వియత్నాంలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వదేశం తిరిగొచ్చారు.
న్యూఢిల్లీ: వియత్నాంలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వదేశం తిరిగొచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు.
వియత్నాం పర్యటనలో ప్రణబ్ కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలను నడపడం సహా ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి వెంట ఎంపీలు, ఇతర ఉన్నత స్థాయి బృందం ఉంది.