return
-
వైరల్ వీడియో.. షాపులో ఆ బాలిక చేసిన పనికి అంతా షాక్!
హాపూర్: ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ షాపు యజమానిపై 15 ఏళ్ల బాలిక బ్లేడ్తో దాడి చేయడం కలకలం సృష్టించింది.. షాప్లో కొన్న వస్తువులను వెనక్కి ఇచ్చేందుకు ఆ బాలిక వెళ్లగా, వాటిని తీసుకునేందుకు ఆ దుకాణదారులడు నిరాకరించాడు. దీంతో కోపంతో బాలిక దాడికి పాల్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాప్లోని సీసీటీవీ కెమెరాకు చిక్కాగా.. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో శుక్రవారం జరిగింది.ఆ షాపు యజమాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఆ బాలిక తరచూ వస్తువులు కొనుగోలు చేస్తుందని.. అయితే.. వాడిన వస్తువులను తిరిగి ఇచ్చేస్తోందని.. అనేకసార్లు వాటిని వెనక్కి తీసుకున్నానంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే బాలిక ప్రవర్తనతో విసిగిపోయిన అతను ఈసారి వాటిని వెనక్కి తీసుకునేందుకు నిరాకరించానని తెలిపారు.ఆ బాలిక బ్లేడ్తో దుకాణదారుడిపై దాడి చేయగా.. ఆయన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో దుకాణంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వెంటనే అప్రమత్తమై వారు ఆ దుకాణదారుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, దుకాణదారుడిపై దాడి చేసిన తర్వాత బాలిక పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు ఆ బాలికను పట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆ బాలిక మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. #हापुड़♦नाबालिग ने दुकानदार पर ब्लेड से हमला किया♦सामान वापस न करने पर नाबालिका हुई आक्रोशित♦दुकानदार गंभीर हालत में अस्पताल में भर्ती♦सीसीटीवी में कैद हुई पूरी घटना♦पिलखुवा कोतवाली क्षेत्र का मामला@hapurpolice pic.twitter.com/H9LkuAJsJp— Knews (@Knewsindia) May 4, 2025 -
నెలకు రూ.3000 చాలు.. పదేళ్లకు రూ.లక్షలు..
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై అవగాహన చాలా మందిలో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. చిన్న మొత్తాల్లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్ (SIP) మంచి మార్గంగా మారింది. సిప్లో ప్రతి నెలా మీరు పెట్టుబడి పెట్టే చిన్న మొత్తమే కాలక్రమేణా పెరుగుతుంది. తద్వారా మీ పెట్టుబడిపై మంచి రాబడి లభిస్తుంది.సిప్ అంటే ఏమిటి.. ఇదెలా పనిచేస్తుంది?సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్.. దీన్నే సంక్షిప్తంగా సిప్ అని వ్యవహరిస్తారు. అంటే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సిప్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇది కాలక్రమేణా పెద్ద మొత్తంగా మారుతుంది. ఈ ప్రక్రియలో మీరు పదేపదే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం ఆటోమేటిక్గా మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయి మ్యూచువల్ ఫండ్కు వెళుతుంది.నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేస్తే..సిప్ ద్వారా ఇప్పుడు మీరు ప్రతి నెలా రూ .3000 పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే, 10 సంవత్సరాల తరువాత మీ పెట్టుబడి ఎలా పెరుగుతుందన్నది ఉదాహరణ ద్వారా చూద్దాం.. మీరు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే, అది సగటున 12% వార్షిక రాబడిని ఇస్తుంది. అప్పుడు 10 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ.3,60,000 అవుతుంది. అదే సమయంలో ఈ పెట్టుబడిపై వచ్చే రాబడి సుమారు రూ .3,37,017 ఉంటుంది. అంటే పదేళ్ల తర్వాత మీ చేతికి మొత్తంగా రూ.6,97,017 వస్తుంది.సిప్ ప్రయోజనాలుచిన్న పెట్టుబడులతో ప్రారంభించి కాలక్రమేణా పెద్ద మొత్తంలో రాబడి సంపాదించవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ పద్ధతి ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది.సిప్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, మీరు మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఇది రాబడిని సమతుల్యం చేస్తుంది. అంటే మార్కెట్ పడిపోయినా, కాలక్రమేణా మీ పెట్టుబడి సరైన దిశలో పెరగడానికి సిప్ సహాయపడుతుంది.సిప్లో పెట్టుబడులను మీ సౌలభ్యానికి అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. ప్రతి నెలా మీ ఖాతా నుండి నిర్ణీత మొత్తం నేరుగా మ్యూచువల్ ఫండ్లో జమయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ కాబట్టి మీరు మళ్లీ మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు.సిప్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని పొందుతారు. మ్యూచువల్ ఫండ్స్ రాబడులు కాలక్రమేణా మెరుగుపడతాయి.గుర్తుంచుకోవాల్సినవి..సరైన మ్యూచువల్ ఫండ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మంచి పనితీరు కనబరిచే ఫండ్లను ఎంచుకోవడం వల్ల మంచి రాబడి పొందవచ్చు.మీ సామర్థ్యాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయండి. మీరు రూ.500తో కూడా సిప్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు.సిప్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకులను నివారించి మంచి రాబడి పొందవచ్చు.క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తేనే సిప్ బెనిఫిట్ లభిస్తుంది. ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ రాబడి పొందొచ్చు. -
Sunita Williams: సునీతా విలియమ్స్ను స్వాగతించిన డాల్ఫిన్లు
వాషింగ్టన్: అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్లను సముద్రంలోని డాల్ఫిన్లు స్వాగతించాయి. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చిన ఈ వ్యోమగాములను చూసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి డాల్ఫిన్ల ఆనందం కూడా తోడయ్యింది. పలు ఇబ్బందుల అనంతరం అంతరిక్ష నౌక చివరకు వ్యోమగాములతో పాటు ఫ్లోరిడా బీచ్లో దిగింది. There are a bunch of dolphins swimming around SpaceX's Dragon capsule. They want to say hi to the Astronauts too! lol pic.twitter.com/sE9bVhgIi1— Sawyer Merritt (@SawyerMerritt) March 18, 2025భారత కాలమానం ప్రకారం ఈ ల్యాండింగ్(Landing) బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సమయంలో నాసా బృందం వ్యోమగాములను స్వాగతించడానికి చిన్నపాటి షిప్లతో సిద్ధమయ్యింది. ఈ సమయంలో సముద్రంలో అరుదైన దృశ్యం కనిపించింది. సునీతా విలియమ్స్ ఉన్న క్యాప్స్యూల్ను పలు డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. డాల్ఫిన్ల గుంపు అంతరిక్ష నౌక చుట్టూ ఈదుతూ కనిపించింది. సునీతా విలియమ్స్తో పాటు ఆమె సహచరులను క్యాప్సూల్ నుండి బయటకు తీసుకువస్తున్నప్పుడు పలు డాల్ఫిన్లు క్యాప్సూల్ చుట్టూ గుమిగూడాయి.దీనికి సంబంధించిన వీడియోను నాసా సిబ్బంది సాయర్ మెరిట్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ చుట్టూ డాల్ఫిన్లు ఈదుతున్నాయి’ అని రాశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా రికవరీ నౌక వ్యోమగాములను క్యాప్సూల్ నుండి బయటకు తీసుకువచ్చాక, వారిని 45 రోజుల పునరావాస కార్యక్రమం కోసం హ్యూస్టన్లోని ఒక కేంద్రానికి తరలించారు. -
Sunita Williams: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’: వైట్హౌస్
వాషింగ్టన్ డీసీ: తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు(Astronauts) తిరిగి భూమికి చేరుకోవడంపై యునైటెడ్ స్టేట్స్లోని అధ్యక్షుని అధికారిక కార్యాలయం వైట్ హౌస్ హర్షం వ్యక్తం చేసింది. అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను రక్షించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట ఇచ్చారని, దానిని నిలబెట్టుకున్నారని వైట్హౌస్ పేర్కొంది.అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా(American space agency NASA)కు చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగింది. తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను రక్షించేందుకు అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారని, వైట్ హౌస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఒక వీడియో షేర్ చేస్తూ పేర్కొంది. ఈరోజు వారు సురక్షితంగా భూమిపైకి దిగారని, వ్యోమగాములను సురక్షితంగా ల్యాండ్ చేసినందుకు ఎలోన్ మస్క్, స్పేస్ఎక్స్, నాసాకు వైట్హౌస్ కృతజ్ఞతలు తెలిపింది. PROMISE MADE, PROMISE KEPT: President Trump pledged to rescue the astronauts stranded in space for nine months. Today, they safely splashed down in the Gulf of America, thanks to @ElonMusk, @SpaceX, and @NASA! pic.twitter.com/r01hVWAC8S— The White House (@WhiteHouse) March 18, 2025డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్'(Truth Social)లో వ్యోమగాములు తిరిగి వచ్చిన క్షణాలను షేర్ చేశారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ సహాయంతో భూమికి తిరిగి వచ్చారు. ఎనిమిది రోజుల మిషన్ కోసం బయలుదేరిన సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఆమె సురక్షితంగా తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇది కూడా చదవండి: Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా -
Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా
న్యూఢిల్లీ: తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్(NASA astronaut Sunita Williams) భూమికి తిరిగి వచ్చారు. ఆమె ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున స్పేస్ఎక్స్ డ్రాగన్ నుండి దిగారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ బంధువు ఫల్గుణి పాండ్యా భావోద్వేగానికి లోనవుతూ, సునీతాకు సంబంధించిన పలు విషయాలు మీడియాకు తెలిపారు. సునీతా విలియమ్స్ ఎంతో భక్తితో గణేశుని విగ్రహాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లారని, దానిని నిత్యం తనతో పాటే ఉంచుకున్నారని అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న ఆమె వరుస సోదరి ఫల్గునీ పాండ్యా తెలిపారు. సునీతా విలియమ్స్ తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని, ఈ వార్త తెలియగానే, తమ కుటుంబ సభ్యులంతా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు, హోమాలు చేయనున్నామని తెలిపారు. సునీతా ఎప్పుడు తిరిగి వస్తుందా అని తామంతా ఇంతకాలం ఎదురు చూశామని తెలిపారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో తేలియాడుతున్న గణేశ విగ్రహం ఫోలోను షేర్ చేశారని ఆమె తెలిపారు.సునీతా విలియమ్స్కు భారతీయ వంటకాలంటే(Indian cuisine) ఎంతో ఇష్టమని, మరీ ముఖ్యంగా సమోసా ఇష్టమని, ఆమె భూమికి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశాన్ని సందర్శించాలని అనుకుంటున్నారని తెలిపారు. 2007లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాము ఆయనను కలుసుకున్నామని, ఆ తర్వాత సునీత, ఆమె తండ్రి అమెరికాలో ప్రధాని మోదీని కలుసుకున్నారన్నారు. సునీత స్వస్థలం గుజరాత్ అని, ఆమె పూర్వీకుల గ్రామమైన ఝులసాన్లో సంబరాలు జరుగుతున్నాయన్నారు. తాను కుంభమేళా సమయంలో భారతదేశానికి వచ్చినప్పుడు ఆ వివరాలను తెలుసుకునేందుకు సునీత చాలా ఆసక్తి చూపారన్నారు. తాను ఆమెకు కుంభమేళా చిత్రాలను చూపించానని, అప్పుడు ఆమె తనకు అంతరిక్షం నుండి కుంభమేళా చిత్రాన్ని పంపారన్నారు. కుంభమేళాలో అది మరపురాని ఫోటో అని ఫల్గుణి పాండ్యా పేర్కొన్నారు. త్వరలోనే తాము సునీతాను కలుసుకుంటామని, సమోసా పార్టీ జరుపుదామని అంటున్నారామె.ఇది కూడా చదవండి: సునీతా విలియమ్స్ స్వగ్రామంలో సంబరాలు -
సునీతా విలియమ్స్ స్వగ్రామంలో సంబరాలు
న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్(Astronaut Sunita Williams) సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమె స్వస్థలమైన గుజరాత్లోని ఝులసాన్లో ప్రజలు భగవంతునికి హారతులు అర్పిస్తూ, ప్రార్థనలు చేశారు. అలాగే సంబరాలు జరుపుకున్నారు.అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వారిలో వ్యోమగామి సునీతా విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. వ్యోమగాములంతా డ్రాగన్ క్యాప్సూల్(Dragon Capsule) నుండి బయటకు వచ్చారు. వెంటనే వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వ్యోమగాములు విజయవంతంగా తిరిగి వచ్చిన తరుణంలో భారతదేశంతో పాటు అమెరికాలో వేడుకల వాతావరణం నెలకొంది. సునీతా విలియమ్స్తో పాటు క్రూ-9 సభ్యుల ధైర్యసాహసాలు, విజయాల గురించి జనం చర్చించుకుంటున్నారు. #WATCH | Mehsana, Gujarat | People express joy and burst firecrackers in Jhulasan - the native village of NASA astronaut Sunita Williams after the successful Splashdown of SpaceX Dragon spacecraft carrying Crew-9 at Tallahassee, FloridaNASA's astronauts Sunita Williams and… pic.twitter.com/fKs9EVnPSf— ANI (@ANI) March 18, 2025డ్రాగన్ క్యాప్సూల్ నుండి బయటకు వచ్చిన మూడవ వ్యక్తి సునీతా విలియమ్స్. ఆమె బయటకు రాగానే అందరినీ చిరునవ్వుతో పలకరించారు. క్యాప్సూల్ నుండి వ్యోమగాములను బయటకు తీసుకువచ్చే ప్రక్రియ క్లిష్టంగా ఉంటుంది. క్యాప్సూల్ లోపల వ్యోమగాములంతా సీట్ బెల్టులతో కట్టి ఉంటారు. సునీతా విలియమ్స్తో పాటు ఇతర వ్యోమగాములను తీసుకువస్తున్న క్యాప్సూల్ భూ వాతావరణం(Earth's atmosphere)లోకి ప్రవేశించినప్పుడు, 3500 డిగ్రీల ఫారెన్హీట్ వేడి కారణంగా అది ఎర్రటి అగ్ని బంతిలా కనిపించింది. అయితే ఆ క్యాప్యూల్ లోనికి ఉష్ణోగ్రత ప్రవేశించకుండా దానిని తయారుచేస్తారు. క్యాప్సూల్ లోపల ఉష్ణోగ్రత దాని బయట ఉష్టోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది.ఇది కూడా చదవండి: భూమిపైకి క్షేమంగా సునీత.. -
సునీతా విలియమ్స్ రాకకు సమయం ఆసన్నం
అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమ్స్, బుచ్ విల్మోర్ల రాకకోపం ఎదురుచూస్తున్నవారికి అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిష్ట్రేషన్(నాసా) శుభవార్త చెప్పింది. వీరు అంతరిక్షం నుంచి 2025, మార్చి చివరిలో భూమికి తిరిగి రానున్నట్లు వెల్లడించింది. సాంకేతిక ఇబ్బందులు, మిషన్ రీషెడ్యూలింగ్ కారణంగా ఈ ఇద్దరు వ్యోమగాములు గత ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు.నాసా తాజాగా తెలిపిన వివరాల ప్రకారం క్రూ-10 మిషన్ మార్చి 12న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు బయలుదేరుతుంది. ఈ మిషన్లో అన్నే మెక్క్లెయిన్, నికోల్ అయర్స్ (నాసా), టకుయా ఒనిషి (జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ), కిరిల్ పెస్కోవ్ (రోస్కోస్మోస్) ఉన్నారు. వీరు అంతరిక్షంలోకి చేరుకున్నాక, క్రూ-9 మిషన్ (సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ అలెగ్జాండర్ గోర్బునోవ్లతో కూడినది) భూమికి తిరిగి వస్తుంది. క్రూ-10 మిషన్ మార్చి 12న ప్రారంభమవుతుందని, ఒక వారం పాటు ఐఎస్ఎస్లో ఉంటుందని బుచ్ విల్మోర్ తెలిపారు. దీని తరువాత ఆ వ్యోమగాములు మార్చి 19 నాటికి భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. నాసా, స్పేస్ఎక్స్లు ఈ మిషన్ను వేగవంతం చేశాయి.ఈ మిషన్లో జరుగుతున్న జాప్యంపై స్పేస్ఎక్స్ సీఈవో ఇలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తూ, వ్యోమగాములను ఇంత కాలం ఐఎస్ఎస్లో వదిలివేయడం సరికాదని అన్నారు. కాగా ఈ మిషన్లో పోలాండ్, హంగేరీల వ్యోమగాములతో పాటు భారత సంతతికి చెందిన శుభాన్షు శుక్లాను కూడా ఐఎస్ఎస్కు పంపనున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే శుభాన్షు ఐఎస్ఎస్కు వెళ్లిన మొదటి భారతీయునిగా నిలుస్తారు. మార్చి 19న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయని నాసా పేర్కొంది. ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో -
Jharkhand: జేఎంఎంలోకి తిరిగి సీతా సోరెన్?
రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో మరో పరిణామం చోటుచేసుకోబోతోంది. బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ తిరిగి జెఎంఎంలోకి రానున్నారననే చర్చ మరోసారి ఊపందుకుంది. ఆమె 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అలాగే బీజేపీ టిక్కెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె తిరిగి జేఎంఎంలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.ఫిబ్రవరి 2న దుమ్కాలో జేఎంఎం వ్యవస్థాపక దినోత్సవం(JMM Foundation Day) జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీతాసోరెన్ జేఎంఎంలో చేరనున్నారనే వార్తల నడుమ విలేకరులు ఆమెను ఇదే విషయమై అడుగగా, తాను ఫిబ్రవరి ఒకటిన దుమ్కా చేరుకుంటానని, కాలమే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుందని, చర్చించే వాళ్లను చర్చించనివ్వండంటూ, తాను సరస్వతి పూజ కోసం దుమ్మా వెళుతున్నట్లు తెలిపారు.సీతా సోరెన్(Sita Soren) బీజేపీలోకి తిరిగి రావడంపై జెఎంఎం ఎమ్మెల్యే, సీతా సోరెన్ బావమరిది బసంత్ సోరెన్ మాట్లాడుతూ దీనిపై చర్చ జరుగుతున్నట్లు తనకు తెలియదన్నారు. వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ఈ వేడుకల నిర్వహణపై కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం ఉందని అన్నారు. గత సంవత్సరం కార్యనిర్వాహక అధ్యక్షుడు లేరని, ఈ కారణంగానే తాము గత సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవాన్ని సరిగా జరుపుకోలేకపోయామన్నారు.లోక్సభ ఎన్నికలకు ముందు శిబూ సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు. దుమ్కా అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె జెఎంఎం అభ్యర్థి నళిన్ సోరెన్ చేతిలో ఓడిపోయారు. దీని తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆమెకు జంతారా టిక్కెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లోనూ సీతకు నిరాశ ఎదురయ్యింది. ఇది కూడా చదవండి: Iran: ముగ్గురు భారతీయులు అదృశ్యం -
22 ఏళ్లగా పాక్లో చిక్కుకుపోయి.. హమీదా బానో భారత్ ఎలా చేరుకున్నదంటే..
పాక్లో ఉంటున్న భారతీయులు పలు ఆంక్షల మధ్య దుర్భర జీవితం సాగిస్తున్నారనే వార్తలను మనం తరచూ వింటుంటాం. అనుకోని రీతిలో పాక్లో చిక్కుకుపోయిన ఒక భారతీయ మహిళ అక్కడ పలు అవస్థలను ఎదుర్కొంది. ఎప్పుడెప్పడు తన స్వదేశానికి వెళదామా అని ఎదురు చూసింది. ఎట్టకేలకు ఆమె ఆశ నెరవేరింది.ముంబైలోని కుర్లా నివాసి హమీదా బానో(70) 22 ఏళ్లక్రితం తనకు తెలియకుండా పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. అయితే ఎప్పటికైనా భారత్ తిరిగి వెళ్లాలనే ఆమె ఆశ నిరంతరం సజీవంగానే ఉంది. తాజాగా ఆమె పంజాబ్లోని అట్టారీ సరిహద్దు మీదుగా భారత్కు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. సరిహద్దుల్లో ఆమెకు అమృత్సర్లోని ఫోక్లోర్ రీసెర్చ్ అకాడమీ అధ్యక్షుడు రమేష్ యాదవ్ ఆమెకు స్వాగతం పలికారు. 2002లో హమీదా బానో దుబాయ్లో వంటమనిషిగా ఉద్యోగం చేసేందుకు ఒక ముంబై ఏజెంట్ను సంప్రదించింది. అయితే ఆ ఏజెంట్ ఆమెను దుబాయ్కి బదులుగా పాకిస్తాన్కు పంపాడు. హమీదా బానో తాను పాకిస్తాన్కు చేరుకున్నానని తెలియగానే కంగారుపడిపోయింది. భయం కారణంగా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. పోలీసులకు కూడా తెలియజేయలేదు.ముంబైలో ఉంటున్న హమీదా బానో కుటుంబ సభ్యులు ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. హమీదా పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని హైదరాబాద్లో ఉంటూ తినుబండారాలు అమ్ముతూ జీవిస్తూ వచ్చింది. తదనంతరకాలంలో ఆమెకు కరాచీలోని ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను పెళ్లికి ప్రపోజ్ చేయడంతో అందుకు అంగీకరించింది. వీరి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. అయితే హమీదా బానో భర్త కరోనా సమయంలో మృతిచెందాడు.పాకిస్తాన్లో హమీదా బానో ఒక మదర్సా బయట కూర్చుని తినుబండారాలు అమ్ముతుండేది. ఆమె దగ్గరకి చాక్లెట్లు కొనుక్కునేందుకు వచ్చిన ఒక బాలుడు తన చదువు పూర్తయ్యాక ఒక టీవీ ఛానల్లో ఉద్యోగం సంపాదించాడు. ఒక రోజు అతను హమీదాను ఇంటర్యూ చేశాడు. ఇది అతను పనిచేస్తున్న టీవీలో టెలికాస్ట్ అయ్యింది. అది వైరల్గా మారింది.ముంబైలో ఉంటున్న హమీదా పిల్లలు యాస్మీన్, ప్రవీణ్ ఈ వీడియో చూశారు. ఇదేసమయంలో ఈ వీడియో పాకిస్తాన్ అధికారుల దృష్టికి కూడా వచ్చింది. దీంతో వారు ప్రభుత్వాన్ని సంప్రదించి హమీదాను భారత్కు పంపేందుకు ప్రయత్నించారు. ఈ వార్త పాకిస్తాన్లోని పలు టెలివిజన్ చానళ్లలో ప్రసారమయ్యింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత హమీదా బానో తన స్వస్థలమైన ముంబైకి చేరుకున్నారు. ఆమెను చూసిన కుటుంబసభ్యులు ఈ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్కు ప్లాన్ చేసుకోవచ్చు -
వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి..
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం డెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను సెప్టెంబరు 30 నుండి ఆఫీస్లకు వచ్చేయాలని ఆదేశించింది. వారానికి ఐదు రోజులూ ఆఫీస్ నుంచే పనిచేయాలని డెల్ ఉద్యోగులను కోరిందని దీనికి సంబంధించిన మెమోను తాము చూసినట్లు రాయిటర్స్ పేర్కొంది.ఉద్యోగులకు సహకార వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే ఈ మార్పు చేస్తున్నట్లు డెల్ తెలిపింది. ఇందుకోస టీమ్ ఆఫీస్లో ఉండాల్సిన అవసరం ఉందని మెమో పేర్కొంది. "రిమోట్గా పని చేయడం అన్నది మినహాయింపుగా ఉండాలి. రొటీన్ కాకూడదు" అని జోడించింది.మెమో ప్రకారం.. సేల్స్ టీమ్లోని ఫీల్డ్ ప్రతినిధులు వారానికి ఐదు రోజులు కస్టమర్లు, భాగస్వాములతో లేదా కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో వీరు వారానికి మూడు రోజులు కార్యాలయం నుండి పని చేయాల్సి ఉండేది. ఇక ఆఫీస్కు వచ్చేందుకు సాధ్యపడని సేల్స్ టీమ్ సభ్యులు రిమోట్గానే పని చేయవచ్చని అని డెల్ వెల్లడించింది.కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయం నుండి చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. అయితే, కొన్ని టెక్ సంస్థలు, ఇప్పుడు ఉద్యోగులతో వారంలో రెండు నుండి మూడు రోజులు ఆఫీస్ల నుంచి పని చేయిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారానికి ఐదు రోజులు కంపెనీ కార్యాలయాలలో పని చేయాలని గత వారం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేసింది. -
వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పని
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి దాదాపు అన్ని కంపెనీలు ముగింపు పలుకుతున్నాయి. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం అమెజాన్ కూడా దీనికి సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పని చేయాలని ఉద్యోగులను ఆదేశించింది.ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీస్కు వచ్చి పనిచేయాలని అమెజాన్ డాట్ కామ్ తెలిపింది. ఇది 2025 జనవరి 2 నుండి అమలులోకి వస్తుంది. "యూఎస్ ప్రధాన కార్యాలయ స్థానాలు (పుగెట్ సౌండ్, ఆర్లింగ్టన్)తో సహా పలు చోట్ల గతంలో మాదిరే డెస్క్ ఏర్పాట్లను తిరిగి తీసుకురాబోతున్నాము" అని సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులకు ఒక నోట్లో తెలిపారు.సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా 2025 మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి మేనేజర్లు, ఉద్యోగుల నిష్పత్తిని కనీసం 15% పెంచాలని అమెజాన్ చూస్తోంది. గత ఏడాది మేలో అమెజాన్ సీటెల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు వాతావరణ విధానం, తొలగింపులు, రిటర్న్ టు ఆఫీస్ ఆదేశాలను నిరసిస్తూ వాకౌట్ చేశారు. -
ఐకియా 365 రోజుల ఎక్స్చేంజ్ పాలసీ
న్యూఢిల్లీ: కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో హోమ్ ఫర్నిషింగ్స్ సంస్థ ఐకియా ఇండియా తాజాగా 365 రోజుల వరకు వర్తించే ఎక్స్చేంజ్, రిటర్న్ పాలసీని ప్రవేశపెట్టింది.దీని ప్రకారం ఐకియాలో హోమ్ ఫర్నిచర్, ఫర్నిషింగ్ యాక్సెసరీలను కొనుగోలు చేసిన కస్టమర్లు తమ మనస్సు మార్చుకున్న పక్షంలో వాటిని ఒరిజినల్ ప్యాకేజింగ్ స్థితిలోనైనా లేదా అసెంబుల్ చేసిన స్థితిలోనైనా స్టోర్లో వాపసు చేయొచ్చు లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇందుకోసం హోమ్ కలెక్షన్ సర్వీసును కూడా అందిస్తున్నట్లు సంస్థ కంట్రీ కస్టమర్ మేనేజర్ అలెక్జాండ్రా షెస్టాకోవా తెలిపారు. -
Polaris Dawn: తిరిగొచ్చిన స్పేస్వాకర్లు
స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్వాక్ ప్రాజెక్టు ‘పొలారిస్ డాన్’ విజయవంతమైంది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లడమే గాక వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్ ఇసాక్మాన్ ఆదివారం సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఆయన, మరో ముగ్గురు సిబ్బందితో కూడిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలో ఫ్లోరిడాలోని డై టార్టగస్ బీచ్ సమీప సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఇసాక్మాన్తోపాటు ఇద్దరు స్పేస్ఎక్స్ ఇంజనీర్లు, ఒక మాజీ ఎయిర్ఫోర్స్ థండర్బర్డ్ పైలట్ కూడా ఈ క్యాప్సూల్లో అంతరిక్షంలోకి వెళ్లడం తెల్సిందే. భూమి నుంచి 740 కి.మీ. ఎత్తులో తొలుత ఇసాక్మాన్, తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ స్పేస్వాక్ చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్లడం ఇదే తొలిసారి! ప్రైవేట్ రంగంలో స్పేస్వాక్ చేసిన తొలి వ్యక్తిగా, మొత్తమ్మీద 264వ వ్యక్తిగా ఇస్సాక్మాన్ నిలిచారు. ఆయన, గిలిస్ దాదాపు రెండు గంటల పాటు క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి స్పేస్ఎక్స్ నూతన స్పేస్సూట్ను పరీక్షించారు. గిలిస్ అంతరిక్షం నుంచే సూపర్హిట్ హాలీవుడ్ సినిమా స్టార్వార్స్ థీమ్ సాంగ్కు వయోలిన్ వాయించి రికార్డు సృష్టించడం తెలిసిందే. – కేప్ కనావరెల్ -
రూ.7,409 కోట్ల విలువైన 2,000 నోట్లు ఇంకా ప్రజల్లోనే..
ముంబై: ఉపసంహరించిన రూ. 2000 డినామినేషన్ బ్యాంకు నోట్లలో 97.92 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం తెలిపింది. ప్రజల వద్ద ఇప్పటికీ రూ.7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. ఉపసంహరణ ప్రకటించిన గత ఏడాది మే 19న బిజినెస్ వ్యవహార సమయం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఈ ఏడాది జూలై 31న ఇదే సమయానికి ఈ విలువ రూ.7,409 కోట్లకు తగ్గింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం, లేదా మార్చుకునే సౌకర్యం దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్లలో 2023 అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంది. అటుపై 2023 అక్టోబర్ 9వ తేదీ నుండి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2000 నోట్లను స్వీకరిస్తున్నాయి. ప్రజలు రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపడానికి తగిన సౌలభ్యతను కూడా కలి్పంచడం జరిగింది. 2016 నవంబర్లో అప్పుడు అమలులో ఉన్న రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. -
చాక్లెట్, కెల్లాగ్స్ చాకోస్లో పురుగుల కలకలం! వెంటనే తిరిగిచ్చేయండి!
ఇటీవల ఓ హైదరాబాదీ వ్యక్తి మెట్రో స్టేషన్లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగులు కనిపించిన సంగతి తెలిసిందే. అది మరువక మునుపే కెల్లాగ్స్ చాకోస్ పురుగులు ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా అంతకుమునపు కూడా పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు వార్తల్లో నిలిచాయి. అయితే ఇలా నాసిరకం వస్తువు కొనుగోలు చేస్తే మొహమాటంతోనే లేక మోసం చేశాడనే ఫీల్తోనే సదరు షాపుకి వెళ్లడం మానేస్తాం. కానీ ఇక్కడ అలా చేయొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తక్షణమే ఆ వస్తువుని సదరు షాపు వాడికి ఇచ్చేసి దాని స్థానంలో మరొక వస్తువుని ఉచితంగా తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. అలా ఇవ్వనని అంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చెయ్యాలి. వస్తువు నాసిరకం అని తేలితే జరిమానా విధించడం లేదా షాప్ని సీజ్ చేయడం జరుగుతుంది . ఇంతకీ ఏంటా నంబర్? ఇలాంటి మోసానికి గురికాకుండా విజిలన్స్ అధికారులకు ఎలా ఫిర్యాదు చెయ్యాలి? అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరూ నాసిరకం వస్తువులను అంటగడుతుంటారు. నిజానికి షాపులో కొన్ని వస్తువులు సేల్స్ కాకుండా అలా మిగిలిపోతాయి. వీటిని ఎలాగైన వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతో తక్కువ ధరకు లేదా డిస్కౌంట్ ఆఫర్స్ కింద అమ్మేందుకు యత్నిస్తుంటారు. ఇక్కడ కస్టమర్ కూడా తక్కువ ధరకే దొరకుతుందన్న ఆశతో ఆ వస్తువు నాణ్యమైనదా? కాదా? అనేది ఆలోచించకుండా వెంటనే కొనుగోలు చేస్తాడు. అసలు అలా తక్కువ దరకు అమ్ముతున్నారంటే.. ముందుగా ఆ వస్తువు గడువు తేదీ చూడాలి. ఎప్పుడూ తయారు చేశారు, ఎప్పటి వరకు వినియోగించొచ్చు అనే వివరాలను చెక్ చేయాలి. అందులోనూ నిత్యావసర వస్తువులు పరిమిత కాలం వరకే ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ద్రవ పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు పైకి నాణ్యమైనవిగా కనిపించినా..ఇంటికెళ్లాక నాసిరకంగా కనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడూ వెంటనే ఆ వస్తవును కొనుగోలు చేసిన షాపుకే వచ్చి.. తక్షణమే తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ అలా తీసుకునేందుకు ఎవ్వరైనా వెనుకాడితే వెంటనే.. 1800114000 లేదా 1915 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి. దెబ్బకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి సదరు షాపు యజమానిపై చర్యలు తీసుకుంటారు. ఆ వస్తువు నాసిరకం అని తేలితే మాత్రం ఆ షాపుని సీజ్ చేయడం లేదా జరిమానా విధించడం వంటి చర్యలు తప్పక తీసుకుంటారు. అందువల్ల ఇలా నకిలీ వస్తువులు కొని మోసపోయానని బాధపడొద్దు, వెంటనే తిరిగి ఇచ్చేయండి. దాని స్థానంలో మరొక వస్తువుని ఉచితంగా తెచ్చుకోండి.! (చదవండి: 'కెల్లాగ్స్ చాకోస్'లో పురుగులు..స్పందించిన కంపెనీ..!) -
‘అక్కడి నుంచి బయటపడండి’ మయన్మార్లోని భారతీయులకు హెచ్చరిక!
మయన్మార్లోని రఖైన్ ప్రావిన్స్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితిలో అక్కడున్న భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు అక్కడి నుండి బయటపడాలని భారత్ కోరింది. రఖైన్ ప్రావిన్స్ సురక్షితంగా లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, ల్యాండ్లైన్లతో సహా టెలికమ్యూనికేషన్కు అంతరాయం, నిత్యావసర వస్తువుల కొరత తదితర కారణాల దృష్ట్యా భారతీయ పౌరులెవరూ రఖైన్ రాష్ట్రానికి వెళ్లవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయ పౌరులు వెంటనే ఆ రాష్ట్రం విడిచి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. 2021, ఫిబ్రవరి ఒకటి నుంచి మయన్మార్లో అస్థిరత నెలకొంది. సైనిక తిరుగుబాటులో దేశ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పలు హింసాత్మక నిరసనలు జరిగాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మయన్మార్లో నెలకొన్న అస్థిరత మన దేశంపై ప్రభావం చూపబోతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మయన్మార్ మన పొరుగు దేశం కావడంతో అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నామన్నారు. భారతదేశంలోని పలు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులు మయన్మార్తో అనుసంధానమై ఉన్నాయి. భారతదేశం, మయన్మార్లు దాదాపు 1,640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. -
అది శత్రువును నిలువునా చీల్చే శివాజీ ఆయుధం.. త్వరలో లండన్ నుంచి భారత్కు..
ఛత్రపతి శివాజీ మహారాజ్ వినియోగించిన ఆయుధం ‘బాఘ్ నఖ్’(పులి గోరు) వందల ఏళ్ల తరువాత తిరిగి భారత్ చేరుకోనున్నది. శివాజీ 1659లో బీజాపూర్ సుల్తానేట్ కమాండర్ అఫ్జల్ ఖాన్ను అంతమెందించడానికి ఈ ఆయుధాన్ని వినియోగించారు. అనంతర కాలంలో బ్రిటిష్ అధికారి దానిని బహుమతిగా బ్రిటన్కు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ ఆయుధాన్ని భారత్కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ అంగీకరించినట్లు సమాచారం. మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ సెప్టెంబరు 2023 చివరిలో లండన్ను సందర్శించనున్నారు. అప్పుడు ఈ ఆయుధాన్ని భారత్కు తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ఈ ఆయుధం ఈ మ్యూజియంలో ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే ‘బాఘ్ నఖ్’ భారత్ చేరుకోనుంది. మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ మీడియాతో మాట్లాడుతూ బ్రిటీష్ అధికారుల నుంచి తమకు లేఖ వచ్చిందని, ఛత్రపతి శివాజీ మహారాజ్కు చెందిన ‘వాఘ్నఖ్’ను తిరిగి ఇవ్వడానికి వారు అంగీకరించారని తెలిపారు. తాము యుకె వెళ్లాక అక్కడ ప్రదర్శనలో ఉన్న శివాజీ జగదాంబ ఖడ్గం తదితర వస్తువులను తీసుకువచ్చేందుకు కూడా పరిశీలిస్తామన్నారు. 1659 నవంబర్ 10న అఫ్జల్ ఖాన్ హత్య గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా చూస్తే అఫ్జల్ ఖాన్ హత్య 1659 నవంబర్ 10న జరిగిందని సుధీర్ తెలిపారు. కాగా ఛత్రపతి శివాజీ మహరాజ్ వినియోగించిన బాఘ్ నఖ్ చరిత్రలో అమూల్యమైన నిధి అని, రాష్ట్ర ప్రజల మనోభావాలు దీనితో ముడిపడి ఉన్నాయని సుధీర్ పేర్కొన్నారు. కాగా మంత్రి ముంగంటివార్తో పాటు సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ వికాస్ ఖర్గే, స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డైరెక్టర్ డాక్టర్ తేజస్ గార్గే లండన్కు వెళ్లనున్నట్లు సాంస్కృతిక శాఖ తెలిపింది. ఈ ముగ్గురు సభ్యుల బృందం సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు ఆరు రోజుల పర్యటన కోసం బ్రిటన్కు వెళ్లనుంది. ఆయుధాన్ని తీసుకెళ్లిన బ్రిటీష్ అధికారి ఉక్కుతో తయారైన ఈ ఆయుధానికి నాలుగు గోళ్లు ఉన్నాయి. మహారాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వాఘ్ నఖ్ పిడికిలితో పట్టుకునే బాకు. సింహం, పులి, చిరుత గోళ్లను పోలినట్టు వీటిని తయారు చేశారు. ఇది శత్రువు చర్మం, కండరాలను చీల్చివేయడానికి రూపొందించారు. ఈ పులి గోరు శివాజీ వారసుల వద్ద ఉండేది. 1818లో దీనిని బ్రిటిష్ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ బహుమతిగా అందుకున్నాడు. ఆ సమయంలో డఫ్ను సతారా రాష్ట్ర రెసిడెంట్ పొలిటికల్ ఏజెంట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ పంపింది. అతను 1818 నుండి 1824 వరకు సతారాలో పనిచేశాడు. ఆయన ఆ పులి పంజా ఆయుధాన్ని తనతో పాటు బ్రిటన్కు తీసుకెళ్లారు. అక్కడ అతని వారసులు దానిని ఆల్బర్ట్ మ్యూజియానికి విరాళంగా ఇచ్చారు. ఇది కూడా చదవండి: మేరీ మిల్బెన్ ఎవరు? ఆమె ప్రధాని మోదీకి ఎందుకు మద్దతు పలికారు? -
రాహుల్ గాంధీ ఇక ఆ బంగ్లాకు వెళ్లలేరు!
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అధికారిక నివాసంగా తుగ్లక్ లేన్ 12 బంగ్లాను కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ తన సమ్మతిని తెలపడానికి పార్లమెంటరీ కమిటీ విధించిన 15 రోజుల గడువు విధించింది. బుధవారంతో ఆ గడువు ముగిసినప్పటికీ.. లద్దాఖ్ యాత్రలో ఉన్న రాహుల్ ఆ బంగ్లాను తీసుకుంటానని సమ్మతిని తెలపలేదు. దీంతో మరో బంగ్లాను ఆయనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మోదీ వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రాహుల్కు రెండేళ్ల శిక్ష విధించిన నేపథ్యంలో పార్లమెంట్ పదవిని కోల్పోయారు. దీంతో 2005 నుంచి ఎంపీగా నివాసం ఉంటున్న తగ్లక్ లేన్ 12 బంగ్లాను ఏప్రిల్ 22న ఆయన ఖాలీ చేశారు. జన్పథ్ 10లోని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి మారారు. తాజాగా సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ మళ్లీ తన ఎంపీ పదవిని పొందారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఆయనకు అధికారికంగా భవనాన్ని కేటాయించాల్సి వచ్చింది. 2005 నుంచి ఆయన ఉంటున్న తగ్లక్ లేన్లోని 12 బంగ్లానే ఇచ్చారు. కానీ దీనికి ఆయన సమ్మతించనట్లు తెలుస్తోంది. బంగ్లా 12పై రాహుల్ సమ్మతి తెలపనంత మాత్రనా పార్లమెంట్ నివాసాన్ని తిరస్కరించినట్లు కాదని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం రాహుల్.. ఆగష్టు 17న ప్రారంభమైన కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. కార్గిల్ను కూడా సందర్శించనున్నారు. ఆగష్టు 25న ఈ యాత్ర ముగుస్తుందని సమాచారం. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 ఖరారు.. ఎప్పటి నుంచి అంటే.. -
తెలుగు విద్యార్థులకు షాక్ - 21 మంది అమెరికా నుంచి వెనక్కి
అమెరికాలో భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. పలు వర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులను సరైన పత్రాలు లేవనే కారణంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. విద్యార్థుల మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లు చూసి తిప్పి పంపించినట్లు తెలుస్తోంది. అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో నుంచి మొత్తంగా 21 మంది విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానంలో తిప్పి భారత్కు పంపించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. -
రూ.6 చిల్లర ఇవ్వనందుకు 26 ఏళ్లుగా శిక్ష..
ముంబయి: ఆరు రూపాయలు చిల్లర తిరిగి ఇవ్వనందుకు ఓ రైల్వే క్లర్కుకు గత 26 ఏళ్లుగా ఉపశమనం లభించలేదు. విజిలెన్స్ టీం పంపిన వ్యక్తికి చిల్లర ఇవ్వని కారణంగా 26 ఏళ్ల క్రితం విధుల నుంచి తొలగించబడ్డారు. అనంతరం అప్పీలుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే టికెట్ క్లర్క్ రాజేశ్ వర్మ ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద పనిచేసేవారు. 1997 ఆగష్టు 30న విజిలెన్స్ టీం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ను ప్యాసింజర్గా పంపి టికెట్ కొనుగోలు చేయించగా.. వర్మ బుక్కయ్యారు. సదరు ప్యాసింజర్ రూ.500 ఇవ్వగా.. టికెట్టు ధర రూ.214 పోగా మిగిలిన రూ.286 ఇవ్వాల్సి ఉంది. కానీ రాజేశ్ వర్మ రూ.280 ఇచ్చి చిల్లర ఇవ్వలేదు. విజిలెన్స్ అధికారులు చెక్ చేయగా.. ఆ రోజు వసూళ్లలో రూ. 58 మిస్ అయ్యాయి. అంతేకాకుండా ఆ క్లర్క్ వెనక ఉన్న అల్మారాలో రూ.450 ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాజేశ్ వర్మ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. క్రమశిక్షణా చర్యల కింద రాజేశ్ వర్మను జనవరి 31, 2002న విధుల నుంచి తప్పించారు. అయితే.. ఆ నిర్ణయాన్ని రాజేశ్ వర్మ సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లారు. చిల్లర రూ.6 లేనందుకే ఇవ్వలేకపోయాడని రాజేశ్ వర్మ తరుపున లాయర్ మిహిర్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. అల్మారాను రాజేశ్ వర్మతో పాటు ఉద్యోగులందరూ ఉపయోగిస్తారని తెలిపారు. చిల్లర ఇవ్వలేదనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ అల్మారాకు ప్రవేశం ఉందని, అధిక ఛార్జీలు వసూలు చేశారనడానికి రుజువు ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజేశ్ వర్మ అప్పీలును తిరస్కరించింది. ఇదీ చదవండి: ఆ పని చేస్తే.. శరద్ పవార్కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ.. -
పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే
ఆఫ్ఘానిస్థాన్లో తాలిబాన్ పాలన మొదలయ్యాక పాకిస్తాన్లో తెహ్రిక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) మరింత పుంజుకున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)కి చెందిన మానిటరింగ్ కమిటీ ఒక నివేదికలో తెలిపింది. పాకిస్తాన్లోని గిరిజన ప్రాంతాలపై పట్టు కోసం ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్లోని గిరిజన ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు టీటీపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని ఈ నివేదిక వెల్లడించింది. కాబూల్ పతనం అనంతరం ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని సమాచారం. టీటీపీ సరిహద్దు ఆవల నుండి తాలిబాన్ మద్దతు పొందుతోంది. పాకిస్తాన్పై పట్టు బిగించడంలో టీటీపీ ఊపందుకుంటున్నట్లు సభ్య దేశాల అంచనా. ఆఫ్ఘానిస్తాన్ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం ద్వారా ధైర్యాన్ని పొందిన టీటీపీ ఇప్పుడు పాకిస్తాన్లో భూభాగంపై నియంత్రణను తిరిగి స్థాపించాలనే ఆశయంతో పనిచేస్తున్నదని నివేదిక తెలియజేస్తున్నది. బలోపేతమవుతున్న టీటీపీ పాకిస్తాన్లో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడులు టీటీపీ బలోపేతాన్ని రుజువు చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోని ముఖ్య లక్ష్యాలు, పట్టణ ప్రాంతాల్లో సాఫ్ట్ లక్ష్యాలపై టీటీపీ దృష్టి సారిస్తోందని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘానిస్తాన్లో టీటీపీ యధేచ్ఛగా తన కార్యకలాపాలను కొనసాగిస్తే అది ప్రాంతీయ ముప్పుగా మారుతుందని సభ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. యూఎన్ఎస్సీలోని కొన్ని సభ్య దేశాలు కూడా టీటీపీ తిరిగి పుంజుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్లో టీటీపీ వివిధ విదేశీ సంస్థలతో అనుబంధం ఏర్పరుచుకోవచ్చని, సమీప భవిష్యత్తులో అల్-ఖైదాతో విలీనమయ్యే అవకాశం కూడా ఉండవచ్చని నివేదిక తెలిపింది. టీటీపీకి అల్-ఖైదా మార్గనిర్దేశం అల్-ఖైదా ఇప్పటికే టీటీపీకి మార్గనిర్దేశం చేస్తోందని, పాకిస్తాన్ లోపల లక్షిత ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి సహాయం చేస్తున్నదని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘానిస్థాన్లోని కునార్ ప్రావిన్స్లో నిషేధిత సంస్థ ఈస్ట్ టర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ (ఈటీఐఎం)శిక్షణా శిబిరాలను టీటీపీ నాయకులు ఉపయోగిస్తున్నారని, ఇది తాలిబాన్ పాలన కింద వివిధ సమూహాల మధ్య సమన్వయం, మద్దతును సూచిస్తున్నదని నివేదిక తెలిపింది. 20కిపైగా ఉగ్రసంస్థలకు ఆఫ్ఘానిస్తాన్ అండ? తీవ్రవాదం విషయంలో ఆఫ్ఘానిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. దాని పొరుగున ఉన్న పాకిస్తాన్లో అశాంతిని వ్యాప్తి చేయడానికి పనిచేస్తున్న 20కి మించిన ఉగ్రవాద సమూహాలకు ఆఫ్ఘానిస్తాన్ సురక్షితమైన ప్రాంతంగా ఉంది. తాలిబాన్, టీటీపీ, అల్ ఖైదాలు సైద్ధాంతికంగా కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయనేది వాస్తవం. ఆఫ్ఘానిస్తాన్లో తాలిబాన్, అల్ ఖైదాలు రహస్యంగా పనిచేస్తున్నాయి. అల్ ఖైదా తన కార్యాచరణ సామర్థ్యాన్ని రహస్యంగా పునర్నిర్మించుకుంటూ, నూతనంగా యువతను రిక్రూట్ చేయడానికి ఆఫ్ఘానిస్తాన్ను రవాణా కేంద్రంగా ఉపయోగిస్తోంది. ప్రాంతీయ తీవ్రవాద గ్రూపుల సహకారంతో.. అల్ ఖైదా నాయకులు ఆఫ్ఘానిస్తాన్లో ఉన్న నాన్-ఆఫ్ఘన్ మూలాలు కలిగిన ప్రాంతీయ తీవ్రవాద గ్రూపులతో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, జమాత్ అన్సరుల్లా సహకారంతో మధ్య ఆసియాతో పాటు ఇతర దేశాలలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆ నివేదికలో పేర్కొంది. ఇది కూడా చదవండి: పాపం.. జపాన్ భవిష్యత్తు అలా ఏడ్చింది -
సహారా డిపాజిటర్లకు గుడ్న్యూస్: చెల్లింపుల ప్రక్రియ షురూ.. ఫస్ట్ వారికే..
న్యూఢిల్లీ: సహారా గ్రూప్నకు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇరుక్కుపోయిన దాదాపు రూ. 5,000 కోట్ల మొత్తాన్ని తిరిగి డిపాజిటర్లకు అందజేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. దీనితో చాలా కాలంగా తమ కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది చిన్న ఇన్వెస్టర్లకు ఊరట లభించనుంది. ఇందుకోసం సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దీనితో ఒక కోటి మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. ముందుగా రూ. 10,000 వరకు ఇన్వెస్ట్ చేసిన కోటి మంది ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరపనున్నట్లు మంత్రి చెప్పారు. నాలుగు సొసైటీల (సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారాయాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ) మొత్తం డేటా సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్లో ఉందని, దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఇన్వెస్టరు ఆధార్ కార్డు వారి మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా వారికి రావాల్సిన సొమ్ము వారి ఖాతాల్లో జమవుతుందని చెప్పారు. రూ. 5,000 కోట్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇతర ఇన్వెస్టర్లకు చెందిన డబ్బును కూడా తిరిగి చెల్లించేందుకు అనుమతుల కోసం సుప్రీం కోర్టును కోరనున్నట్లు ఆయన తెలిపారు. సహారా–సెబీ రిఫండ్ ఖాతా నుంచి రూ. 5,000 కోట్ల మొత్తాన్ని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్)కు బదలాయించాలంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు 9 నెలల్లోగా డిపాజిట్ మొత్తాలను వాపసు చేస్తామంటూ మార్చి 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
స్వదేశానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.! పాకిస్థాన్ కొత్త చట్టం..
పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మళ్లీ తన సొంత దేశానికి రావడానికి మార్గం సుగమం అయింది! చట్టసభ్యుల అనర్హతపై కాలపరిమితిని నిర్ణయిస్తూ పాక్ కేంద్ర అసెంబ్లీ చట్టం తీసుకువచ్చింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్కు తిరిగి రావాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత ఈ మేరకు చట్టం తీసుకురావడం గమనార్హం. చట్ట సభ్యులపై ఐదేళ్లకు మించి అనర్హత వేటు వేయడానికి అవకాశం లేనివిధంగా చట్టాన్ని సవరించినట్లు పాక్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ సవరణపై తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సిద్ధికీ సంజ్రాణి సంతకం కూడా చేసి ఆమోదించినట్లు స్పష్టం చేశారు. అయితే.. హజ్ యాత్రలో ఉన్న అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వీ లేని సమయంలో ఈ చట్టం తీసుకురావడం గమనార్హం. ఇదీ చదవండి: హజ్యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే.. బ్రిటన్లో నవాజ్ షరీఫ్.. అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ తీర్పును వెల్లడించింది. అయితే.. 2019లో ఆరోగ్య రీత్యా బెయిల్పై విడుదలయిన నవాజ్ షరీఫ్.. బ్రిటన్కు పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. పాక్ రాజకీయాలను బ్రిటన్ నుంచే తెరవెనక ఉండి శాసిస్తున్నాడని కొందరు విశ్వసిస్తారు. మళ్లీ రాజకీయాల్లోకి.. గతేడాది విశ్వాస పరీక్షలో ఓడి ఇమ్రాన్ ఖాన్ పదవీత్యుడయ్యాక.. నవాజ్ షరీఫ్ సోదరుడు సెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఈ ఏడాది అక్టోబర్లో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మాజీ ప్రధాని, తన సోదరున్ని స్వదేశానికి తీసుకురావాలని సెహబాజ్ ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించాడు. నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పదవి చేపట్టాలని అధికార PML-N పార్టీ కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నవాజ్ షరీఫ్ రాజకీయంలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: నవాజ్ పాక్ తిరిగొచ్చి, నాలుగోసారి ప్రధాని అవ్వాలి: షెహబాజ్ షరీఫ్ -
81 ఏళ్లకు లైబ్రరీకి చేరిన పుస్తకం.. 17వ పేజీలో ఏమున్నదంటే..
ఇటీవల ఒక లైబ్రరీకి ఎవరో ఒక పుస్తకాన్ని తీసుకురాగా అక్కడి స్టాఫ్ దానిని చూసి అవాక్కయ్యారు. ఆ పుస్తకం 81 ఏళ్ల క్రితం ఇష్యూ చేసినది కావడం విశేషం. సిబ్బంది ఆ పుస్తకాన్ని తెరవగా, అక్కడున్న విచిత్రమైన మెసేజ్ చూసి తెగ ఆశ్చర్యపోయారు. పుస్తకప్రియులు లైబ్రరీలకు వెళుతుంటారు. కొందరు అక్కడే కూర్చుని చదువుకుంటారు. మరికొందరు పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లి చదువుకుంటారు. అయితే ఆ పుస్తకాలను రిటర్న్ చేసేందుకు కొంత గడువు ఉంటుంది. అది దాటితై ఫైన్ విధిస్తారు. ఇటువంటి సందర్భాల్లో కొందరు తాము తీసుకువెళ్లిన పుస్తకాలను తిరిగి లైబ్రరీలో అప్పగించరు. ఇటీవల ఒక వ్యక్తి పుస్తకాన్ని తిరిగి ఇచ్చేందుకు లైబ్రరీకి వచ్చాడు. ఆ పుస్తకాన్ని చూసిన అక్కడ స్టాఫ్ ఆశ్చర్యపోయారు. ఈ పుస్తకం 1942,మార్చి 30 నాడు ఇష్యూ చేసినది కావడం విశేషం. అంటే ఈ పుస్తకం 81 ఏళ్ల తరువాత తిరిగి లైబ్రరీకి చేరింది. ఈ ఉదంతం అమెరికాలోని వాషింగ్టన్లో గల ఎబర్డీన్లో చోటుచేసుకుంది. ఇది చదవండి: కేకు డబ్బులు అడిగాడని కాల్పులు.. దుకాణదారుని మృతి! పాత సామానులలో దొరికింది లైబ్రరీ ప్రతినిధులు తమ ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని తెలియజేస్తూ, చార్ల్స్ నార్డాఫ్ అండ్ జేమ్స్ నార్మన్ హాల్ రాసిన పుస్తకం ‘ది బౌంటీ ట్రిలాజీ’’ 81 ఏళ్ల తరువాత ఎబర్డీన్ టింబర్లాండ్ లైబ్రరీకి తిరిగి వచ్చింది. ఈ పుస్తకం పాత సామానుల మధ్య పడి ఉండగా లభ్యమయ్యిందని పేర్కొన్నారు. పేజీ నంబరు-17లో.. కిరో7 న్యూస్ రిపోర్టు ప్రకారం ఈ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తీసుకున్న వ్యక్తి ఈ పుస్తకంలోని 17వ పేజీ వరకే చదివాడు. అతను పుస్తకంలో ఇలా ఒక నోట్ రాశాడు..‘‘ ఒకవేళ నాకు డబ్బులు ఇచ్చిన పక్షంలో నేను ఈ పుస్తకాన్ని ఎప్పటికీ చదవను’’ అని రాసివుంది. దీని అర్థం ఏమిటంటే అ వ్యక్తికి ఈ పుస్తకం చదవడం అస్సలు ఇష్టం లేదని తెలుస్తోంది. లేటు ఫీజు విధిస్తే.. లైబ్రరీ అధికారులను ఈ పుస్తకానికి ఒకవేళ లేటు ఫీజు విధిస్తే ఎంత ఉంటుందని అడగగా, సెలవురోజులు మినహాయించి మిగిలిన రోజులను పరిగణలోకి తీసుకుంటే రోజుకు రెండు సెంట్ల చొప్పున 1942 నాటి విలువను అనుసరించి ఇది 484 డాలర్లు(సుమారు రూ.40 వేలు) అవుతుంది. అయితే లైబ్రరీ నిర్వాహకుల కోవిడ్-19 మహమ్మారి నేపధ్యంలో లేటు ఫీజు అనేది పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. బహుమతిగా భావించి.. ఆ పేస్బుక్ పోస్టులో లైబ్రరీ ప్రతినిధి.. ఈ ఉదంతం నుంచి మనం ఒక విషయం తెలసుకోవాలన్నారు.. ఒకవేళ మీ దగ్గర ఈ విధంగా లైబ్రరీ నుంచి తెచ్చిన ఏ పుస్తకమైనా దుమ్ము, ధూళి బారిన పడి ఉంటే, దానిని వెంటనే లైబ్రరీకి తిరిగి ఇవ్వండి. మేము వాటిని బహుమతులుగా భావించి, ఆ పుస్తకం తీసుకుని వెళ్లినవారికి ఎటువంటి ఫైన్ వేయబోమని తెలిపారు. చదవండి: నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా! -
రిటర్న్ టు ఆఫీస్ గూగుల్ వార్నింగ్: ఉద్యోగులేమంటున్నారంటే!
న్యూఢిల్లీ: వారానికి మూడు రోజులు ఆఫీసులకు వచ్చి తీరాల్సిందే అంటూ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాల పట్ల ఉద్యోగులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగులు ఒక ప్రకటన విడుదల చేశారు రాత్రికి రాత్రే ఉద్యోగుల పనితీరు వృత్తి నైపుణ్యాన్ని అవమానపరిచేలా, అస్పష్టమైన అటెండెన్స్ ట్రాకింగ్ పద్ధతులకు అనుకూలంగా మారిపోవడం విచారకరం అంటూ గూగుల్ ఉద్యోగి క్రిస్ ష్మిత్ పేర్కొన్నారు. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్కు చెందిన కొంతమంది కాంట్రాక్ట్ ,ప్రత్యక్ష ఉద్యోగుల తరపున ఆయన ఈ ప్రకటన జారీ చేశారు. (1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో భౌతికంగా హాజరయ్యేలా మార్చిలో, గూగుల్ తన హైబ్రిడ్ వర్క్ పాలసీని అప్డేట్ చేసింది. తాజాగా వారానికి మూడు రోజులు ఆఫీస్కు రాకుంటే చర్యలు తప్పవని గూగుల్ ఉద్యోగులకు గూగుల్ హెచ్చరించింది. అంతేకాదు రిటన్ టూ ఆఫీస్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగులకు పేలవమైన పెర్ఫామెన్స్ రివ్యూ ఇవ్వనున్నామని, హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరించని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని అల్టిమేటం జారీ చేసింది. అంటే అటెండెన్స్ సరిగా లేని వారికి శాలరీ హైక్స్, ప్రమోషన్స్లో ప్రభావం పడనుంది. (మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్ మహీంద్ర) ఉద్యోగులు చాలామంది తిరిగి ఆఫీసులకు వస్తారనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది. అలాగే హైబ్రిడ్ పని విధానం, ఇంటి నుండి పని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలతో పోల్చి చూసేలా దీన్ని డిజైన్ చేశామని గూగుల్ ప్రతినిధి ర్యాన్ లామోంట్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఆఫీసులో టీంగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియాన సిసోని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ఉద్యోగులను తిరిగి పనిలోకి రావాలంటున్న కంపెనీల్లో గూగుల్ మాత్రమే కాదు, అమెజాన్ కూడా గతంలోనే ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 2వేల మంది అమెజాన్ ఉద్యోగులు వర్క్-ఫ్రమ్-ఆఫీస్ ఆదేశాలు, సామూహిక తొలగింపులు వ్యతిరేకంగా గతంలో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో గూగుల్ ఉద్యోగుల తాజా ప్రకటన చర్చకు దారీ తీస్తోంది. -
దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ హైదరాబాద్లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడు షూటింగ్లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి గతవారం దుబాయ్ వెళ్లారు. ఎయిర్పోర్టులో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (ఇది చదవండి: పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్!) అయితే ఫ్యామిలీతో దుబాయ్ వేకేషన్ వెళ్లిన తారక్ శనివారం హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఎయిర్పోర్ట్లో తన కుమారులతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోన్న ఎన్టీఆర్ తదుపరి షెడ్యూల్ కోసం గోవా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచాపరం. ఒక పాటతో పాటు యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తారని తెలుస్తోంది. (ఇది చదవండి: మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్పై మొదలైన చర్చ!) -
దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలంటే.. ఈ ఫండ్ను పరిశీలించండి
ప్రతీ ఇన్వెస్టర్ తన పెట్టుబడుల్లో ఈక్విటీలకు కచ్చితంగా స్థానం కల్పించాలి. అప్పుడే మెరుగైన సంపద సృష్టి, ఆర్థిక లక్ష్యాల సాధన సాధ్యపడుతుంది. ఇందుకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన మార్గం అవుతుంది. ఈక్విటీల్లోనూ ఎన్నో రకాల విభాగాలున్నాయి. అందులో మల్టీక్యాప్ ఫండ్స్ విభాగం ఒకటి. అన్ని రకాల మార్కెట్ విలువలతో కూడిన కంపెనీలను పోర్ట్ఫోలియోలో భాగం చేసుకునేవే మల్టీక్యాప్ ఫండ్స్. అంటే, లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లో.. ఒక్కో విభాగంలో కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడులు పెడతాయి. దీంతో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పెట్టుబడి అవకాశాలను సొంతం చేసుకునే అనుకూలత ఈ పథకాలకు ఉంటుంది. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా మల్టీక్యాప్ ఫండ్ దీర్ఘకాలం నుంచి స్థిరమైన, నమ్మకమైన పనితీరును చూపిస్తోంది. సొంతిల్లు, పిల్లల ఉన్నత విద్య, వివాహాల వంటి దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం, అలాగే దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలని భావించే వారు ఈ పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలలో 29 శాతం రాబడులను తెచ్చిపెట్టింది. కానీ, ఇదే కాలంలో ఈ పథకం రాబడికి పోల్చుకోతగిన ప్రామాణిక సూచీ బీఎస్ఈ 500 టీఆర్ఐ రాబడి కేవలం 15.63 శాతంగానే ఉంది. ఇక మూడేళ్ల కాలంలో చూసినా బీఎస్ఈ 500 టీఆర్ఐ రాబడి ఏటా 30 శాతంగా ఉంటే, ఈ పథకంలో రాబడి వార్షికంగా 41.50 శాతం మేర ఉంది. ఐదేళ్లలోనూ బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే 2 శాతం అధికంగా 14.47 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలం ఈ పథకంలో వచ్చింది. ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలో 15.61 శాతం చొప్పున వార్షిక రాబడి రేటు ఉంది. 2005 మార్చిలో ఈ పథకం మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఏటా 17.18 శాతం చొప్పున రాబడి ఈ పథకంలో ఉండడం గమనించొచ్చు. ఇన్వెస్టర్లు సిప్ రూపంలో కనీసం రూ.1,000 నుంచి ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడుల విధానం/పోర్ట్ఫోలియో ఈ పథకాన్ని 16 ఏళ్ల నుంచి శైలేష్ రాజ్ భాన్ నిర్వహిస్తుండడం సానుకూల అంశం. అతని మెరుగైన నిర్వహణ పథకం స్థిరమైన రాబడులకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మెరుగైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను, సరైన విలువల వద్ద ఉంటే ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం విధానంలో భాగం. పోటీ కంపెనీలతో పోలిస్తే అనుకూలతలు ఉన్న కంపెనీలు కొంచెం అధిక విలువల వద్ద ఉన్నా, పెట్టుబడులను కేటాయిస్తుంది. ఆయా రంగాల్లో అగ్రగామి కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఆయా రంగాల్లో వచ్చే స్వల్పకాల, మధ్య కాల అనుకూలతల్లోనూ పెట్టుబడులు పెడుతుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో మొత్తం రూ.15,088 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 98.71 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. మిగిలిన 1.29 శాతం నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 49 శాతం వరకు లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. మిడ్క్యాప్ కంపెనీలకు 34.05 శాతం కేటాయించగా, స్మాల్క్యాప్ కంపెనీల్లో 17.29 శాతం పెట్టుబడులే ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో మొత్తం 91 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 27.73 శాతం పెట్టుబడులను ఈ రంగానికి చెందిన కంపెనీలకే కేటాయించింది. సేవల రంగ కంపెనీల్లో 19.39 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 13 శాతం, హెల్త్కేర్లో 7.72 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీల్లో 5.19 శాతం, కెమికల్స్ కంపెనీల్లో 4.92 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం లిండే ఇండియా 4.69 ఐసీఐసీఐ బ్యాంక్ 4.26 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.03 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.53 యాక్సిస్ బ్యాంక్ 3.42 ఇండియన్ హోటల్స్ కంపెనీ 3.37 ఎల్అండ్టీ 3.13 ఈఐహెచ్ 3.11 ఎస్బీఐ 3.07 కెన్నమెటల్ ఇండియా 3.06 -
దొంగను మార్చేసిన భగవద్గీత.. చోరీ చేసిన నగలు వెనక్కి!
భగవద్గీత ఓ దొంగలో మార్పు తీసుకొచ్చింది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందడమే కాదు.. తొమ్మిదేళ్ల కిందట ఓ ఆలయంలో చోరీ చేసిన నగలను సైతం తిరిగి ఇచ్చేలా చేసింది. ఆశ్చర్యకరమైన ఈ ఘటన భువనేశ్వర్(ఒడిషా)లో జరిగింది. భువనేశ్వర్లోని గోపీనాథ్పూర్ రాధాకృష్ణ ఆలయంలో 2014 మే నెలలో చోరీ జరిగింది. కృష్ణ భగవానుడికి చెందిన లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అవి దొరకపోవడంతో కొత్త అభరణాలు చేయించారు ఆలయ నిర్వాహకులు. కట్ చేస్తే.. ఈ మధ్య ఆలయ ద్వారం వద్ద ఓం సంచి ఒకటి దొరికింది. అందులో ఓ లేఖ.. పోయిన నగలు కనిపించాయి. చేసిన చోరీకి క్షమాపణలు కోరుతూ లేఖ, జరిమానా కింద రూ.300 కూడా ఉంచాడు ఆ వ్యక్తి. ఈ మధ్యకాలంలో తాను భగవద్గీత చదివానని.. తన మార్గం తప్పని తెలుసుకొని విలువైన ఆ ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు దొంగ పేర్కొన్నాడు. మరోవైపు, తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన ఆభరణాలు తిరిగి దొరకడంతో ఆలయ అధికారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాలు ఇలా మళ్లీ దొరకడం అద్భుతమే అంటున్నారు. Video Source: OTV News English -
కరోనాతో చనిపోయి.. బతికొచ్చాడు!
క్రైమ్: విడ్డూరంగా అనిపిస్తుందా?. కరోనా టైంలో చనిపోయాడని అధికారులు ప్రకటించిన ఓ వ్యక్తి.. రెండేళ్ల తర్వాత బతికొచ్చాడు. అది తెలిసి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు షాక్ తిన్నారు. మధ్యప్రదేశ్ ధార్కు చెందిన కమలేష్ అనే వ్యక్తికి.. కరోనా రెండో వేవ్ టైంలో అంటే 2021 లాక్డౌన్ సమయంలో కరోనా సోకింది. అయితే వైరస్తో చికిత్స పొందుతూ అతను చనిపోయినట్లు అధికారులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించలేదు వైద్య సిబ్బంది. దీంతో మున్సిపల్ అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు(బుధవారం) కమలేష్ తిరిగి రావడంతో అంతా షాక్ తిన్నారు. తనని అహ్మదాబాద్లో ఓ గ్యాంగ్ ఇంతకాలం బంధించి ఉంచిందని, మత్తు మందు ఇస్తూ వచ్చిందని చెప్తున్నాడు కమలేష్. ఎలాగోలా తప్పించుకుని వచ్చానని చెప్పగా.. భార్యతో పాటు తల్లిదండ్రులు అతన్ని కమలేష్గా ధృవీకరించారు. ఈ వ్యవహారంపై ధార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. -
సిబ్బందితో ప్యాసింజర్ గొడవ.. విమానం గాల్లో ఉండగానే వెనక్కి..
న్యూఢిల్లీ: సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. ఫ్లయిట్ గాల్లో ఉండగా సిబ్బందితో గొడవకు దిగాడు. వాళ్లతో ఫైట్ చేశాడు. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు పైలట్. తిరిగి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. అనంతరం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి ప్రయాణానికి అంతరాయం కల్గించిన ప్యాసింజర్ను కిందకు దింపేశారు. అతనిపై ఫిర్యాదు చేసి విమానాశ్రయంలోని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత విమానం మళ్లీ లండన్ బయల్దేరి వెళ్లింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా నిర్వాహకులు అధికారకంగా స్పందించాల్సి ఉంది. ప్యాసింజర్ సిబ్బందితో ఎందుకు గొడవపడ్డాడనే విషయం తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవలి కాలంలో కొందరు ప్రయాణికులు విమానాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఓ ప్యాసింజర్ తప్పతాగి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో ఘటనలో ఓ ప్యాసింజర్ విమానంలో స్మోకింగ్ చేసి హల్ చల్ చేశాడు. మరో ఘటనలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు తోటి ప్యాసింజర్లతో గొడవకు దిగి నానా హంగామా చేశాడు. చదవండి: Corona Virus: జాగ్రత్త! కేసులే కాదు.. మరణాలూ పెరుగుతున్నాయ్.. -
కొనడం కష్టమేనా : రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. ఓ వైపు ఆర్ధిక మాద్యం..మరోవైపు బ్యాంకుల దివాళా వెరసీ అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర సోమవారం రోజు 1శాతం పెరిగింది. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో పెరగడం గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్యాంకుల్లో ఆర్ధిక అవకతవకలు జరిగి మూతపడుతున్నాయి. ఇప్పటికే సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్లు దివాళా తీయగా.. అదే దారిలో మరికొన్ని బ్యాంకులు పయనిస్తున్నాయంటూ ఆర్ధిక వేత్తల అంచనాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ఇక దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒకే రోజు రూ.1400 పెరిగి రూ.61,100కు చేరింది. వెండి ధర సైతం రూ.1860 పెరిగి రూ.69,340కి చేరింది. ఇటీవల బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణమయ్యాయి. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే పసిడి ధర రూ.56వేల స్థాయి నుంచి రూ.60వేల స్థాయికి చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1 శాతం పెరిగి ఔన్స్ బంగారం 2,007.30 డాలర్లకు చేరింది. అంతకుముందు సెషన్లో 1శాతానికి పడిపోయింది. యూఎస్ మార్కెట్లో 2శాతం పెరిగి 2,012.50డాలర్లకు చేరింది. బ్యాంకులు షట్డౌన్ అవుతాయోమోనన్న భయాలతో మదుపర్లు..బ్యాంకుల్లో దాచిన డిపాజిట్లను తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు.లాభాదాయకమైన బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. చదవండి👉 చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..ఇప్పుడే ఇలా ఉంటే, మరి రాబోయే రోజుల్లో ఎలా? -
ఆకాశాన్ని ఖాళీ చేయిస్తున్న రష్యా.. విమానాలన్నీ వెనక్కి.. ఏం జరుగుతోంది?
మాస్కో: రష్యా ఆకాశమార్గాన్ని ఖాళీ చేయిస్తోంది. సెయింట్ పీటర్స్బర్గ్లోని పుల్కోవో విమానాశ్రాయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇక్కడకు చేరుకోవాల్సిన విమానాలన్నింటినీ తిరిగి వెనక్కి పంపింది. ఫ్లైట్ రాడార్ వెబ్సైట్ దీన్ని వెల్లడించింది. దీంతో రష్యా ఏం చేయబోతుందని సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే సెయింట్పీటర్స్బర్గ్ గగనతలంలో గుర్తు తెలియని వస్తువు (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్- UFO)ను గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని గమనించిన తర్వాతే ప్రభుత్వం అప్రమత్తమై ఆకాశమార్గాన్ని ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ విమానాశ్రాయానికి చేరుకోవాల్సిన విమానాలనకు వెనక్కి పంపించి.. యుద్ధ విమానాలకు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వస్తువు గురించి తెలుసుకునేందుకు రెండు యుద్ధ విమానాలను రష్యా గగనతలంలోకి పంపినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. ఆ వస్తువు ఏంటో కనిపెట్టేందుకు దాదాపు 100 యుద్ధవిమానాలను సెయింట్పీటర్స్బర్గ్ విమానాశ్రయంలో మోహరించినట్ల సమాచారం. అయితే ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వస్తువులు గగనతలంలో కన్పించడం కలకలం రేపడం తెలిసిందే. చైనాకు చెందిన భారీ బెలూన్లు అమెరికా ఆకాశంలో నిఘా వహించడం చర్చనీయాంశమైంది. వీటిని అగ్రరాజ్యం కూల్చివేసింది. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా ఆకాశంలో ఇప్పుడు యూఎఫ్ఓ కన్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఏలియన్ల పనా? లేక ఇతర దేశాల పనా? అనే చర్చ కూడా మొదలైంది. పుతిన్ సొంత నగరం.. అయితే రష్యా గగనతలంలో కన్పించింది ఓ భారీ డ్రోన్ అని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇది నాటో దేశాల పని అయ్యి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సొంతనగరం అయిన సెయింట్ పీటర్స్బర్గ్కు ఈ డ్రోన్ దగ్గరగా ఉండటంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా యుద్ధ విమానాలను మోహరించారు. ఈ ఎయిర్పోర్టుకు 180 కిలోమీటర్ల దూరంలోనే భారీ డ్రోన్ కన్పించింది. చదవండి: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి! -
రిటర్న్ టు ఆఫీస్: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టీసీఎస్ ఆఫీసులకు వచ్చే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కోవిడ్ తరువాత క్రమంగా వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికిన మేజర్ కంపెనీలన్నీ ఉద్యోగులకు ఆఫీసులకు రప్పించేందుకు నానా కష్టాలు పడుతున్నాయి.ఆ ఫీసు నుండే పని చేసేలా ఉద్యోగులనుప్రేరేపించేందుకు వారు కొత్త మార్గాలను ప్రయత్నిస్తున్నాయనిహెచ్ఆర్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ క్రమంలో టీసీఎస్ ఉద్యోగులను ఆఫీసు నుంచి పనిచేసేలా చేసేందుకు ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఉద్యోగులు ఆఫీసు నుండి పనిచేసే రోజులకు పాయింట్లను చేర్చనుంది. అప్రైజల్ సిస్టమ్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాయింట్లను అందించనుంది. ఈ మేరకు కంపెనీలోని మేనేజర్లు, టీమ్ లీడ్లకు ఈమెయిల్ పంపించినట్టు తెలుస్తోంది. టీమ్ మెంబర్లందరికీ ఈ క్రింది RTO (రిటర్న్ టు ఆఫీస్)కు వచ్చేలా చూడాలని కోరింది. తమ టీం సభ్యులు వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులకు రావాలని కోరుతోంది. అయితే తాజా పరిణామంపై హెచ్ఆర్ నిపుణులు విభిన్నంగా స్పందించారు. ఒక ఉద్యోగి పనితీరు వారు ఆఫీసు నుండి పని చేస్తున్నా లేదా రిమోట్గా పని చేస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా వారు ఉత్పత్తి చేసే ఫలితాలపై మాత్రమే నిర్దారించుకోవాలని, ఆఫీసు నుండి పని చేసే ఉద్యోగులు ఉండవచ్చు కానీ వారి లక్ష్యాలను చేరుకోలేరు, కేవలం ఆఫీసుల నుండి పని చేసినవారికి మదింపు పాయింట్లు ఇవ్వడం అనేది వారి పనితీరును మెరుగు పర్చడంలో సహాయ పడదని సీఐఇఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఎండీ ఆదిత్య నారాయణ్ మిశ్రా పేర్కొన్నారు. -
దొంగకు చుక్కలు చూపించిన దేవుడు!.. సొత్తు తిరిగిచ్చి క్షమాపణ
భోపాల్: దేవుడి సొత్తును కాజేస్తే రక్తం కక్కుకుని చనిపోవటం, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారని చాలా సినిమాల్లో చూపించారు. కానీ, నిజ జీవితంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. విలువైన ఆభరణాలను దోచుకుంటున్నారు దొంగలు. అయితే, ఓ దొంగ ఆలయంలో చోరీ చేసిన సొత్తును తిరిగిచ్చేశాడు. దాంతో పాటు తాను తప్పు చేశానని, ఈ దొంగతనం వల్ల తాను చాల ఇబ్బందులు పడ్డానని, తనను క్షమించాలంటూ ఓ లేఖ సైతం రాయటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో జరిగింది. బాలాఘాట్లోని శాంతినాథ్ దిగంబర జైన దేవాలయంలో గుర్తు తెలియని దొంగ అక్టోబర్ 24న చోరీకి పాల్పడ్డాడు. ఆలయంలో 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలు అపహరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, దొంగ.. మనసు మార్చుకొని అపహరించిన వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. చోరీ చేసిన వస్తువులను ఓ సంచిలో ఉంచి గ్రామ పంచాయతీ వద్ద ఉంచాడు. శుక్రవారం నీళ్ల కోసం వెళ్లినవారు సంచిని పరిశీలించగా.. అపహరణకు గురైన వస్తువులు, లేఖ కనిపించాయి. ప్రస్తుతం ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘నేను చేసిన పనికి క్షమాపణ కోరుతున్నా. నేను తప్పు చేశా.. క్షమించండి. దొంగతనం చేశాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.’ అని లేఖలో పేర్కొన్నాడు దొంగ. పంచాయతీ వద్ద వదిలివెళ్లిన వస్తువులను స్వాధీనం చేసుకుని దొంగ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ఎట్టకేలకు డ్రీమ్ గర్ల్తో వివాహం...మోదీ, యోగీలకు ఆహ్వానం! -
ఎట్టకేలకు తిరిగిచ్చారు.. 84 ఏళ్లకు గ్రంథాలయానికి చేరిన పుస్తకం
లండన్: పుస్తక పఠనంపై ఆసక్తితో గ్రంథాలయం నుంచి అద్దెకు తెచ్చుకున్న ఒక పుస్తకాన్ని ఓ పెద్దాయన తిరిగి ఇవ్వడం మరిచాడు. అలా అది 84 సంవత్సరాలు అల్మారాలో అలాగే ఉండిపోయింది. వారసత్వంగా తాత నుంచి వచ్చిన పాత వస్తువులను సర్దుతున్న మనవడికి లైబ్రరీ పుస్తకంపై దృష్టిపడింది. 1938 అక్టోబర్ 11న ఈ పుస్తకం తిరిగి ఇవ్వాలి అంటూ పుస్తకం ముందుపేజీపై ముద్రించి ఉండటం చూసి అవాక్కయ్యా. వెంటనే ఆ పుస్తకాన్ని లైబ్రరీలో అప్పజెప్పాడు. ఇంగ్లండ్లో ఇటీవల ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్లోని కోవెంట్రీ నగరం సమీపంలోని ఎర్లీస్డన్ ప్రాంతంలోని కోవెంట్రీ పబ్లిక్ లైబ్రరీ శాఖ నుంచి కెప్టెన్ విలియం హారిసన్ అనే వ్యక్తి రిచర్డ్ జెఫరీ రచించిన రెడ్ డీర్ అనే పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకున్నాడు. 1938 తొలినాళ్లలో ఈ పుస్తకం విలియం చేతికొచ్చింది. విలియం 1957లో మరణించారు. పుస్తకం విషయం తెలియక ఆయన కుమార్తె సైతం పుస్తకాన్ని గ్రంథాలయానికి పంపలేదు. ఆమె ఇటీవల కన్నుమూశారు. ఆమె కుమారుడు ప్యాడీ రియార్డన్ ఇటీవల తాత వస్తువుల్లో దీనిని కనుగొన్నాడు. వెంటనే లైబ్రరీకి తీసుకెళ్లి ఇచ్చేశాడు. 84 ఏళ్ల తర్వాత పుస్తకం తిరిగి ఇవ్వడం చూసి లైబ్రరీ సిబ్బంది ఒకింత ఆశ్చర్యపడినా చాలా ఆలస్యంగా ఇచ్చారంటూ జరిమానా విధిస్తామన్నారు. అందుకు ప్యాడీ సిద్ధపడ్డాడు. 30,695 రోజుల ఆలస్యానికి లెక్కలు కట్టి, ప్రతి ఏడు రోజుల్లో ఒకరోజుకు జరిమానా విధిస్తూ ఫైన్ను 18.27 బ్రిటిష్ పౌండ్లుగా తేల్చారు. అది కట్టేసి ప్యాడీ బాధ్యత తీరిందని సంతోషపడ్డాడు. ఇన్ని రోజుల తర్వాత పుస్తకం తిరిగిఇవ్వడం రికార్డ్ అవుతుందని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు. వాస్తవానికి ఇలాంటి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ ఇంగ్లాండ్లోనే నమోదవడం విశేషం. గ్రేట్ బ్రిటన్ తొలి ప్రధానిగా పరిగణించబడే సర్ రాబర్డ్ వాల్పోలే తండ్రి కల్నల్ రాబర్ట్ 1668లో సిడ్నీ ససెక్స్ కాలేజీ నుంచి ఒక పుస్తకం తీసుకున్నారు. అది ఏకంగా 288 సంవత్సరాల తర్వాత తిరిగి కళాశాలకు చేరింది. -
మీ ప్రాపర్టీస్పై ఎక్కువ ఆదాయం రావాలంటే గుర్తుంచుకోవలసిన విషయాలు!
దేశంలో స్థిరాస్థి మార్కెట్ పరుగులు తీస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు మధ్యలో కోవిడ్-19 ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ పుంజుకుంది. వైరస్ తగ్గుముఖం పట్టి భవిష్యత్తుపై భరోసా కనిపిస్తుండటంతో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్లు హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో స్థిరాస్థులైన ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడులే సురక్షితమైనవని, సమీప భవిష్యత్లో అవి పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అందుకే స్థిరాస్థి రేట్లు పెరుగుతున్నా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఒక వేళ మీరూ ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఆ ప్రాపర్టీస్ మీద పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ రిటర్న్ పొందాలని అనుకుంటున్నారా? అయితే పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకోండి. తద్వారా భవిష్యత్లో ఊహించని దానికంటే ఎక్కువ రిటర్న్ పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లొకేషన్ మీరు ఏ ప్రాంతంలో పెట్టుబుడులు పెడుతున్నారో.. ఆ పెట్టుబడుల నుంచి ఎంత రిటర్న్స్ రావాలో నిర్ణయించేది లొకేషన్ మాత్రమే. అందుకే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉండి, ఆదాయం పొందాలనుకుంటే అభివృద్ధి అవుతున్న ప్రాంతాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఈ పెట్టుబడి ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడికంటే తక్కువగా ఉంటుంది. సౌకర్యం కొనుగోలు దారులు షాపింగ్ క్లాంప్లెక్స్, పార్క్స్,స్కూల్స్, హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న ఏరియాకు చెందిన ప్రాపర్టీల మీద పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు. అందుకే మీరు ప్రాపర్టీస్మీద పెట్టుబడులు పెట్టే ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు ఉన్నాయా? లేవా అని చూసుకోండి. ఇప్పటికే ఈ సౌకర్యాలు ఉంటే ఇన్వెస్ట్ చేయండి. లేదంటే భవిష్యత్లో పైన పేర్కొన్న సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిసినా పెట్టుబడి పెట్టొచ్చు. ట్రాన్స్ పోర్ట్ ప్రాపర్టీని కొనుగోలు చేసే బయ్యర్స్ పరిగణలోకి తీసుకునే అంశం ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఉందా? కనెక్టివిటీ ఆప్షన్ ఉందా? అని చూసుకుంటారు. అదే ఆస్తిపై కొనుగోలుదారుడి ఆసక్తి, దాని విలువ పెరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లైతే రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు, బస్టాండ్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయండి. కమర్షియల్ ఏరియాలు మీ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ప్రాపర్టీస్ కమర్షియల్ ఏరియాల్లో ఉంటే మంచిది. ముఖ్యంగా కార్పొరేట్ ఆఫీస్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడులతో అధిక ఆదాయం పొందవచ్చు. ప్రాపర్టీస్ను లీజ్గా ఇవ్వొచ్చు. ఇళ్లైతే రెంట్కు ఇవ్వొచ్చు. ఇలా ప్రాపర్టీస్ మీద ఎక్కువ ఆదాయం గడించవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. -
భద్రతా లోపాలతో 13 లక్షల వాహనాలు వెనక్కి
న్యూఢిల్లీ: భద్రతా పరమైన లోపాల కారణంగా 13 లక్షల ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లను గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) కంపెనీలు వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్సభకు తెలిపారు. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాల ప్రకారం.. 8,64,557 ద్విచక్ర వాహనాలు, 4,67,311 ప్యాసింజర్ కార్లు వెనక్కి పిలిచిన వాటిల్లో ఉన్నట్టు చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 1,60,025 ద్విచక్ర వాహనాలు, 25,142 ప్యాసింజర్ కార్లను వెనక్కి తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. తయారీ అనంతరం లోపాలు బయటపడినప్పుడు ఆయా బ్యాచ్ల వారీగా మొత్తం వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు వెనక్కి పిలిపించి, అన్నింటినీ సరిచేసిన తర్వాత అప్పగిస్తుంటాయి. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇలా మొత్తం 3.39 లక్షల వాహనాలు, 2019–20లో 2.14 లక్షల వాహనాలను కంపెనీలు వెనక్కి పిలిపించుకున్నాయి. ‘‘ఓ మోటారు వాహనంలో లోపం వల్ల పర్యావరణానికి లేదా నడిపే వారికి లేదా ఆ వాహనంలో ప్రయాణించే వారికి, లేదంటే రహదారులను వినియోగించుకునే ఇతరులకు ప్రమాదం అని భావిస్తే.. వాటిని వెనక్కి తీసుకోవాలని కంపెనీలను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంది’’అని మంత్రి చెప్పారు. -
రియల్టీ పెట్టుబడులపై రాబడి మన దగ్గరే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: విదేశీ పెట్టుబడుల ఆకర్షణీయమైన ప్రాంతంగా భారత్ నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే రియల్టీ పెట్టుబడులపై ఎక్కువ రాబడి మన దగ్గర్నుంచే కనిపిస్తుందని ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కొలియర్స్ తెలిపింది. 2030 నాటికి ఇండియా మూడో అతిపెద్ద వినియోగదారు ఆర్ధిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది పారిశ్రామిక రంగంలో నూతనోత్సాహాన్ని నింపుతుందని పేర్కొంది. సాంకేతికత దేశం బలంగా ఉన్నప్పటికీ.. నెమ్మదిగా తయారీ రంగానికి గమ్యస్థానంగా మారుతోందని తెలిపింది. డేటా సెంటర్, సీనియర్ లివింగ్, స్టూడెంట్ హౌసింగ్, కోలివింగ్ వంటి ప్రత్యామ్నాయ రియల్ ఎస్టేట్ విభాగాలలో పెట్టుబడుల వరద పారుతోంది. సాంకేతిక వినియోగం పెరగడంతో డేటా భద్రత చట్టం అనివార్యమైంది. దీంతో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెరిగాయని కొలియర్స్ ఇండియా డైరెక్టర్ పీయూష్ గుప్తా తెలిపారు. గతేడాది దేశీయ ప్రత్యామ్నాయ రియల్టీలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని రిపోర్ట్ వెల్లడించింది. 2020తో పోలిస్తే ఇది 26 శాతం మేర వృద్ధిరేటని పేర్కొంది. అధిక నాణ్యత, సాంకేతికత, పాలన, కస్టమర్ సర్వీస్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. డేటా వేర్హౌస్లు, షేర్డ్ స్పేస్ (రెసిడెన్షియల్ లేదా కమర్షియల్), ప్రాప్టెక్ వంటి కొత్త వ్యాపారాలు ఊపందుకున్నాయి. మెరుగైన పాలన, గడువులోగా డెలివరీలు, నగదు లభ్యతతో నివాస సముదాయాల మార్కెట్లో సానుకూలత తిరిగొచ్చింది. నివాస రంగంలో 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగేళ్లలో అత్యధికం. పెట్టుబడిలో అందుబాటు, మధ్యతరగతి గృహాలు 64 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ–కామర్స్ డిమాండ్తో గత ఐదేళ్లలో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలో గరిష్ట స్థాయిలో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడిదారులు, డెవలపర్లు, ప్రాపర్టీ యజమానులు స్థిరమైన అభివృద్ధి వైపు దృష్టిసారించారు. దేశంలో గ్రీన్ బాండ్లు, గ్రీన్ ఫైనాన్సింగ్ ఎక్కువ ఆమోదం పొందుతున్నాయి. -
పన్ను చెల్లింపుదారులకు షాక్ ! నిర్మలమ్మ బడ్జెట్ వరాల్లో మెలిక
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్నుల్లో (ఐటీఆర్) తెలిసీ, తెలియకుండా వదిలేసిన వివరాలను అప్డేట్ చేసి, రెండేళ్లలోగా తిరిగి దాఖలు చేసేందుకు ఇచ్చిన వెసులుబాటును ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) స్కీముగా పరిగణించరాదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. గతంలో వెల్లడించని ఆదాయంపై అదనంగా 25% కట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సహేతుకమైన కారణాల వల్ల ఆదాయాన్ని చూపించలేకపోయిన వారు తమ రిటర్నులను సరిదిద్దుకునేందుకు దీన్ని ఉద్దేశించినట్లు బజాజ్ చెప్పారు. 12 నెలల్లోగా అప్డేటెడ్ ఐటీఆర్ను 12 నెలల్లోగా సమర్పిస్తే బాకీ ఉన్న పన్నుపై అదనంగా 25%, వడ్డీ కట్టాల్సి ఉంటుందని.. అదే 12 నెలల తర్వాత 24 నెలల్లోగా సమర్పిస్తే రేటు 50% దాకా పెరిగిపోతుందని ఆయన వివరించారు. ‘ఇదెలా పనిచేస్తుందంటే.. ఎవరైనా ట్యాక్స్పేయరు రూ.50,000 ఆదాయాన్ని చూపించడం మర్చిపోతే దానిపై రూ. 15,000 పన్ను వర్తిస్తుందనుకుందాం. అప్పుడు వారు ఆ రూ. 15,000పై అదనంగా మరో 25–50% వరకూ (అప్డేట్ చేసిన రిటర్నును దాఖలు చేసిన సమయాన్ని బట్టి) కట్టాల్సి ఉంటుంది‘ అని బజాజ్ వివరించారు. ‘ఇది..మీరు ఏడాది, రెండేళ్ల తర్వాతయినా ఐటీఆర్ వేయొచ్చని చెప్పడం కాదు. ఎందుకంటే, అలాగయితే నిఖార్సయిన ట్యాక్స్పేయరు కూడా తర్వాత వేయొచ్చులే అనుకోవచ్చు. అలా జరగకుండా ఉండేందుకే అదనపు పన్ను విధిస్తున్నాం‘ అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం డిసెంబర్ దాటితే, సవరించిన రిటర్నులను దాఖలు చేసే అవకాశం లేదు. చదవండి: ఓన్లీ ఫైలింగ్ అప్డేట్కి అవకాశం.. శ్లాబుల్లో నో ఛేంజ్.. -
‘బోనస్లు తిరిగి ఇచ్చేయండి’.. ఉద్యోగులకు కంపెనీ షాక్!
దేశంలోనే నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీని ఏడాది మధ్యలో వీడుతున్న ఉద్యోగులను.. బోనస్ కింద చెల్లించిందంతా తిరిగి ఇచ్చేయమంటూ వేధిస్తోందన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు ప్రకటన ఇచ్చుకుంటున్నప్పటికీ.. అది ఉద్యోగులకు పూర్తి ఊరట ఇచ్చేదిగా లేదని తెలుస్తోంది!. తాజాగా భారత ఐటీ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెసీఎల్పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజైన్లు చేసి కంపెనీని వీడుతున్న ఉద్యోగులను ‘పర్ఫార్మెన్స్ బోనస్’ ఇచ్చిందంతా.. తిరిగి చెల్లించాకే బయటకు వెళ్లాలని కోరుతోంది. ఈ మేరకు హెచ్ఆర్ పాలసీలోని రూల్ను చూపించడంతో ఉద్యోగులు ఖంగుతింటున్నారు. ఈ విషయంపై ఐటీ ఎంప్లాయిస్ యూనియన్లను ఉద్యోగులు ఆశ్రయించినట్లు సమాచారం. లేబర్ మినిస్టర్ భూపేందర్ యాదవ్కి, హెచ్సీఎల్ చైర్పర్సన్కి సైతం లేఖలు రాశారు పుణే ఐటీ యూనియన్ ప్రతినిధి హర్మీత్ సలూజ. డబ్బులు తిరిగి చెల్లించని ఉద్యోగుల ఎక్స్పీరియెన్స్ సర్టిఫికెట్లు, రిలీవింగ్ లెటర్లు ఇవ్వకుండా కంపెనీ వేధిస్తోందని సలూజ ఆ లేఖలో ప్రస్తావించారు. హెచ్సీఎల్ ప్రకటన అయితే హెచ్సీఎల్ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతోంది. ఉద్యోగులకు తెలియకుండా తామేం చేయట్లేదని పేర్కొంది. మంత్లీ బేసిస్ మీద చెల్లించే అడ్వాన్స్ విషయంలో హెచ్ఆర్ పాలసీ ప్రకారం.. అదీ ఉద్యోగులు సంతకాలు చేసిన కాలమ్ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేసింది. నవంబర్ 2021న ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రకారం.. సెప్టెంబర్ 1, 2021 నుంచి మార్చ్ 31, 2022 మధ్య కంపెనీని వీడే ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ల నుంచి.. ఎంప్లాయి పర్ఫార్మెన్స్ బోనస్ (EFB) రికవరీ చేస్తామని తెలిపింది. ఇక వివాదాస్పదం కావడంతో ఆఘమేఘాల మీద ఆ పాలసీని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. వెనక్కి తగ్గలేదు! వివాదాస్పద ఈ పాలసీ విషయంలో హెచ్సీఎల్ ఒక స్పష్టమైన ప్రకటనంటూ ఇవ్వకపోవడం గమనార్హం. దశాబ్దానికి పైగా జూనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు జీతం కాకుండా.. అడ్వాన్స్గా చెల్లింపులు అందుకుంటున్నారు. అలాగే ఇకపై కంపెనీ మా ఉద్యోగుల కోసం ముందస్తు వేరియబుల్ చెల్లింపును కొనసాగిస్తుంది. అంతేకాదు డిసెంబర్ 22, 2021 నుంచి రికవరీలను కూడా మాఫీ చేసిందని హెచ్సీఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఇక్కడే గందరగోళం నెలకొంది. ఈఎఫ్బీ రికవరీ పాలసీని మాత్రమే హెచ్సీఎల్ వెనక్కి తీసుకుందని.. ఏపీఎంబీ (Advance Monthly Performance Bonus) విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సలూజ చెప్తున్నారు. ఈఎఫ్బీ అనేది ఉద్యోగులందరికీ వర్తించే బోనస్ కాగా.. ఏఎంపీబీ మాత్రం ప్రత్యేకించి ప్రాజెక్టుల కోసం పని చేసే ఉద్యోగులందరికీ జారీ చేస్తున్న బోనస్. సో.. రిజైన్ చేసిన ఉద్యోగులు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న మాట!. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ‘ఆఫీస్ రిటర్న్’ నిరవధిక వాయిదా
After Google Now Apple Delays Return To Office Deadline Indefinitely: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ ఆందోళన కొనసాగుతోంది. కరోనా వైరస్లో శరవేగంగా విస్తరిస్తున్న వేరియెంట్ కావడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగుల భద్రత దృష్ట్యా మరికొంత కాలం వర్క్ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటున్నాయి కంపెనీలు. గూగుల్ ఇదివరకే ఆఫీస్ రిటర్న్ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేయగా.. ఇప్పుడు మరో టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ అదే బాటలో పయనించింది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు రావాలన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ఫిబ్రవరి 1, 2022 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ప్రకటించిన యాపిల్.. ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ప్రతీ ఉద్యోగికి 1,000 డాలర్ల(76 వేల రూ. పైనే) వర్క్ఫ్రమ్ హోం బోనస్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది కూడా. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గుడ్న్యూస్..! కేంద్రం కీలక నిర్ణయం..! దీంతో మరికొన్ని కంపెనీలు ఈ జాబితాలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గూగుల్ కూడా ఇలాగే వర్క్ఫ్రమ్ హోం కొనసాగిస్తూ.. ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి కంపెనీలు ఈ ఏడాది జూన్ నుంచే వర్క్ఫ్రమ్కు ఎండ్కార్డ్ వేయాలనుకున్నాయి. కానీ, డెల్టా ఫ్లస్ వేరియెంట్, ఆ వెంటనే ఒమిక్రాన్ వేరియెంట్లు వచ్చి పడ్డాయి. అయినప్పపటికీ వ్యాక్సినేషన్ కారణంగా ఏది ఏమైనా ఈ జనవరి నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని నిర్ణయించుకున్నాయి. కానీ, ఒమిక్రాన్ ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో పాకేసింది. గాలిలో శరవేగంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ ప్రమాదకరమైందనే సంకేతాలిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల ఆరోగ్యం పట్ల రిస్క్ తీసుకునే ఉద్దేశంతో కంపెనీలు లేనట్లు కనిపిస్తున్నాయి. మరోవైపు భారత్లోనూ వ్యాక్సినేషన్తో సంబంధం లేకుండా ఉద్యోగుల్ని మరికొంత కాలం వర్క్ఫ్రమ్ హోంలోనే కొనసాగించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పిస్తుండగా.. మరికొన్ని 45 ఏళ్లలోపు వాళ్లను మాత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే చాలావరకు మాత్రం 2022లోనూ వర్క్ఫ్రమ్ హోం విధాన కొనసాగింపుకే మొగ్గు చూపిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి కూడా. వర్క్ ఫ్రమ్ హోంపై ఐటీ కంపెనీల సంచలన నిర్ణయం..! -
ప్రయాణికుడి మృతి.. వెనక్కి వచ్చిన విమానం
US Passenger Dies Onboard Air India Flight Returns To Delhi : ఢిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న విమానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి నేవార్క్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటలకు ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. (చదవండి: లండన్ - హైదరాబాద్ ఫ్లైట్ ఫ్యూయెల్ ట్యాంక్లో లీక్.. అత్యవసర ల్యాండింగ్..) "ఎయిరిండియా ఢిల్లీ-నెవార్క్ (యూఎస్) విమానంలో వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా.. టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది" అని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు వార్తా సంస్థ ఏఎన్ఐకి తెలిపారు. "డిసెంబర్ 4న, తన భార్యతో కలిసి నెవార్క్కు ప్రయాణిస్తున్న ఒక అమెరికి పౌరుడు మరణించిన కారణంగా ఢిల్లీ నుంచి నెవార్క్కి వెళ్లే ఫ్లైట్ నంబర్ ఏఐ-105 తిరిగి వచ్చింది" అని తెలిపారు. (చదవండి: ‘దేశంలో రాజాలు ఎందరున్నా.. మహారాజా ఒక్కడే’) విమానాశ్రయ వైద్యుల బృందం విమానం వద్దకు చేరుకుని.. ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అతను చనిపోయినట్లు నిర్ధారించారు. మరణించిన వ్యక్తి అమెరికన్ కాగా.. భార్యతో కలిసి అతడు ప్రయాణం చేస్తున్నాడు. విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని.. తిరిగి ఇదే విమానం.. శనివారం సాయంత్రం 4 గంటలకు కొత్త టీంతో అమెరికా ప్రయాణం అయ్యిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. చదవండి: సొంతింటికొస్తున్న విమానం -
దళితబంధును వదులుకున్న సిసలైన శ్రీమంతులు..
సాక్షి, కరీంనగర్: లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.10 లక్షలు. తిరిగి ఇచ్చేయాలన్న నియమమేమీ లేదు. అయినా.. వారు ఆ డబ్బును తిరస్కరించారు. తాము మంచి స్థితిలోనే ఉన్నామని, దళితబంధు కింద వచ్చే ఆ డబ్బు పేద సోదరులకు ఉపయోగపడాలంటూ ఆ ఐదుగురు పెద్ద మనసు చాటుకున్నారు. సమాజంలో సిసలైన శ్రీమంతులు అనిపించుకున్నారు. తాము ఆర్థికంగా ఉన్నతస్థితిలోనే ఉన్నామని, తమకు రూ.10 లక్షల సాయం అవసరం లేదని స్పష్టంచేశారు. గివ్ ఇట్ అప్ (వదులుకోవడం) కింద వీరు తమకు వచ్చే భారీ ఆర్థికసాయాన్ని వదులుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ ఐదుగురి గురించే చర్చించుకుంటున్నారు. వీరిలో ముగ్గు రు వ్యక్తులు తండ్రీకొడుకులు కావడం గమనార్హం. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దళితుల పురోభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హు జూరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా సర్వే చేసి 5 మండలాల్లో దాదాపు 23 వేలకుపైగా దళితులను గుర్తించింది. వీరికోసం రూ.2,000 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకూ హు జూరాబాద్ నియోజకవర్గంలో 14,421 మంది లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం దళితబంధు నిధులు జమచేసింది. తాజాగా ఐదుగురు వ్యక్తులు తామెందుకు దళితబంధు సాయాన్ని వద్దనుకుంటున్నారో తెలుసుకుందాం..! పేదలకు ఉపయోగపడాలి నేను గెజిటెడ్ ప్రాధానోపాధ్యాయునిగా పదవీవిరమణ పొందాను. నా భార్య కూడా ప్రభుత్వ టీచర్గా రిటైరయ్యారు. నేను అంబేడ్కర్ వాదిని. ఆయన కల్పించిన రిజర్వేషన్లను ఆసరా చేసుకొని ఉన్నత స్థితికి చేరుకున్నా. ఇప్పటికీ ఇంకా ఎందరో దళితులు అట్టడుగు స్థితిలో ఉన్నారు. అందుకే.. నాకు వచ్చిన రూ.10 లక్షలను ఇతర పేద కుటుంబాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాపస్ ఇచ్చా. – కర్రె నరసింహస్వామి, హుజూరాబాద్ పేదల కోసం వదులుకున్నా ప్రస్తుతం రైల్వేలో డిప్యూటీ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ మంచి జీతంతో ఉన్నత స్థితిలో ఉన్నా. మా తండ్రి, తల్లి ప్రభుత్వ టీచర్లుగా పదవీవిరమణ పొందారు. వారికి పెన్షన్ కూడా వస్తోంది. అందుకే.. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద మంజూరు చేసిన 10 లక్షల రూపాయలను పేద దళిత కుటుంబాలకు ఉపయోగపడాలని గివిట్ అప్ కింద ప్రభుత్వానికి తిరిగి ఇచ్చా. – కర్రె కిరణ్ కుమార్, రైల్వే ఇంజనీర్, హుజూరాబాద్ నా పెన్షన్ చాలు పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా రిటైరయ్యాను. ఇప్పటికీ చాలా దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాయి. నాకు మంజూరైన దళితబంధు డబ్బులు పేద దళిత కుటుంబానికి ఇస్తే వారు అభివృద్ధి చెందుతారు. అదే నాకు తృప్తి. నాకు వచ్చే పెన్షన్ సరిపోతుంది. అందుకే.. నాకు వచ్చిన రూ.10 లక్షలను వదులుకున్నా. – సోటాల మోహన్రావు, రిటైర్డ్ ఇంజనీర్, హుజూరాబాద్ చదవండి: కంటోన్మెంట్ విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ -
Cheetahs: చీతా గురించి మీకు ఈ విషయాలు తెలుసా!
భూమిపైనే అత్యంత వేగవంతమైన జీవిగా పేరున్న చీతా (ఒక రకం చిరుత).. భారతదేశంలోకి మళ్లీ అడుగుపెడుతోంది. అర్ధ శతాబ్దం క్రితం మన దేశంలో అంతరించిపోయిన ఈ జాతి.. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే నవంబర్లో మళ్లీ మన నేలపై పరుగులు తీయనుంది. చీతాల ప్రత్యేకత.. ► సన్నగా నాజూగ్గా ఉండే చీతా.. పిల్లి జాతిలోని పెద్ద జంతువుల్లో ఒకటి. సుమారు 70 కేజీల బరువు ఉంటుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇమిడి పోగలదు. ► కంటి కింద చారికలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ చారికలు సూర్యకాంతి నుంచి వాటి కళ్లకు రక్షణ కల్పిస్తూ వేటాడే జంతువును స్పష్టంగా చూడటానికి ఉపయోగపడతాయి. ► చిరుతలాగే చుక్కలతో అందంగా ఉంటుంది. కానీ తన సహచర జీవిలా చెట్లు ఎక్కలేదు. ► దౌడు తీస్తున్న సమయంలోనూ తన గతిని వెంటనే మార్చుకోగలదు, తన ఎరపైకి దూకగలదు. ఈ సమయంలో వాటి పొడవైన తోకే స్టీరింగ్లా పనిచేస్తుంది. ► సోదరులైన మగ చీతాలు మూడు, నాలుగు కలసి గుంపుగా జీవిస్తాయి. కలసి వేటాడతాయి. కానీ ఆడ చీతా మాత్రం ఒక్కటే ఉంటుంది. పిల్లలను సంరక్షిస్తూ జీవిస్తుంది. ► భూమిపైన అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఇది. గంటకు సుమారు 70 మైళ్లు (112 కి.మీ) వేగంతో పరిగెత్తగలదు. ఈ వేగాన్ని కేవలం మూడు సెకన్లలోనే అందుకోగలదు. రెండు జాతులు.. ఆసియా రకం, ఆఫ్రికా రకం అనే రెండు జాతులు చీతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆసియా రకం చీతా అంతరించి పోయే జాతుల్లో ఒకటి. కేవలం 70 నుంచి 80 వరకూ మాత్రమే బతికి ఉన్నాయి. వీటిని ఇరాన్ వంటి దేశాల్లో గ్రేహౌండ్ శునకాల్లాగా పెంచుకుంటున్నారు. వేటకు వీటిని ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 7 వేల ఆఫ్రికా చీతాలు ఉంటే.. వాటిల్లో ఎక్కువ సౌతాఫ్రికా, నమీబియా, బోట్సవానాల్లోనే నివసిస్తున్నాయి. 1980వ దశకంలో మలావీలో చీతాలు అంతరించి పోతే.. 2017లో 4 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలారు. ఇప్పుడు అక్కడ వాటి సంఖ్య 24కు పెరిగింది. సమస్యలు ఏంటి.. ► ఇతర వేటాడే జీవులైన సింహాలు, పులులు, చిరుతలు, హైనాలు, అడవి కుక్కల దాడుల వల్ల ఎక్కువగా చీతాలు చనిపోతూ ఉంటాయి. ఆఫ్రికాలో సగంపైగా చీతాల మరణాలకు సింహాలు, హైనాలే కారణం. వీటి నుంచి చీతాలు తమ కూనలను రక్షించుకోవడం కూడా చాలా కష్టం. ► తరచూ మనుషుల ఆవాసాల్లోకి చొరబడి పెంపుడు జంతువులను చంపుతాయి. దీంతో మనుషులు కూడా వాటిపై దాడి చేస్తారు. నిపుణులు ఏం చెబుతున్నారు.. ► భారతదేశంలో అంతరించి పోయిన జీవిని మళ్లీ తీసుకొచ్చి సంరక్షించడం మంచిదే. కానీ దేశంలో అడవులు క్షీణించిపోతుండటం పెద్ద సమస్య. ఇప్పుడు ఉన్న వేటాడే జీవులకే ఆహారం లభ్యంకాని పరిస్థితి. దీని వల్ల వేటాడే జీవుల్లో ఆహార పోటీ పెరుగుతుంది. ఇది చీతాలకు శ్రేయస్కరం కాదు. ► పులులు, చిరుతలు, అడవి కుక్కలు లేని చోట వాటిని వదలాలి. లేదంటే సంరక్షణాలయాల్లో వాటిని ఉంచి సంతతి పెరిగాక అడవుల్లో వదలాలి. ► చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయడం వల్ల ఉపయోగంలేదు. ఫెన్సింగ్తో కూడిన రక్షణ వలయం ఏర్పరచినప్పుడే వాటి సంతతి పెరుగుతుంది ఇప్పుడు ఎక్కడ.. ► ప్రస్తుతం ఐదు మగ, మూడు ఆడ.. మొత్తం ఎనిమిది చీతాలను ఆఫ్రికా నుంచి భారత్కు తీసుకువస్తున్నారు. ► వీటిని రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టనున్నారు. ► మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో జింక జాతి జీవులు, అడవి పందులు ఎక్కువగా ఉండటం, అవి చీతాకు సహజ ఆహారం కావడం వల్ల ఆ పార్కును ఎంచుకున్నారు. ► రాజస్థాన్లోని ముకుంద్ర హిల్స్ ప్రాంతంలోని పులుల సంరక్షణ ప్రాంతాన్ని కూడా చీతాల పునఃప్రవేశానికి ఎంపిక చేశారు. భారత్లో ఇలా.. ► మొగల్ చక్రవర్తి అక్బర్ కాలంలో సుమారు 10 వేల చీతాలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వాటిలో వెయ్యి వరకూ ఆయన అధీనంలో ఉండేవట. ► చీతాల సంతతి పెంచడానికి జహంగీర్ కాలంలో కృత్రిమ గర్భధారణ పద్ధతులను కూడా అవలంభించారు. ► 1799లో 230 వరకూ చీతాలు భారత్లో ఉన్నాయి. ► అడవుల్లో సహజ ఆహారమైన జింకలు, దుప్పులు తగ్గిపోవడం, బ్రిటిష్ పాలకుల వేట కారణంగా చీతాల సంఖ్య క్రమంగా క్షీణించిపోయింది. ► భారత దేశంలో చిట్టచివరి చీతా 1967–68 సంవత్సరాల్లో కనిపించింది. ► 1970లో 300 చీతాలను ఇరాన్ నుంచి భారత్కు తీసుకురావడానికి జరిగిన చర్చలు సఫలం కాలేదు. -
మళ్లీ ఓడిన సింధు, శ్రీకాంత్
బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్లు పూసర్ల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నిరాశ పరిచారు. సీజన్కు సంబంధించిన ఈ ముగింపు టోర్నీలో లీగ్ దశతోనే సరిపెట్టుకున్నారు. ప్రపంచ చాంపియన్ సింధు, మాజీ ప్రపంచ నంబర్వన్ శ్రీకాంత్ వరుసగా రెండో లీగ్ మ్యాచ్లోనూ పరాజయం పాలయ్యారు. దీంతో వీరిద్దరు సెమీస్ చేరుకునే అవకాశాలు గల్లంతయ్యాయి. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో తెలుగమ్మాయి సింధు 18–21, 13–21తో మాజీ ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి చవిచూసింది. గత వారం ఇదే ప్రత్యర్థి చేతిలో థాయ్లాండ్ ఓపెన్లో ఓడిన ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు ఈ మ్యాచ్లోనూ తన ఆటతీరును, ఫలితాన్ని మార్చుకోలేకపోయింది. ప్రపంచ చాంపియన్పై మూడో సీడ్ రచనోక్కు ఇది ఆరో విజయం. వీరిద్దరూ పలు అంతర్జాతీయ టోర్నీల్లో ఇప్పటివరకు పది సార్లు తలపడితే సింధు 4 సార్లు మాత్రమే గెలిచింది. తొలి గేమ్లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ఆరంభంలో అయితే సింధు దూకుడుగా ఆడటంతో 4–2తో మొదలైన ఆమె ఆధిక్యం 14–11 దాకా కొనసాగింది. ఈ దశలో రచనోక్ వరుసగా మూడు పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. క్రమంగా సింధుపై తన ఆధిపత్యం చలాయిస్తూ 21–18తో గేమ్ నెగ్గింది. తర్వాత రెండో గేమ్లో సింధు పట్టు కోల్పోయింది. ఇదే అదనుగా రచనోక్ 9–8 స్కోరు వద్ద వరుసగా మూడు పాయింట్లు గెలుచుకుంది. వెంటనే సింధు కూడా మూడు పాయింట్లు చేసినప్పటికీ తర్వాత థాయ్లాండ్ స్టార్... సింధుకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా చెలరేగి ఆడింది. దీంతో ఈ గేమ్, మ్యాచ్ గెలిచేందుకు ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. 43 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. పరాజయంపై సింధు మాట్లాడుతూ ‘ఈ రోజు నాది కాదు. నాకేం కలిసిరాలేదు. తొలి గేమ్ ఓడిపోవడం... తర్వాత నేను వెనుకబడటంతో మ్యాచ్లో నిరాశ తప్పలేదు’ అని పేర్కొంది. పురుషుల ఈవెంట్ గ్రూప్ ‘బి’లో భారత స్టార్ శ్రీకాంత్ 21–19, 9–21, 19–21తో నాలుగో సీడ్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్లో పోరాడి ఓడాడు. వాంగ్ జుపై శ్రీకాంత్కు 3–0తో మంచి రికార్డే ఉంది. అందుకు తగ్గట్లే శ్రీకాంత్ తొలి గేమ్ను గెలుచుకున్నాడు. కానీ రెండో గేమ్ను చిత్తుగా కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్లో మళ్లీ పోరాటం చేసినప్పటికీ వాంగ్ జు ఆ అవకాశం ఇవ్వలేదు. గంటా 18 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరులో శ్రీకాంత్కు పరాజయం తప్పలేదు. నేటి నామ మాత్రమైన మ్యాచ్లో సింధు... పోర్న్పవి (థాయ్లాండ్)తో, శ్రీకాంత్... క లంగ్ అంగుస్ (హాంకాంగ్)తో తలపడతారు. -
సారూ.. నా ఇల్లు వేరొకరికి ఇయ్యండి
‘నాకు సిద్దిపేటలో కేసీఆర్ నగర్లో అధికారులు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిండ్రు. నేను నా కూతురు ఇద్దరం.. మా తమ్ముడి వద్ద ఉంటున్నం. రేపోమాపో నా కూతురికి పెళ్లయి వెళ్లిపోతది. తర్వాత ఒంటరిగా ఉండే నాకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు అవసరం ఉండదు. నాకు వచ్చిన ఆ ఇంటిని అధికారులకు తిరిగిస్తున్నా. నా లాంటి పేదవారికి దాన్ని ఇవ్వండి. ఇదీ ఈ పేదింటి మహిళ గొప్ప మనసు.. సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట కేసీఆర్ నగర్లోని ఆడిటోరియంలో లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సిద్దిపేటకు చెందిన రచ్చ లక్ష్మి తన కూతురు, తమ్ముడితో కలసి వేదికపైకి వచ్చింది. తన భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడని.. కొంతకాలంగా కూతురుతో కలసి తమ్ముడు నగేష్ వద్ద ఉంటున్నా మని తెలిపింది. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని వెనక్కి ఇస్తున్నట్లు మంత్రికి వివరించింది. మరో పేదరాలికి ఆ ఇంటిని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇంటి ధ్రువీకరణ పత్రాలు, తాళం చెవిని మంత్రి హరీశ్ సమక్షంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి అప్పగించింది. లక్ష్మి నిర్ణయాన్ని మంత్రి అభినందించారు. -
మళ్లీ బరిలోకి మైక్ టైసన్..
బాక్సింగ్ అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది మైక్ టైసన్. 20 ఏళ్ల వయసులోనే ట్రివర్ బెర్బిక్ను ఓడించి హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ను గెలుచుకొని రికార్డు సృష్టించాడు. బాక్సింగ్ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నటైసన్ 2005లో రిటైర్డ్ అయ్యాడు. అయితే మళ్లీ రింగ్లోకి దిగాలని మైక్టైసన్ భావిస్తున్నాడు. సెప్టెంబర్ 12న 4 డివిజన్ వరల్డ్ ఛాంపియన్ రాయ్జోన్స్ జూనియర్తో తలపడనున్నాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఒక మ్యూజిక్ ప్లాట్ఫాం ద్వారా టైసన్ పంచుకున్నాడు. తాను రిటర్న్ వస్తున్న సందర్భంగా చేసిన ఒక వీడియోను టైసన్ షేర్ చేశారు. చదవండి: మహాబలుడు 🥊 ANNOUNCED: Mike Tyson is having a comeback fight against Roy Jones Jr on Sept 12th at the Dignity Health Sports Park in California. The bout will be an eight-round exhibition, broadcast on PPV. Tyson, 54, last fought in 2005. Jones, 51, last fought in 2018. pic.twitter.com/eJzWT5HaL4 — Michael Benson (@MichaelBensonn) July 23, 2020 ఈ వీడియోలో టైసన్ గెలుచుకున్న డబ్య్లూబీఏ, డబ్య్లూబీసీ, ఐబీఎఫ్ టైటిల్స్ను చూపిస్తూ ఒక పవర్ పుల్ పంచుఇవ్వగానే హి ఈజ్ బ్యాక్ అనే మ్యూజిక్ వస్తుంది. తాను మే నుంచి ప్రాక్టీస్ ప్రారంభించానని, చారిటీకి ఫండ్స్ ఇవ్వడం కోసమే తాను మరోసారి రింగ్లోకి దిగుతున్నట్లు మైక్ టైసన్ పేర్కొన్నాడు. ఇక తన ప్రత్యర్థులు తనతో తలబడటానికి సిద్దంగా ఉండాలని సవాల్ విసిరాడు. టైసన్ తన కెరీర్లో మొత్తం 50 ప్రొఫెషనల్ ఫైట్స్ను గెలిచాడు. మొత్తానికి టైసన్ తిరిగి రావడంతో బాక్సింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ప్రదీప్... కొత్త రకం డోపీ View this post on Instagram Visit MyYellowShirt.com to buy your official @tysonranchofficial training gear and help support a good cause. @smartcups @miketysoncares A post shared by Mike Tyson (@miketyson) on Jul 20, 2020 at 9:01am PDT -
అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : కంగన
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత సినీ పరిశ్రమలో నెపోటిజంపై గొంతెత్తిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి సంచలనం సృష్టించారు. ఈ విషయంలో తన వాదనలను నిరూపించుకోలేకపోతే తన పద్మశ్రీని పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఒక హిందీ టీవీ చానల్తో మాట్లాడుతూ కంగనా ఈ విషయాన్ని వెల్లడించారు. సుశాంత్ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు తాను మనాలీ ఉండగా ఫోన్ చేశారనీ, అయితే తన స్టేట్మెంట్ను తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా ఎవరూ రాలేదని వివరించారు అయితే ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడనని, తాను పారిపోయే మనషిని కాదని స్పష్టం చేశారు. తన విమర్శలను నిరూపించుకోలేకపోతే, పద్మశ్రీ అవార్డును ఉంచుకునే అర్హత తనకుండదని ఆమె పేర్కొన్నారు. (సుశాంత్ది ఆత్మహత్యా? హత్యా: కంగన ఫైర్) జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య యావత్ సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే పరిశ్రమలో నెపోటిజంపై అనేక విమర్శలు చెలరేగాయి. ప్రధానంగా మహేష్ భట్, కరన్జోహార్ లాంటి నిర్మాతలపై కంగనా ఘాటు విమర్శలు గుప్పించారు. అలాగే సుశాంత్ది ఆత్మహత్యా లేక పథకం ప్రకారం జరిగిన హత్యా అంటూ బాలీవుడ్ పరిశ్రమ తీరుపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (‘సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలి’) -
ఇన్వెస్టర్ల సొమ్ము పూర్తిగా చెల్లిస్తాం
న్యూఢిల్లీ: సాధ్యమైనంత త్వరగా ఇన్వెస్టర్ల సొమ్మును పూర్తిగా చెల్లిస్తామని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. స్కీములను మూసివేసినంత మాత్రాన పెట్టుబడులు పోయినట్లుగా భావించరాదని పేర్కొంది. ‘స్కీముల్లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు జరిపేందుకు, మా బ్రాండ్పై విశ్వసనీయతను నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నాం‘ అని ఇన్వెస్టర్లకు రాసిన నోట్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏఎంసీ(ఇండియా) ప్రెసిడెంట్ సంజయ్ సప్రే తెలిపారు. కరోనా వైరస్పరమైన సంక్షోభం కారణంగా రిడెంప్షన్ ఒత్తిళ్లు పెరిగిపోయి, బాండ్ మార్కెట్లలో లిక్విడిటీ పడిపోవడంతో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ స్కీములను మూసివేసిన సంగతి తెలిసిందే. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ. 25,000 కోట్లు ఉంటుంది. మూసివేత నిర్ణయం చాలా కష్టతరమైనదని, కానీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తప్పలేదని సప్రే తెలిపారు. ట్రిపుల్ ఎ రేటింగ్ నుంచి ఎ రేటింగ్ దాకా ఉన్న బాండ్లలో తాము ఇన్వెస్ట్ చేశామని .. ఈ వ్యూహం ఇటీవలి దాకా మంచి ఫలితాలనే ఇచ్చిందని పేర్కొన్నారు. ఫండ్ను ప్రభుత్వం టేకోవర్ చేయాలి: బ్రోకింగ్ సంస్థల డిమాండ్ ‘ఫ్రాంక్లిన్’ ఉదంతంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తక్షణ చర్యలు తీసుకోవాలని బ్రోకింగ్ సంస్థల సమాఖ్య ఏఎన్ఎంఐ పేర్కొంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మేనేజ్మెంట్ను టేకోవర్ చేసేందుకు, పెట్టుబడుల తీరును సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖకు ఏప్రిల్ 26న ఏఎన్ఎంఐ ఈ మేరకు లేఖ రాసింది. సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్ట్ చేయడంతో పాటు అంతగా రేటింగ్ లేనివి, ఊరూ పేరూ లేని పలు సంస్థల్లో టెంపుల్టన్ ఫండ్ పెట్టుబడులు పెట్టడం సందేహాలు రేకెత్తిస్తోందని పేర్కొంది. -
ప్రముఖ మహిళా ఎడిటర్ సంచలన నిర్ణయం
ముంబై: బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు -2019 ను నిరసిస్తూ ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు, రచయిత షిరీన్ దాల్వి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అమానవీయ చట్టానికి నిరసనగా తనకు ప్రదానం చేసిన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ బిల్లును పాస్ చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, సెక్యులరిజానికి విరుద్ధమని విమర్శించారు. ఈ పరిణామం తనను తీవ్రమైన విచారానికి, షాక్కు గురించేసిందని షిరీన్ వ్యాఖ్యానించారు. ''అవధ్నామా'’ ఉర్దూ పత్రిక ముంబై ఎడిషన్ ఎడిటర్గా పనిచేసిన ఆమెకు సాహిత్య రంగంలో చేసిన విశేష సేవకు గాను 2011లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అయితే చార్లీ హెబ్డో కార్టూన్ను తిరిగి ముద్రించిన వివాదంలో ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్న ఆమె ఉర్దూన్యూస్ ఎక్స్ప్రెస్. కామ్ అనే న్యూస్ వెబ్సైట్ను ప్రారంభించారు. మరోవైపు మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అబ్దుర్ రహమాన్ ముంబై (రాష్ట్ర మానవ హక్కుల కమిషన్) తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఆయన నిరాశ చెందారు. పౌరుల హక్కులకు విఘాతంగా కలిగిస్తుందంటూ బిల్లును ఖండించిన ఆయన తన సర్వీసులకు గుడ్ బై చెబుతున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించుకన్న నరేంద్ర మోదీ సర్కార్, బుధవారం రాజ్యసభ ఆమోదాన్ని కూడా సాధించింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలు వీగిపోయాయి. సుదీర్ఘ వాదనలు, వాకౌట్లు తరువాత రాజ్యసభ బుధవారం నాడు ఈ బిల్లుకు ఆమోదించింది. దీంతో ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినమని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ పరిణామంతో ఈశాన్య రాష్ట్రాలు నిరసనలు, అల్లర్లతో అట్డుడుకుతున్నాయి. ముఖ్యంగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. గువహటి, డిబ్రూగర్ ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్ సేవలతోపాటు పలు రైళ్ల, విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. -
సీఏసీలోకి మళ్లీ సచిన్, లక్ష్మణ్!
కోల్కతా: గతంలో రద్దయిన క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏఏ)ని శనివారం మళ్లీ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూ ల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి ఇందులో సభ్యులుగా పునరాగమనం చేసే అవకాశం ఉందని సమాచారం. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కారణంగా ఈ కమిటీ నుంచి సచిన్, వీవీఎస్ ఇంతకు ముందు తప్పుకున్నారు. అయితే గంగూలీ బోర్డు అధ్యక్షుడైన నేపథ్యంలో సీఏసీ మళ్లీ సిద్ధమవుతోంది. ఆదివారం జరిగే బీసీసీఐ ఏజీఎంలో కొత్త సెలక్షన్ కమిటీని కూడా ప్రకటించనున్నారు. -
ఒరిజినల్స్, ఫీజు తిరిగి ఇచ్చేయాల్సిందే
న్యూఢిల్లీ: నెలలోపు అడ్మిషన్లు ఉపసంహరించుకున్న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఫీజును తిరిగి ఇవ్వకపోవడం పట్ల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అన్ని వర్సిటీలు, కళాశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము జారీచేసిన మార్గదర్శకాలను పాటించకపోతే కళాశాలలు, వర్సిటీలు.. అఫిలియేషన్, డీమ్డ్ హోదాతో పాటు యూజీసీ సాయం కోల్పోతా యని హెచ్చరించింది. ప్రవేశాల సమయంలో విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించాల్సిన అవసరంలేదని మానవ వనరుల మంత్రి జవడేకర్ చెప్పారు. ఏ విద్యా సంస్థ కూడా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను తమ వద్దే అట్టిపెట్టుకోకూడదన్నారు. స్వీయ ధ్రువీ కరణ నకలు పత్రాలు ఇస్తే సరిపోతుందని తెలిపారు. అడ్మిషన్ల గడువు ముగియడానికి 15 రోజుల ముందు విద్యార్థి ప్రవేశాన్ని ఉపసంహరించుకుంటే మొత్తం ఫీజు తిరిగి చెల్లించాలి. -
‘రైతుబంధు’ను వదులుకున్న డీజీపీ
సాక్షి, కూసుమంచి/తలకొండపల్లి : రైతుబంధు పథకం ద్వారా వచ్చిన రెండు చెక్కులను డీజీపీ మహేందర్రెడ్డి దంపతులు వదులుకున్నారు. మొత్తం రూ.1,59,080 లక్షల విలువ గల చెక్కులను గురువారం తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు. మహేందర్రెడ్డికి ఖమ్మం జిల్లా కిష్టాపురంలో వ్యవసాయ భూమి ఉంది. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం రూ.81,780 చెక్కు అందించింది. అయితే ఆ మొత్తాన్ని డీజీపీ తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. ఆయన సూచన మేరకు సోదరుడు వెంకటరెడ్డి.. తహసీల్దార్ కృష్ణ, ఏఓ అరుణకుమారిని కలసి చెక్కును అందజేశారు. అలాగే.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని పడకల్ గ్రామంలో డీజీపీ సతీమణి అనిత పేరు మీద సుమారు 19 ఎకరాల భూమి ఉంది. ఇందుకు రూ.77,300 చెక్కును తహసీల్దార్ ఆర్పీ జ్యోతి అందజేశారు. అయితే.. గురువారం ఆ చెక్కును జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డికి డీజీపీ సతీమణి తిరిగిచ్చేశారు. ఆ డబ్బులను ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. -
‘డిమో’ డిపాజిట్ల గురించి రిటర్నుల్లో చెప్పాల్సిందే
అందుకోసం ప్రత్యేకంగా ఒక కాలమ్ ఆధార్ నంబర్ పేర్కొనడం ఇకపై తప్పనిసరి న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో చేసిన నగదు డిపాజిట్ల గురించి కొత్తగా ఆదాయపన్ను రిటర్నుల్లో తెలియజేయక తప్పదు. 2017–18 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి నూతన ఆదాయ పన్ను రిటర్నుల విషయమై ఆ శాఖ త్వరలోనే నిబంధనలను నోటిఫై చేయనుంది. గతేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. చెల్లని నోట్లను మార్చుకోవడంతోపాటు అదే ఏడాది డిసెంబర్ 31 వరకు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు అనుమతించింది. ఈ కాలంలో చేసిన డిపాజిట్ల వివరాలను తెలుసుకునేందుకు ఆదాయపన్ను రిటర్నుల పత్రాల్లో ఒక కాలమ్ను ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వేతన జీవులు సులభంగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా ‘సహజ్’ పేరుతో తీసుకురానున్న ఐటీఆర్–1లోనూ ఈ కాలమ్ను ఉంటుందని వెల్లడించాయి. డీమోనిటైజేషన్ సమయంలో నమోదైన అన్ని డిపాజిట్ల వివరాలను తెలుసుకోవడమే దీని వెనుకనున్న ఉద్దేశంగా తెలిపాయి. -
‘నిధులు వెనక్కి ఇవ్వాల్సిందే’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు చంద్రన్న బీమా పథకానికి మళ్లించడం సరికాదని, తక్షణమే ఆ నిధులు వెనక్కి తీ సుకురావాలని భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు మంతిన హరనాథరావు, అధ్యక్షులు ఎ.ల క్ష్మణరావు డిమాండ్ చేశారు. పథకాలను సంక్షేమ బో ర్డు ద్వారానే అమలుచేయాలని కోరుతూ నగరంలో స్థానిక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ముందు సోమవారం వారు ధర్నా చేశారు. నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను ఇతర పథకాలకు మళ్లించడం సరికాదన్నారు. ఈ మేరకు వారు కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం అందించారు. ఆయన స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కొందరు కార్మిక నాయకులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా క్లయిమ్లు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ప్రభుత్వ విప్ చెప్పిన వెంటనే పరిష్కరించడం సరికాదన్నారు. కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కోశాధికారి ఎ.సత్యనారాయణ, జిల్లాకార్యదర్శి టి.తిరుపతిరావు, కె.హరినారాయణ, కె.చిన్నారావు, ఎన్.అప్పారావు, కామేశ్వరరావు, పి.రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
'మా ఫోన్లను ఇలా వెనక్కు పంపండి'
బ్యాటరీ తయారీ లోపాలతో పేలిపోతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను కంపెనీ వెనక్కు తీసుకుంటోంది. ఇందుకోసం ఫోన్లను కొనుగోలు చేసిన వారికి ఫైర్ ప్రూఫ్ బాక్సులు, గ్లౌజులను సరఫరా చేయనుంది. ఈ మేరకు కంపెనీ ఓ ప్రకటనను విడుదల చేసింది. రెండు నెలల క్రితం మార్కెట్లోకి విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ నోట్7 ఫోన్లు పేలిపోతుండటం కంపెనీ రీప్లేస్ మెంట్ ను ప్రకటించింది. రిప్లేస్ చేసిన మోడళ్లు కూడా పేలిపోతుండటంతో గెలాక్సీ నోట్ 7 ఫోన్ల తయారీని నిలిపివేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటివరకూ కొనుగోలు చేసిన ఫోన్లను తిరిగి పంపించడానికి ప్రత్యేకమైన బాక్సును కంపెనీ వినియోగదారులకు పంపనుంది. ఈ విషయాన్ని శాంసంగ్ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ వార్తపై ట్విట్టర్ లో దుమారం రేగింది. ఈ బాక్సులైనా సరిగా పనిచేస్తాయా? వాటిని సరిగ్గా పరీక్షించి చూశారా? అంటూ ట్విట్లు వెల్లువెత్తాయి. ఫోన్ ను ఎలా ప్యాక్ చేసి పంపాలి అనే అంశంపై శాంసంగ్ అధికారికంగా ఓ వీడియోను యూట్యూబ్ లో ఉంచింది. -
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
జీడిమెట్ల: ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణం తీశాయి. రోడ్డు గుంతల్లో ద్విచక్రవాహనం జారి పడింది. దానిపై ప్రయాణిస్తున్న గృహిణి రోడ్డుపై పడగా.. అదే సమయంలో దూసుకొచ్చిన బస్సు ఆమై నుంచి దూసుకెళ్లడంతో మృతి చెందింది. జీడిమెట్ల ఎస్సై లింగ్యానాయక్ కథనం ప్రకారం.. సురారం కాలనీకి చెందిన మన్మథరావు భార్య సంధ్య(25) ఆదివారం సాయంత్రం పనిపై స్కూటీపై ఎర్రగడ్డ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో సురారం వెళ్లెందుకు జీడిమెట్ల మైలాన్ పరిశ్రమ వద్ద ఉన్న రోడ్డు గుంతల్లో స్కూటీ స్క్రిడ్ కావడంతో పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు (టీఎస్ యూబీ 0448) సంధ్యపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలైన సంధ్యను స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ రాత్రి 9 గంటలకు మృతి చెందింది. సోమవారం భర్త మన్మథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గుంతలు పడ్డ రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో నిండు ప్రాణం బలైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ట్యాక్స్ ఆడిట్ పూర్తయిందా? రిటర్ను వేశారా?
ఆదాయపు పన్ను చట్ట ప్రకారం ట్యాక్స్ ఆడిట్ అసెసీలు వారి రిటర్నులను దాఖలు చేయడానికి గడువు తేది ఈ నెలాఖరుతో (30/09/16) ముగుస్తుంది. అసెసీ అకౌంట్లను తనిఖీ చేయడాన్నే ఆడిట్ అంటుంటాం. ఆదాయపు పన్ను చట్ట ప్రకారం చేయించే ఆడిట్ను ట్యాక్స్ ఆడిట్గా పిలుస్తారు. జీతం మీద ఆదాయం, ఇంటి మీద ఆదాయం, మూలధన లాభాలు, ఇతర ఆదాయం ఉన్న వారికి ఈ ఆడిట్ వర్తించదు. అదేవిధంగా తక్కువ టర్నోవర్, వసూళ్లు ఉన్న వ్యాపారస్తులకు, వృత్తి నిపుణులకు ట్యాక్స్ ఆడిట్ వర్తించదు. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం ద్వారా ఒక వ్యక్తి టర్నోవర్, వసూళ్లు, అమ్మకాలు కోటి రూపాయలు దాటితే వారికి ట్యాక్స్ ఆడిట్ వర్తిస్తుంది. ఒక అసెసీ వృత్తిపరమైన టర్నోవర్, వసూళ్లు రూ.25 లక్షలు దాటితే వారు కూడా ట్యాక్స్ ఆడిట్ పరిధిలోకి వస్తారు. కొన్ని వ్యాపారాల్లో ఉన్న అసెసీలకు నిర్దేశించిన లాభ శాతాన్ని లేదా ఎక్కువ లాభ శాతాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. అటువంటి వారు అకౌంట్లు రాయాల్సిన అవసరం లేదు. వారికి ట్యాక్స్ ఆడిట్ కూడా వర్తించదు. కానీ వారు నిర్దేశించిన దాని కన్నా తక్కువ లాభాన్ని చూపితే అకౌంట్లు రాసి, ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. ట్యాక్స్ ఆడిట్ని ప్రాక్టీసులో ఉన్న సీఏలతో చేయించాలి. ఈ ఆడిట్ ద్వారా అసెసీలు మినహాయింపులను, తగ్గింపులను సరిగ్గా చేసుకోవచ్చు. ఈ ఆడిట్ 44ఏబీ సెక్షన్ ప్రకారం జరగాలి. కంపెనీల విషయంలో అయితే కంపెనీ చట్ట ప్రకారం ఆడిట్తోపాటు ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ ఆడిట్ను పూర్తిచేశాక రిపోర్ట్ని జతపరుస్తూ 30/09/16 లోపల అసెసీలు ఆన్లైన్ ద్వారా రిటర్నులు వేయాలి. దాఖలుకు అసెసీలకు డిజిటల్ సంతకం కావాలి. ఈ డిజిటల్ సంతకం లేకుండా రిటర్నులు దాఖలు చేయలేరు. ట్యాక్స్ ఆడిట్ చేశాక రిపోర్ట్ని ఫారం 3సీఏ/సీబీ, 3సీడీలోనే ఇవ్వాలి. ఫారం 3 సీడీలో ఎన్నో అంశాలను పొందుపరుస్తారు. ఈ అంశాలు సంఖ్యాపరంగా లెక్కిస్తే పది, విడిగా చూస్తే వందలు దాటుతాయి. అన్నింటికీ వివరాలు చూపాలి. అకౌంట్ పుస్తకాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. స్థిరాస్తుల విక్రయంలో ప్రతిఫలం ఎంత? ఎంత మొత్తం మీద స్టాంప్ డ్యూటీ చెల్లించామో చెప్పాలి. టీడీఎస్, స్టాక్స్ తదితర వాటి వివరాలు తెలపాలి. సెక్షన్ 271బీ ప్రకారం గడువు తేది లోపల రిటర్నులు దాఖలు చేయకపోతే పెనాల్టీ విధిస్తారు. టర్నోవర్పై 0.5 శాతం లేదా రూ.1,50,000లో ఏది తక్కువైతే దానిని పెనాల్టీగా చెల్లించాలి. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి,కె.వి.ఎన్ లావణ్య -
దొరికిన వస్తువులు పోలీసులకు అప్పగింత
విజయవాడ(మొగల్రాజపురం): తనకు దొరికిన విలువైన వస్తువుల కోసం ఆశపడకుండా పోలీసులకు అప్పగించి నిజాయితీని నిరూపించుకున్నాడు తమిళనాడులోని మధురైకి చెందిన వెంగస్వామి ప్రభాకర్. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన బరాటం శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో సోమవారం కృష్ణవేణి ఘాట్లో స్నానం చేయడానికి వచ్చారు. తడిసిన దుస్తులను మెట్లపై ఉంచారు. కొడుకు, భార్యను అక్కడే ఉండమని చెప్పారు. పిండప్రధానం చేయడానికి వెళ్లారు. శ్రీనివాసరావు భార్య లక్ష్మీరాజ్యం ఘాట్లోని నీళ్లు సీసాలో తీసుకురావడానికి వెళ్లింది. విషయాన్ని గమనించిన దొంగలు బాలుడి వీపుపై పౌడర్ చల్లారు. దురదగా ఉండటంతో నీటితో కడుక్కోడానికి వెళ్లాడు. వచ్చి చూస్తే దుస్తులు కనిపించలేదు. వెంటనే తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పాడు. సమీపంలోని పోలీస్ అవుట్పోస్ట్లో వివరాలు చెప్పారు. నగరంలో వారు బసచేసిన హోటల్కు వెళ్లిపోయారు. ఘాట్లోని 22వ నంబరు హైమాస్ట్ లైటు దగ్గర స్రీలు దుస్తులు మార్చుకునే గదికి సమీపంలో ఎప్పటి నుంచో తడిసిన దుస్తులు ఉండటం, సమీపంలో ఎవరూ లేకపోవడాన్ని స్నానం చేయడానికి వచ్చిన వెంగస్వామి ప్రభాకర్ గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఘాట్కు రప్పించారు. దుస్తుల్లోని వాచ్, రెండు పర్సులు, ఏటీఎం కార్డులను సీఐ ఎం.కృపానందం, ఎస్ఐ ఏజీ నాయుడు, వెంగస్వామి ప్రభాకర్ చేతుల మీదుగా శ్రీనివాసరావు దంపతులకు అప్పగించారు. పర్సులో రూ.17 వేలు పోయాయి. పోలీసులు వెంగస్వామి ప్రభాకర్ను అభినందించారు. -
స్నేహ రిటర్న్స్!
గతేడాది ఆగస్టులో విహాన్ (కుమారుడు)కి జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చారు స్నేహ. ఇప్పుడు మమ్ముట్టి హీరోగా నటించనున్న ఓ మలయాళ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నారట. ఫ్యామిలీ డ్రామా కమ్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మమ్ముట్టి భార్యగా స్నేహ కనిపిస్తారని సమాచారం. ఈ పాత్రకు నయనతారతో పాటు పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. స్నేహ మాత్రమే ఫర్ఫెక్ట్గా సూటవుతారని ఆమెను సంప్రదించారు. అయితే.. అబ్బాయి మరీ చిన్నపిల్లాడు కావడంతో సినిమాలో నటించాలా? వద్దా? అని ఆలోచించిన స్నేహ కథ విన్న తర్వాత సంతకం చేశారట. ఈ నెలాఖరున ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. -
హోదాతోనే సీఎం తిరిగిరావాలి
హోదాతోనే సీఎం తిరిగిరావాలి సీఎం, హోదా, తిరిగిరావాలి cm, status, return cm must return with special status గుంటూరు ఎడ్యుకేషన్ : ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు హోదా, విభజన చట్టంలోని హామీల సాధనతో తిరిగి రావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరస దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో సాగనంపుతామని హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులచే రాజీనామా చేయించి, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయకపోతే వారి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీక్షలో సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర నాయకులు తాడికొండ నరసింహారావు, ప్రజా నాట్యమండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు గని, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
హోదాతోనే సీఎం తిరిగిరావాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు హోదా, విభజన చట్టంలోని హామీల సాధనతో తిరిగి రావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరస దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో సాగనంపుతామని హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులచే రాజీనామా చేయించి, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయకపోతే వారి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీక్షలో సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర నాయకులు తాడికొండ నరసింహారావు, ప్రజా నాట్యమండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు గని, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
హమ్మయ్య.. వచ్చేశాం
కొయ్యలగూడెం: ఉగ్రవాదుల దాడులు, కాశ్శీర్లో కర్ఫ్యూ, అల్లర్ల మధ్య తీవ్ర ఇబ్బందులు పడిన అమర్నాథ్ యాత్రికులు ఒక్కొక్కరుగా జిల్లాకు చేరుకుంటున్నారు. కొయ్యలగూడేనికి చెందిన మండా నాగేశ్వరరావు, అచ్యుతాపురం గ్రామానికి చెందిన తలకొండ సత్యనారాయణ శుక్రవారం వేకువజామున స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరు ఈనెల 1న కొయ్యలగూడెం నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లామని, యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో శ్రీనగర్లో చిక్కుకునిపోయామని చెప్పారు. 8 నుంచి 11వ తేదీ వరకు అక్కడ బస్టాండ్లోనే భద్రతా దళాల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు ఆహారం లేకపోవడంతో నీరసించిపోయామని చెప్పారు. శాంతిభద్రతలు మెరుగుపడిన తర్వాత భద్రతా దళాలు తమను ఢిల్లీకి చేర్చారన్నారు. అక్కడ ఆంధ్రాభవన్లో ఆశ్రయం పొంది కోలుకున్న తర్వాత ఇక్కడకు చేరుకున్నామన్నారు. పరమ శివుని దయతోనే.. పోతవరం (నల్లజర్ల): పరమ శివుని దయ వల్లే తామంతా తిరిగి ఇంటికి చేరుకున్నామని పోతవరానికి చెందిన కందుల రవిశేఖర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కాశ్శీర్లో అల్లర్ల నేపథ్యంలో మూడు రోజులపాటు శ్రీనగర్ బస్టాండ్లోనే భయం, ఆకలితో అసలు స్వస్థలం చేరుతామో లేదో అన్న భయంతో గడిపామన్నారు. మూడు రోజులు శ్రీనగర్లో చిక్కుకుపోవడంతో కాంగ్డా, ఛాముండి, నైనాదేవి ఆలయాలను సందర్శించకుండానే వెనుదిరిగామని చెప్పారు. కాశ్మీరుకు ఉత్తర భాగం హిమాలయాల్లో 14 వేల అడుగుల ఎత్తులో యాత్ర అత్యంత క్లిష్టంగా సాగిందని చెప్పారు. తనతో పాటు నల్లజర్ల, ఏలూరు, మక్కినవారిగూడెం తదితర ప్రాంతాల నుంచి 80 మంది బృందంగా వెళ్లామని చెప్పారు. -
ఇదేమి తిరకాసు!
- ఇసుక రీచ్ నిధులు తిరిగి ఇవ్వాలని ఆదేశం - ఎంపీడీవో కార్యాలయం రూ.8 లక్షలు, మంత్రాలయం పంచాయతీ రూ.4 లక్షలు చెల్లించాలట.. - ఖర్చు చేసిన నిధులు ఎలా ఇవ్వాలని ఆందోళన మంత్రాలయం: మూడేళ్ల క్రితం జమ చేసిన నిధులు తిరిగి చెల్లించాలంటూ మంత్రాలయం ఎంపీడీవో, మంత్రాలయం మేజర్ పంచాయతీ ఆదేశ పత్రాలు జారీ అయ్యాయి. నిధులన్నీ ఖర్చు అయ్యాక ఎలా చెల్లించాలంటూ పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక వేలములో భాగంగా మంత్రాలయంలో 2011–12లో ఇసుక రీచ్ను ఎంఎస్ చౌడేశ్వరి మైనింగ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ ఇసుక తవ్వకాల హక్కు పొందింది. మొదటి బిడ్ కింద రూ.1.20 కోట్లు వేలం ద్వారా జిల్లా పరిషత్కు జమ చేసింది. అందులో జిల్లా పరిషత్కు రూ.30.16 లక్షలు (25 శాతం), మంత్రాలయం మండల పరిషత్ కార్యాలయానికి రూ.60.32 లక్షలు (50శాతం), మంత్రాలయం పంచాయతీకి రూ.30.16 లక్షలు (25 శాతం) ప్రకారం జమ చేశారు. ఈ నిధులతో వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, మట్టిరోడ్లు, నీటి వసతి కల్పనతోపాటు పలు అభివృద్ధి పనులు చేశారు. నిధులు మంజూరు సమయంలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఇసుక రీచ్ నిధులు ప్రస్తుతం ఖాతాల్లో చిల్లిగవ్వ లేదు. ఇసుక తవ్వలేదంట.. నిధులు వెనక్కు ఇవ్వాలట చౌడేశ్వరి కంపెనీ 2011 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2011 మే 27వ తేదీ వరకు మొత్తం 57 రోజులు ఇసుక తవ్వకాలు చేపట్టలేకపోయింది. ఈ మేరకు జమ చేసిన నిధుల్లో రూ.16.08 లక్షలు చెల్లించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ లేఖ పంపారు. మంత్రాలయం మండల పరిషత్ రూ.8.04 లక్షలు, మంత్రాలయం పంచాయతీ రూ.4.02 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశించారు. మొత్తాన్ని జిల్లా పరిషత్ సాధారణ ఖాతాలో వేయాలని సూచించారు. -
రెండేళ్ల తర్వాత 11 మంది భారతీయులకు విముక్తి
ఢిల్లీ: రెండేళ్లపాటూ నైజీరియాలో బంధీలుగా ఉన్న 11 మంది భారతీయులకు విముక్తి లభించింది. వీరిలో మహబూబ్నగర్కు చెందిన ఇంజినీర్ మనోజ్ కుమార్ కూడా ఉన్నారు. బోట్లోని ఇంజన్ సాంకేతిక లోపంతో నైజీరియా సీవే లో వీరందరూ చిక్కుక్కున్నారు. డబ్బుకోసం నైజీరియన్ కోస్ట్ గార్డ్స్ వారిని బంధించినట్టు బాధితులు తెలిపారు. భారత్కు చెందిన నితిన్ సందేశ్ కంపెనీ, స్ట్రెర్లింగ్ ఆయిల్ రిసోర్సెస్ లిమిటెడ్ సహకారంతో స్వదేశానికి వచ్చామని బాధితులు పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖతో మాట్లాడి స్వదేశానికి తీసికొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి మనోజ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. -
మళ్లీ ఊరిస్తున్న మాల్యా
ముంబై: ఇదిగో వస్తున్నా..అదిగో వస్తున్నా.అంటూ ఊరిస్తున్న బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా మరోసారి తాను ఇండియాకు వస్తానంటూ ప్రకటించారు. అదీ కొన్ని ప్రత్యేక షరతులతో.. తనకు పూర్తి భద్రత కల్పిస్తే వస్తానంటూ పాతపాటే పాడుతున్నారు. రుణాల చెల్లిపుల విషయంలో అన్నివైపుల నుంచి ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో వ్యాపార వేత్త విజయ మాల్యా భారతదేశానికి తిరిగి వచ్చేందకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముంబైలో శుక్రవారం జరిగిన యునైటెడ్ బ్రెవరేజెస్ లిమిటెడ్ డైరెక్టర్స్ బోర్డు సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మాల్యా రక్షణకు సరైన హామీ లభిస్తే త్వరలోనే తాను ఇండియాకు తిరిగి రానున్నట్టు తెలిపారు. భద్రత, స్వేచ్ఛ, రక్షణకు సంబంధించి హామీ లభిస్తే ఇండియా తిరిగి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించినట్టు సమాచారం. రుణాల చెల్లింపులో బ్యాంకులతో చర్చలు జరపనున్నట్టు మాల్య తమకు హామీ ఇచ్చారని ఇండిపెండెంట్ ప్రతినిధి కిరణ్ మజుందార్ షా తెలిపారు. మాల్యా ప్రతిపాదనలకు బోర్డ్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు మరో ఇండిపెండెంట్ ప్రతినిధి సీవై పాల్ వెల్లడించారు. అలాగే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బంది జీతాల చెల్లింపునకు తాను చేసిన ప్రయత్నాలు తన ఆస్తులు సీజ్ చేయాలనే కర్నాటక హైకోర్టు నిర్ణయం మూలంగా విఫలమయ్యాయన్నారని చెప్పారు. ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం తనపై వచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారన్నారు. మనీ లాండరింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మాల్యా వాదించారనీ, ఆధారాలు లేని ఆరోపణలని కొట్టి పారేసారని తెలిపారు. కాగా బ్యాంకుల కన్సార్టియానాకి 9 వేల కోట్లకు పైగా బకాయి పడి విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యా, రుణాల చెల్లింపుకు గడువుల గడువుల మీద విధిస్తూ బేరసారాలకు దిగాడు. ఆయన ప్రతిపాదనలకు కన్సార్టియం ససేమిరా అనడంతో వివాదం మరింత సాగుతోంది. అటు మనీ లాండరింగ్ కేసులో మాల్యాను ప్రశ్నించేందుకు ఈడీ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు, గోవాలోని ఆయన విల్లా స్వాధీనం తెలిసిందే. -
కాశీ యాత్రకు వెళ్లొస్తుండగా విషాదం..
మారేడుపల్లి: కాశీ యాత్రకు వెళ్లొస్తున్న ఓ భక్త బృందం ప్రమాదం బారిన పడింది. వారు ప్రయాణిస్తున్న బస్సు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం ఇజ్జలూరి జంక్షన్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో చింతగింజల విజయ (50) అనే మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు, 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, శ్రీరామ్పూర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 47 మంది గత నెల 29వ తేదీన కాశీయాత్రకు బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం అన్నవరం చేరుకుని సత్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున భద్రాచలం బయల్దేరారు. ఇజ్జలూరు జంక్షన్ సమీపంలో మలుపులో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
ఆ ‘108’ ఉద్యోగులు విధుల్లోకి
సర్కారు నిర్ణయం... జీతాల పెంపు కూడా సాక్షి, హైదరాబాద్: జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థలో ‘108’ అత్యవసర సర్వీసులో పనిచేసి తొలగింపునకు గురైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మంత్రులు కె.తారకరామారావు, లక్ష్మారెడ్డి ‘108’ సేవలను బలోపేతం చేయడానికి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఇందులో జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అలాగే ‘108’లో పనిచేసే ఉద్యోగుల వేతనాలను పెంచాలని కూడా నిర్ణయించింది. -
2.5 లక్షల మంది స్వదేశానికి తిరిగొచ్చేశారు
ఇస్లామాబాద్ : ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి మొత్తం 251,624 పాకిస్తానీ జాతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని ఆదేశ మీడియా సంస్థ శనివారం వెల్లడించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పాక్ తిరిగి వచ్చిన వారి వివరాలను ఆ దేశ హోం శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ గణాంకాలతో సహా వివరించారని తెలిపింది. 2013లో జున్ 1 - డిసెంబర్ 31 మధ్య 45,008 మంది పాకిస్థానీయులు స్వదేశం చేరుకున్నారని వివరించారు. అలాగే 2014లో 78, 409 మంది... 2015లో 116,165 మంది... గత కొన్ని నెలలుగా 12,022 మంది స్వదేశం పాక్ చేరుకున్నారని విశదీకరించారు. అధికారిక నివేదిక ప్రకారం గత రెండున్నర ఏళ్లుగా.... సౌదీ అరేబియా నుంచి 120,393 మంది, ఇరాన్ నుంచి 38,097 మంది, యూఏఈ నుంచి 23, 330 మంది, బ్రిటన్ నుంచి 5400 మంది, యూఎస్ నుంచి 358 మంది, ఒమెన్ నుంచి 11,248 మంది, మలేషియా నుంచి 9, 789, గ్రీస్ నుంచి 6,976 నుంచి పాక్ చేరుకున్నారని పేర్కొంది. భారత్ నుంచి మాత్రం 27 మంది పాక్ చేరుకున్నారని చెప్పింది. -
నేలను తాకి ఎన్నాళ్లయింది..!
డెకాగన్: అంగారక గ్రహాంపైకి మానవుణ్ని పంపేందుకు నాసా ఆధ్వర్యంలో పలు దేశాలు సంయుక్తంగా తలపెట్టిన మిషన్ టు మార్స్ ప్రయోగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్స్ యాత్రకు వెళ్లలాంటే వ్యోమగాలు సుదీర్ఘకాలంపాటు అంతరీక్షంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అసలు మనిషి స్పేస్ లో అంతకాలం ఉండగలడా? అందుకు వాతావరణం, శరీరం సహకరిస్తుందా? అనే కోణంలో చేపట్టిన ప్రయోగాలు.. స్కాట్ కెల్లీ, మిఖాయెల్ కొర్నియాంకోల రాకతో సఫలమైనట్లు తేటతెల్లమైంది. మిషన్ టు మార్స్ లో భాంగా ఏడాది పాటు అంతరీక్షంలో గడిపిన అమెరికన్, రష్యన్ వ్యోమగాములు స్కాట్ కెల్లీ, మిఖాయెల్ కొర్నియోంకోలు బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమిని చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి స్పేస్ షటిట్ లో బయలుదేరిన ఆ ఇద్దరూ కజకిస్థాన్ లోని డెకాగన్ శాటిలైట్ సెంటర్ వద్ద విజయవంతంగా భూమిపై పాదం మోపారు. అత్యధికా కాలం ఐఎస్ఎస్ లో గడిపిన రికార్డు వీరిద్దరే కావటం గమనార్హం. స్కాట్, మిఖాయెల్ ల రాకతో నాసా సహా మిషన్ టు మార్స్ లో భాగస్వామ్యదేశాల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. 345 రోజులపాటు అంతరీక్షంలో గడిపిన స్కాట్.. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ నెట్ వర్క్ లో పోస్టులు పెట్టేవారు. వాటిని నెటిజన్లు కూడా అద్భుతంగా ఆదరించారు. ఇటీవలే గొరిల్లా సూట్ లో ఐఎస్ఎస్ లో సందడి చేస్తూ స్కాట్ పెట్టిన పోస్టుకు విపరీతమైన స్సదన వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి 27న స్కాట్, మిఖాయెల్ లు అంతరీక్ష కేంద్రానికి వెళ్లారు. -
అవార్డ్లు వాపస్ ఇస్తున్న రైతులు!
ముంబై: దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ గతంలో కొంతమంది కళాకారులు, రచయితలు తమ అవార్డులను వాపస్ ఇవ్వడం తెలిసిందే. ఇప్పుడు వారి బాటలో మహారాష్ట్ర రైతులు నడుస్తున్నారు. అయితే రైతులు మాత్రం కరువు పీడిత ప్రాంతాల్లో తమను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వానికి నిరసనగా ఈ అవార్డ్ వాపసీ ఉద్యమానికి పూనుకున్నారు. సాగులో చూపించిన ప్రతిభకు గాను 1983లో రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్న జల్నా ప్రాంతానికి చెందిన నారాయన్ ఖడ్కే(78) అనే రైతు ఇటీవల తన అవార్డును తిరిగిచ్చాడు. లాతుర్ జిల్లాలోని కర్ల గ్రామానికి చెందిన మరోరైతు విఠల్రావ్ కాలే కూడా అవార్డుతో పాటు తనకు లభించిన 10 వేల నగదును సైతం ముఖ్యమంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ అమలులో మాత్ర చిత్తశుద్ధిని చూపించడం లేదని ఖడ్కే వెల్లడించారు. -
ఈ ఏడాదైనా గాగా కాక పుట్టించేనా!?
స్టీఫనీ జోనే ఏంజలీనా జెర్మనాట్టో.. అదేనండీ సొంతపేరు కంటే లేడీ గాగాగా పాపులరైన ఈ పాప్ సంచలనం ఇటీవల వార్తల్లోనే కాక చాట్ బస్టర్ లోనూ స్థానం కోల్పోయింది. గడిచిన మూడేళ్లుగా హిట్ కు దూరంగా ఉన్న అమెరికన్ కలువ.. మళ్లీ మునుపటి ఫామ్ అందుకునేందుకు తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న జరగనున్న గ్రామీ అవార్డు ప్రదానోత్సవం ఆమె కెరీర్ ను మలుపు తిప్పుతుందని ఆశిస్తోంది. క్యాన్సర్ తో బాధపడుతూ ఇటీవలే తనువు చాలించిన మ్యూజిక్ మెస్ట్రో డేవిడ్ బోవీ జ్ఞాపకార్థం గ్రామీ వేదికపై లేడీగాగా ప్రదర్శన ఇవ్వనుంది. వ్యక్తిగతంగానూ డేవిడ్ తనకెంతో ఇష్టమని, ప్రదర్శన ద్వారా ఆయన జ్ఞాపకాలను గుర్తుచేయడం గర్వకారణమని గాగా అంటోంది. గ్రామీ- 2016లో గాగా ప్రదర్శనే హైలెట్ గా నిలుస్తుందని నిర్వాహకుల అభిప్రాయం. ఆ మేరకు తాను కూడా తీవ్ర సాధన చేస్తున్నట్లు వెల్లడించింది గాగా. ఒక వేళ 'డేవిడ్ కు నివాళి'కిగాను అవార్డు లభిస్తే అది గాగా ఖాతాలోచేరే 7వ గ్రామీ అవుతుంది. మొదటిసారిగా 2008లో 'ది ఫేమ్' ఆల్బంతో దూసుకొచ్చిన లేడీగాగా ఆ తర్వాత జస్ట్ డ్యాన్స్, పోకర్ ఫేస్, 2009లో ది ఫేమ్ మూన్ స్టర్, బ్యాడ్ రొమాన్స్, టెలిఫోన్, అలెజాండ్రో వంటి సింగిల్స్ తో అదరగొట్టేసింది. 2011లో విడిదలైన 'బార్న్ దిస్ వే' ఆల్బంతో గాగాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పాడ్డారు. అయితే 2013లో విడుదలైన ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ విజయాలేవీలేవు. 2016 ప్రారంభంలోనే వరంలా వచ్చిన గ్రామీ వేడుకలతోనైనా గాగా మళ్లీ కాక పుట్టిస్తుందేమో చూడాలి. -
జల్లికట్టుపై రాజకీయాలు
-
ఆ ముగ్గురు సౌదీ బాధితులకు విముక్తి
తిరువనంతపురం: సౌది అరేబియాలో యజమాని చేతిలో చిత్రహింసలకు గురైన ముగ్గురు భారతీయులు ఎట్టకేలకు శనివారం ఉదయం భారత్కు చేరుకున్నారు. త్రివేండ్రం విమానాశ్రయానికి చేరుకున్న వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులపై యజమాని విచక్షణారహితంగా దాడిచేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. యజమాని తమను వేధిస్తున్నాడని, కాపాడాలంటూ ఈ వీడియోను బాధితులు వాట్సప్లో కుటుంబ సభ్యులకు పంపారు. కేరళలోని హరిపాద్ పట్టణానికి చెందిన వీరిని ఎలక్ట్రిషీయన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి సౌదీ అరేబియాకు తీసుకెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక ఇటుక బట్టీల్లో పనిచేయాలని వారిని వేధించారు. వీరిని భారత్కు తీసుకురావడానికి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్తో పాటు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది చొరవ తీసుకున్నారు. భారత్ నుండి వెళ్లిన ఎంతో మంది బాధితులు ఇలా మోసపోయి ఇబ్బందులకు గురౌతున్నా ఆర్థిక కారణాల వలన తిరిగిరాలేని స్థితిలో చిక్కుకుంటున్నారు. -
'ఇదో రకమైన రాజకీయం'
పాట్నా: పలువురు మేధావులు, రచయితలు దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోందంటూ, తమకు లభించిన జాతీయ అవార్డులను తిరిగి ఇస్తున్నారు. తాజాగా పలువురు సినీ దర్శకులు తమ అవార్డులను వెనక్కి ఇచ్చారు. దీనిపై కేంద్ర ఆర్ధీక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. అవార్డులను వెనక్కి ఇవ్వడం బీజేపీకి వ్యతిరేకంగా చేపడుతున్న మతిలేని చర్యగా అభివర్ణించారు. అవార్డులను వెనక్కి ఇచ్చిన వారిలో కొందరు గత సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వారణాసిలో ప్రచారం నిర్వహించారని తెలిపారు. అవార్డులను వెనక్కి ఇవ్వడం అనేది మరో రకమైన రాజకీయ చర్యగా జైట్లీ అభివర్ణించారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంగా దీనిని చూడాలన్నారు. గత యూపీఏ పాలనలో జరిగిన లక్షల కోట్ల రూపాయల అవినీతి సమయంలో దేశంలో పాలన సక్రమంగా ఉందని ఈ మేధావులు భావించారా? అని జైట్లీ ఎద్దేవా చేశారు. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్కు చెందిన విద్యార్ధులు తమ ఆందోళనను విరమించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపిన మంత్రి, కేంద్ర ప్రభుత్వం ఎఫ్టీఐఐని అత్యున్నతమైన సంస్థగా తీర్చిదిద్దుతుందని అన్నారు. -
ఆ వరుసలో మరో ముగ్గురు
పుణే: దేశంలో పెరుగుతున్న అశాంతి, అసహనానికి నిరసనగా తమ ప్రతిష్టాత్మక అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న వారికి మరో ముగ్గురు జత కలిశారు. ఎఫ్టిఐఐ పూర్వ విద్యార్థులు ముగ్గురు... తమ జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన విక్రాంత్ పవార్, ఉత్తర ప్రదేశ్కు చెందిన రాకేశ్ శుక్ల, గోవాకు చెందిన ప్రతీక్ సినీ రంగంలో తాము సాధించిన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా దేశంలో నెలకొన్న అవాంఛనీయ పరిణామాలకు నిరసనగా తమ అవార్డులను తిరిగి ఇస్తున్నట్టు వారు పేర్కొన్నారు. 'పవార్ కతాల్' ఫిక్షన్ మూవీకి గాను, 2012 లో రాష్ట్రపతి బంగారు పతకాన్ని, శుక్ల 'డాంకీ ఫెయిర్' 2013 స్పెషల్ జ్యూరీ అవార్డు, ప్రతీక్ 'కాల్' ఉత్తమ షార్ట్ ఫిలిం రజత్ కమల్ అవార్డును గెల్చుకున్నారు. కాగా పుణే ఫిలిం అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గత 139 రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని విరమించి క్లాసులకు హాజరవుతామని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వివిధ దశల్లో జరిగిన చర్చల ప్రతిష్టంభన అనంతరం క్లాసులకు హాజరైనా, తమ శాంతియుత నిరసన,ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు ప్రకటించారు. సంస్థ చైర్మన్గా గజేంద్ర చౌహాన్ నియామకంపై ఎఫ్టిఐఐ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. -
నేను సైతం అంటున్న వితాషా
బెంగళూరు: ప్రముఖ కన్నడ రచయిత కల్బుర్గి దారుణ హత్యకు నిరసనగా సాహిత్య పురస్కారాలను తిరిగి ఇస్తున్న రచయితలలో మరో రచయిత్రి కూడా తోడయ్యారు. కర్ణాటకకు చెందిన రియా వితాషా(17) తన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. కల్బుర్గి కేసులో ఇంతవరకు నేరస్తులను గుర్తించకపోవడంతో పాటు, శిక్షించడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరికి నిరసనగా తన అవార్డును వెనక్కి ఇస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ముద్దు తీర్థహళ్లి అనే కలంపేరుతో ప్రసిద్దురాలైన రియా 'ఒందు చంద్రాణ తుందు' వ్యాస సంపుటికి 2011లో కర్ణాటక ప్రభుత్వ సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్నారు. ఆమె అయిదు నవలలు కూడా రచించారు. వీటిలో కథా హదియా హూగళు అనే నవల ఆధారంగా రూపొందిన సినిమా అవార్డును కూడా గెల్చుకుంది. కల్బుర్గిని హత్యచేసిన వారిని ఇంతవరకు పట్టుకోలేక పోవడంపై రియా వితాషా ఆవేదనవ వ్యక్తం చేశారు. తనకు బాల్యం నుంచి తెలుసనీ, ఆయన రచనలన్నీ చదివానన్నారు. ఆయన హత్యకు గురైనపుడు చాలా వేదనకు గురయ్యాననీ, అపుడే తన అవార్డును వెనక్కి ఇవ్వాలనుకున్నానన్నారు. అయితే తన తల్లిదండ్రులు సహనం పాటించాలని చెప్పడంతో మౌనంగా ఉండిపోయానని తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైనా ఇది స్పందించాల్సిన సమయని ఆమె అన్నారు. వితాషా తీసుకున్న నిర్ణయంపై ఆమె తల్లి లిడియా డి మెల్లో హర్షం వ్యక్తం చేశారు. కన్నడ రచయిత చంద్రశేఖర్ పాటిల్ తన అవార్డును వెనక్కి ఇచ్చేసిన వార్త విన్న తరువాత తన కూతురు ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కల్బుర్బి హత్య తరువాత నితాషా చాలా ఆవేదనకు గురైందని తెలిపారు. నిరసనగా ఏదైనా చేయాలని వితాషా ఎప్పటినుంచో ఆలోచిస్తోందన్నారు. ఇప్పటివరు తమ అవార్డులు తిరిగి ఇచ్చిన వారిలో బహుశా అతి పిన్న వయస్కురాలైన రియా వితాషా పీయుసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. -
ఉన్నతాధికారుల మౌనం భయపెడుతోంది
న్యూఢిల్లీ: దేశంలో చెలరేగుతున్న మతవిద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్న రచయితలు, మేధావుల సంఖ్య పెరుగుతోంది. నయనతార సెహగల్, అశోక్ వాజ్పేయి, కె. సచ్చిదానందన్, కేరళ నవలా రచయిత్రి, ప్రముఖ కవి సారా జోసెఫ్ ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు తమ నిరసనను తెలియజేస్తున్నారు. దాద్రి హత్యోదంతంపై వారం రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడాన్ని ప్రముఖ మళయాల రచయిత్రి సారా జోసెఫ్ తప్పుబట్టారు. బాధలో ఉన్న బాధిత కుటుంబాన్ని ఓదార్చాల్సిన ప్రధాని ఒట్లను దండుకునే ప్రసంగాలు చేశారంటూ విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో కనీస హక్కులు కరువవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మలయాళ కవి కె.సచ్చిదానందన్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మర్నాడే సాహు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. తాము ఏ తినాలో.. ఏం తినకూడదో నిర్ణయించుకునే శక్తి ప్రజలకే ఉండాలన్నారు. దేశంలో ప్రతిచోటా అసహనం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఏ రచయితా మౌనంగా ఉండలేడని వ్యాఖ్యానించారు. ఉన్నతాధికారుల మౌనం తనను బాగా భయపెడుతోందన్నారు. 2004లో అలహాయుద పెన్ మక్కల్ రచనకు గాను సారా జోసెఫ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి గత లోక్ సభ ఎన్నికల్లో త్రిశూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. -
'ముగిసిన టూర్.. స్వదేశానికి మోదీ'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తిరిగి స్వదేశానికి బయలుదేరారు. విజయవంతంగా ఐదు రోజుల అమెరికా పర్యటనను ముగించుకొని వస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సర్వసభ్య సమావేశానికి ప్రధాని మోదీ న్యూయార్క్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ఐర్లాండ్ ప్రధానితో తొలుత భేటీ అయ్యి అనంతరం నేరుగా కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీకి వెళ్లారు. అక్కడ ఫేస్ బుక్ అధినేత జూకర్ బర్గ్ను కలిసి, ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడమే కాకుండా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రత్యేకతను అటు జూకర్ బర్గ్కు, సుందర్ పిచాయ్కు తెలియజేయడమే కాకుండా వారి సంపూర్ణ మద్దతు కోరి ఆ ప్రయత్నంలో విజయం సాధించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. భారత్కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు కోరగా అందుకు ఒబామా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపారు. మొత్తానికి అంతర్జాతీయ వేదికల్లో మోదీ మరోసారి భారత్ ఘనతను గట్టిగానే చాటి చెప్పారు. భారత్ అభివృద్ధిలో దూసుకెళుతున్న తీరు, ఆహ్వానిస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం సాధిస్తున్న తీరు, పర్యావరణ హితమైన కార్యక్రమాలు, రక్షణ సంబంధ అంశాలు, ఉద్యోగాల కల్పన, ముఖ్యంగా అంతర్జాతీయంగా ఇరు దేశాలమధ్య ఉన్న సహకారం, శాంతి, యుద్ధ పరిణామం తదితర అంశాలను వివరించారు. ఈ టూర్ సందర్భంగా ఆయన పలువురు దేశాల ప్రధానులను, అధ్యక్షులను కలిశారు. -
దుర్గా మాత విగ్రహాన్ని అప్పగించనున్న జర్మనీ
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లోని ఓ ఆలయంలో చోరీకి గురై జర్మనీలోని ఓ మ్యూజియంలో ప్రత్యక్షమైన 9వ శతాబ్దం నాటి దుర్గామాత విగ్రహాన్ని జర్మనీ భారత్కు ఈవారంలో అప్పగించనుంది. జర్మనీలోని భారత దౌత్య కార్యాలయ అధికారులకు ఈ నెల 23న ఈ విగ్రహాన్ని అప్పగించే అవకాశాలున్నాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) అధికారులు తెలిపారు. ఈ నెల 26న లేదా 27న ఇది భారత్కు చేరొచ్చని చెప్పారు. 1990లో జమ్మూ కశ్మీర్, పుల్వామాలోని ఓ ఆలయంలో దుర్గామాత విగ్రహం చోరీకి గురైంది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విగ్రహం జర్మనీలోని లిండెన్ మ్యూజియంలో ఉన్నట్లు 2012లో పోలీసులకు సమాచారం అందింది. విగ్రహం భారత్కు చెందినదన్న పూర్తి ఆధారాలతో ప్రభుత్వం అక్కడి అధికారులను సంప్రదించింది. ఈ క్రమంలో జర్మనీ దీన్ని తిరిగి భారత్కు అప్పగించనుంది. ఈ విగ్రహాన్ని దేశాన్ని దాటించడంలో స్మగ్లర్ సుభాష్ కపూర్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కపూర్ను జర్మనీ 2011లో అరెస్ట్ చేసింది. -
కోహినూర్ వజ్రం తిరిగొస్తుందా?
లండన్: కోహినూర్.. గుంటూరులో పుట్టి అక్కడినుంచి చేతులు మారి ఆంగ్లేయుల వశమైన ఈ వజ్రానికి పరిచయం అక్కర్లేదు. వందల ఏళ్లుగా మనకు దూరమైన ఈ అతిపెద్ద వజ్రం.. ఇప్పుడు మళ్లీ మన దేశానికి చేరుతుందా? భారత ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ నెలలో బ్రిటన్లో పర్యటిస్తున్న నేపథ్యంలో దీన్ని భారత్కు తిరిగి ఇవ్వాల్సిందేనన్న వాదనలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. మొన్నామధ్య కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆక్స్ఫర్డ్ వెళ్లినప్పుడు.. వలసపాలనలో భారతదేశం నుంచి దోచుకున్న సంపద మొత్తాన్ని తిరిగి కక్కాల్సిందేనని గట్టిగా చెప్పారు. ఇప్పుడు ఆయన బాటలోనే.. బ్రిటిష్ ఎంపీ కీత్ వాజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నూటికి నూరుపాళ్లూ కోహినూర్ వజ్రం భారత్కే చెందాలని, ప్రధాని నరేంద్రమోదీ చేతికి దానిని అందించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు మంగళవారం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ను అభ్యర్థించారు. బ్రిటన్లో ఎంపీగా అత్యధిక కాలం కొనసాగుతున్న ఆసియావాసిగా రికార్డులకెక్కిన కీత్ వాజ్ వ్యాఖ్యలతో కోహినూర్ వజ్రాం మరోసారి చర్చనీయాంశమైంది. ఇదీ కోహినూర్ ప్రస్థానం.. గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనులులో ఈ ప్రఖ్యాత వజ్రం లభించింది. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తారు. తర్వాతికాలంలో కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. క్రీస్తు శకం 1310లో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. ఢిల్లీ సుల్తాన్తో సంధి చేసుకున్న సమయంలో అపార సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా సమర్పించుకున్నాడు. 1526లో ఈ వజ్రం మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ వశం అయి.. బాబర్ వజ్రంగా పేరు పొందింది. మొఘల్ సామ్రాజ్యం ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో నాదిర్ షా దీన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అది నెరవేరలేదు గానీ దానిని చూసే భాగ్యం మాత్రమే ఆయనకు దక్కింది. నిజానికి కోహినూర్ కు ఆ పేరు (కోహ్-ఇ-నూర్ అంటే కాంతి శిఖరం) పెట్టింది కూడా నాదిర్ షాయే. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ద్వారా 1913లో ఈ వజ్రం విక్టోరియా రాణికి బహుమతిగా వెళ్లింది. అప్పటి నుంచి లండన్లోనే ఉండిపోయిన కోహినూర్ ప్రస్తుతం లండన్లోని ఓ మ్యూజియంలో ఉంది. దాన్ని తిరిగివ్వాల్సిందిగా భారత ప్రభుత్వం ఇన్నాళ్లూ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలిచలేదు. ఇప్పటికైనా మన కోహినూర్ మన చెంతకు చేరాలని ఆశిద్దాం. -
స్వదేశానికి చేరుకున్న సోనియా, రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక తమ స్వల్ప విదేశీ పర్యటన ముగించుకుని దేశ రాజధాని ఢిల్లీకి చే రుకున్నారు. రాహుల్ గాంధీ బుధవారం రాగా, రాహుల్ కంటే ముందే విదేశాలకు వెళ్లిన సోనియా, ప్రియాంక మంగళవారమే ఇక్కడికి చేరుకున్నారు. గత నెల 20వ తేదీన రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లగా.. సోనియా గాంధీ వ్యక్తిగత కారణాల రీత్యా విదేశాలకు వెళ్లారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా తెలిపారు. అయితే వారి పర్యటనకు గల కారణాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. -
తిరిగొచ్చేదాక డౌటే
- ప్రమాదం అంచున ప్రయాణం - ఇష్టారాజ్యంగా వాహన రాకపోకలు - పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణం - అధికారుల నామమాత్రపు తనిఖీలు - గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు నెల్లూరు (రవాణా): అస్తవ్యస్తమైన రోడ్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిబంధనలు అమలు చేయని అధికారులు వెరసి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంటినుంచి పనిమీద వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకుంటారో లేదోనన్న భయం ప్రస్తుతం జనాన్ని వెంటాడుతోంది. మృత్యువు ఎప్పుడు ఏరూపంలో కంబళిస్తుందో ఎవరికి అంతుపట్టని పరిస్థితి. ఓవైపు నిత్యం తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా మరో వైపు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా దవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం. ఈ ప్రమాదంలో 21 మంది అమాయకులు ప్రాణాలు పొగొట్టుకున్న విషయం తెలిసిందే. వాహనాల మయం జిల్లాలో మొత్తం 5 లక్షలకుపైగా వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. వాటిలో 2.80 లక్షల బైక్లు, 30వేల ఆటోలు, ట్రాక్టర్లు 29,000, లారీలు 19,000, కార్లు 36,000, క్యాబ్లు, మాక్సీక్యాబ్లు 3వేలు, టౌన్ బస్సులు 81, టూరిస్టు, ట్రావెల్స్ 170, మిగిలినవి ఇతర వాహనాలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 169 కి.మీ మేర జాతీయ రహదారి ఉంది. హైవేతో పాటు ముంబై, బెంగళూరు వెళ్లే ప్రధాన రోడ్లు ఉన్నాయి. అయితే జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పోలీసులు, రవాణా అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పరిమితికి మించి ప్రయాణం... ప్రధానంగా ఆటోలు, మాక్సీక్యాబ్లు, ప్రైవేటు బస్సులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రధానంగా దూరపు ప్రాంతాలకు మాక్సీక్యాబ్లును ఎక్కువమంది వినియోగిస్తున్నారు. ఒక్కో వాహనంలో డ్రైవర్తో కలిపి 10 నుంచి 12 మందిని మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇన్నోవాలో ఏడుగురు, తుపాన్ వాహనంలో 10మంది, మాక్సీక్యాబ్లో ఎనిమిదిమంది, టెంపోలో 10 నుంచి 12 మందిని మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉంది. అయితే వాహనాన్ని బట్టి 10 నుంచి 25 మందికిపైగా ఎక్కించుకుని రోడ్డెక్కుతున్నారు. ప్రమాదాలకు కారకులవుతున్నారు. అదే ఆటోలో కేవలం ముగ్గుర్ని మాత్రమే ఎక్కించుకోవాలి. కానీ ఆటోలో 10మందికి పైగా ఎక్కించుకుని ప్రయాణం చేస్తున్నారు. అలాగే హైవేపై రాత్రివేళల్లో ఇష్టారీతిన వాహనాలను ఆపడం వల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిని నియంత్రించాల్సిన హైవే పెట్రోలింగ్ నామమాత్రంగా మారింది. హైవే నిబంధనలు పట్టించుకోరు హైవేపైకి ఆటో రాకూడదన్న నిబంధన ఉంది. అయితే దాదాపు ఎక్కువ ఆటోలు జాతీయ రహదారిపైనే నిత్యం తిరుగుతుంటాయి. ప్రధానంగా పాఠశాలల నుంచి కళాశాలల వరకు విద్యార్థులు పరిమితికి మించి ప్రయాణం చేస్తున్నారు. ప్రధానంగా డ్రైవర్ పక్కన ఎవరిని కూర్చోబెట్టకూడదన్న నిబందన ఉన్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారుల నామమాత్రపు తనిఖీలు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, సుదూర ప్రాంతాలకు ఒక్కరే డ్రైవింగ్, మితిమీరిన వేగం తదితర కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన రోజు అధికారులు హడావుడి చేసి మిగిలిన రోజులు పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతున్నారు. పోలీసు, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా నిత్యం తనిఖీలు చేస్తే తప్ప ప్రమాదాలు తగ్గే అవకాశం లేదని పలువురు చెబుతున్నారు. అలాగే ప్రధానంగా జాతీయ రహదారికి మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో పలుచోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. కానీ స్పీడుబ్రేకర్లు ఉన్న ప్రాంతంలో ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే వాటిపై దృష్టిపెట్టి ప్రమాదాలను నివారించాల్సిన అవసరముంది. -
రాహుల్ పునరాగమనం
రాజకీయ నాయకులు నిరంతరం వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. తమ పేరు నిత్యం మార్మోగాలని ఆశిస్తారు. అధికారంలో ఉన్నవారికి అందుకు సంబంధించిన దిగులేమీ ఉండదు. అధికారిక సమావేశాలు, విధాన ప్రకటనలు వగైరాలవల్ల వద్దనుకున్నా ప్రచారం లభిస్తుంది. విపక్షంలో ఉండేవారు ఏ సమస్యపైన అయినా చురుగ్గా స్పందించే విధానంద్వారా...అధికార పక్షాన్ని గుక్కతిప్పుకోనీయకుండా చేసే కార్యాచరణద్వారా గుర్తింపు పొందాలి. ఏ పక్షంలో ఉన్నా వార్తల్లోకెక్కే తత్వం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీది. అయితే అది అదృష్టమనాలో, దురదృష్టమనాలో... ఒక్కోసారి అతిగా వ్యవహరించడంద్వారా, కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారో, ఏమయ్యారో తెలియకపోవడంద్వారా మాత్రమే ఆయన మీడియాలో గుర్తింపు పొందుతున్నారు. రాహుల్గాంధీ 56 రోజులపాటు సెలవుపై వెళ్లి నాలుగురోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. రాజకీయ నాయకులు కూడా మనుషులే గనుక, వారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది గనుక అలా వెళ్లడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయితే, అందుకు ఎంచుకున్న సమయం విషయంలోనే అందరూ ఆశ్చర్య పోయారు. ఒకపక్క పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎన్డీయే సర్కారు పనితీరుపై పార్లమెంటులో కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. భూసేకరణ బిల్లు లోక్సభ ముందుకొచ్చింది. అందుకు సంబంధించిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్, వామపక్షాలతోసహా అందరూ కలిసికట్టుగా వెళ్లారు. అదే సమయంలో బొగ్గు కుంభకోణానికి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు సమన్లు జారీ అయ్యాయి. మీ వెనక మేమున్నామంటూ సోనియాతో సహా కాంగ్రెస్ హేమా హేమీలంతా ఆయన నివాసానికి వెళ్లి నైతిక మద్దతునిచ్చారు. మరోవైపు యూపీఏలో కొనసాగుతున్న కొన్ని పార్టీలూ, వెలుపలనున్న మరికొన్ని పార్టీలూ కలిసి ఒకే పార్టీగా ఆవిర్భవించనున్నట్టు ప్రకటించాయి. ఆయన స్థాయి నాయకుడు ఇలాంటి పరిణామాల్లో కనబడకుండా, వినపడకుండా శూన్యంలోకి జారిపోవడం అసాధారణమైన విషయం. రాహుల్ను నమ్ముకుని కాంగ్రెస్వంటి అతి పెద్ద పార్టీ రోజులు వెళ్లదీస్తోంది. గాంధీ కుటుంబంవల్లనే మళ్లీ గత వైభవాన్ని పొందగలనని తనకు తాను ధైర్యం చెప్పుకుంటోంది. కిందినుంచి మీది వరకూ అందరూ తననే నమ్ముకుని ఉన్న కీలక తరుణంలో రాహుల్ ఒక్కసారిగా ఎటో వెళ్లిపోతే వారందరూ దిగులుపడటంలో... అడిగినవారికి జవాబు చెప్పలేక సతమతమవడంలో వింతేముంది? పార్టీ శ్రేణులనూ, నేతలనూ ఇలా ఇరుకునపడేయడం రాహుల్కు ఇది మొదటిసారి కాదు. నేర చరితులైన చట్టసభల సభ్యులకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ను రూపొందించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపినప్పుడు ఏమైందో అందరికీ గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ మీడియా ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరై ఆ ఆర్డినెన్స్ను సమర్థించుకోవడానికి తిప్పలు పడుతున్న సమయంలో హఠాత్తుగా రాహుల్ అక్కడ ప్రత్యక్షమై... విషయమేమిటని అడగటం, ఆయన ఇంకా చెప్పడం పూర్తిచేయకుండానే ‘ఇదంతా నాన్సెస్. ఈ ఆర్డినెన్స్ను చెత్తబుట్టలో వేయాల’ంటూ ప్రకటన ఇచ్చేసి అక్కడినుంచి నిష్ర్కమించడం పూర్తయ్యాయి. ఇంకా వెనక్కు వెళ్తే రాజకీయాల్లో వారసత్వం సరికాదని రెండేళ్లక్రితం ప్రకటించి కాంగ్రెస్ శ్రేణుల్ని ఆయన ఇరకాటంలో పడేశారు. అధికారం విషంతో సమానమని, హైకమాండ్ సంస్కృతి తనకు నచ్చదని కుండబద్దలు కొట్టారు. తమ పార్టీతోసహా దేశంలోని పార్టీలన్నీ కొద్దిమంది వ్యక్తుల ప్రాబల్యంలో నడుస్తున్నాయని, ఇది మారాలని పిలుపునిచ్చారు. అధినేత కుమారుడు గనుక ఆయన తల్చుకుంటే ఏమైనా జరుగుతుందని... పార్టీలో అంతా మారిపోతుందని అందరూ భ్రమించారు. తీరా అదేమీ జరగలేదు. అసలు ఆయనే మారలేదు. ఎప్పటిలా అధికారం ఉన్న రాష్ట్రాల్లో తన వర్గం అనుకున్నవారికి పదవులు ఇప్పించడంలోనూ, ఎన్నికలొచ్చినప్పుడు టిక్కెట్ల పంపిణీలోనూ తన పాత్రను యథావిధిగా పోషించారు. ఇంతకూ రాహుల్ 56 రోజులపాటు ఎక్కడికెళ్లారన్న విషయంలో చర్చ సాగుతూనే ఉంది. అది తప్పదు. ఆయన థాయ్ ఎయిర్వేస్ విమానంలో వచ్చారు గనుక ఆ దేశం వెళ్లి ఉంటారని కొందరంటుంటే, మయన్మార్ వెళ్లారని...అటు వెళ్లినట్టు తెలియకుండా ఉండటానికి థాయ్లాండ్ మీదుగా తిరిగొచ్చారని మరికొందరూ, వియత్నాం వెళ్లారని ఇంకొందరూ ఊహాగానాలు చేశారు. పార్టీకి జవసత్వాలివ్వడం కోసం సంస్థాగతంగా చేయాల్సిన మార్పులపైనా...వర్తమాన పరిణామాలను అవలోకనం చేసుకుని పార్టీకి దిశానిర్దేశం చేయడానికి సంబంధించిన ప్రణాళికపైనా లోతుగా ఆలోచించడం కోసం ఆయన ‘సెలవుపై’ వెళ్లారని పార్టీ పెద్దలు లీకులిచ్చారు. పార్టీ బాగుపడటం, పడకపోవడం మాట అటుంచి- ఆయనొస్తే తమ పదవులకు ఎసరు రావొచ్చని భయపడిన నేతలంతా ఒకపక్క... రాహుల్ ఎప్పుడు పూర్తిస్థాయిలో పగ్గాలు చేపడతారా, తమకెప్పుడు పదవుల వడ్డన ఉంటుందా అని ఎదురుచూసే నేతలంతా మరోపక్క చేరి పార్టీలో ఉన్న అంతర్గత పోరును బజారున పడేశారు. ఏ వర్గంవారైనా అందరూ 70 ఏళ్ల వయసు దాటినవారే. యువకులకు అవకాశం ఇవ్వాలన్న సంగతిని పార్టీ ఏనాడో మరిచిపోయినందువల్ల రాహుల్ను సమర్థించే వారిలో సైతం యువ నేతలు లేరు. తిరిగొచ్చాక పార్టీ నిర్వహించిన కిసాన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ నిప్పులు చెరగడం, అందుకు సభికుల నుంచి స్పందన బాగానే రావడం... లోక్సభలో సైతం మోదీ సర్కారుపై ఆయన వ్యంగ్య వ్యాఖ్యలతో చెలరేగడం పార్టీ నేతలకు సంతృప్తి కలిగించి ఉంటుంది. అందుకే దేశమంతా యాత్రలు చేయాలని, ఎన్డీయే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టాలని వారు రాహుల్ను బతిమాలుతున్నారు. అతిథి పాత్రలా వచ్చి నిష్ర్కమించాలనుకునే వారికి రాజకీయాల్లో చోటుండదు. ఏంచేసినా నిలకడగా, నికరంగా చేయాలి. దృఢంగా నిలబడాలి. సమస్యలపై స్పష్టమైన అవగాహనతో మాట్లాడాలి. అవసరమైనప్పుడల్లా పోరాడాలి. అప్పుడే నాయకుడిగా జనం గుర్తిస్తారు. నీరాజనాలు పడతారు. విచిత్రంగా మాట్లాడి, ప్రవర్తించి వార్తల్లోకెక్కడం వల్ల ప్రయోజనం కలగదని రాహుల్ తెలుసుకుంటే ఆయనకూ, పార్టీకీ కూడా మంచిది. -
ఆసిన్ కోలీవుడ్కు రిటర్న్
నటి ఆసిన్ కోలీవుడ్కు రిటర్న్ అవుతున్నారన్నది తాజా వార్త. ఈ కేరళ బ్యూటీ తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథా నాయికిగా ఒక రౌండ్ కొట్టి గజని హిందీ చిత్రం తో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అక్కడ తొలి చిత్రం విజయం, అదీ బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్తో నటించడంతో ఆసిన్ బాలీవుడ్ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందని ఆశించారు. అనుకున్నవి జరగడానికి సినిమా కాదుగా గజిని చిత్రం తరువాత రెండు మూడు ఆమె ఆశల్ని చిగురింప చేసినా ఆ తరువాత అపజయాలు వెంటాడడంతో అవకాశాలు వెనుకడుగు వేశాయి. ప్రస్తుతం అభిషేక్బచ్చన్ సరసన నటిస్తున్న ఆల్ ఈజ్ వెల్ చిత్రం మినహా ఆసిన్ చేతిలో మరో చిత్రం లేదు. ఇలాంటి పరిస్థితిలో నటుడు మాధవన్ హిందీ, తమిళంలో నటించడానికి సిద్ధం అవుతున్న తాజా చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఆసిన్ వెంటనే ఒకే చెప్పారట. ఈ చిత్రానికామె పారితోషికం గురించి కూడా చర్చించలేదట. మీరే ఒక ఎమౌంట్ను ఫిక్స్ చేయండి అని చెప్పారని సమాచారం. దీంతో ఆసిన్ చాలాకాలం తరువాత తమిళ తెరపైకి రావడం ఖాయం అని తెలుస్తోంది. -
హైదరాబాద్ తిరిగొచ్చిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చత్తీస్గఢ్ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ తిరిగొచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. నయారాయపూర్ నిర్మాణాన్ని పరిశీలించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని చత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరినట్టు చంద్రబాబు తెలిపారు. రాయపూర్ నుంచి విశాఖ వరకు రోడ్ లింకేజ్ గురించి చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో చర్చించినట్టు చెప్పారు. -
ఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ: వియత్నాంలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వదేశం తిరిగొచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. వియత్నాం పర్యటనలో ప్రణబ్ కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలను నడపడం సహా ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి వెంట ఎంపీలు, ఇతర ఉన్నత స్థాయి బృందం ఉంది. -
వియత్నాం నుంచి తిరుగుపయనమైన రాష్ట్రపతి
హో చిన్ మిన్ సిటీ: వియత్నాంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటన ముగిసింది. బుధవారం ఆయన స్వదేశానికి బయల్దేరారు. వియత్నాం పర్యటనలో ప్రణబ్ కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలను నడపడం సహా ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి వెంట ఎంపీలు, ఇతర ఉన్నత స్థాయి బృందం ఉంది. -
హైదరాబాద్కు తిరిగొచ్చిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సింగపూర్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేసీఆర్ కు డిప్యూటీ సీఎంలు రాజయ్య, మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్ సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సింగపూర్ నుంచి కౌలాలంపూర్కు రోడ్డు మార్గాన ప్రయాణించి శాటిలైట్ టౌన్ షిప్ను పరిశీలించారు. ఈ పర్యటనలో కేసీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
స్వదేశం తిరిగొచ్చిన నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగొచ్చారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు మోడీ బృందం ఢిల్లీకి చేరుకుంది. రెండు రోజుల నేపాల్ పర్యటనకు వెళ్లిన మోడీ కీలక ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటన విజయవంతంగా ముగిసిందని ఇరు దేశాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. మోడీ తన పర్యటనలో నేపాల్ అధ్యక్షుడు, ప్రధాని, మావో్యిస్టు నేతలతో చర్చలు జరిపారు. నేపాల్ అసెంబ్లీలో ప్రసంగించిన భారత ప్రధాని అక్కడి ప్రఖ్యాత పశుపతి ఆలయాన్ని దర్శించుకున్నారు. -
ఇరాక్ నుంచి తిరిగొస్తున్న మరో 2 వేలమంది భారతీయులు
న్యూఢిల్లీ: ఇరాక్లోని కల్లోలిత ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు 2200 మంది భారతీయులు స్వదేశానికి తిరిగివస్తున్నారు. 1600 మందికి భారత ప్రభుత్వం విమాన టిక్కెట్ల కొనుగోలు చేయగా, మరో 600 మందికి వారు ఇరాక్లో పనిచేస్తున్న కంపెనీలు టిక్కెట్ల డబ్బులు చెల్లించాయి. ఆదివారం రాత్రికి 117 మంది ఢిల్లీ చేరుకోనున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు తెలియజేసింది. ఇరాక్లో ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న నర్సులను భారత్కు క్షేమంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని స్వస్థలాలకు పంపారు. ఇరాక్లో ఉగ్రవాదులు చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. దీంతో అక్కడ భారతీయులకు రక్షణ లేకుండాపోయింది. -
షిండేను కలిసి తెలంగాణ పై నోట్ ఇచ్చిన ఎంపి వివేక్