన్నట్లు విచారణలో తేలింది. గతేడాది నవంబరు నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు తెలిసింది. సియా బేకరీ వ్యాపారం నిర్వహిస్తుండగా, చేతన్ డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి కేతన్తో పెళ్లికి సియా ఒప్పుకుందని సమాచారం. మొదటి హత్యాయత్నం విఫలం!కేతన్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సియా, చేతన్తో కలిసి అతడిని హత్య చేయాలని కుట్ర చేసింది. ఇందులో భాగంగా కేతన్ను సియా.. ఫొటో షూట్ పేరుతో లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడికి వచ్చిన చేతన్తో కలిసి కేతన్ను లోయలోకి తోసేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొదటి హత్యాయత్నం విఫలమైందని వెల్లడించారు. జూన్ 14న కూడా లోహగడ్ కోట వద్ద సియా కేతన్ను లోయలోకి నెట్టేసి చంపేందుకు ప్రయత్నించింది. అయితే అతడు పక్కనే ఉన్న పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి అనుమానం రాకుండా ఉండేందుకు కట్టుకథ అల్లింది. పాము కనిపించడంతో భయంతో అతడి మీద పడ్డానని చెప్పడంతో కేతన్ నమ్మేశాడు.చదవండి: బంధం ముగిస్తే సరిపోదా.. బలి ఎందుకు?ప్లాన్- సీ కూడా సిద్ధం!మొదటి ప్రయత్నం విఫలం కావడంతో జూన్ 18న మళ్లీ పథకం అమలు చేసి కేతన్ను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రయత్నం కూడా విఫలమైతే అమలు చేసేందుకు మరో ప్రత్యామ్నాయ ప్రణాళికను ("ప్లాన్-సీ") సిద్ధం చేసుకున్నట్లు కేసు పత్రాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌధరిలను హత్య, నేరపూరిత కుట్ర కేసుల్లో అరెస్టు చేసిన పోలీసులు వారిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
బంధం ముగిస్తే సరిపోదా?.. బలి ఎందుకు?
ఒకప్పుడు ప్రేమ విఫలమైతే దూరమయ్యేవారు. పెళ్లి బంధం సరిగా సాగకపోతే విడాకులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా?. ప్రేమించిన వారినే హత్య చేయడం, జీవిత భాగస్వామిని అంతమొందించడం, సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రాణాలు తీయడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు బంధాలు ‘బ్రేక్’ అవ్వడం కాకుండా ఎందుకు బలైపోతున్నాయి?. కాస్త లోతుల్లోకి వెళ్తే..మేఘాలయ హనీమూన్ కేసునే పరిశీలిద్దాం. ఇండోర్కు చెందిన జంట.. హనీమూన్కు వెళ్లింది. దంపతులు మిస్ కావడం.. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు.. భర్త చనిపోవం.. భార్య దీనావస్థలో రోడ్డు మీద కనిపించడం.. చివరకు భార్య&ప్రియుడి చేతిలోనే హత్యకు గురవడం తీవ్ర సంచలనం రేపింది. మరోవైపు ఇటు తెలంగాణలో సంచలనం సృష్టించిన సర్వేయర్ హత్య కేసులోనూ వివాహేతర సంబంధాల కోణం ప్రధానంగా చర్చకు వచ్చింది. అటు.. ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన మీరట్ "బ్లూ డ్రం" కేసులో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను హత్య చేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా పుణెలో పెళ్లికి సిద్ధమవుతున్న కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. అది హత్య అని తేలడం సంచలనం సృష్టించింది. ఫొటోషూట్ పేరుతో ఓ కోటకు తీసుకెళ్లి కాబోయే వధువు, ఆమె ప్రియుడే అతన్ని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.These are Ketan Agarwal and Siya Goel. They were engaged and supposed to get married this year. Look how happy, in love, and comfortable they are with each other.They must have dreamed of a great future together, but cruel fate had other ideas. On June 18, Siya's birthday,… pic.twitter.com/4Av4OQvXuc— THE SKIN DOCTOR (@theskindoctor13) June 23, 2026ఈ ఘటనల్లో పరిస్థితులు, వ్యక్తులు, ప్రాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఒక ఉమ్మడి అంశం కనిపిస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదే.. సంబంధాన్ని ముగించడం కంటే వ్యక్తినే శాశ్వతంగా తొలగించాలనే ప్రమాదకర ఆలోచన.మనస్తత్వ నిపుణుల ప్రకారం.. నేటి కాలంలో కొందరు ప్రేమను పరస్పర గౌరవంతో కూడిన బంధంగా కాకుండా, స్వాధీన భావంతో చూస్తున్నారు. నువ్వు నాకే చెందాలి.. లేదంటే ఎవరికీ దక్కకూడదు అనే ఆలోచన తీవ్ర స్థాయికి చేరినప్పుడు హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.అలాగే, తిరస్కరణను అంగీకరించలేకపోవడం కూడా కీలక కారణమని నిపుణులు చెబుతున్నారు. సంబంధం కొనసాగకపోతే విడిపోవడం, చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడం వంటి మార్గాలు ఉన్నప్పటికీ, కొందరు వాటిని పరాజయంగా భావిస్తున్నారని అంటున్నారు. పరువు పోతుందనే భయం, ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతామనే ఆందోళన, కుటుంబమో.. సమాజమో ఏమనుకుంటుందో అనే ఒత్తిడి కొందరిని తీవ్ర నిర్ణయాల వైపు నెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు.మరోవైపు సోషల్ మీడియా ప్రభావం కూడా సంబంధాలపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ రిలేషన్షిప్ చిత్రాలతో తమ బంధాలను పోల్చుకోవడం, చిన్న చిన్న విభేదాలను కూడా పెద్ద సమస్యలుగా భావించడం వల్ల అసహనం పెరుగుతోందని చెబుతున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం, కోపాన్ని ఆరోగ్యకరంగా వ్యక్తం చేయలేకపోవడం, కౌన్సెలింగ్ తీసుకోవడంపై ఇప్పటికీ ఉన్న అపోహలు కూడా సమస్యను మరింత తీవ్రమం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. అయితే సంభాషణ, కుటుంబ సభ్యుల సహకారం, అవసరమైతే కౌన్సెలింగ్ ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. బంధం కొనసాగించడం సాధ్యం కాకపోతే విడిపోవడం కూడా ఒక మార్గమే. కానీ ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రేమ అనేది స్వాధీనం కాదు, బాధ్యత. బంధం అనేది నియంత్రణ కాదు, పరస్పర గౌరవం. ఆ గౌరవం, నమ్మకం కోల్పోయినప్పుడు బంధాలు బలహీనపడతాయి. కానీ ఏ పరిస్థితుల్లోనూ ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు మరొకరికి లేదన్న విషయాన్ని సమాజం మరచిపోకూడదు.::వెబ్ ప్రత్యేకం -
ఫొటోల వంకతో కాబోయే భర్తను లోయలోకి తోసేసిందా..?
ముంబై: పుణె వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని కావాలనే లోయపై నుంచి తోసి వేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్య 'సియా గోయల్', ఆమె స్నేహితుడు 'సుధాన్షు చౌదరి'లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల నిర్ధారణతో వెలుగుచూసిన అంశాలతో అంతా షాకింగ్ గురయ్యారు.ఏం జరిగిందిపుణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్ 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాము ట్రెక్కింగ్కు వచ్చామని, కేతన్ తనను ఫొటోలు తీస్తుండగా హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని కేతన్ కాబోయే భార్య పోలీసులకు తెలిపింది. దాంతో ప్రమాదంగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.అయితే విచారణ సందర్భంగా కేతన్ కాబోయే భార్య పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. హత్య కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతడిది హత్య అని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ కేసులో కేతన్ కాబోయే భార్యను, ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు విచారణ చేపట్టారు.పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్.. తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. ఇటీవలే అతడికి వివాహం నిశ్చయమైంది. నవంబర్లో జరిగే పెళ్లి వేడుక కోసం ఉదయ్పుర్లోని ఖరీదైన ప్యాలెస్ను కూడా బుక్ చేశారు. జూన్ 19న కాబోయే భార్య పుట్టినరోజు ఉండటంతో ఆ వేడుకల కోసం కేతన్ కొంతమంది మిత్రులతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లారు. అక్కడే ఈ విషాద ఘటన జరిగింది.అంగరంగ వైభవంగా వివాహ వేడుక వివాహం ఈ నవంబర్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరగాల్సి ఉంది. దీని కోసం ఇరు కుటుంబాలు జైపూర్లో రూ.17 కోట్ల వ్యయంతో ఒక ప్యాలెస్ను బుక్ చేశారు. అంతేకాకుండా అతిథుల కోసం రెండు ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేశారని మృతుడి బంధువులు తెలిపారు. ఆ సమయంలో ఇలాంటి ఘటన జరగడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు.


