
స్వదేశానికి చేరుకున్న సోనియా, రాహుల్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక తమ స్వల్ప విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక తమ స్వల్ప విదేశీ పర్యటన ముగించుకుని దేశ రాజధాని ఢిల్లీకి చే రుకున్నారు. రాహుల్ గాంధీ బుధవారం రాగా, రాహుల్ కంటే ముందే విదేశాలకు వెళ్లిన సోనియా, ప్రియాంక మంగళవారమే ఇక్కడికి చేరుకున్నారు. గత నెల 20వ తేదీన రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లగా.. సోనియా గాంధీ వ్యక్తిగత కారణాల రీత్యా విదేశాలకు వెళ్లారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా తెలిపారు. అయితే వారి పర్యటనకు గల కారణాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.