స్వదేశం తిరిగొచ్చిన నరేంద్ర మోడీ

స్వదేశం తిరిగొచ్చిన నరేంద్ర మోడీ - Sakshi


న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగొచ్చారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు మోడీ బృందం ఢిల్లీకి చేరుకుంది.



రెండు రోజుల నేపాల్ పర్యటనకు వెళ్లిన మోడీ కీలక ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటన విజయవంతంగా ముగిసిందని ఇరు దేశాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. మోడీ తన పర్యటనలో నేపాల్ అధ్యక్షుడు, ప్రధాని, మావో్యిస్టు నేతలతో చర్చలు జరిపారు. నేపాల్ అసెంబ్లీలో ప్రసంగించిన భారత ప్రధాని అక్కడి ప్రఖ్యాత పశుపతి ఆలయాన్ని దర్శించుకున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top