
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలిటెస్టు తుది అంకానికి చేరుకుంది. గత నాలుగు రోజుల నుంచి హోరా హోరీగా సాగుతున్న ఈ మ్యాచ్ ఫలితం మంగళవారం తేలిపోనుంది. తొలి ఇన్నింగ్స్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో కూడా సత్తాచాటారు.
దీంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. లక్ష్య చేధనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. దూకుడుగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్టోక్స్ సేన భావిస్తుంటే.. భారత జట్టు మాత్రం ప్రత్యర్ధిని ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.
వర్షం ముప్పు..
అయితే భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశముంది. ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆక్యూవెధర్, బీబీసీ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో లీడ్స్లో వర్షం పడటానికి 40 శాతం ఆస్కారం ఉంది. స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం 11:00 గంటలకు ఆఖరి రోజు ఆట ఆరంభం కానుంది. ఒకవేళ రిపోర్ట్స్ ప్రకారం.. మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగిస్తే తొలి టెస్టు డ్రాగా ముగిసే ఛాన్స్ ఉంది.
ఆక్యూ వెదర్ రిపోర్ట్..
మధ్యాహ్నం 2:30 (స్దానిక కాలమానం ఉదయం 10 గంటలకు 55% వర్షం పడే అవకాశం)
మధ్యాహ్నం 3:30 (స్దానిక కాలమానం ఉదయం 11 గంటలకు 40% వర్షం పడే అవకాశం)
మధ్యాహ్నం 4:30 (స్దానిక కాలమానం ఉదయం 12 గంటలకు 43% వర్షం పడే అవకాశం)
సాయంత్రం 6:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 2 గంటలకు 47 % వర్షం పడే అవకాశం)
సాయంత్రం 7:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 3 గంటలకు 52 % వర్షం పడే అవకాశం
రాత్రి 8:30-10:30( స్ధానిక కాలమనం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 50 % వర్షం పడే అవకాశం)
చదవండి: చరిత్ర సృష్టించిన కిరాన్ పొలార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా