-
అదితి శంకర్ కొత్త సినిమా.. షూటింగ్ పూర్తి!
దర్శకుడు విష్ణు వర్ధన్ పేరు చెప్పగానే పట్టియల్, బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆమధ్య బాలీవుడ్ వెళ్లి పేర్షా సినిమాను డైరెక్ట్ చేయగా ఈ మూవీ ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఇతడు సల్మాన్ఖాన్ హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం విష్ణువర్ధన్కు బాలీవుడ్లో మరింత గుర్తింపును తీసుకురానుందట. తాజాగా ఈయన కోలీవుడ్పై దృష్టి సారించారు. దివంగత నటుడు మురళి వారసుడు ఆకాష్ మురళిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఎక్స్ బీ ఫిలిమ్స్ పతాకంపై సేవియర్ బిట్టో నిర్మిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ ఇంతకుముందు విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించిన మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించింది. ఇక లేటెస్ట్ మూవీలో ఆకాష్ మురళి సరసన దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్గా నటించటం విశేషం. ఇందులో నటుడు శాంతకుమార్, ప్రభు గణేశన్, నటి కుష్భు సుందర్, కల్కి కొచ్లిన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీ మనసులను హత్తుకునే రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా ఉండబోతుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్ర షూటింగ్ పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లోని అందమైన నగరాలతో పాటు ఇండియాలోని బెంగళూరు, చైన్నె ప్రాంతాల్లో నిర్వహించినట్లు పేర్కొన్నారు. చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపారు. కాగా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారని, ఇంతకు ముందు దర్శకుడు విష్ణు వర్ధన్ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కాంబోలో రూపొందిన చిత్రాల్లోని పాటలు సూపర్ హిట్ అయ్యాయని, అదే కోవలో సంగీత ప్రియులను ఈ చిత్రం అలరిస్తుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. Tamil hero, Akash Murali, son of late actor Murali. The filming has been completed & the film has been shot extensively across different cities in Portugal, Spain & India. Starring @_akashmurali @AditiShankarofl @realsarathkumar #PrabhuGanesan @khushsundar — XB Film Creators (@XBFilmCreators) February 9, 2024 చదవండి: ఫైనల్లీ గుడ్న్యూస్ చెప్పిన సమంత -
రాజ రాజ చోళుడిగా అజిత్?
తమిళసినిమా: నటుడు అజిత్ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నారా? రాజరాజ చోళుడు పాత్రను పోషించనున్నారా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానమే రావడం విశేషం. ఇటీవల చారిత్రక కథాచిత్రాలు నడుస్తుందని చెప్పవచ్చు. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1,2 చిత్రాలు సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్ అయిన విషయాన్ని చూశాం. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు. చాలా కాలం క్రితమే దివంగత నడిగర్ తిలకం శివాజీ గణేషన్ రాజ రాజ చోళన్ చిత్రంలో తన గంభీరమైన నటనా కౌశలంతో ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చారు. కాగా తాజాగా బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్ కూడా అదే బాటలో పయనించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన వెళ్పారి అనే చారిత్రాత్మక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే ప్రచారం సాగుతోంది. రచయిత బాలకుమార్తో కలిసి కథా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో నటుడు అజిత్ కూడా చారిత్రక కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈయన ప్రస్తుతం విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని తర్వాత రాజరాజ చోళన్ కథా చిత్రంలో నటించిన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అజిత్, విష్ణువర్దన్ కాంబినేషన్లో ఇంతకుముందు బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా ప్రస్తుతం దర్శకుడు విష్ణువర్దన్ హిందీలో సల్మాన్ ఖాన్ బంధువు ఒకరికి చిత్రం చేయడానికి కమిట్ అయ్యారని సమాచారం. అదే విధంగా అజిత్ తన 62వ చిత్రం విడాముయిర్చి చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాత రాజ రాజ చోళుడుగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
లైంగికదాడి కేసులో 8 మంది అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో సంచలనం రేకెత్తించిన యువతిపై లైంగికదాడి కేసులో 8 మంది నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ డి.శ్రీని వాసరెడ్డి తన కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి కోవూరు మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న తన అక్క ఇంటికొచ్చింది. ఆమె అక్క గర్భిణి కావడంతో నెల్లూరులోని ఆస్పత్రిలో సిజేరియన్ చేశారు. అక్కకు తోడుగా ఆమె ఆస్పత్రి లో ఉంటున్నారు. ఈ నెల 10న యువతి మందుల కోసం గాంధీబొమ్మ సెంటర్ వద్దకొచ్చింది. నె ల్లూరుకి చెందిన పాతనేరస్తులైన భాను విష్ణువర్ధన్ అలియాస్ లడ్డసాయి, జగదీష్ అలియాస్ డి యోసాయి, యుగంధర్ అలియాస్ యుగి, ఎ.సుజన్కృష్ణ అలియాస్ చింటూ ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని..కత్తితో బెదిరించి కొండాయపాళెంలోని ఖాళీ స్థలంలో లైంగికదాడి చేశారు. అనంతరం వారి స్నేహితులైన భాను సాయివర్ధన్, షేక్ హుస్సేన్బాషా అలియాస్ కేటీఎం, సాయిసాత్విక్, కె.అజయ్, రేవంత్లను పిలిపించి వారితో కూడా లైంగికదాడి చేయించారు. యువతి కేకలను గమనించిన స్థానికులు ‘దిశ’కు కాల్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా దుండగులు పారి పోయారు. ఘటనాస్థలిలో బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్లు, ఆటో నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆదివారం గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చే శారు. డియోసాయి పరారీలో ఉన్నాడు. -
ఓరి.. భడవా! అమ్మ తిట్టిందని..18 కి.మీ నడిచి వెళ్లి..
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో శుక్రవారం అదృశ్యమైన 9 ఏళ్ల బాలుడు విష్ణువర్ధన్ ఆచూకీ లభించింది. పోలీసులు శనివారం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. అయితే ఘటనలో బాలుడు ఎక్కడకు వెళ్లాడు? ఏమయ్యాడు? ఎలా దొరికాడనే విషయాలు తెలిస్తే.. వీడు పిల్లాడు కాదు.. పిడుగు అనిపిస్తుంది. టూటౌన్ సీఐ యుగంధర్ తెలిపిన వివరాలు.. ప్రశాంత్నగర్కు చెందిన గీత పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ పక్కింటి అబ్బాయితో గొడవపడటంతో తల్లి మందలించింది. దీంతో శుక్రవారం ఉదయం స్కూల్కు వెళుతున్నట్టు చెప్పి కనిపించకుండాపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు. ఇంటి నుంచి వెళ్లిన రోజు ఉదయం 9 గంటలకు ప్రశాంత్నగర్ నుంచి నడుచుకుంటూ గిరింపేట దుర్గమ్మ గుడి దాటినట్టుగా సీసీ కెమెరాల్లో గుర్తించారు. తవణంపల్లె మండలం దిగువ తడకరలో ఉంటున్న గీత తల్లిదండ్రులు కూడా శనివారం చిత్తూరుకు చేరుకుని పిల్లాడి కోసం వెతకసాగారు. ఇదిలా ఉండగా, విష్ణువర్దన్ నిన్న సాయంత్రానికే చిత్తూరు నుంచి దాదాపు 18 కి.మీ దూరంలో ఉన్న తవణంపల్లెలో దిగువ తడకర సమీపంలోని ఓ గ్రామానికి చేరుకున్నాడు. చీకటి పడడంతో అక్కడే ఓ ఇంటి వద్ద పడుకుని.. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దిగువ తడకరకు చేరుకున్నాడు. బాలుడిని చూసిన స్థానికులు వెంటనే విషయాన్ని గీత తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో పోలీసులు దిగువ తడకరకు వెళ్లి బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లిపై కోపంతో విష్ణువర్ధన్ అంతదూరం నడుచుకుంటూ తన అమ్మమ్మ, తాత ఇంటికి ఎవరి సాయం లేకుండా వెళ్లడంపై పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. రెండుసార్లు తడకరకు బస్సులో వెళ్లిన విష్ణువర్దన్.. అక్కడక్కడా చూసిన కొండగుర్తులతో దిగువ తడకరకు నడిచి వెళ్లడం విశేషం. -
ఒకేరోజు ముగ్గురు సినీ తారల జన్మదినం
బెంగళూరు : కన్నడ చిత్రరంగానికి చెందిన ముగ్గురు నటీనటుల పుట్టినరోజు బుధవారమే కావడంతో అభిమానుల సందడి మిన్నంటింది. సాహససింహ, దివంగత నటుడు విష్ణువర్ధన్, స్టార్ నటునిగా పేరున్న ఉపేంద్ర, నటీమణి శృతిల అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జన్మదిన వేడుకలను జరిపారు. విష్ణు అభిమానులు, వివిధ సంఘ సంస్థలు అభిమాన్ స్టూడియోలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. చిత్ర ప్రముఖులు ట్విట్టర్లో ఆయనను స్మరించుకున్నారు. నిరాడంబరంగా ఉప్పి జన్మదినం మరో నటుడు ఉపేంద్ర 52వ పుట్టినరోజును బెంగళూరులో తన ఇంట్లో నిరాడంబరంగా జరుపుకొన్నారు. కేక్, పూల బొకేలు తీసుకురావద్దని అభిమానులకు ఆయన ముందుగానే మనవి చేశారు. పరిసర సంరక్షణ కోసం మొక్కలను తీసుకురావాలని కోరటంతో చాలామంది అభిమానులు మొక్కలను అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. నటి, బీజేపీ నాయకురాలు శృతి 44వ జన్మదినంను బెంగళూరులో కేక్ కట్ చేసి ఆచరించారు. విష్ణుకు సీఎం యడ్డి, సుదీప్ నివాళులు దివంగత నటుడు విష్ణువర్ధన్కు సీఎం బీఎస్ యడియూరప్ప నివాళులరి్పంచారు. కన్నడ చిత్రరంగానికి అనేక సేవలందించిన్నట్లు ట్విట్టర్ ద్వారా కొనియాడారు. ఆయన సినిమాలు, వ్యక్తిత్వం ద్వారా ప్రజల మన్ననలను పొందుతున్నారని తెలిపారు. విష్ణువర్థన్ తండ్రి మాదిరిగా ఎంత ప్రీతిని చూపించేవారో, తప్పు చేస్తే అంతే కోప్పడేవారని హీరో సుదీప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన దూరమై అనాథమలయ్యామని ఆవేదనను వ్యక్తం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement