కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్! | Actress Colors Swathi Reddy Gave Clarity On Her Divorce Rumours - Sakshi
Sakshi News home page

Swathi Reddy: విడాకులపై స్పందించిన కలర్స్ స్వాతి.. ఏమందంటే?

Sep 26 2023 3:42 PM | Updated on Sep 26 2023 4:16 PM

Actress Colors Swathi Reddy Clarity On Her Divorce Romours - Sakshi

కలర్స్ స్వాతి తెలుగువారికి పరిచయం ‍అక్కర్లేని పేరు. డేంజర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగమ్మాయి.. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఫేమస్ అయింది. ఆ తర్వాత అష్టా చెమ్మా, త్రిపుర, కలవరమాయే మదిలో, మిరపకాయ్ చిత్రాల్లో నటించింది. తాజాగా మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో త్రిపురలో కలిసి నటించిన నవీన్ చంద్రతో మరోసారి కనిపించనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానాలిచ్చింది. 

(ఇది చదవండి: వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే..)

ఈవెంట్‌లో పాల్గొన్న కలర్స్‌ స్వాతికి ఆసక్తికర ప్రశ్నలు వేశారు. మీపై ఇటీవల డైవర్స్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి కదా.. వీటిపై మీ సమాధానమేంటి అని అడిగారు. అయితే దీనికి స్వాతి సైతం అదే రీతిలో స్పందించింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటి వాటికి నేను సమాధానం కూడా ఇవ్వను అంటూ తెగేసి చెప్పింది. 

స్వాతి మాట్లాడుతూ..' నేను కలర్స్ ప్రోగ్రామ్‌లో చేస్తున్నప్పుడు నా వయసు కేవలం పదహారేళ్లు. అప్పట్లో అయితే సోషల్ మీడియా కూడా లేదు. నన్ను నేను ఎలా ప్రజెంట్‌ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అప్పుడు కనుక సోషల్ మీడియా ఉండి ఉంటే నన్ను ఫుట్‌ బాల్ ఆడేసేవారేమో అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడేలా హ్యాండిల్ చేస్తున్నారే తెలియదు. ఒక యాక్టర్‌గా నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. అందుకే ఈ విషయం గురించి నేను చెప్పను.' ‍అని అన్నారు. కాగా.. ప్రస్తుతం కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

(ఇది చదవండి: 40 ఏళ్లలో సంపాదించిన ఆస్తి, నగలు.. అన్నీ పోగొట్టుకున్నా: నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement