
కర్ణాటక: ఎస్ఎస్ఎల్సీ (టెన్త్)లో 3 పాఠ్యాంశాల్లో ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులు పాఠశాలకు వెళ్లి చదువుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కూడా తెలిపింది. మళ్లీ పరీక్షలు రాసుకోవచ్చు.
ఇందుకు కొన్ని నిబంధనలను విధించింది. ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మళ్లీ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవాలి. మామూలు విద్యార్థులకు మాదిరే చేరవచ్చు, చదువుకోవచ్చు. అందరు విద్యార్థులకు లభించే సౌకర్యాలు ఈ విద్యార్థులకూ లభిస్తాయి. డ్రాపౌట్స్ను తగ్గించడానికి, ఫెయిలయ్యామని చదువు మానివేయకుండా ఈ వెసులుబాటును కల్పించినట్లు తెలిసింది.