-
రాయబేరాలు!
సంఖ్యాబలం సమీకరణకు ప్రలోభాలు రూ.కోటి నగదు, ఫార్చ్యూనర్ కారు ఎర టీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ సభ్యుడు? ఆసక్తికరంగా జెడ్పీ రాజకీయం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. సంఖ్యాబలాన్ని సమకూర్చుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్లు వ్యూహాలకు పదునుపెట్టాయి. మేజిక్ ఫిగర్ను చేరేందుకు, అవసరమైన సంఖ్యకు చేరుకునేందుకు జెడ్పీటీసీలతో రాయబేరాలు సాగిస్తున్నాయి. నజరానాలు, ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 17 మంది సభ్యులు అవసరం. మొత్తం 33 మంది జెడ్పీటీసీలకుగాను ప్రస్తుతం కాంగ్రెస్కు 14, టీఆర్ఎస్కు 12, టీడీపీకి ఏడుగురు సభ్యులున్నారు. దీంతో ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ దక్కలేదు. ఈ క్రమంలోనే మేజిక్ నంబర్ కోసం ఇరుపార్టీలూ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లు టీడీపీపై మద్దతుపై గట్టి ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఇరుపార్టీలు తమకు ఉమ్మడి శత్రువు కనుక.. ఎవరికీ మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది. ఒకవేళ అనివార్యమై తే కాంగ్రెస్కు అండగా నిలుస్తాం తప్ప టీఆర్ఎస్తో జతకట్టేదిలేదని టీడీపీ భావిస్తోంది. కాంగ్రెస్ కూడా టీడీపీ మద్దతుపైనే ఆశలు పెట్టుకుంది. ఈ మేరకు ఆ పార్టీ పెద్దలు మంతనాలు కూడా సాగిస్తున్నారు. నజరానాల ఎర జిల్లా పరిషత్ చైర్మన్పై కన్నేసిన ఓ ప్రధాన పార్టీ.. ప్రత్యర్థి పార్టీల సభ్యులపై వల విసురుతోంది. సరిపడా సంఖ్యాబలాన్ని సమకూర్చుకునేందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తూర్పు డివిజన్లోని ఓ కాంగ్రెస్ సభ్యుడితో టీఆర్ఎస్ నాయకత్వం సంప్రదింపులు జరిపినట్లు ప్రచారమవుతోంది. కోటి రూపాయల నగదు, ఫార్చునర్ కారును ఎరవేయడం ద్వారా సదరు జెడ్పీటీసీని ఆకర్షించడంలో సక్సెస్ అయినట్లు తెలిసింది. ఇదే తరహాలో మిగతా సభ్యులను కూడా చేరదీయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్లు క్యాంపు రాజకీయాలు నెరపుతున్నప్పటికీ, మరోవైపు ఆయా పార్టీల జెడ్పీటీసీలను తమవైపు తిప్పుకొనేందుకు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, విప్ ఉల్లంఘించినా ఏమీ కాదనే ధీమాతో కొందరు సభ్యులు గోడ దూకేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున సస్పెన్షన్ వేటు పడ్డ కాంగ్రెస్ జెడ్పీటీసీ, గులాబీ గూటికి చేరే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్లో నైరాశ్యం అలుముకోవడం, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి కూడా సొంత పార్టీ సభ్యుల గొంతెమ్మ కోరికలను తీర్చే విషయంలో వెనుకడుగు వేస్తుండడాన్ని అనువుగా మలుచుకున్న టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అసంతుష్టులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. వారిని సంతృప్తి పరచడం ద్వారా మేజిక్ ఫిగర్ను సులువుగా చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ వ్యూహాలకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ కూడా ప్రతి వ్యూహాలను రూపొందిస్తోంది. క్యాంపుల్లో ఉన్న జెడ్పీటీసీలపై వల విసరకుండా అప్రమత్తమైంది. సభ్యుల కదలికలపై నిఘాను విస్తృతంచేసింది. -
మొదలైన క్యాంపులు
సాక్షి, హన్మకొండ: తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నాడో సినీ కవి. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు రోజే రాజకీయ నేతలు తమ పార్టీ తరఫున వార్డు కౌన్సిలర్లుగా బరిలో నిలి చిన అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. గెలిచిన వారు ఎట్టి పరిస్థితుల్లోను తమ పట్టు నుంచి జారిపోకుండా... ఇతర పార్టీల్లో చేరకుండా ఉండేందుకు ప్రధాన పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీలకు ఈ ఏడాది మార్చి 30న పోలింగ్ జరిగింది. మొత్తం 115 మంది వార్డులకు 651 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి చైర్పర్సన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో జరగనుంది. ఈ మేరకు ప్రతి మునిసిపాలిటీలో ఎక్కువ వార్డుల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు, తమలో ఒకరిని మునిసిపాలిటీ చైర్మన్గా, మరొకరిని వైస్చైర్మన్గా ఎ న్నుకుంటారు. దీంతో గెలిచిన ప్రతి వార్డు మెంబరూ కీలకం గా మారారు. ఈ నేపథ్యంలో ఐదు మునిసిపాలిటీలకు సం బంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నిట్ క్యాంపస్ కేంద్రంగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక రోజు ముందుగానే... భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్లో చైర్పర్సన్ సీటుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. భూపాలపల్లిలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు జతకట్టగా... మహబూబాబాద్లో టీఆర్ఎస్ సీపీఐలు ఒక జట్టుగా ఎన్నికల బరిలో నిలిచాయి. భూపాలపల్లి నుంచి వార్డు మెంబర్లుగా బరిలో నిలిచిన అభ్యర్థులను ఒకరోజు ముందుగానే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు హన్మకొండలోని రహస్య ప్రదేశాలకు తరలించారు. సోమవారం ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన అభ్యర్థులను అక్కడి నుంచి అటే పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లే యోచనలో నాయకులు ఉన్నారు. కాగా.. మహబూబాబాద్ టీఆర్ఎస్ వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఒక బృందంగా ఏర్పడి ఆదివారం రాత్రి మహబూబాబాద్ నుంచి హన్మకొండకు చేరుకున్నారు. వీరందరూ కౌంటింగ్ కేంద్రానికి దగ్గరల్లో ఉన్న లాడ్జిలో బస చేసినట్లుగా సమాచారం. మరోవైపు భూపాలపల్లిలో టీఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వార్డు మెంబర్లు సోమవారం తెల్లవారు జామున మొలుగూరి బిక్షపతి ఇంటికి చేరుకుని... అక్కడి నుంచి ప్రత్యేక వాహానంలో హన్మకొండకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. పరకాలలో టీడీపీ, బీజేపీ గణనీయమైన సంఖ్యలో వార్డుమెంబర్లుగా గెలుస్తామని అంచనా వేస్తున్నాయి. రెండు పార్టీలు ఒక జట్టుగా ఏర్పడి చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎంపికలో కీలక పాత్ర పోషించాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల నుంచి గెలిచిన వార్డు మెంబర్లు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా కట్టడి చేయడంపై స్థానిక నాయకత్వం దృష్టి పెట్టింది. ఇదిలా ఉండగా... జనగామ, నర్సంపేట మునిసిపాలిటీల్లో ఫలితాలు వెలువడిన తర్వాత రంగంలోకి దూకాలని అక్కడి నేతలు భావిస్తున్నారు. -
రేపే ‘స్థానిక’ ఫలితాలు
చిత్తూరు (అర్బన్), న్యూస్లైన్: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇక 24 గంటలు మాత్రమే ఉంది. అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. జిల్లాలోని 65 జెడ్పీటీసీ స్థానాలకు 266 మంది, 887 ఎంపీటీసీ స్థానాలకు 2414 మంది పోటీ పడ్డారు. ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు రాత్రికే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ పత్రాలను లెక్కించడానికి జిల్లా వ్యాప్తంగా ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ ఒక్కో మండలం కౌంటింగ్ పూర్తవుతుండగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారికి అప్పటికప్పుడే ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను ఒకేసారి లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవడానికి రాత్రి 10 గంటలు దాటుతుందని అధికారులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ధీమా జెడ్పీ పీఠం కచ్చితంగా తమకే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, రుణమాఫీ, వైఎస్.జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీ కలిసి చేసిన కుట్రలు ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తాయని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతున్నారు. దీనికితోడు టీడీపీకి 13 మండలాల్లో రెబల్స్ బెడద ఉండటం, చంద్రబాబు గత పాలన వద్దంటూ రైతులే బహిరంగంగా చెప్పడంతో ఆ పార్టీ నేతలకు ఎన్నికల ఫలితాలపై దిగులు పట్టుకుంది. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మెజారిటీ స్థానాలు తమకే వస్తాయంటూ చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఓటర్లు చెప్పిన తీర్పు బహిరంగం కావడానికి మరికొన్ని గంటలు ఆగాల్సిందే. -
కౌంటింగ్కు పక్కా ఏర్పాట్లు
కడప కలెక్టరేట్, న్యూస్లైన్: ఈనెల 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశిధర్ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. రాజంపేట డివిజన్కు కడపలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో, జమ్మలమడుగు డివిజన్కు మదీనా ఇంజనీరింగ్ కళాశాలలో, కడప డివిజన్కు కేశవరెడ్డి స్కూలులో కౌంటింగ్ జరుగుతుందన్నారు. బ్యాలెట్ బాక్సులను డీజీటీ వాహనాల్లో కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తామని, ఈ సమాచారాన్ని అభ్యర్థులకు తెలపాలని సూచించారు. కౌంటింగ్ శిక్షణ తరగతులు ఆదివారం ఉదయం 10 గంటలకు కౌంటింగ్ కేంద్రాల్లోనే నిర్వహిస్తారన్నారు. అలాగే పార్లమెంటు, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు శిక్షణ కార్యక్రమం ఈ నెల 14 ఉదయం 10 గంటలకు మున్సిపల్ హైస్కూలులో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఏఓ గుణభూషణ్ తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ తేదీల్లో మద్యం విక్రయాలు బంద్ కడప అర్బన్: జిల్లా కేంద్రంలో ఈనెల 12, 13, 16 తేదీల్లో నిర్వహించే ఆయా ఎన్నికల కౌంటింగ్ల ఈ నేపధ్యంలో జిల్లా కేంద్రంలో కార్పొరేషన్ పరిధితోపాటు చుట్టు ఐదు కిలోమీటర్ల మేరకు మద్యం షాపులను మూసి వేయనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయకుమారి తెలిపారు. శనివారం కడప ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కోడ్ వెలువడినప్పటి నుంచి ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించారన్నారు. ఎన్నికలు జరిగే రోజుల్లో కూడా 48 గంటలపాటు మద్యంషాపులను మూసి వేయించామన్నారు. అలాగే కౌంటింగ్ జరగనున్న తేదీలలో కూడా ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. 12వ తేదీ ఉదయం 6 నుంచి 13వ తేది సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలన్నారు. అలాగే 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మద్యం షాపులను మూసి వేయాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీతోపాటు కడప ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. గట్టి బందోబస్తు కడప అర్బన్, న్యూస్లైన్: జిల్లాలో ఈనెల 12న మున్సిపల్,13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్తోపాటు నగరంలో 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందన్నారు. విజయోత్సవ ర్యాలీలు, డప్పులు లేదా బ్యాండులతో ఊరేగింపులు, బాణసంచా కాల్చడం నిషిద్ధమన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సమీపంలో పార్కింగ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. కొత్త బస్టాండు ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి వాహనాలను నగర శివార్లలో పార్కింగ్ చేయాలన్నారు. అభ్యర్థులు తమ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు తీసుకు రావాలని పేర్కొన్నారు. -
12న మునిసిపల్, 13న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: మునిసిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...జిల్లాలో ఎనిమిది మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపు ఈనెల 12న కర్నూలు శివారులోని సెయింట్ బాలికల జూనియర్ కళాశాల జరుగుతుందని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 13న కర్నూలు డివిజన్లో అన్ని మండలాల ఓట్ల లెక్కింపు కర్నూలులోని సిల్వర్ జూబ్లీ, డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మెన్)లోను జరుగుతుందని పేర్కొన్నారు. ఆదోని డివిజన్లకు సంబంధించి ఆయా డివిజన్కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్ల లెక్కింపు జరుగుతోందని వివరించారు. వీటికి కూడా 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించినట్లు పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement