breaking news
Alyssa Healy
-
డబ్ల్యూపీఎల్ వేలంలో దీప్తి ధమాకా
భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ దీప్తి శర్మకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారీ విలువ దక్కింది. 2026 సీజన్ కోసం నిర్వహించిన మెగా వేలంలో దీప్తిని అత్యధికంగా రూ.3 కోట్ల 20 లక్షలకు ఆమె గత జట్టు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. డబ్ల్యూపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక మొత్తం 2023లో స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు)కు దక్కగా... దీప్తి రెండో స్థానంలో నిలిచింది. కెప్టెన్గా మూడుసార్లు ఢిల్లీని ఫైనల్కు చేర్చిన ఆ్రస్టేలియా దిగ్గజం మెగ్ లానింగ్ను రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ తమ సారథిగా ఎంచుకునే అవకాశం ఉంది. వరల్డ్ కప్ విజయంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.30 కోట్లు ఇచ్చి మళ్లీ తమ జట్టులోకి తీసుకుంది. న్యూఢిల్లీ: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) –2026 సీజన్ కోసం గురువారం నిర్వహించిన వేలంలో 67 మంది మహిళా క్రికెటర్లను ఐదు ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరిలో 23 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 276 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా, గరిష్టంగా 73 ఖాళీలు ఉండగా... తమకు కావాల్సిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు టీమ్లు ఓవరాల్గా రూ. 40.80 కోట్లు ఖర్చు చేశాయి. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మకు అత్యధికంగా రూ.3.20 కోట్లు దక్కాయి. విదేశీ ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్టార్ అమేలియా కెర్కు రూ. 3 కోట్లు లభించగా... 11 మంది ప్లేయర్లకు కనీసం రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలు దక్కాయి. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు రెండు నగరాల్లో డబ్ల్యూపీఎల్ జరుగుతుంది. ముంబైలోని డీవై పాటిల్, వడోదరలోని కొటాంబి స్టేడియంలను టోర్నీకి వేదికలుగా నిర్ణయించారు. 2023లో మొదటిసారి డబ్ల్యూపీఎల్ వేలం జరిగింది. ఆ తర్వాత జరిగిన మెగా వేలం ఇదే కావడం గమనార్హం. తొలిసారి జట్లకు రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డును వాడుకునే అవకాశం కల్పించారు. వేలానికి ముందు యూపీ వారియర్స్ వద్ద ఏకంగా రూ.14.50 కోట్లు ఉండటంతో ఆ జట్టు చురుగ్గా పాల్గొని గరిష్టంగా 17 మంది ఆటగాళ్లను ఎంచుకుంది. డబ్ల్యూపీఎల్ వేలం విశేషాలు » ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీతో వేలం మొదలైంది. వన్డే వరల్డ్ కప్లో చెలరేగిన ఆమె ప్రాథమిక ధర రూ.50 లక్షలు కాగా... ఏ జట్టు కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. » దీప్తి కోసం 2023లో యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈ సీజన్కు ముందు ఆమెను విడుదల చేసింది. వేలంలో దీప్తి కనీస విలువ రూ. 50 లక్షలకు తీసుకునేందుకు ఢిల్లీ సిద్ధం కాగా... యూపీ ఆర్టీఎం కార్డును వాడుకొని తమ జట్టులోకి ఎంచుకుంది. » డబ్ల్యూపీఎల్లో మూడుసార్లు కెప్టెన్గా ఢిల్లీని ఫైనల్ చేర్చిన ఆసీస్ దిగ్గజం మెగ్ లానింగ్ కనీస ధర రూ.50 లక్షల నుంచి ఢిల్లీ, యూపీ పోటీ పడగా, చివరకు రూ.1.9 కోట్లతో యూపీ సొంతమైంది. » వేలంలో భారీ మొత్తం పలికిన ప్లేయర్ల జాబితాలో శిఖా పాండే కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. భారత జట్టుకు ఎప్పుడో దూరమైన 36 ఏళ్ల శిఖా అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు మూడేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం కరీబియన్ లీగ్ సహా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతూ ఫిట్గా ఉండటం ఆమె ఎంపికకు ప్రధాన కారణం. ఆర్సీబీతో పోటీ పడిన యూపీ చివరకు శిఖాను సొంతం చేసుకుంది.» వరల్డ్కప్ విజేత, కడప బిడ్డ శ్రీచరణిని రూ.1.30 కోట్లతో ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది.వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల వివరాలు (విలువ రూ.లలో)ఢిల్లీ క్యాపిటల్స్: షినెల్ హెన్రీ (1.30 కోట్లు), శ్రీచరణి (1.30 కోట్లు), వోల్వార్ట్ (1.10 కోట్లు), స్నేహ్ రాణా (50 లక్షలు), మిన్ను మణి (40 లక్షలు), లిజెల్ లీ (30 లక్షలు), తానియా భాటియా (30 లక్షలు), నందిని శర్మ (20 లక్షలు), దియా యాదవ్ (10 లక్షలు), మమత మదివాల (10 లక్షలు), లూసీ హామిల్టన్ (10 లక్షలు).గుజరాత్ జెయింట్స్: సోఫీ డివైన్ (2 కోట్లు), జార్జ్ వేర్హామ్ (1 కోటి), భారతి ఫుల్మలీ (70 లక్షలు), కాశ్వీ గౌతమ్ (65 లక్షలు), రేణుకా సింగ్ (60 లక్షలు), కిమ్ గార్త్ (50 లక్షలు), యస్తిక భాటియా (50 లక్షలు), డానీ వ్యాట్ (50 లక్షలు), తనూజ కన్వర్ (45 లక్షలు), అనుష్క శర్మ (45 లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్ (40 లక్షలు), టిటాస్ సాధు (30 లక్షలు), కనిక అహుజా (30 లక్షలు), ఆయుషి సోని (30 లక్షలు), హ్యాపీ కుమారి (10 లక్షలు), శివాని సింగ్ (10 లక్షలు).ముంబై ఇండియన్స్: అమేలియా కెర్ (3 కోట్లు), సజీవన్ సజన (75 లక్షలు), షబి్నమ్ ఇస్మాయిల్ (60 లక్షలు), నికోలా క్యారీ (30 లక్షలు), సైకా ఇషాక్ (30 లక్షలు), సంస్కృతి గుప్తా (20 లక్షలు), త్రివేణి వశిష్ట (20 లక్షలు), రాహిలా ఫిర్దోస్ (10 లక్షలు), పూనమ్ ఖెమ్మార్ (10 లక్షలు), నల్లా క్రాంతి రెడ్డి (10 లక్షలు), మిలీ ఇలింగ్వర్త్ (10 లక్షలు).రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: లారెన్ బెల్ (90 లక్షలు), పూజ వస్త్రకర్ (85 లక్షలు), అరుంధతి రెడ్డి (75 లక్షలు), గ్రేస్ హారిస్ (75 లక్షలు), డిక్లెర్క్ (65 లక్షలు), రాధ యాదవ్ (65 లక్షలు), జార్జ్ వోల్ (60 లక్షలు), లిన్సీ స్మిత్ (30 లక్షలు), హేమలత దయాళన్ (30 లక్షలు), ప్రేమ రావత్ (20 లక్షలు), గౌతమ్ నాయక్ (10 లక్షలు), ప్రత్యూష కుమార్ (10 లక్షలు).యూపీ వారియర్స్: దీప్తి శర్మ (3.20 కోట్లు), శిఖా పాండే (2.40 కోట్లు), మెగ్ లానింగ్ (1.90 కోట్లు), ఫోబ్ లిచ్ఫీల్డ్ (1.20 కోట్లు), ఆశా శోభన (1.10 కోట్లు), సోఫీ ఎకెల్స్టోన్ (85 లక్షలు), డియాండ్రా డాటిన్ (80 లక్షలు), కిరణ్ నవ్గిరే (60 లక్షలు), హర్లీన్ డియోల్ (50 లక్షలు), క్రాంతి గౌడ్ (50 లక్షలు), ప్రతీక రావల్ (50 లక్షలు), క్లో ట్రయాన్ (30 లక్షలు), శిప్రా గిరి (10 లక్షలు), సిమ్రన్ షేక్ (10 లక్షలు), తారా నోరిస్ (10 లక్షలు), సుమన్ మీనా (10 లక్షలు), గొంగడి త్రిష (రూ. 10 లక్షలు). వీరికి నిరాశ అంతర్జాతీయ క్రికెట్లో తమదైన గుర్తింపు ఉన్న పలువురు ప్లేయర్లకు ఈసారి డబ్ల్యూపీఎల్ వేలంలో నిరాశే మిగిలింది. అలీసా హీలీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా ...విదేశీ ప్లేయర్లలో ఎమీ జోన్స్, హీతర్ నైట్, చమరి అటపట్టు, అలానా కింగ్, తజ్మీన్ బ్రిట్స్, సోఫీయా డంక్లీ, సుజీ బేట్స్ తది తరులను ఎవరూ పట్టించుకోలేదు. గతంలో లీగ్లో అవకాశం దక్కించుకొని ఈసారి వేలంలో ఎంపిక కాని భారత ప్లేయర్ల జాబితాలో ఉమా ఛెత్రి, సైమా ఠాకూర్లతోపాటు సబ్బినేని మేఘన, స్నేహ దీప్తి, అంజలి శర్వాణి (ఆంధ్రప్రదేశ్), యషశ్రీ (హైదరాబాద్) ఉన్నారు. -
జెమీమా వీరోచిత పోరాటం.. ఫైనల్లో భారత్
ఉత్కంఠపోరులో భారత్ గెలుపు..మహిళల వన్డే ప్రపంచకప్-2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. గురువారం నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 48.3 ఓవర్లలో చేధించింది. దీంతో ముచ్చటగా మూడో సారి మన అమ్మాయిల జట్టు ప్రపంచకప్ ఫైనల్కు అర్హత సాధించింది. భారత విజయంలో జెమీమా రోడ్రిగ్స్ది కీలక పాత్ర. భారీ లక్ష్య చేధనలో రోడ్రిగ్స్ విరోచిత శతకంతో చెలరేగింది. 134 బంతులు ఎదుర్కొన్న రోడ్రిగ్స్.. 14 ఫోర్ల సాయంతో 127 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్ప్రీత్ కౌర్ (89; 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడింది.ఐదవ వికెట్ డౌన్..రిచా ఘోష్ రూపంలో భారత్ ఐదవ వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన రిచా. క్యాచ్ అవుట్ అయింది. రోడ్రిగ్స్ సెంచరీ..ఆసీస్తో జరుగుతున్న సెమీఫైనల్లో రోడ్రిగ్స్ అద్బుతమైన సెంచరీతో మెరిసింది. 43 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. క్రీజులో రోడ్రిగ్స్(106), రిచా ఘోష్(8) ఉన్నారు. భారత్ విజయానికి 42 బంతుల్లో 55 పరుగులు కావాలి.నాలుగో వికెట్ డౌన్..దీప్తీ శర్మ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన దీప్తీ.. రనౌట్ రూపంలో వెనుదిరిగింది. బారత విజయానికి 54 బంతుల్లో 75 పరుగులు కావాలి. క్రీజులో రోడ్రిగ్స్(96) ఉంది.భారత్ మూడో వికెట్ డౌన్..226 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. సదర్లాండ్ బౌలింగ్లో ఔటైంది. దీంతో 167 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 38 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. భారత విజయానికి 72 బంతుల్లో 98 పరుగులు కావాలి. క్రీజులో రోడ్రిగ్స్(90), దీప్తీ(10) ఉన్నారు.రసవత్తరంగా భారత్-ఆసీస్ సెమీఫైనల్భారత్-ఆస్ట్రేలియా మధ్య సెకెండ్ సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. 339 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా అద్బుతంగా పోరాడుతోంది. 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. రోడ్రిగ్స్, హర్మన్ కలిసి మూడో వికెట్కు 167 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత విజయానికి ఇంకా 113 పరుగులు కావాలి. జేమిమా రోడ్రిగ్స్(85), హర్మన్ ప్రీత్ కౌర్(89) ఉన్నారు.హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీఆసీస్తో జరుగుతున్న సెమీఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్బుత ఇన్నింగ్స్ ఆడుతోంది. 65 బంతుల్లో తన ఆర్ధ శతకాన్ని హర్మన్ పూర్తి చేసుకుంది. 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రోడ్రిగ్స్, హర్మన్ కలిసి మూడో వికెట్కు 130 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత విజయానికి ఇంకా 120 బంతుల్లో 150 పరుగులు కావాలి.రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ..టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు జేమిమా రోడ్రిగ్స్(54), హర్మన్(25) ప్రీత్ కౌర్ నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్ 58 బంతుల్లో తన ఆర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. 21 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల కోల్పోయి 124 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి ఇంకా 215 పరుగులు కావాలి.టీమిండియా రెండో వికెట్ డౌన్..స్మృతి మంధాన రూపంలో టీమిండియా రెండు వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన మంధాన.. కిమ్ గార్త్ బౌలింగ్లో ఔటైంది. 10 ఓవర్లకు భారత్ స్కోర్:66-2, క్రీజులో రోడ్రిగ్స్(24), హర్మన్ప్రీత్ కౌర్(2) ఉన్నారు.టీమిండియాకు భారీ షాక్..339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోని గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ.. గార్త్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయింది. 6 ఓవర్లు ఆసీస్ స్కోర్: 38/1. క్రీజులో మంధాన(14), రోడ్రిగ్స్(8) ఉన్నారు.భారత బౌలర్లు విఫలం.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ముంబై వేదికగా భారత్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఫోబ్ లిచ్ఫీల్డ్(17 ఫోర్లు, 3 సిక్స్లతో 119) శతక్కొట్టగా.. ఎల్లీస్ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 77), గార్డెనర్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో శ్రీచరణి, దీప్తీ శర్మ తలా రెండు వికెట్లు సాధించగా.. రాధా యాదవ్, అమన్జ్యోత్ కౌర్, క్రాంతి గౌడ్ తలా వికెట్ పడగొట్టారు.కమ్బ్యాక్ ఇచ్చిన భారత బౌలర్లు..భారత బౌలర్లు కమ్బ్యాక్ ఇచ్చారు. వరుస క్రమంలో ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత చరణి బౌలింగ్లో సదర్లాండ్(3) ఔట్ కాగా.. ఆ తర్వాత రాధా యాదవ్ బౌలింగ్లో పెర్రీ(77) క్లీన్ బౌల్డ్ అయ్యింది. 41 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 260/5ఆసీస్ మూడో వికెట్ డౌన్..220 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన బెత్ మూనీ.. శ్రీచరణి బౌలింగ్లో ఔటైంది. 35 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 225-3ఆసీస్ రెండో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా ఎట్టకేలకు రెండో వికెట్ కోల్పోయింది. 119 పరుగులు చేసిన లిచ్ఫీల్డ్.. అమన్ జ్యోత్ కౌర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో 155 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 27.2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 180-2లిచ్ఫీల్డ్ సెంచరీ..భారత్తో జరుగుతున్న సెమీఫైనల్లో ఆసీస్ యువ సంచలనం లిచ్ఫీల్డ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. కేవలం77 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను ఆమె అందుకుంది. 24 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో లిచ్ఫీల్డ్తో పాటు పెర్రీ(40) ఉన్నారు.18 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోరు: 115-1పెర్రీ 36, లిచ్ఫీల్డ్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.10 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 72/110 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజులో లిచ్ఫీల్డ్(46), పెర్రీ(18) ఉన్నారు.ఆసీస్ తొలి వికెట్ డౌన్..25 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కెప్టెన్ అలీసా హీలీ.. క్రాంతి గౌడ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. అయితే ఆమె ఔటైన వెంటనే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆటను అంపైర్లు నిలిపివేశారు.దూకుడుగా ఆడుతున్న ఆసీస్..టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో లిచ్ఫీల్డ్(17), హీలీ(4) ఉన్నారు. రేణుకా బౌలింగ్లో హీలీ ఇచ్చిన సునాయస క్యాచ్ను కెప్టెన్ హర్మన్ జారవిడిచింది.ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 సెకెండ్ సెమీఫైనల్లో భాగంగా గురువారం నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అలీస్సా హీలీ తిరిగి జట్టులోకి వచ్చింది.భారత్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. అదేవిధంగా భారత్ కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్లో రెండు మార్పులు చేసింది. రిచా ఘోష్, షఫాలీ వర్మ తుదిజట్టులోకి వచ్చారు. స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.తుదిజట్లు భారత్షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.ఆస్ట్రేలియాఫోబ్ లిచ్ఫీల్డ్, అలిసా హేలీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డ్నర్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగన్ షట్. -
WC 2025 Ind vs Aus: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా చెత్త రికార్డు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 రెండో సెమీ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా (WC Ind vs Aus) తలపడుతున్నాయి. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా టాస్ గెలిచిన ఆసీస్ మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. హర్మన్ సేనను బౌలింగ్కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ అలిసా హేలీ మాట్లాడుతూ.. తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది. కీలక మ్యాచ్లో తాము ఒక మార్పు చేశామని.. జార్జియా వారేహమ్ స్థానంలో సోఫీ మోలినెక్స్ జట్టులోకి వచ్చినట్లు వెల్లడించింది.మరోవైపు.. భారత జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని.. ఫియర్లెస్గా ఆడతామని తెలిపింది. గాయం వల్ల దురదృష్టవశాత్తూ ప్రతికా రావల్ దూరమైందన్న హర్మన్.. హర్లిన్ డియోల్, ఉమా ఛెత్రిలకు విశ్రాంతినిచ్చామని.. రిచా ఘోష్, షఫాలీ వర్మ తుదిజట్టులోకి వచ్చారని పేర్కొంది.టీమిండియా చెత్త రికార్డుమహిళల వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా భారత్ నిలిచింది. గత పది వన్డేల్లో హర్మన్ ఒకే ఒక్కసారి టాస్ గెలవడం గమనార్హం.మహిళల వరల్డ్కప్ టోర్నీ సింగిల్ ఎడిషన్లో అత్యధికసార్లు టాస్ ఓడిన జట్లు👉ఇంగ్లండ్- 1982లో 13 మ్యాచ్లలో 9 సార్లు ఓటమి👉భారత్- 1982లో 12 మ్యాచ్లలో 8 సార్లు ఓటమి👉శ్రీలంక- 2000లో ఏడింట ఏడుసార్లు ఓటమి👉సౌతాఫ్రికా- 2025లో ఎనిమిదింట ఏడుసార్లు ఓటమి👉భారత్- 2025లో ఎనిమిదింట ఏడుసార్లు ఓటమి.తుదిజట్లు భారత్షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.ఆస్ట్రేలియాఫోబ్ లిచ్ఫీల్డ్, అలిసా హేలీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డ్నర్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగన్ షట్.చదవండి: IND vs AUS: అతడి కోసం అర్ష్దీప్ను బలిచేస్తారా?.. గంభీర్పై ఫైర్ -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో రేపు (అక్టోబర్ 30) జరుగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్కు (India vs Australia) ముందు టీమిండియాకు (Team India) బ్యాడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా గత రెండు మ్యాచ్లకు (ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా) దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ అలైస్సా హీలీ (Alyssa Healy) ఈ మ్యాచ్కు అందుబాటులోకి రానుంది.ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. హీలీ ఫిట్నెస్ టెస్ట్ను క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆమె, పునరాగమనం సంకేతాలు ఇచ్చింది. సెమీస్లో హీలీ బరిలోకి దిగితే టీమిండియాను కష్టాలు తప్పవు.గాయపడక ముందు ఆమె అరివీర భయంకరమైన ఫామ్లో ఉండింది. వరుసగా భారత్, బంగ్లాదేశ్పై సెంచరీలు (142, 113 నాటౌట్) చేసింది. ఇదే ఫామ్ను హీలీ సెమీస్లోనూ కొనసాగిస్తే.. టీమిండియా ప్రపంచకప్ సాధించాలన్న కల తలకిందులయ్యే ప్రమాదం ఉంది.ఈ టోర్నీలో హీలీ 4 మ్యాచ్ల్లో 2 సెంచరీల సాయంతో 98 సగటున 298 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా సెమీస్కు చేరింది. లీగ్ దశలో న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై విజయాలు సాధించి, జైత్రయాత్రను కొనసాగిస్తుంది. భారత్ విషయానికొస్తే.. చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించిన భారత్.. టోర్నీ ప్రారంభంలో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్లపై విజయాలు సాధించి, ఆతర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇంగ్లండ్ చేతుల్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడింది. ఈ టోర్నీ నుంచి మరో రెండు సెమీస్ బెర్త్లు ఇంగ్లండ్, సౌతాఫ్రికాకు దక్కాయి. ఇరు జట్లు ఇవాళ (అక్టోబర్ 29) జరుగబోయే తొలి సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: పాక్ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా -
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) టేబుల్ టాపర్గా కొనసాగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ అయిన అలైస్సా హీలీ (Alyssa Healy) గాయం (కాలు వెనుక భాగంలో) కారణంగా ఇంగ్లండ్తో రేపు (అక్టోబర్ 23) జరుగబోయే మ్యాచ్కు దూరమైంది.ప్రస్తుత ప్రపంచకప్లో హీలీ అరివీర భయంకరమైన ఫామ్లో ఉంది. భారత్, బంగ్లాదేశ్పై వరుసగా రెండు మ్యాచ్ల్లో విధ్వంసకర శతకాలు బాదింది. బంగ్లాదేశ్తో మ్యాచ్ ముగిశాక ప్రాక్టీస్ సమయంలో హీలీ గాయపడినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్తో మ్యాచ్లో హీలీ స్థానంలో బెత్ మూనీ వికెట్ కీపింగ్ చేస్తుందని ఆసీస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఓపెనర్గా హీలీ స్థానాన్ని 22 ఏళ్ల జార్జియా వాల్ భర్తీ చేస్తుందని వెల్లడించింది.ఆసీస్ శిబిరంలో కలవరంహీలీ గాయం నేపథ్యంలో ఆసీస్ శిబిరం కలవరపడుతుంది. ఆమె గాయం తీవ్రతపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతుంది. ఆసీస్ ఇదివరకే సెమీస్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఒకవేళ హీలీ సెమీస్ మ్యాచ్కు కూడా దూరమైతే ఆసీస్ విజయావకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఇంగ్లండ్తో తర్వాత ఆసీస్ లీగ్ దశలో మరో మ్యాచ్ (సౌతాఫ్రికా) ఆడుతుంది. ఆ మ్యాచ్ అక్టోబర్ 25న జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచ్లు అక్టోబర్ 29, 30 తేదీల్లో జరుగనున్నాయి. ఆ సమయానికి హీలీ కోలుకుంటుందని ఆసీస్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. తొలి ప్లేయర్గా రికార్డు -
వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదిన ఆసీస్ కెప్టెన్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) అరివీర భయంకరమైన ఫామ్లో ఉంది. ఈ టోర్నీలో ఆమె వరుసగా రెండో మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదింది.కొద్ది రోజుల కిందట విశాఖ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేసిన హీలీ.. ఇవాళ (అక్టోబర్ 16) అదే విశాఖ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మరింత రెచ్చిపోయి 77 బంతుల్లో 20 ఫోర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేసింది.రెండు మ్యాచ్ల్లో హీలీ లక్ష్య ఛేదనల్లోనే సెంచరీలు సాధించడం విశేషం. భారత్తో మ్యాచ్లో 331 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టగా.. తాజాగా బంగ్లాదేశ్పై 199 పరుగుల స్వల్ప ఛేదనలో సెంచరీ చేసింది.నేటి మ్యాచ్లో హీలీ ఒంటిచేత్తో తన జట్టును గెలుపుతీరాలు దాటించింది. ఆమెకు మరో ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) సహకరించింది. వీరిద్దరి ధాటికి ఆసీస్ సగం ఓవర్లు కూడా పూర్తి కాకుండానే (24.5 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ ఓటమెరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సెమీస్కు కూడా అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్.. న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్పై విజయాలు సాధించింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్కు ఓ వికెట్ దక్కింది.చదవండి: చివరి బెర్త్ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్లు ఇవే..! -
World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీస్ చేరాలంటే...
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Women's ODI WC 2025)లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. విశాఖపట్నం వేదికగా తొలుత సౌతాఫ్రికా వుమెన్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిన హర్మన్సేన.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లోనూ ఓటమిని చవిచూసింది.ఓపెనర్లు సూపర్హిట్విశాఖలో ఆస్ట్రేలియా మహిళా జట్టు (IND W vs AUS W)తో మ్యాచ్లో 330 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఫలితంగా మూడు వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు ప్రతికా రావల్ (75), స్మృతి మంధాన (Smriti Mandhana- 80) గొప్ప ఆరంభం అందించారు.మిగతావారిలో వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 38, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 22, జెమీమా రోడ్రిగెస్ 33, రిచా ఘోష్ 32 పరుగులతో ఓ మోస్తరుగా రాణించారు. అయితే, ఆసీస్ బౌలర్ల ధాటికి లోయర్ ఆర్డర్ వేగంగా పతనమైంది. అమన్జోత్ కౌర్ 16 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. దీప్తి శర్మ (1), స్నేహ్ రాణా (8), క్రాంతి గాడ్ (1), శ్రీ చరణి (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది.అనాబెల్ సదర్లాండ్కు ఐదుఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. సోఫీ మొలినక్స్ మూడు వికెట్లు పడగొట్టింది. మిగిలిన వారిలో మేగన్ షట్, ఆష్ల గార్డ్నర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్, కెప్టెన్ అలిసా హేలీ ఆకాశమే హద్దుగా చెలరేగింది.హేలీ విధ్వంసంకేవలం 107 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించింది. 142 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రీచరణి బౌలింగ్లో స్నేహ్ రాణాకు క్యాచ్ ఇవ్వడంతో హేలీ సునామీ ఇన్నింగ్స్కు తెరపడింది. ఆమెకు తోడుగా మరో ఓపెనర్ ఫోబే లిచ్ఫీల్డ్ 40, వన్డౌన్లో వచ్చిన ఎలిస్ పెర్రీ 47, ఆష్లే గార్డ్నర్ 45 పరుగులతో రాణించారు. ఆఖర్లో కిమ్ గార్త్ (14) సిక్సర్బాది ఆసీస్ విజయాన్ని ఖరారు చేసింది.It took another moment of brilliance to stop Alyssa Healy! 🙌Shree Charani ends her spell with 3 wickets, while Sneh Rana takes a stunner 🔥Will this wicket be the turning point of the match? 👀Catch the LIVE action ➡https://t.co/qAoZd44TEs#CWC25 👉 #INDvAUS | LIVE NOW… pic.twitter.com/NMKHPYlZ8q— Star Sports (@StarSportsIndia) October 12, 2025వరుసగా రెండు ఓటములు..కాగా వన్డే వరల్డ్కప్-2025లో భారత జట్టు ఇప్పటికే నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. తొలుత శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్సేన.. ఆ తర్వాత దాయాది పాకిస్తాన్ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసింది.అనంతరం సౌతాఫ్రికా, ఆసీస్ చేతుల్లో వరుస ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్లలో మెరుగైన ఫలితాలు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు విజయాలతో ఉన్న భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి.సెమీస్ చేరాలంటే..ఆస్ట్రేలియా (7), ఇంగ్లండ్ (6) తర్వాత హర్మన్సేన పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక భారత్ తదుపరి ఇంగ్లండ్ (అక్టోబరు 19), న్యూజిలాండ్ (23), బంగ్లాదేశ్ (అక్టోబరు 26) జట్లతో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్లలో గెలిస్తే నెట్రన్రేటుతో పనిలేకుండా టాప్-4లో నిలిచి.. నేరుగా సెమీస్లో అడుగుపెడుతుంది హర్మన్సేన.ఒకవేళ ఇంగ్లండ్ చేతిలో ఓడితే మాత్రం.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్లపై భారత జట్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. తద్వారా మరో నాలుగు పాయింట్లు సాధించి.. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో సెమీస్కు దూసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కంటే నెట్రన్రేటు పరంగా మెరుగ్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.చదవండి: ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా -
భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా?
వారిద్దరూ వరల్డ్ క్రికెట్లో పవర్ ఫుల్ జోడీ. ఒకరేమో తన యార్కర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపించే ఫాస్ట్ బౌలర్.. మరొకరు తన బ్యాటింగ్తో బౌలర్లకు చెమటలు పట్టించే డేంజరస్ ప్లేయర్. ముఖ్యంగా ఈ జంటకు ప్రత్యర్ధి భారత్ అయితే చాలు పూనకాలు వచ్చేస్తాయి. అతడు రెండేళ్ల కిందట తన బౌలింగ్తో వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియాకు గుండె కోత మిగల్చగా.. ఇప్పుడు అతడి భార్య మెరుపు బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించింది. ఈపాటికే ఆ స్టార్ జంట ఎవరన్నది మీకు ఆర్ధమై ఉంటుంది. వారిద్దరూ ఎవరో కాదు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు మిచెల్ స్టార్క్, అతడి భార్య అలీసా హీలీ. ఆసీస్ మెన్స్ టీమ్లో స్టార్క్ కీలక సభ్యునిగా కొనసాగుతుంటే.. మహిళల జట్టు కెప్టెన్గా హీలీ వ్యవహరిస్తోంది.హీలీ సూపర్ సెంచరీ..మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో హీలీ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు దారుణ ప్రదర్శన కనబరిచిన అలిస్సా .. భారత్పై మాత్రం విశ్వరూపాన్ని చూపించింది. 331 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. కేవలం 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్లతో 142 పరుగులు చేసి మ్యాచ్ను భారత్ నుంచి లాగేసుకుంది. ఆమె ఇన్నింగ్స్కు భారత అభిమానులు సైతం ఫిదా అయిపోయారు. ఆమె విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆసీస్ లక్ష్యాన్ని 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ వరల్డ్కప్లో ఆసీస్కు ఇది వరుసగా మూడో విజయం. అంతేకాకుండా మహిళల వన్డేలో అత్యధిక పరుగులు చేధించిన జట్టుగా కంగారులు నిలిచారు.కెప్టెన్గా అదుర్స్..ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా 2023లో హీలీ నియమించబడింది. అయితే అంతకుముందు చాలా మ్యాచ్లలో తాత్కాలిక కెప్టెన్గా ఆమె వ్యవహరించింది. మాగ్ లానింగ్ రిటైర్మెంట్ తర్వాత ఫుల్ టైమ్ కెప్టెన్గా హీలీ బాధ్యతలు స్వీకరించింది. ఆమె కెప్టెన్సీలో 55 మ్యాచ్లు ఆడిన ఆసీస్..42 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్లో టైటిల్ ఫేవరేట్గా ఆసీస్ బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.ప్రేమించి పెళ్లాడి..మిచెల్ స్టార్క్, హీలీది ప్రేమ వివాహం. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత వీరు 2016లో పెళ్లి చేసుకున్నారు. సిడ్నీకి చెందిన వీరిద్దరికి 9 ఏళ్ల వయస్సు నుంచే పరిచయం ఉంది. వారిద్దరూ అండర్-10 క్రికెట్ టోర్నీల్లో ఒకే జట్టు ప్రాతినిథ్యం వహించేవారు. 15 ఏళ్ల వరకు ఒకే టీంకు ఆడిన వీరు అనంతరం విడిపోయారు. పురుషుల జట్టుకు ఆడేందుకు స్టార్క్ వెళ్లగా... మహిళల జట్టుకు ఆడేందుకు హేలీ సిద్ధమైంది. 2013లో స్టార్క్ హేలీపై తన ప్రేమను బయటపెట్టాడు. అందుకు హీలీ కూడా ఓకే చెప్పడంతో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
మహిళల ప్రపంచకప్-2025లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఆదివారం వైజాగ్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 331 పరుగుల భారీ లక్ష్య చేధనలో కంగారుల కెప్టెన్ అలీసా హీలీ అద్భుత సెంచరీతో చెలరేగింది.107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 142 పరుగులు చేసిన హీలీ.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఫలితంగా భారీ టార్గెట్ను ఆసీస్ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. హీలీతో పాటు లీచ్ ఫీల్డ్(40), పెర్రీ(47), గార్డనర్(45) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.భారత బౌలర్లు ఆఖరిలో పోరాడినప్పటికి జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.ఆసీస్ వరల్డ్ రికార్డు..ఈ విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. శ్రీలంక జట్టులో 2024లో దక్షిణాఫ్రికాపై 302 పరుగుల టార్గెట్ను ఛేజ్ చేసింది. ఈ మ్యాచ్లో లంక కెప్టెన్ చమారి అటపత్తు (195* పరుగులు) భారీ శతకంతో మెరిసింది. అయితే తాజా మ్యాచ్తో లంక ఆల్టైమ్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది.మహిళల వన్డే క్రికెట్లో హైయిస్ట్ ఛేజింగ్లు ఇవే..1.ఆస్ట్రేలియా-భారత్(ప్రత్యర్ధి)-331/7 2.శ్రీలంక - దక్షిణాఫ్రికా (ప్రత్యర్ధి) -302/4 3.ఆస్ట్రేలియా -న్యూజిలాండ్ (ప్రత్యర్ధి)-289 4.ఆస్ట్రేలియా-భారత్ (ప్రత్యర్ధి)-283 5.ఆస్ట్రేలియా -భారత్ (ప్రత్యర్ధి)-282చదవండి: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ఆసియాలో తొలి బ్యాటర్ -
330 సరిపోలేదు.. భారత్పై ఆసీస్ గ్రాండ్ విక్టరీ
స్టార్ బ్యాటర్ స్మృతి ఫామ్లోకి వచ్చింది. ప్రతీక, జెమీమా కూడా రాణించారు. 330 పరుగుల భారీ స్కోరు నమోదైంది. పిచ్ బ్యాటింగ్కు కాస్త అనుకూలంగానే ఉన్నా... ఈ భారీ స్కోరును కాపాడుకోవచ్చని భారత మహిళలు భావించారు. కానీ అటువైపు ఉన్నది ఆస్ట్రేలియా... కెప్టెన్ అలీసా హీలీ నేతృత్వంలో డిఫెండింగ్ చాంపియన్ జట్టు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. చివర్లో కొన్ని అవకాశాలు సృష్టించుకొని భారత్ పట్టు బిగించినట్లు కనిపించినా... ప్రత్యర్థి విజయాన్ని ఆపడానికి అవి సరిపోలేదు. దాంతో గత మ్యాచ్ తరహాలోనే గెలుపునకు చేరువైనట్లు కనిపించినా... మరో ఓటమితో టీమిండియాకు నిరాశ తప్పలేదు. సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: సొంతగడ్డపై మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత్కు మరో నిరాశజనక ఫలితం ఎదురైంది. ఆదివారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో హోరాహోరీగా సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. అన్ని వరల్డ్కప్లలో కలిపి భారత్కు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు స్మృతి మంధాన (66 బంతుల్లో 80; 9 ఫోర్లు, 3 సిక్స్లు), ప్రతీక రావల్ (96 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు తొలి వికెట్కు 24.3 ఓవర్లలో 155 పరుగులు జోడించారు. ఆ్రస్టేలియా బౌలర్ అనాబెల్ సదర్లాండ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం ఆ్రస్టేలియా 49 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు సాధించి గెలిచింది. మహిళల వన్డేల చరిత్రలో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (107 బంతుల్లో 142; 21 ఫోర్లు, 3 సిక్స్లు) అద్భుత సెంచరీతో చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. భారత్ తమ తర్వాతి పోరులో ఈ నెల 19న ఇంగ్లండ్తో ఇండోర్లో తలపడుతుంది. నేడు విశాఖపట్నంలో జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్తో దక్షిణాఫ్రికా తలపడుతుంది. భారత ఓపెనర్లు ప్రతీక, స్మృతి ఇన్నింగ్స్ను జాగ్రత్తగా మొదలు పెట్టారు. ఫలితంగా తొలి 7 ఓవర్లలో 26 పరుగులే వచ్చాయి. పవర్ప్లే తర్వాత 11–15 ఓవర్లలో భారత్ 15 పరుగులే చేసింది. ఓపెనర్లు ధాటిని పెంచడంతో 21–24 మధ్య 4 ఓవర్లలోనే 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46 పరుగులు రావడం విశేషం. ఎట్టకేలకు స్మృతిని అవుట్ చేసి మోలినే ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకోగా, 30 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 192/1కు చేరింది. అయితే తర్వాతి బంతికే ప్రతీక వెనుదిరగ్గా, హర్మన్ప్రీత్ (22; 3 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగింది. అయితే జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు), రిచా ఘోష్ (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు ప్రదర్శిస్తూ స్కోరును 300 దాటించారు.వీరిద్దరు ఐదో వికెట్కు 34 బంతుల్లో 54 పరుగులు జత చేశారు. అయితే ఆఖర్లో భారీ షాట్లకు యత్నించి భారత బ్యాటర్లు వరుసగా వెనుదిరిగారు. 36 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ మరో 7 బంతుల ముందే ముగిసింది. ఓపెనర్ల దూకుడు... భారీ ఛేదనలో ఆసీస్కు ఓపెనర్లు హీలీ, లిచ్ఫీల్డ్ ఘనమైన ఆరంభం అందించారు. క్రాంతి ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్తో హీలీ దూకుడు కనబర్చగా, అమన్జోత్ ఓవర్లో లిచ్ఫీల్డ్ 4 ఫోర్లు బాదింది. తొలి వికెట్కు వీరిద్దరు 68 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. అయితే లిచ్ఫీల్డ్తో పాటు తక్కువ వ్యవధిలో బెత్ మూనీ (4), అనాబెల్ సదర్లాండ్ (0) అవుటయ్యారు. కానీ మరోవైపు హీలీ ఎక్కడా తగ్గకుండా ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ను నడిపించింది. ఈ క్రమంలోనే 84 బంతుల్లో ఆమె శతకం పూర్తి చేసుకుంది. ఆసీస్ విజయానికి చేరువవుతున్న దశలో ఒక్కసారిగా భారత బౌలర్లు పైచేయి సాధించారు. ఫలితంగా 38 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే ఒత్తిడిని అధిగమించి ఆసీస్ ఒక ఓవర్ ముందే గెలిచింది.112 స్మృతి 5 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు పట్టిన ఇన్నింగ్స్ల సంఖ్య. మహిళల వన్డేల్లో అందరికంటే వేగంగా ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే ఇన్నింగ్స్లో ఒకే ఏడాది 1000 పరుగులు చేసిన తొలి క్రికెటర్గా కూడా స్మృతి గుర్తింపు పొందింది.331 మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. శ్రీలంక జట్టు (302 దక్షిణాఫ్రికాపై 2024లో) పేరిట ఉన్న రికార్డును ఆస్ట్రేలియా అధిగమించింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) పెరీ (బి) సదర్లాండ్ 75; స్మృతి (సి) లిచ్ఫీల్డ్ (బి) మోలినే 80; హర్లీన్ (సి) సదర్లాండ్ (బి) మోలినే 38; హర్మన్ప్రీత్ (సి) మోలినే (బి) షుట్ 22; జెమీమా (సి) మూనీ (బి) సదర్లాండ్ 33; రిచా (సి) (సబ్) వేర్హమ్ (బి) సదర్లాండ్ 32; అమన్జోత్ (సి) మోలినే (బి) గార్డ్నర్ 16; దీప్తి (సి) మూనీ (బి) మోలినే 1; స్నేహ్ (నాటౌట్) 8; క్రాంతి (సి) (సబ్) వేర్హమ్ (బి) సదర్లాండ్ 1; శ్రీచరణి (బి) సదర్లాండ్ 0; ఎక్స్ట్రాలు 24; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 330. వికెట్ల పతనం: 1–155, 2–192, 3–234, 4–240, 5–294, 6–309, 7–320, 8–327, 9–330, 10–330. బౌలింగ్: గార్త్ 5–0–35–0, షుట్ 6.1–0–37–1, యాష్లే గార్డ్నర్ 7–0–40–1, మోలినే 10–1–75–3, సదర్లాండ్ 9.5–0–40–5, తాలియా మెక్గ్రాత్ 4.5–0–43–0, అలానా కింగ్ 6–0–49–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) స్నేహ్ (బి) శ్రీచరణి 142; లిచ్ఫీల్డ్ (సి) స్నేహ్ (బి) శ్రీచరణి 40; ఎలీస్ పెరీ (నాటౌట్) 47; మూనీ (సి) రోడ్రిగ్స్ (బి) దీప్తి 4; సదర్లాండ్ (బి) శ్రీచరణి 0; యాష్లే గార్డ్నర్ (బి) అమన్జోత్ 45; తాలియా మెక్గ్రాత్ (ఎల్బీ) (బి) దీప్తి 12; మోలినే (ఎల్బీ) (బి) అమన్జోత్ 18; కిమ్ గార్త్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 9; మొత్తం (49 ఓవర్లలో 7 వికెట్లకు) 331. వికెట్ల పతనం: 1–85, 2–168, 3–170, 4–265, 5–279, 6–299, 7–303. బౌలింగ్: అమన్జోత్ 9–0–68–2, క్రాంతి 9–1–73–0, స్నేహ్ రాణా 10–0–85–0, శ్రీచరణి 10–1–41–3, దీప్తి 10–0–52–2, హర్మన్ప్రీత్ 1–0–10–0. -
World Cup 2025: పాక్ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC World Cup)లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. టోర్నీలో తొలుత న్యూజిలాండ్ వుమెన్ను 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన ఆసీస్ జట్టు.. తాజాగా పాకిస్తాన్ (Aus W vs Pak W)పై ఘన విజయం సాధించింది.కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన ఆసీస్.. పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్ఫీల్డ్ (10).. వన్డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (5) విఫలం కావడంతో ఆసీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.మూనీ సెంచరీ.. అలనా హాఫ్ సెంచరీఆ తర్వాత కూడా పాక్ బౌలర్లు విజృంభించడంతో ఐదో నంబర్ ప్లేయర్ అనాబెల్ సదర్లాండ్ (1) సహా ఆ తర్వాత వచ్చిన ఆష్లే గార్డ్నర్ (1), తహీలా మెగ్రాత్ (5), జార్జియా వారేహామ్ (0), కిమ్ గార్త్ (11) పెవిలియన్కు క్యూ కట్టారు.ఈ నేపథ్యంలో కేవలం 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆసీస్ను బెత్ మూనీ (Beth Mooney), అలనా కింగ్ అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకున్నారు. మూనీ 114 బంతుల్లో 109 పరుగులతో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.చెలరేగిన ఆసీస్ బౌలర్లుఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. కిమ్ గార్త్ బౌలింగ్లో ఓపెనర్ సదాఫ్ షమాస్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించగా.. మునీబా అలీ (3)ని మేగన్ షట్ వెనక్కి పంపింది. అయితే, వన్డౌన్లో వచ్చిన సిద్రా ఆమిన్ (35) కాసేపు పోరాడగా.. ఆష్లే గార్డ్నర్ ఆమెను అవుట్ చేసింది.ఇక నాలుగో నంబర్ బ్యాటర్ సిద్రా నవాజ్ (5) వికెట్ను కిమ్ గార్త్ తన ఖాతాలో వేసుకోగా.. నటాలియా పర్వేజ్ (1)ను మేగన్ పెవిలియన్కు పంపింది. ఇక కెప్టెన్ ఫాతిమా సనా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సదర్లాండ్ బౌలింగ్లో బౌల్డ్ కాగా.. డయానా బేగ్ (7)ను జార్జియా వారేహామ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది.114 పరుగులకే కుప్పకూలిన పాక్ఈ క్రమంలో 86 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్ను లక్ష్యం దిశగా నడిపించేందుకు స్పిన్నర్లు రమీన్ షమీమ్ (15), నష్రా సంధు (11) విఫలయత్నం చేశారు. అయితే, అలనా బౌలింగ్లో నష్రా తొమ్మిదో వికెట్గా.. సదర్లాండ్ బౌలింగ్లో షమీమ్ పదో వికెట్గా వెనుదిరగడంతో పాక్ పోరాటం ముగిసిపోయింది.ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. ఆసీస్ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ తమ రెండో మ్యాచ్లో శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ పడకుండానే ఆ మ్యాచ్ రద్దైపోయింది.చదవండి: అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
World Cup 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఈజ్ బ్యాక్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ అలిస్సా హీలీ తిరిగి టీమ్లోకి వచ్చింది. దీంతో ఈ మెగా టోర్నీలో ఆసీస్ జట్టుకు హీలీ నాయకత్వం వహించనుంది.ఇది ఆమెకు మూడో వన్డే ప్రపంచకప్ కావడం గమనార్హం. ఇక ఈ జట్టులో ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, యాష్ గార్డ్నర్, తహ్లియా మెక్గ్రాత్, మేగాన్ షుట్, వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అదేవిధంగా స్టార్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. దీంతో ఆసీస్ స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది.స్పిన్ యూనిట్లో మోలినెక్స్తో పాటు అలానా కింగ్, జార్జియా వేర్హామ్ కూడా ఉన్నారు. మరోవైపు యువ ఆటగాళ్లు జార్జియా వోల్, ఫోబ్ లిచ్ఫీల్డ్, వేర్హామ్, కిమ్ గార్త్ వంటి యువ ప్లేయర్లు తొలిసారి వన్డే ప్రపంచకప్లో ఆడనున్నారు.అయితే ఈ ప్రధాన టోర్నీకి ముందు భారత మహిళల జట్టుతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో కూడా ప్రపంచకప్కు ఎంపికైన ఆసీస్ జట్టే భాగం కానుంది. అదనంగా వికెట్ కీపర్ నికోల్ ఫాల్టమ్, ఆల్ రౌండర్ చార్లీ నాట్ భారత్తో సిరీస్లో ఆడనున్నారు.ఈ సిరీస్ ముగిశాక వీరిద్దరూ తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. ఆసీస్ తమ వరల్డ్కప్ ప్రయణాన్ని ఆక్టోబర్ 1న న్యూజిలాండ్ మ్యాచ్తో ఆరంభించనుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే రికార్డు స్దాయిలో ఏడు సార్లు ప్రపంచ కప్ విజేతగా ఆసీస్ నిలిచింది.వరల్డ్కప్కు ఆసీస్ జట్టుఅలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్ఫీల్డ్, సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.చదవండి: Asia Cup 2025: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్లుగా బాబర్ ఆజం, జైశ్వాల్ -
‘స్పిన్ సవాలు ఎదుర్కోవాల్సిందే’
బ్రిస్బేన్: భారత్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్లో స్పిన్ సవాలు ఎదురవడం ఖాయమని ఆ్రస్టేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ పేర్కొంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఏడుసార్లు వరల్డ్కప్ టైటిల్ గెలుచుకున్న ఆ్రస్టేలియా జట్టు ఎనిమిదోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. 2022లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన వరల్డ్కప్లో ఆసీస్ ఘనవిజయం సాధించగా... డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అదే తీవ్రత కొనసాగించాలని భావిస్తున్నట్లు హీలీ వెల్లడించింది. భారత మహిళల ‘ఎ’ జట్టుతో మూడో వన్డేలో హీలీ అజేయ శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం హీలీ మాట్లాడుతూ... భారత్, శ్రీలంక వేదికగా వచ్చే నెలలో ప్రారంభంకానున్న వరల్డ్కప్లో స్పిన్ కీలక పాత్ర పోషించనుందని వెల్లడించింది. ‘భారత్ ‘ఎ’ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వరల్డ్కప్లో మాకు మరింత స్పిన్ సవాలు ఎదురుకానుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడం కీలకం’ అని హీలీ పేర్కొంది. ఆ్రస్టేలియా ‘ఎ’తో వన్డే సిరీస్లో భారత ‘ఎ’ జట్టు తరఫున రాధ యాదవ్, మిన్ను మణి, తనూజ కన్వర్, ప్రేమ రావత్ స్పిన్ బాధ్యతలు నిర్వర్తించారు. మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన హీలీ... రెండో వన్డేలో 91 పరుగులతో సెంచరీ చేజార్చుకుంది. ఇక ఆదివారం జరిగిన సిరీస్ చివరి వన్డేలో 85 బంతుల్లోనే 23 ఫోర్లు, 3 సిక్స్లతో అజేయంగా 137 పరుగులు చేసి ఫామ్ చాటుకుంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు హీలీ సత్తాచాటడం ఆ్రస్టేలియా జట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆసీస్ మహిళల ‘ఎ’ జట్టు కోచ్ డాన్ మార్‡్ష అన్నాడు. ‘భారత్లో వన్డే ప్రపంచకప్ వంటి మెగాటోర్నీకి ముందు అలీసాకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దక్కింది. భారత ‘ఎ’ జట్టుతో టి20, వన్డే సిరీస్లతో హీలీ చక్కటి ప్రదర్శన కనబర్చింది. చివరి వన్డేలో సాధించిన అజేయ శతకం మెగా టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది’ అని మార్‡్ష పేర్కొన్నాడు. -
అలీసా అదరహో
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా గడ్డపై ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల ‘ఎ’ జట్టు చివరి మ్యాచ్లో పరాజయం పాలైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడి 2–1తో సిరీస్ ఖాతాలో వేసుకుంది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (85 బంతుల్లో 137 నాటౌట్; 23 ఫోర్లు, 3 సిక్స్లు) విజృంభించడంతో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు అలవోకగా విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత ‘ఎ’ జట్టు 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (59 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... వికెట్ కీపర్ యస్తిక భాటియా (54 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. నందిని కశ్యప్ (53 బంతుల్లో 28; 2 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (32 బంతుల్లో 18; 2 ఫోర్లు), తనూశ్రీ సర్కార్ (22 బంతుల్లో 17), కెప్టెన్ రాధా యదవ్ (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తేజల్ హసబ్నిస్ (1) విఫలమైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో తహిలా మెక్గ్రాత్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. సియానా జింజర్ 50 పరుగులిచ్చి 2 వికెట్లు, ఎల్లా హేవార్డ్ 43 పరుగులిచ్చి 2 వికెట్లు, అనిక లెరాయిడ్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 27.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 222 పరుగులు చేసింది. హీలీ అజేయ శతకంతో చెలరేగగా... తహీలా విల్సన్ (51 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ఇక్కడే ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్ జరగనుంది.దంచికొట్టిన హీలీ..గాయం నుంచి కోలుకొని వచ్చిన అలీసా హీలీ... భారత ‘ఎ’ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్లను సంపూర్ణంగా వినియోగించుకుంది. మొదట టి20 సిరీస్తో లయ అందుకున్న హీలీ... వన్డే సిరీస్లో అదరగొట్టింది. గత మ్యాచ్లో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న అలీసా... ఈ మ్యాచ్లో అజేయ శతకంతో అదరగొట్టింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హీలీ ఇచ్చిన క్యాచ్ను భారత ఫీల్డర్లు నేలపాలు చేయగా... దాన్ని వినియోగించుకున్న ఆస్ట్రేలియా సీనియర్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బౌండరీలతో చెలరేగింది. రెండో ఓవర్లో ఫోర్తో మోత ప్రారంభించిన హీలీ... భారీ సిక్స్తో లక్ష్యఛేదనను పూర్తి చేసేంతవరకు అదే జోరు కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ బౌలర్ షబ్నమ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ... మిన్ను మణి, తనూజ కన్వర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టింది. మరో ఎండ్ నుంచి తహిలా విల్సన్ కూడా ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. షబ్నమ్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. తొలి వికెట్కు 137 పరుగులు జోడించిన అనంతరం తహిలా వెనుదిరగగా... హీలీ మాత్రం అదే జోష్ కనబర్చింది. మిన్ను మణి వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 4, 4, 6 కొట్టి 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఎండ్ నుంచి రాచెల్ (21 నాటౌట్) సహకారం లభించడంతో హీలీ జట్టును విజయతీరాలకు చేర్చింది -
మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. ఆస్ట్రేలియాకు కంటితుడుపు విజయం
ఆస్ట్రేలియా ఏ మహిళల జట్టుతో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపు ఆసీస్కు కంటితుడుపుగా మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే కైవసం చేసుకుంది (తొలి రెండు వన్డేలు గెలిచి).మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తడబడింది. ఆసీస్ బౌలర్లు తహ్లియా మెక్గ్రాత్ (8-0-40-3), అనిక లియారాయ్డ్ (3-0-16-2), ఎల్లా హేవర్డ్ (10-0-40-2), సియన్నా జింజర్ (8.4-0-50-2), లూసీ హ్యామిల్టన్ (10-2-34-1) సత్తా చాటడంతో 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (52), యస్తికా భాటియా (42) పోరాటపటిమ కనబర్చి భారత్కు ఈ మాత్రం స్కోరైన అందించారు.వీరు మినహా టీమిండియాలో ఎవరూ రాణించలేదు. నందిని కశ్యప్ (28), రఘవి బిస్త్ (18), తనుశ్రీ సర్కార్ (17), కెప్టెన్ రాధా యాదవ్ (18), తనుజా కన్వర్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. తేజల్ హసబ్నిస్ (1), మిన్నూ మణి (5), సైమా ఠాకోర్ (0), షబ్నమ్ షకీల్ (7 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అలిస్సా హీలీ (మిచెల్ స్టార్క్ భార్య) (84 బంతుల్లో 137 నాటౌట్; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి శతకంతో ఆసీస్ను విజయతీరాలకు చేర్చింది. ఆమెకు మరో ఓపెనర్ తహ్లియా విల్సన్ (59), రేచల్ ట్రెనామన్ (21 నాటౌట్) సహకరించారు.ఈ మ్యాచ్లో ఓడినా భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో గెలుచుకుంది. టీ20ల్లో ఎదురైన పరాభవానికి భారత్ వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
IND vs AUS: స్టార్ ఓపెనర్ విఫలం.. భారత జట్టుకు తప్పని ఓటమి
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ మహిళా జట్టు (AUS A W vs IND A W)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. మొదటి టీ20 మ్యాచ్లో రాధా యాదవ్ (Radha Yadav) సేన ఆసీస్-‘ఎ’ మహిళా జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించలేకపోయింది.కాగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత యువ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆసీస్తో మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు, ఓ అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం టీ20 సిరీస్ ఆరంభమైంది.అనికా హాఫ్ సెంచరీమకాయ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు సాధించింది. ఓపెనర్లలో ఆస్ట్రేలియా రెగ్యులర్ జట్టు కెప్టెన్ అలిసా హేలీ (18 బంతుల్లో 27) ఫరవాలేదనిపించగా.. తహీలా విల్సన్ (23 బంతుల్లో 17) మాత్రం విఫలమైంది.ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ అనికా లియరాడ్ అద్భుత ఇన్నింగ్స్తో అలరించింది. 44 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మిగతా వాళ్లలో కోర్ట్నీ (11), కెప్టెన్ నికోల్ ఫాల్టమ్ (11) మాత్రం డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు.స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ విఫలంభారత బౌలర్లలో సైమా ఠాకూర్, సీజవన్ సజన చెరో వికెట్ తీయగా.. ప్రేమా రావత్ మూడు వికెట్లతో సత్తా చాటింది. ఇక 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ (3) దారుణంగా విఫలమైంది. వన్డౌన్లో వచ్చిన ధారా గుజ్జర్ (7), ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన దినేశ్ వ్రింద (5) కూడా నిరాశపరిచారు.రాఘవి బిస్త్ మెరుపులు వృథాఇలాంటి క్లిష్ట దశలో మరో ఓపెనర్ ఉమా ఛెత్రి (31 బంతుల్లో 31) మెరుగ్గా ఆడగా.. రాఘవి బిస్త్ (20 బంతుల్లో 33) ఆఖర్లో మెరుపులు మెరిపించింది. ఈమెకు తోడుగా కెప్టెన్ రాధా యాదవ్ (22 బంతుల్లో 26) రాణించింది. కానీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసిన భారత జట్టు.. విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఆసీస్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య శనివారం (ఆగష్టు 9) రెండో టీ20కి షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IND vs WI: టీమిండియాకు భారీ షాక్! -
WPL 2025: యూపీ వారియర్స్కు కొత్త కెప్టెన్
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టీ20 క్రికెట్ టోర్నమెంట్లో మరో జట్టుకు కొత్త కెప్టెన్ నియామకం జరిగింది. ఈనెల 14 నుంచి జరిగే మూడో సీజన్లో యూపీ వారియర్స్ జట్టుకు భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) నాయకత్వం వహించనుంది. గత సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ అలీసా హీలీ కెప్టెన్సీలో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టు బరిలోకి దిగింది.అయితే గాయం కారణంగా అలీసా హీలీ మూడో సీజన్ డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగింది. దాంతో యూపీ వారియర్స్కు కొత్త కెప్టెన్గా దీప్తి శర్మను నియమించారు. గత సీజన్లో దీప్తి శర్మ ఎనిమిది ఇన్నింగ్స్లు ఆడి 136.57 స్ట్రయిక్రేట్తో 295 పరుగులు సాధించడంతోపాటు 10 వికెట్లు తీసింది. గత సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు బెత్ మూనీ కెప్టెన్ వ్యవహరించగా... ఈసారి ఆస్ట్రేలియాకే చెందిన ఆస్లీ గార్డ్నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైంది. డబ్ల్యూపీఎల్లోని మిగతా మూడు జట్లకు హర్మన్ప్రీత్ (ముంబై ఇండియన్స్), స్మృతి మంధాన (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్) కెప్టెన్లుగా ఉన్నారు. లంకపై ఘన విజయం.. సిరీస్ ఆసీస్దేగాలె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... శ్రీలంకలో 14 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ అందుకుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్ను 2–0తో చేజిక్కించుకుంది. కంగారూ జట్టు చివరిసారిగా 2011లో శ్రీలంకలో టెస్టు సిరీస్ గెలిచింది. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించిన ఆసీస్... లంక పర్యటనలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్నైట్ స్కోరు 211/8తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 68.1 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (50; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కంగారూ బౌలర్లలో కూనెమన్, లయన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. కుశాల్ మెండిస్ క్యాచ్ పట్టడం ద్వారా టెస్టు క్రికెట్లో 200 క్యాచ్లు అందుకున్న ఐదో ప్లేయర్గా ఆ్రస్టేలియా కెప్టెన్ స్మిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 17.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (27 నాటౌట్), ట్రావిస్ హెడ్ (20), లబుషేన్ (26 నాటౌట్) రాణించారు. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... స్మిత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. కరుణరత్నే వీడ్కోలు శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే పరాజయంతో కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఈ పోరు ద్వారా టెస్టు క్రికెట్లో 100 మ్యాచ్లు పూర్తి చేసుకున్న 36 ఏళ్ల కరుణరత్నే మాట్లాడుతూ... ‘కెరీర్ ఆరంభంలో ఒక్క టెస్టు మ్యాచ్ ఆడితే చాలు అనుకున్నా. వంద మ్యాచ్లు ఆడటం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నాడు. సుదీర్ఘ కెరీర్లో కరుణరత్నే 39.25 సగటుతో 7,222 పరుగులు చేశాడు. అందులో 16 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
Fab Four: ‘కోహ్లి కాదు.. అతడే నంబర్ వన్’
క్రికెట్ నవ యుగంలో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లలో టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ లెజండరీ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ముందు వరుసలో ఉంటారు. కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై శతకాలతో సత్తా చాటగా.. టెస్టుల్లో రూట్ అత్యధిక పరుగుల జాబితాలో మున్ముందుకు దూసుకెళ్తున్నాడు.ఫ్యాబ్ ఫోర్లో బెస్ట్ ఎవరు?మరోవైపు స్మిత్, విలియమ్సన్ సైతం తమ మార్కును చూపిస్తూ తమ తమ జట్లను విజయపథంలో నిలుపుతున్నారు. అందుకే.. ఈ నలుగురిని కలిపి ‘ఫ్యాబ్ ఫోర్’గా పిలుచుకుంటారు క్రికెట్ ప్రేమికులు. అయితే, వీరిలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు మాత్రం ‘ఫ్యాబ్ ఫోర్’ అభిమానులు సైతం ఏకాభిప్రాయానికి రాలేరు.కోహ్లికి ఆఖరి ర్యాంకు ఇస్తాతాను కూడా అందుకు అతీతం కాదంటోంది ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ అలిసా హేలీ.‘ ఫ్యాబ్ ఫోర్’ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వారంతా గొప్ప బ్యాటర్లు. అయితే, వారికి ర్యాంకు ఇవ్వాలంటే మాత్రం నేను కోహ్లిని నాలుగో స్థానానికే పరిమితం చేస్తా. ఇది నేను సరదాకి చెప్తున్న మాట కాదు.మిగతా వాళ్లతో పోలిస్తేఅన్ని రకాలుగా విశ్లేషించిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నా. నిజానికి మిగతా ముగ్గురితో పోలిస్తే కోహ్లి చాలా ఎక్కువగా క్రికెట్ ఆడాడు. అందుకే అతడి గణాంకాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టి చూస్తే మాత్రం కోహ్లికి నంబర్ 1 రేటింగ్ ఇవ్వాల్సిందే’’ అని అలిసా హేలీ ఓ పాడ్కాస్ట్లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.అతడే నంబర్ వన్తన అభిప్రాయం ప్రకారం ఈ నలుగురిలో కేన్ విలియమ్సన్కు అగ్రస్థానం ఉంటుందని.. ఆ తర్వాతి స్థానాల్లో స్మిత్, రూట్, కోహ్లి ఉంటారని తెలిపింది. విలియమ్సన్ కారణంగా కివీస్ జట్టు మొత్తానికి పేరు వచ్చిందని.. అయితే, కోహ్లి ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ మాత్రమేనని హేలీ పేర్కొంది. ఎనిమిదిసార్లు ప్రపంచకప్ను ముద్దాడిందిఅదే విధంగా.. టీమిండియా తరఫున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆఖరికి రవీంద్ర జడేజా కూడా సెంచరీలు బాదగలరని.. అయితే.. జట్టు భారం మొత్తాన్ని మోయగల విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కొంతమందే ఉంటారని అభిప్రాయపడింది.కాగా ఆస్ట్రేలియా మేటి బ్యాటర్గా ఎదిగిన అలిసా హేలీ ఆరుసార్లు టీ20 ప్రపంచకప్, రెండుసార్లు వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్లలో సభ్యురాలు. అంతేకాదు.. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్ భార్య కూడా! చదవండి: Musheer Khan: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్! -
ఆస్ట్రేలియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
సిడ్నీ: బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... మహిళల టి20 ప్రపంచకప్ కోసం అక్కడికి వెళ్లడం సరికాదని ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ అభిప్రాయపడింది. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న దేశంపై ఇది మరింత ఒత్తిడి కలిగిస్తుందని హీలీ వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్లో ఏర్పడిన రాజకీయ అస్థిరత హింసకు దారితీయగా... వందలాది మంది మృత్యువాత పడ్డారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడగా... మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 19 వరకు బంగ్లాదేశ్ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. మొత్తం 10 జట్లు పాల్గొననున్న ఈ టోర్నీలో ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో హీలీ మాట్లాడుతూ... ‘ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఆడటం కష్టంగా ఉంది. నైతికంగా ఇది సరైంది కాదనిపిస్తోంది. టోర్నీ అక్కడే నిర్వహించాలా వద్దా అనే విషయం ఐసీసీ పరిధిలోకి వస్తుంది. మా వరకైతే టి20 వరల్డ్కప్ కోసం మెరుగ్గా సిద్ధమవుతున్నాం. టోర్నీ ఎక్కడ జరిగినా సత్తా చాటగలమనే నమ్మకం ఉంది’ అని పేర్కొంది. 2014 టి20 ప్రపంచకప్ తర్వాత.. ఇటీవలే ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించింది. పరిమిత ఓవర్ల సిరీస్లలో భాగంగా ఆడిన 3 వన్డేలు, మూడు టి20ల్లోనూ విజయం సాధించింది. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్లో టి20 వరల్డ్కప్ నిర్వహించాలా వద్దా అనే విషయంపై ఈరోజు ఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ వేదిక మార్చాలనుకుంటే మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆతిథ్య రేసులో ముందుంది. -
ఆస్ట్రేలియా భారీ స్కోర్
వడోదర : మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం భారత మహిళల జట్టుతో జరుగుతున్న నామమాత్రమైన మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కీపర్ అలైసా హేలీ (133;115బంతుల్లో17 ఫోర్లు, 2సిక్సర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించింది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా తరపున భారత్పై అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది. ఆస్ట్రేలియా 64 పరుగులకే నికోల్ బోల్టన్(11), లాన్నింగ్(18) వికెట్లను కోల్పోగా, అలైసా హేలీ-ఎలైస్ పెర్రీ జట్టును కాపాడే ప్రయత్నం చేశారు. ఈ జోడి 79 పరుగులు జోడించిన అనంతరం పెర్రీ (32) మూడో వికెట్గా పెవిలియన్కు చేరింది. తరువాత వచ్చిన ప్లెయర్స్లో రాచెల్ హేన్స్ (43, 39బంతుల్లో 5ఫోర్లు), యాష్లే గార్డనర్ (35, 20బంతుల్లో 6 ఫోర్లు), మూనీ(34, 19బంతుల్లో 5ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోర్ సాధించింది. హర్మన్ప్రీత్ కౌర్ రెండు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ, శిఖా పాండే, ఏక్తా బిస్త్, పూనం యాదవ్ తలో వికట్ తీశారు. మూడు వన్డేల సిరీస్ను 0-2తో భారత మహిళా జట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎక్తాబిస్త్కు గాయం భారత క్రీడాకారిణి ఏక్తా బిస్త్ బౌలింగ్ చేస్తూ గాయపడటంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడింది. -
ఇంటివారైన స్టార్క్, అలీసా
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిషెల్ స్టార్క్, మహిళల జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ గతేడాది ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీకి అలీసా మేనకోడలు. ప్రస్తుతం ఈమె ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతుండగా... స్టార్క్ గాయం కారణంగా రెండు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
తూనీగా... తూనీగా..!
ప్రస్తుత క్రికెట్లో ప్రేమికుల జంట స్టార్క్, అలీసా 15 సంవత్సరాల స్నేహం ప్రేమగా మారిన వైనం ఏప్రిల్ 3, 2014... వేదిక మిర్పూర్... ఆస్ట్రేలియా , వెస్టిండీస్... మహిళల టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్.. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా ఒకరిద్దరు మ్యాచ్ను వీక్షిస్తున్నారు.. స్లాగ్ ఓవర్లలో ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వీఐపీ లాంజ్లో కూర్చున్న ఓ వ్యక్తి చప్పట్లు చరుస్తూ బ్యాట్స్వుమన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. అతని ప్రోత్సాహంతో క్రీజ్లో ఉన్న ఆమె రెట్టించిన ఉత్సాహంతో ఫోర్లతో విరుచుకుపడుతోంది. ఆ ఇన్నింగ్సే ఆసీస్ జట్టు విజయానికి కారణమైంది. చివరికి వెస్టిండీస్పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ బ్యాట్స్వుమన్ను ప్రోత్సహించింది ఎవరో కాదు ఆస్ట్రేలియా యువ పేస్ బౌలర్ స్టార్క్.. ఫోర్లతో విరుచుకుపడింది ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ సోదరి కూతురు అలీసా హీలీ... ఇద్దరు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆస్ట్రేలియా పురుషుల జట్టు గ్రూప్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టినా... స్టార్క్ మాత్రం బంగ్లాదేశ్లోనే ఉండిపోయి మహిళల జట్టును ప్రోత్సహించడానికి అలీసా హీలీతో ప్రేమాయణమే కారణం.. 24 ఏళ్ల వయసున్న వీళ్లిద్దరూ దాదాపుగా రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. లవ్ ఇన్ సిడ్నీ... మిచెల్ స్టార్క్.. అలీసా హీలీ.. ఒకరికి మరొకరు 15 ఏళ్లుగా పరిచయం.. 9 ఏళ్ల వయసులో సిడ్నీలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నారు. వికెట్ కీపర్లుగా ఇద్దరూ క్రికెట్ కెరీర్ను ప్రారంభించారు. ఆరేళ్ల పాటు ఒకే జట్టుతో కలసి క్రికెట్ ఆడారు. స్టార్క్ వికెట్ కీపింగ్ వదిలేసి పేస్ బౌలింగ్పై దృష్టి పెట్టగా.. అలీసా మాత్రం వికెట్ కీపింగ్నే కొనసాగించింది. 15 ఏళ్ల వయసులో అలీసా మహిళల క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఇద్దరూ చిన్ననాటి పరిచయాన్ని కొనసాగించారు. క్రికెట్నే ప్రొఫెషనల్గా ఎంచుకుని జాతీయ జట్టులో చోటు సంపాదించారు. 2011లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు భారత పర్యటనకు వెళ్లేముందు దొరికిన కాస్త సమయం వీళ్లిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందని తెలిసేలా చేసింది. అయితే చిన్ననాటి పరిచయం ప్రేమగా మారింది మాత్రం 2012లోనే.. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్నారు.. అప్పటి నుంచి ప్రేమపక్షులుగా మారిపోయారు. ఓ వైపు క్రికెట్ కెరీర్కు ఎలాంటి ఇబ్బంది రాకుండా... మరోవైపు ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు.


