తన తల్లిదండ్రులని తలుచుకుని హీరో నాగార్జున భావోద్వేగానికి లోనయ్యారు. ఈయన నిర్మించిన 'పళ్లబురుసు' అనే చిన్న సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో సోమవారం సాయంత్రం జరిగింది. ఇందులోనే నాగ్ మాట్లాడుతూ ఎన్నడూ లేనంతలా ఎమోషనల్ అయ్యారు. తండ్రితో జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. త్వరలో మూడో పార్ట్?)
'నా తండ్రి ప్రారంభించిన ఈ సంస్థతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ని మరింత విస్తరించాం. నా తల్లిదండ్రులని ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకున్నాను. నా భార్య అమల కూడా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమె కూడా తల్లిదండ్రులని ఎంతో శ్రద్ధగా చూసుకుంటోంది. తల్లిదండ్రులు మన కోసం చేసిన త్యాగాలని గుర్తించి వారికి అండగా నిలవడం మన జీవితంలో అత్యంత విలువైన బాధ్యత. తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవడం కంటే జీవితంలో గొప్ప అదృష్టం మరొకటి ఉండదు' అని నాగార్జున అన్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టారు. మొన్ననే కొడుకు అఖిల్తో తీసిన 'లెనిన్' సక్సెస్ అయింది. అలానే నాగ్ కూడా తన 100వ సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ కూడా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది.
(ఇదీ చదవండి: ‘వారణాసి’లో హనుమంతుడిగా రామ్ చరణ్?)
నేను నా తల్లిదండ్రులను చూసుకున్నాను..
అమల కూడా అదృష్టవంతురాలు ..
పెరెంట్స్ ను దగ్గరుండి చూసుకుంటోంది.
మన చినప్పుడు వారే మన వేలు పట్టుకుని నడిపించారు. అలాంటి వారిని చూసుకోవాలిగా..!#Nagarjuna #PallaburusuOnAug14th #Amala #Akhil #Nagachaitanya pic.twitter.com/JbvaRNZ2gN— SZN (@Suzenbabu) August 10, 2026


