తమిళనాడు: రీల్స్ను వాట్సాప్ స్టేటస్గా పెట్టడం వల్ల గొడవ జరగడంతో భార్యపై దాడి చేసిన ఐటీ కంపెనీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. సేలంకు చెందిన శ్రీకాంత్ (24), అభిరామి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు చెన్నైలో నివసిస్తున్నారు. అభిరామి తన వాట్సాప్ స్టేటస్లో అత్తని కోడలు పని చేయమని పురమాయించేలా ఉన్న ఒక ఫన్నీ రీల్ను పోస్ట్ చేసింది.
దీన్ని చూసిన శ్రీకాంత్ సోదరి అతనికి సమాచారం అందించింది.దీనిపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో అభిరామి తన పుట్టింటికి వెళ్లిపోయింది. జూలై 9న శ్రీకాంత్ అక్కడికి వెళ్లి మళ్లీ గొడవ పడి, ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అభిరామి ఆసుపత్రిలో చేరింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు.


