మిస్ యూనివర్స్ ఇండియా- 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్న రియా సింఘా(Rhea Singha)..‘జైట్లీ’తో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సత్య హీరోగా, రితేశ్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న రిలీజైంది. ఈ సందర్భంగా రీయా గురించి ఆసక్తికర విషయాలు..
రియా సింఘా గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన యువతి. కేవలం 19 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
కేవలం 16 ఏళ్ల వయసు నుంచే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. అప్పటి నుండి అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అందాల పోటీల్లో రాణిస్తూనే ఆమె చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేశారు.
రియా కేవలం మోడల్, నటి మాత్రమే కాదు.. ఆమె ఒక అద్భుతమైన డాన్సర్, ఆర్ట్ కూడా బాగా వేస్తుందట.
రియాకు హీరోయిన్ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచే ఉందట. ‘జెట్లీ’లో (JETLEE Movie) ఏజెంట్ శివానిగా తనదైన నటనతో ఆకట్టుకుంది
తన విజయంలో తండ్రి బ్రిజేష్ సింఘా మరియు తల్లి రీటా సింఘా పాత్ర ఎంతో ఉందని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. తన కలలను సాకారం చేసుకోవడంలో వారు ఎంతో ప్రోత్సహించారు.
సుస్మితా సేన్, లారా దత్తా వంటి వారిని తన స్ఫూర్తిగా భావిస్తానని ఆమె పలు సందర్భాల్లో పేర్కొన్నారు.


