మదనపల్లె టౌన్ : దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు అని అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి అన్నారు. మండలి జయంతి వేడుకలను అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లె పోలీసులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. ఉన్నత పదవుల్లో ఉన్నా సామాన్యుడిలా జీవిస్తూ, 1977 తుఫాను సమయంలో కృష్ణారావు చేసిన నిస్వార్థ సేవలు చిరస్మర ణీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్ఐ (అడ్మిన్) యు.రంగనాథ్బాబు, ఆర్ఎస్ఐలు చంద్రశేఖర్, మగ్బుల్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


