breaking news
Alyssa Healy
-
World Cup 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఈజ్ బ్యాక్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ అలిస్సా హీలీ తిరిగి టీమ్లోకి వచ్చింది. దీంతో ఈ మెగా టోర్నీలో ఆసీస్ జట్టుకు హీలీ నాయకత్వం వహించనుంది.ఇది ఆమెకు మూడో వన్డే ప్రపంచకప్ కావడం గమనార్హం. ఇక ఈ జట్టులో ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, యాష్ గార్డ్నర్, తహ్లియా మెక్గ్రాత్, మేగాన్ షుట్, వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అదేవిధంగా స్టార్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. దీంతో ఆసీస్ స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది.స్పిన్ యూనిట్లో మోలినెక్స్తో పాటు అలానా కింగ్, జార్జియా వేర్హామ్ కూడా ఉన్నారు. మరోవైపు యువ ఆటగాళ్లు జార్జియా వోల్, ఫోబ్ లిచ్ఫీల్డ్, వేర్హామ్, కిమ్ గార్త్ వంటి యువ ప్లేయర్లు తొలిసారి వన్డే ప్రపంచకప్లో ఆడనున్నారు.అయితే ఈ ప్రధాన టోర్నీకి ముందు భారత మహిళల జట్టుతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో కూడా ప్రపంచకప్కు ఎంపికైన ఆసీస్ జట్టే భాగం కానుంది. అదనంగా వికెట్ కీపర్ నికోల్ ఫాల్టమ్, ఆల్ రౌండర్ చార్లీ నాట్ భారత్తో సిరీస్లో ఆడనున్నారు.ఈ సిరీస్ ముగిశాక వీరిద్దరూ తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. ఆసీస్ తమ వరల్డ్కప్ ప్రయణాన్ని ఆక్టోబర్ 1న న్యూజిలాండ్ మ్యాచ్తో ఆరంభించనుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే రికార్డు స్దాయిలో ఏడు సార్లు ప్రపంచ కప్ విజేతగా ఆసీస్ నిలిచింది.వరల్డ్కప్కు ఆసీస్ జట్టుఅలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్ఫీల్డ్, సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.చదవండి: Asia Cup 2025: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్లుగా బాబర్ ఆజం, జైశ్వాల్ -
‘స్పిన్ సవాలు ఎదుర్కోవాల్సిందే’
బ్రిస్బేన్: భారత్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్లో స్పిన్ సవాలు ఎదురవడం ఖాయమని ఆ్రస్టేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ పేర్కొంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఏడుసార్లు వరల్డ్కప్ టైటిల్ గెలుచుకున్న ఆ్రస్టేలియా జట్టు ఎనిమిదోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. 2022లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన వరల్డ్కప్లో ఆసీస్ ఘనవిజయం సాధించగా... డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అదే తీవ్రత కొనసాగించాలని భావిస్తున్నట్లు హీలీ వెల్లడించింది. భారత మహిళల ‘ఎ’ జట్టుతో మూడో వన్డేలో హీలీ అజేయ శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం హీలీ మాట్లాడుతూ... భారత్, శ్రీలంక వేదికగా వచ్చే నెలలో ప్రారంభంకానున్న వరల్డ్కప్లో స్పిన్ కీలక పాత్ర పోషించనుందని వెల్లడించింది. ‘భారత్ ‘ఎ’ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వరల్డ్కప్లో మాకు మరింత స్పిన్ సవాలు ఎదురుకానుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడం కీలకం’ అని హీలీ పేర్కొంది. ఆ్రస్టేలియా ‘ఎ’తో వన్డే సిరీస్లో భారత ‘ఎ’ జట్టు తరఫున రాధ యాదవ్, మిన్ను మణి, తనూజ కన్వర్, ప్రేమ రావత్ స్పిన్ బాధ్యతలు నిర్వర్తించారు. మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన హీలీ... రెండో వన్డేలో 91 పరుగులతో సెంచరీ చేజార్చుకుంది. ఇక ఆదివారం జరిగిన సిరీస్ చివరి వన్డేలో 85 బంతుల్లోనే 23 ఫోర్లు, 3 సిక్స్లతో అజేయంగా 137 పరుగులు చేసి ఫామ్ చాటుకుంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు హీలీ సత్తాచాటడం ఆ్రస్టేలియా జట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆసీస్ మహిళల ‘ఎ’ జట్టు కోచ్ డాన్ మార్‡్ష అన్నాడు. ‘భారత్లో వన్డే ప్రపంచకప్ వంటి మెగాటోర్నీకి ముందు అలీసాకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దక్కింది. భారత ‘ఎ’ జట్టుతో టి20, వన్డే సిరీస్లతో హీలీ చక్కటి ప్రదర్శన కనబర్చింది. చివరి వన్డేలో సాధించిన అజేయ శతకం మెగా టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది’ అని మార్‡్ష పేర్కొన్నాడు. -
అలీసా అదరహో
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా గడ్డపై ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల ‘ఎ’ జట్టు చివరి మ్యాచ్లో పరాజయం పాలైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడి 2–1తో సిరీస్ ఖాతాలో వేసుకుంది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (85 బంతుల్లో 137 నాటౌట్; 23 ఫోర్లు, 3 సిక్స్లు) విజృంభించడంతో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు అలవోకగా విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత ‘ఎ’ జట్టు 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (59 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... వికెట్ కీపర్ యస్తిక భాటియా (54 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. నందిని కశ్యప్ (53 బంతుల్లో 28; 2 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (32 బంతుల్లో 18; 2 ఫోర్లు), తనూశ్రీ సర్కార్ (22 బంతుల్లో 17), కెప్టెన్ రాధా యదవ్ (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తేజల్ హసబ్నిస్ (1) విఫలమైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో తహిలా మెక్గ్రాత్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. సియానా జింజర్ 50 పరుగులిచ్చి 2 వికెట్లు, ఎల్లా హేవార్డ్ 43 పరుగులిచ్చి 2 వికెట్లు, అనిక లెరాయిడ్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 27.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 222 పరుగులు చేసింది. హీలీ అజేయ శతకంతో చెలరేగగా... తహీలా విల్సన్ (51 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ఇక్కడే ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్ జరగనుంది.దంచికొట్టిన హీలీ..గాయం నుంచి కోలుకొని వచ్చిన అలీసా హీలీ... భారత ‘ఎ’ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్లను సంపూర్ణంగా వినియోగించుకుంది. మొదట టి20 సిరీస్తో లయ అందుకున్న హీలీ... వన్డే సిరీస్లో అదరగొట్టింది. గత మ్యాచ్లో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న అలీసా... ఈ మ్యాచ్లో అజేయ శతకంతో అదరగొట్టింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హీలీ ఇచ్చిన క్యాచ్ను భారత ఫీల్డర్లు నేలపాలు చేయగా... దాన్ని వినియోగించుకున్న ఆస్ట్రేలియా సీనియర్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బౌండరీలతో చెలరేగింది. రెండో ఓవర్లో ఫోర్తో మోత ప్రారంభించిన హీలీ... భారీ సిక్స్తో లక్ష్యఛేదనను పూర్తి చేసేంతవరకు అదే జోరు కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ బౌలర్ షబ్నమ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ... మిన్ను మణి, తనూజ కన్వర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టింది. మరో ఎండ్ నుంచి తహిలా విల్సన్ కూడా ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. షబ్నమ్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. తొలి వికెట్కు 137 పరుగులు జోడించిన అనంతరం తహిలా వెనుదిరగగా... హీలీ మాత్రం అదే జోష్ కనబర్చింది. మిన్ను మణి వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 4, 4, 6 కొట్టి 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఎండ్ నుంచి రాచెల్ (21 నాటౌట్) సహకారం లభించడంతో హీలీ జట్టును విజయతీరాలకు చేర్చింది -
మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. ఆస్ట్రేలియాకు కంటితుడుపు విజయం
ఆస్ట్రేలియా ఏ మహిళల జట్టుతో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపు ఆసీస్కు కంటితుడుపుగా మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే కైవసం చేసుకుంది (తొలి రెండు వన్డేలు గెలిచి).మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తడబడింది. ఆసీస్ బౌలర్లు తహ్లియా మెక్గ్రాత్ (8-0-40-3), అనిక లియారాయ్డ్ (3-0-16-2), ఎల్లా హేవర్డ్ (10-0-40-2), సియన్నా జింజర్ (8.4-0-50-2), లూసీ హ్యామిల్టన్ (10-2-34-1) సత్తా చాటడంతో 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (52), యస్తికా భాటియా (42) పోరాటపటిమ కనబర్చి భారత్కు ఈ మాత్రం స్కోరైన అందించారు.వీరు మినహా టీమిండియాలో ఎవరూ రాణించలేదు. నందిని కశ్యప్ (28), రఘవి బిస్త్ (18), తనుశ్రీ సర్కార్ (17), కెప్టెన్ రాధా యాదవ్ (18), తనుజా కన్వర్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. తేజల్ హసబ్నిస్ (1), మిన్నూ మణి (5), సైమా ఠాకోర్ (0), షబ్నమ్ షకీల్ (7 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అలిస్సా హీలీ (మిచెల్ స్టార్క్ భార్య) (84 బంతుల్లో 137 నాటౌట్; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి శతకంతో ఆసీస్ను విజయతీరాలకు చేర్చింది. ఆమెకు మరో ఓపెనర్ తహ్లియా విల్సన్ (59), రేచల్ ట్రెనామన్ (21 నాటౌట్) సహకరించారు.ఈ మ్యాచ్లో ఓడినా భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో గెలుచుకుంది. టీ20ల్లో ఎదురైన పరాభవానికి భారత్ వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
IND vs AUS: స్టార్ ఓపెనర్ విఫలం.. భారత జట్టుకు తప్పని ఓటమి
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ మహిళా జట్టు (AUS A W vs IND A W)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. మొదటి టీ20 మ్యాచ్లో రాధా యాదవ్ (Radha Yadav) సేన ఆసీస్-‘ఎ’ మహిళా జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించలేకపోయింది.కాగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత యువ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆసీస్తో మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు, ఓ అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం టీ20 సిరీస్ ఆరంభమైంది.అనికా హాఫ్ సెంచరీమకాయ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు సాధించింది. ఓపెనర్లలో ఆస్ట్రేలియా రెగ్యులర్ జట్టు కెప్టెన్ అలిసా హేలీ (18 బంతుల్లో 27) ఫరవాలేదనిపించగా.. తహీలా విల్సన్ (23 బంతుల్లో 17) మాత్రం విఫలమైంది.ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ అనికా లియరాడ్ అద్భుత ఇన్నింగ్స్తో అలరించింది. 44 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మిగతా వాళ్లలో కోర్ట్నీ (11), కెప్టెన్ నికోల్ ఫాల్టమ్ (11) మాత్రం డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు.స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ విఫలంభారత బౌలర్లలో సైమా ఠాకూర్, సీజవన్ సజన చెరో వికెట్ తీయగా.. ప్రేమా రావత్ మూడు వికెట్లతో సత్తా చాటింది. ఇక 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ (3) దారుణంగా విఫలమైంది. వన్డౌన్లో వచ్చిన ధారా గుజ్జర్ (7), ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన దినేశ్ వ్రింద (5) కూడా నిరాశపరిచారు.రాఘవి బిస్త్ మెరుపులు వృథాఇలాంటి క్లిష్ట దశలో మరో ఓపెనర్ ఉమా ఛెత్రి (31 బంతుల్లో 31) మెరుగ్గా ఆడగా.. రాఘవి బిస్త్ (20 బంతుల్లో 33) ఆఖర్లో మెరుపులు మెరిపించింది. ఈమెకు తోడుగా కెప్టెన్ రాధా యాదవ్ (22 బంతుల్లో 26) రాణించింది. కానీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసిన భారత జట్టు.. విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఆసీస్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య శనివారం (ఆగష్టు 9) రెండో టీ20కి షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IND vs WI: టీమిండియాకు భారీ షాక్! -
WPL 2025: యూపీ వారియర్స్కు కొత్త కెప్టెన్
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టీ20 క్రికెట్ టోర్నమెంట్లో మరో జట్టుకు కొత్త కెప్టెన్ నియామకం జరిగింది. ఈనెల 14 నుంచి జరిగే మూడో సీజన్లో యూపీ వారియర్స్ జట్టుకు భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) నాయకత్వం వహించనుంది. గత సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ అలీసా హీలీ కెప్టెన్సీలో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టు బరిలోకి దిగింది.అయితే గాయం కారణంగా అలీసా హీలీ మూడో సీజన్ డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగింది. దాంతో యూపీ వారియర్స్కు కొత్త కెప్టెన్గా దీప్తి శర్మను నియమించారు. గత సీజన్లో దీప్తి శర్మ ఎనిమిది ఇన్నింగ్స్లు ఆడి 136.57 స్ట్రయిక్రేట్తో 295 పరుగులు సాధించడంతోపాటు 10 వికెట్లు తీసింది. గత సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు బెత్ మూనీ కెప్టెన్ వ్యవహరించగా... ఈసారి ఆస్ట్రేలియాకే చెందిన ఆస్లీ గార్డ్నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైంది. డబ్ల్యూపీఎల్లోని మిగతా మూడు జట్లకు హర్మన్ప్రీత్ (ముంబై ఇండియన్స్), స్మృతి మంధాన (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్) కెప్టెన్లుగా ఉన్నారు. లంకపై ఘన విజయం.. సిరీస్ ఆసీస్దేగాలె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... శ్రీలంకలో 14 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ అందుకుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్ను 2–0తో చేజిక్కించుకుంది. కంగారూ జట్టు చివరిసారిగా 2011లో శ్రీలంకలో టెస్టు సిరీస్ గెలిచింది. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించిన ఆసీస్... లంక పర్యటనలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్నైట్ స్కోరు 211/8తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 68.1 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (50; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కంగారూ బౌలర్లలో కూనెమన్, లయన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. కుశాల్ మెండిస్ క్యాచ్ పట్టడం ద్వారా టెస్టు క్రికెట్లో 200 క్యాచ్లు అందుకున్న ఐదో ప్లేయర్గా ఆ్రస్టేలియా కెప్టెన్ స్మిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 17.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (27 నాటౌట్), ట్రావిస్ హెడ్ (20), లబుషేన్ (26 నాటౌట్) రాణించారు. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... స్మిత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. కరుణరత్నే వీడ్కోలు శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే పరాజయంతో కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఈ పోరు ద్వారా టెస్టు క్రికెట్లో 100 మ్యాచ్లు పూర్తి చేసుకున్న 36 ఏళ్ల కరుణరత్నే మాట్లాడుతూ... ‘కెరీర్ ఆరంభంలో ఒక్క టెస్టు మ్యాచ్ ఆడితే చాలు అనుకున్నా. వంద మ్యాచ్లు ఆడటం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నాడు. సుదీర్ఘ కెరీర్లో కరుణరత్నే 39.25 సగటుతో 7,222 పరుగులు చేశాడు. అందులో 16 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
Fab Four: ‘కోహ్లి కాదు.. అతడే నంబర్ వన్’
క్రికెట్ నవ యుగంలో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లలో టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ లెజండరీ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ముందు వరుసలో ఉంటారు. కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై శతకాలతో సత్తా చాటగా.. టెస్టుల్లో రూట్ అత్యధిక పరుగుల జాబితాలో మున్ముందుకు దూసుకెళ్తున్నాడు.ఫ్యాబ్ ఫోర్లో బెస్ట్ ఎవరు?మరోవైపు స్మిత్, విలియమ్సన్ సైతం తమ మార్కును చూపిస్తూ తమ తమ జట్లను విజయపథంలో నిలుపుతున్నారు. అందుకే.. ఈ నలుగురిని కలిపి ‘ఫ్యాబ్ ఫోర్’గా పిలుచుకుంటారు క్రికెట్ ప్రేమికులు. అయితే, వీరిలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు మాత్రం ‘ఫ్యాబ్ ఫోర్’ అభిమానులు సైతం ఏకాభిప్రాయానికి రాలేరు.కోహ్లికి ఆఖరి ర్యాంకు ఇస్తాతాను కూడా అందుకు అతీతం కాదంటోంది ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ అలిసా హేలీ.‘ ఫ్యాబ్ ఫోర్’ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వారంతా గొప్ప బ్యాటర్లు. అయితే, వారికి ర్యాంకు ఇవ్వాలంటే మాత్రం నేను కోహ్లిని నాలుగో స్థానానికే పరిమితం చేస్తా. ఇది నేను సరదాకి చెప్తున్న మాట కాదు.మిగతా వాళ్లతో పోలిస్తేఅన్ని రకాలుగా విశ్లేషించిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నా. నిజానికి మిగతా ముగ్గురితో పోలిస్తే కోహ్లి చాలా ఎక్కువగా క్రికెట్ ఆడాడు. అందుకే అతడి గణాంకాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టి చూస్తే మాత్రం కోహ్లికి నంబర్ 1 రేటింగ్ ఇవ్వాల్సిందే’’ అని అలిసా హేలీ ఓ పాడ్కాస్ట్లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.అతడే నంబర్ వన్తన అభిప్రాయం ప్రకారం ఈ నలుగురిలో కేన్ విలియమ్సన్కు అగ్రస్థానం ఉంటుందని.. ఆ తర్వాతి స్థానాల్లో స్మిత్, రూట్, కోహ్లి ఉంటారని తెలిపింది. విలియమ్సన్ కారణంగా కివీస్ జట్టు మొత్తానికి పేరు వచ్చిందని.. అయితే, కోహ్లి ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ మాత్రమేనని హేలీ పేర్కొంది. ఎనిమిదిసార్లు ప్రపంచకప్ను ముద్దాడిందిఅదే విధంగా.. టీమిండియా తరఫున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆఖరికి రవీంద్ర జడేజా కూడా సెంచరీలు బాదగలరని.. అయితే.. జట్టు భారం మొత్తాన్ని మోయగల విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కొంతమందే ఉంటారని అభిప్రాయపడింది.కాగా ఆస్ట్రేలియా మేటి బ్యాటర్గా ఎదిగిన అలిసా హేలీ ఆరుసార్లు టీ20 ప్రపంచకప్, రెండుసార్లు వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్లలో సభ్యురాలు. అంతేకాదు.. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్ భార్య కూడా! చదవండి: Musheer Khan: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్! -
ఆస్ట్రేలియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
సిడ్నీ: బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... మహిళల టి20 ప్రపంచకప్ కోసం అక్కడికి వెళ్లడం సరికాదని ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ అభిప్రాయపడింది. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న దేశంపై ఇది మరింత ఒత్తిడి కలిగిస్తుందని హీలీ వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్లో ఏర్పడిన రాజకీయ అస్థిరత హింసకు దారితీయగా... వందలాది మంది మృత్యువాత పడ్డారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడగా... మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 19 వరకు బంగ్లాదేశ్ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. మొత్తం 10 జట్లు పాల్గొననున్న ఈ టోర్నీలో ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో హీలీ మాట్లాడుతూ... ‘ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఆడటం కష్టంగా ఉంది. నైతికంగా ఇది సరైంది కాదనిపిస్తోంది. టోర్నీ అక్కడే నిర్వహించాలా వద్దా అనే విషయం ఐసీసీ పరిధిలోకి వస్తుంది. మా వరకైతే టి20 వరల్డ్కప్ కోసం మెరుగ్గా సిద్ధమవుతున్నాం. టోర్నీ ఎక్కడ జరిగినా సత్తా చాటగలమనే నమ్మకం ఉంది’ అని పేర్కొంది. 2014 టి20 ప్రపంచకప్ తర్వాత.. ఇటీవలే ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించింది. పరిమిత ఓవర్ల సిరీస్లలో భాగంగా ఆడిన 3 వన్డేలు, మూడు టి20ల్లోనూ విజయం సాధించింది. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్లో టి20 వరల్డ్కప్ నిర్వహించాలా వద్దా అనే విషయంపై ఈరోజు ఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ వేదిక మార్చాలనుకుంటే మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆతిథ్య రేసులో ముందుంది. -
ఆస్ట్రేలియా భారీ స్కోర్
వడోదర : మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం భారత మహిళల జట్టుతో జరుగుతున్న నామమాత్రమైన మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కీపర్ అలైసా హేలీ (133;115బంతుల్లో17 ఫోర్లు, 2సిక్సర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించింది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా తరపున భారత్పై అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది. ఆస్ట్రేలియా 64 పరుగులకే నికోల్ బోల్టన్(11), లాన్నింగ్(18) వికెట్లను కోల్పోగా, అలైసా హేలీ-ఎలైస్ పెర్రీ జట్టును కాపాడే ప్రయత్నం చేశారు. ఈ జోడి 79 పరుగులు జోడించిన అనంతరం పెర్రీ (32) మూడో వికెట్గా పెవిలియన్కు చేరింది. తరువాత వచ్చిన ప్లెయర్స్లో రాచెల్ హేన్స్ (43, 39బంతుల్లో 5ఫోర్లు), యాష్లే గార్డనర్ (35, 20బంతుల్లో 6 ఫోర్లు), మూనీ(34, 19బంతుల్లో 5ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోర్ సాధించింది. హర్మన్ప్రీత్ కౌర్ రెండు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ, శిఖా పాండే, ఏక్తా బిస్త్, పూనం యాదవ్ తలో వికట్ తీశారు. మూడు వన్డేల సిరీస్ను 0-2తో భారత మహిళా జట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎక్తాబిస్త్కు గాయం భారత క్రీడాకారిణి ఏక్తా బిస్త్ బౌలింగ్ చేస్తూ గాయపడటంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడింది. -
ఇంటివారైన స్టార్క్, అలీసా
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిషెల్ స్టార్క్, మహిళల జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ గతేడాది ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీకి అలీసా మేనకోడలు. ప్రస్తుతం ఈమె ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతుండగా... స్టార్క్ గాయం కారణంగా రెండు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
తూనీగా... తూనీగా..!
ప్రస్తుత క్రికెట్లో ప్రేమికుల జంట స్టార్క్, అలీసా 15 సంవత్సరాల స్నేహం ప్రేమగా మారిన వైనం ఏప్రిల్ 3, 2014... వేదిక మిర్పూర్... ఆస్ట్రేలియా , వెస్టిండీస్... మహిళల టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్.. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా ఒకరిద్దరు మ్యాచ్ను వీక్షిస్తున్నారు.. స్లాగ్ ఓవర్లలో ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వీఐపీ లాంజ్లో కూర్చున్న ఓ వ్యక్తి చప్పట్లు చరుస్తూ బ్యాట్స్వుమన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. అతని ప్రోత్సాహంతో క్రీజ్లో ఉన్న ఆమె రెట్టించిన ఉత్సాహంతో ఫోర్లతో విరుచుకుపడుతోంది. ఆ ఇన్నింగ్సే ఆసీస్ జట్టు విజయానికి కారణమైంది. చివరికి వెస్టిండీస్పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ బ్యాట్స్వుమన్ను ప్రోత్సహించింది ఎవరో కాదు ఆస్ట్రేలియా యువ పేస్ బౌలర్ స్టార్క్.. ఫోర్లతో విరుచుకుపడింది ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ సోదరి కూతురు అలీసా హీలీ... ఇద్దరు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆస్ట్రేలియా పురుషుల జట్టు గ్రూప్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టినా... స్టార్క్ మాత్రం బంగ్లాదేశ్లోనే ఉండిపోయి మహిళల జట్టును ప్రోత్సహించడానికి అలీసా హీలీతో ప్రేమాయణమే కారణం.. 24 ఏళ్ల వయసున్న వీళ్లిద్దరూ దాదాపుగా రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. లవ్ ఇన్ సిడ్నీ... మిచెల్ స్టార్క్.. అలీసా హీలీ.. ఒకరికి మరొకరు 15 ఏళ్లుగా పరిచయం.. 9 ఏళ్ల వయసులో సిడ్నీలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నారు. వికెట్ కీపర్లుగా ఇద్దరూ క్రికెట్ కెరీర్ను ప్రారంభించారు. ఆరేళ్ల పాటు ఒకే జట్టుతో కలసి క్రికెట్ ఆడారు. స్టార్క్ వికెట్ కీపింగ్ వదిలేసి పేస్ బౌలింగ్పై దృష్టి పెట్టగా.. అలీసా మాత్రం వికెట్ కీపింగ్నే కొనసాగించింది. 15 ఏళ్ల వయసులో అలీసా మహిళల క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఇద్దరూ చిన్ననాటి పరిచయాన్ని కొనసాగించారు. క్రికెట్నే ప్రొఫెషనల్గా ఎంచుకుని జాతీయ జట్టులో చోటు సంపాదించారు. 2011లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు భారత పర్యటనకు వెళ్లేముందు దొరికిన కాస్త సమయం వీళ్లిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందని తెలిసేలా చేసింది. అయితే చిన్ననాటి పరిచయం ప్రేమగా మారింది మాత్రం 2012లోనే.. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్నారు.. అప్పటి నుంచి ప్రేమపక్షులుగా మారిపోయారు. ఓ వైపు క్రికెట్ కెరీర్కు ఎలాంటి ఇబ్బంది రాకుండా... మరోవైపు ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు.